spot_img
Homeఅంతర్జాతీయంUS Military Attack: అమెరికా దుర్మార్గానికి ఏపీ వాసి బలి.. ఒరేయ్ ట్రంప్ నువ్వు మట్టి...

US Military Attack: అమెరికా దుర్మార్గానికి ఏపీ వాసి బలి.. ఒరేయ్ ట్రంప్ నువ్వు మట్టి కొట్టుకొని పోతావ్

US Military Attack: అమెరికా దుర్మార్గం గురించి ఎంత చెప్పినా తక్కువే. గిట్టని దేశాల మీద రాళ్లు వేయడంలో.. తనకు అనుకూలంగా లేకపోతే దాడులు చేయడంలో అమెరికా సిద్ధహస్తమైన దేశం.. అమెరికా ప్రపంచ పెద్దన్నగా మారడానికి.. ప్రపంచ దేశాల మీద పెత్తనం సాగించడానికి ఎన్నో రకాల దుర్మార్గాలు చేసింది. ఇంకాను చేస్తూనే ఉంది. తాజాగా అమెరికా చేసిన దాడి ఏపీ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి జీవితంలో చీకట్లు నింపింది.

ఏపీ రాష్ట్రంలోని విశాఖపట్నం నగరానికి చెందిన పట్నాల సురేష్ అనే వ్యక్తి మెరైన్ ఇంజనీర్. అతడు ఇండియన్ నేవీలో పని చేస్తూ ఉంటాడు. వృత్తిరీత్యా అతడు ఇటీవల ఒమన్ వెళ్ళాడు. తన విధులు ముగించుకొని.. తిరిగి అదే ఓడలో ఇండియాకు ప్రయాణమవ్వగా.. అమెరికా దాడి చేసింది. ఒమన్ తీరంలో సురేష్ ప్రయాణిస్తున్న ఓడ మీద అమెరికా దళాలు దాడి చేశాయి. ఈ దాడిలో సురేష్ తో సహా ముగ్గురు చనిపోయారు. సురేష్ కు భార్య, 13, 10 సంవత్సరాల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. అతడు చనిపోయిన విషయాన్ని భారత నేవీ వర్గాలు కుటుంబ సభ్యులకు తెలియజేశాయి.

భర్త చనిపోవడంతో అతని భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఈనెల 24న సురేష్ వివాహ వార్షికోత్సవం ఉంది. దానిని ఘనంగా జరుపుకోవాలని ఇప్పటికే సురేష్ తన భార్యతో అనేకసార్లు చెప్పాడు. ఆ ఏర్పాట్లలో భార్య నిమగ్నమై ఉంది. భర్త ఇండియాకు రాగానే.. అతనితో కలిసి ఈ వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించుకుంది. కానీ అమెరికా చేసిన దాడి వల్ల సురేష్ చనిపోయాడు. తన కుటుంబాన్ని చీకట్లో వదిలేసి వెళ్లిపోయాడు..

సురేష్ మెరైన్ ఇంజనీర్. ఇతడు విశాఖపట్నం వాసి. విధి నిర్వహణలో చురుకుగా ఉంటాడు. పై అధికారులకు ఇతడి పనితీరు అంటే చాలా ఇష్టం. అయితే దుర్మార్గపు అమెరికా చేసిన దాడి వల్ల ఇతడు చనిపోయాడు. ఇటీవల కాలంలో భారత నౌకలను లక్ష్యంగా చేసుకొని అమెరికా దాడులు చేపడుతుంది. కొన్ని సందర్భాలలో ఇది ప్రాణనష్టానికి కూడా దారి తీస్తోంది. ఇరాన్ హార్మోజ్ సంధిని మూసివేయడంతో.. పరిస్థితి దారుణంగా మారిపోయింది. అమెరికా బలగాలు విపరీతంగా దాడులు చేస్తున్నాయి. దీంతో మధ్య ప్రాచ్యం లో మళ్లీ యుద్ధం మొదలైంది.

అమెరికా దళాలు చేసిన దాడులను అందరూ ఖండిస్తున్నారు. ఇలా దాడులు చేయడం వల్ల సురేష్ చనిపోయాడని.. ఈ దాడులకు రూపకర్త అయిన ట్రంప్ మట్టి కొట్టుకుని పోతాడని శాపనార్ధాలు పెడుతున్నారు. సురేష్ భార్య విలపిస్తున్న తీరు మాటలకు అందనిదిగా ఉంది. ఆమెను ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు. మరి కొద్ది రోజుల్లో తమ తండ్రి వస్తాడని భావించిన ఆ పిల్లలకు.. అతడి చివరి చూపు కూడా కరువైంది. సురేష్ మరణంతో నేవీ వర్గాలలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular