spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Vijayawada airport new flight routes: అమరావతి ఎఫెక్ట్.. విజయవాడ నుంచి కొత్త ఎయిర్ లైన్స్

Vijayawada airport new flight routes: అమరావతి ఎఫెక్ట్.. విజయవాడ నుంచి కొత్త ఎయిర్ లైన్స్

Vijayawada airport new flight routes: అమరావతికి( Amravati capital ) చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు వస్తున్నారు. రాజధాని లో పెట్టుబడులు పెట్టేందుకు సాహసిస్తున్నారు. ఏకంగా కేంద్ర ప్రభుత్వమే ఈ రాష్ట్ర రాజధానికి లేనివిధంగా రక్షణ కల్పించడంతో అందరి చూపు అమరావతిపై పడింది. మరోవైపు ఢిల్లీ వెలుపల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రధాన అధికార కేంద్రంగా అమరావతి మారనుంది. కేవలం పాలనాపరమైన భవనాలే కాదు. ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చే అన్ని రకాల నిర్మాణాలకు వేదిక కానుంది అమరావతి. అయితే ఎప్పుడైతే కేంద్రం చట్టబద్ధత కల్పించిందో ఇన్వెస్టర్లు రావడం ప్రారంభించారు. తాజాగా విజయవాడ నుంచి కొత్త ఎయిర్లైన్స్ కూడా ప్రారంభం అయ్యాయి.

కేంద్రమంత్రి తో ప్రారంభం..
సరికొత్త విమానయాన సంస్థ ఫ్లై 91 విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తన ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ సర్వీస్ లను ప్రారంభించారు. తొలి విడతగా విజయవాడ- హైదరాబాద్ నగరాల మధ్య ఈ విమానాలు నడవనున్నాయి. గతంలో కొన్ని కంపెనీలు ప్రారంభమయ్యాయి కానీ కొనసాగించలేకపోయాయి. అయితే ఇప్పుడు ఫ్లై 91 నిలదొక్కుకునేందుకు గట్టి ప్రయత్నం లోనే ఉంది. ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.

గోవా కేంద్రంగా..
ఫ్లై 91 ఎయిర్లైన్ ను గోవా కేంద్రంగా పనిచేసే.. జస్ట్ వుడో ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్( just udo aviation Private Limited) సంస్థ నిర్వహిస్తోంది. కొంకణి భాషలో ఉడో అంటే ఎగరడం అని అర్థం. భారతదేశ కంట్రీ కోడ్ ప్లస్ 91 ను ప్రతిబింబించేలా ఈ సంస్థకు ఫ్లై 91 అని పేరు పెట్టారు. ప్రాంతీయ అనుసంధానంలో భాగంగా.. ప్రధాన నగరాలను కలుపుతూ విమాన సర్వీసులను ఏర్పాటు చేస్తోంది ఈ సంస్థ. ఇటీవల ఇండిగో సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి ఎంతగానో ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది.

భారీ పెట్టుబడితో..
గతంలో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్( Kingfisher Airlines) మంచి సేవలు అందించిన సంగతి తెలిసిందే. అప్పట్లో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ లో కీలక బాధ్యతలు నిర్వహించిన మనోజ్ చాకో ఈ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ గా వ్యవహరిస్తున్నారు. ఆయనతోపాటు ప్రముఖ ఇన్వెస్టర్, కన్వర్జేంట్ ఫైనాన్స్ వ్యవస్థాపకుడు హర్ష రాఘవన్ ప్రధాన పెట్టుబడిదారు గా ఉన్నారు. సుమారు రూ.200 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఈ సంస్థను వారు స్థాపించారు. ప్రధాన మెట్రో నగరాలకు అనుసంధానం చేస్తూ విమాన సర్వీసులు తిప్పనన్నారు. ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా కొత్త ఎయిర్లైన్స్ ను అందుబాటులోకి తెచ్చారు. కేవలం అమరావతి ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా విజయవాడ నుంచి విమాన రాకపోకలను ప్రారంభించారు

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper