Hormuz Strait US Warships: ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం 15 రోజులుగా కొనసాగుతోంది. ఇరువైపులా ఎవరూ తగ్గడం లేదు. దీంతో యుద్ధం హోరాహోరీగా సాగుతోంది. మరోవైపు ఇరాన్ హార్మూజ్పై పట్టు బిగిస్తోంది. ఈ తరుణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికా నౌకలను పంపాలని ఆదేశించారు. దీనిపై చైనా, యూకే స్పందించాయి. దీంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
Also Read: ‘ధురంధర్ 2’ తో పోటీ పడడం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీం చేసిన పెద్ద మిస్టేక్.. ఓవర్సీస్ లో చావు దెబ్బ!
అంతర్జాతీయ సహకారానికి ట్రంప్ పిలుపు..
మార్చి 14న ట్రూత్ సోషల్లో ట్రంప్, హర్ముజ్ జలమార్గాన్ని రక్షించడానికి చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, యూకే వంటి దేశాలు నౌకలు పంపాలని కోరాడు. ఇది సమూహ బాధ్యత అని, అమెరికా సహాయం చేస్తుందని పేర్కొన్నాడు. ఇరాన్ సైన్యాన్ని పూర్తిగా నాశనం చేశామని ప్రకటించి, డ్రోన్లు, మైన్లు, క్షేపణుల ప్రమాదాలను హెచ్చరించాడు.
చైనా శాంతి సూచన..
వాషింగ్టన్లోని చైనా రాయబారి కచెరీ, సీఎన్ఎన్కు మాట్లాడుతూ, హింసాత్మక చర్యలు ఆపాలని, శక్తి సరఫరా స్థిరత్వం అందరి బాధ్యత అని చెప్పింది. మధ్యప్రాచ్య దేశాలతో సన్నిహిత సహచరులుగా, పోరాడే వర్గాలతో సంభాషణలు బలోపేతం చేసి, శాంతి పునరుద్ధరణకు కృషి చేస్తామని ప్రకటించింది. ట్రంప్–షీ జిన్ పింగ్ సమావేశ అనిశ్చితితో ఈ స్పందన వచ్చింది.
యూకే సానుకూల స్పందన..
బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ, మిత్రదేశాలతో చర్చలు జరుపుతూ, ప్రాంతీయ షిప్పింగ్ భద్రతకు వివిధ మార్గాలను చూస్తోందని తెలిపింది. ట్రంప్ సూచనపై సానుకూలంగా స్పందించింది. మరోవైపు హార్మూజ్ మూసివేతతో ఆయిల్ ధరలు మార్చి 13 నాటికి 103 డార్లకు చేరాయి.
ట్రంప్ తన యుద్ధ కాంక్షను పలు దేశాలపై రుర్దేందుకు ప్రయత్నిస్తోంది. చైనా మధ్యవర్తిత్వం ఎంపికలు చూపుతున్నాయి. ఇరాన్ ఆర్థిక ఒత్తిడి, మిత్రులకు మినహాయింపులు ద్వారా పొదుపు చేస్తోంది. మరోవైపు దాడులు ఇంధన ధరలు పెంచుతున్నాయి.
