విద్య, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లాలనుకునే వారికి ఇది షాకింగ్ వార్త. ఏప్రిల్ 1 నుంచి వలసేతర అమెరికన్ వీసాల కోసం వసూలు చేసే ఫీజును భారీగా పెంచింది అమెరికా ప్రభుత్వం. ఒకేసారి వీసా ఫీజును మూడు రెట్లు పెంచింది. ఈ పెంపు హెచ్–1బీ, ఎల్–1, ఈబీ–5 వీసాలకు వర్తిస్తుంది.
ఎనిమిదేళ్ల తర్వాత పెంపు..
అమెరికాలో నివసించడానికి వెళ్లే భారతీయులు ఎక్కువగా హెచ్–1బీ, ఎల్–1, ఈబీ–5 వీసాలు తీసుకుంటారు. ఈ వీసాల చార్జీలను దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత పెంచింది. గతంలో 2016లో ఫీజులు పెంచారు. తాజాగా ఏప్రిల్ 1, 2024 నుంచి కొత్త చార్జీలు వర్తించనున్నాయి. ఇప్పటికే చార్జీల పెంపుపై నోటిఫికేషన్ జారీ చేసినట్లు యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) తెలిపింది.
కొత్త ఫీజులు ఇలా..
– ఇక పెరిగిన వీసా కొత్త ఫీజులు పరిశఋలిస్తే హెచ్–1బీ వీసా కోసం దరఖాస్తు చేయాలనుకుంటే దాని కోసం ఫారమ్ ఐ–129 ఉంటుంది. దీని రుసుము 460 డాలర్లు ఉండగా పెరిగిన చార్జీల ప్రకారం 780 డాలర్లకు పెరుగుతుంది. భారత కరెన్సీలో చెప్పాలంటే రూ.38 వేల నుంచి రూ.64 వేలకు పెరుగుతుంది. ఇది క ఆకుండా హెచ్1బీ రిజిస్ట్రేషన్ ఫీజు 10 డాలర్లు(రూ.829) నుంచి 215 డాలర్లు(సేమారు రూ.17 వేల)కు పెరుగుతుంది.
– ఇక ఎల్–1 వీసా రుసుము ఏప్రిల్ 1 నుంచి మూడు రెట్లు పెరగనుంది. ప్రస్తుతానికి ఇది 460 డాలర్లు (సుమారు రూ. 38 వేలు) ఉంది. ఇది ఏప్రిల్ 1 నుంyచి 1385 డాలర్లకు (రూ. 1,10,000) పెరుగుతుందని అంచనా. ఎల్–1 అమెరికాలో నాన్ –ఇమ్మిగ్రెంట్ వీసా కేటగిరీ కింద వస్తుంది. కంపెనీలో పనిచేసే ఉద్యోగుల బదిలీ కోసం దీన్ని రూపొందించారు.
– ఈబీ–5 వీసా ఫీజులు కూడా మూడు రెట్లు పెరుగుతాయని భావిస్తున్నారు. ఇది ప్రస్తుతం 3,675 డాలర్లు (దాదాపు రూ. 3 లక్షలు) ఉండగా 11160 డాలర్లకు (దాదాపు రూ.9 లక్షలు) పెరగవచ్చని అంచనా. ఈబీ–5 వీసాను 1990లో యూఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. దీని కింద అధిక ఆదాయ విదేశీ పెట్టుబడిదారులు అమెరికన్ వ్యాపారాలలో కనీసం 5 లక్షల డాలర్ల పెట్టుబడి పెట్టడం ద్వారా వారి కుటుంబాలకు వీసాలు పొందవచ్చు. కనీసం 10 మంది అమెరికన్లు ఉద్యోగాలు పొందగలిగేలా ఈ వ్యాపారం ఉండాలి.