US Iran Deal: కొద్ది నెలలుగా సాగుతున్న భీకరమైన యుద్ధం ఎట్టకేలకు తాత్కాలికంగా ముగిసింది.. ఇరాన్, అమెరికా మధ్య డీల్ కుదిరింది.. ట్రంప్.. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ శాంతి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఫలితంగా మూడున్నర నెలలుగా సాగుతున్న తాత్కాలిక యుద్ధం ముగిసిపోయింది. యుద్ధం తాత్కాలికంగా ముగిసిన నేపథ్యంలో మనకు ఏంటి లాభం అనే చర్చ నడుస్తోంది.
ఈ యుద్ధంలో ఇరాన్ తీవ్రస్థాయిలో నష్టపోయింది. ఇరాన్ దేశానికి ఏకంగా 30 వేల కోట్ల డాలర్లను ఇస్తామని ప్రతిపాదన వచ్చింది. 13 సంవత్సరాలపాటు అంతయుద్ధంతో ఇబ్బంది పడుతున్న సిరియాకు 215 బిలియన్ డాలర్లు.. గాజాకు 53 బిలియన్ డాలర్లు అవసరమని అంచనా వేశారు. అయితే ఇరాన్ దేశం ఈ రెండు ప్రాంతాల కంటే ఎక్కువ అనుతిని సొంతం చేసుకోవడం గమనార్హం. విదేశాలలో ఉన్న ఇరాన్ ఆస్తులు కూడా రిలీజ్ అవుతాయి. మరోవైపు ఈ ఫండ్ కు ఒక పైసా కూడా ఇచ్చేది లేదని అమెరికా స్పష్టం చేసింది.
తాత్కాలిక శాంతి ఒప్పందం వల్ల ఇరాన్ దేశానికి ఆర్థికంగా ఊరట లభిస్తుంది.. అమెరికా విధించిన ఆంక్షలు పూర్తిగా తొలగిపోతాయి. గత ఏడాది ఇరాన్ క్రూడ్ ఆయిల్ అమ్మకుల ద్వారా 45 బిలియన్ డాలర్లను సంపాదించింది. అమెరికా ఎక్కడికక్కడ ఆంక్షలు విధించడంతో చైనా దేశానికి అత్యంత రహస్యంగా విక్రయించాల్సి వచ్చింది. ఇప్పుడు ఆంక్షలు తొలగిన నేపథ్యంలో గ్లోబల్ వ్యాప్తంగా తనకు నచ్చిన రేటుకు క్రూడ్ ఆయిల్ అమ్ముకోవచ్చు.
ఇన్నాళ్లపాటు మూసివేతకు గురైన హార్మోజ్ జల సంధి తీర్చుకుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ డిస్ట్రిబ్యూషన్లో ఇది ఐదవ వంతు పాత్ర పోషిస్తుంది. యుద్ధం వల్ల దీనిని తాత్కాలికంగా మూసివేశారు. తాజా డీల్ నేపథ్యంలో అమెరికా తన ఆంక్షలు మొత్తం ఎత్తివేసింది. వచ్చే 60 రోజులపాటు ఈ సంధి మీదుగా కమర్షియల్ షిప్ లు ఉచితంగా రాకపోకలు సాగిస్తాయి.. ఫలితంగా ఇంటర్నేషనల్ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ డిస్ట్రిబ్యూషన్ పెరిగిపోతుంది. ముఖ్యంగా ఫ్యూయల్ ధరలు చాలా వరకు తగ్గుతాయి. ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక రకమైన ఊరట. యుద్ధం తెచ్చిన సంక్షోభం వల్ల మనదేశంలో ధరలు పెరిగిపోయాయి. అమెరికాలో కూడా అదే పరిస్థితి. ఇరాన్ తో యుద్ధం అలానే కొనసాగితే.. అమెరికాలో మధ్యంతర ఎన్నికల మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది.
ఈ యుద్ధంలో ఇరాన్ డిఫెన్స్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేయాలని.. హౌతి.. హిజ్ బొల్లా వంటి శక్తులను తొక్కి వేయాలని అమెరికా.. ఇజ్రాయిల్ దాడులు మొదలుపెట్టాయి. ఇన్ని రోజులపాటు సాగిన యుద్ధంలో ఇరాన్ రూపొందించుకున్న స్థావరాలు మొత్తం నాశనమయ్యాయి. అయినప్పటికీ ఇరాన్ బలం తగ్గిపోలేదు. మరోవైపు తాత్కాలిక శాంతి ఒప్పందంలో ఇరాన్ మిస్సైల్స్.. ప్రాక్సిల గురించి ఎటువంటి ప్రస్తావన రాకపోవడం విశేషం. ఈ అంశాన్ని పదేపదే ఇరాన్ దాటవేయడం ఇక్కడ గమనార్హం.
యుద్ధం తాత్కాలికంగా ముగిసిపోవడం వల్ల ఇరాన్ నుంచి మళ్లీ మన దేశానికి క్రూడ్ ఆయిల్ డిస్ట్రిబ్యూషన్ మొదలవుతుంది. దేశంలో వంట గ్యాస్.. ఫ్యూయల్ ధరలు తగ్గుతాయి. దీనికి తోడు ఇరాన్ దేశంలో భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చాబహర్ పోర్ట్ నిర్మాణం మళ్లీ మొదలవుతుంది. మిడిల్ ఈస్ట్ లో ఉద్యోగాలు చేస్తున్న కోటి మంది భారతీయులకు భద్రత లభిస్తుంది.
