Russia Oil Attack: ప్రస్తుతం ప్రపంచం దృష్టి మొత్తం ఇరాన్–అమెరికా శాంతి చర్చలపై ఉంది. ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ తన సొంత సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులు.. ఇంకోవైపు శాంతి చర్చలపై ఇరాన్ స్పందనను అంతా గమనిస్తున్నారు. ఇంకోవైపు హర్మూజ్ ఎప్పుడు తెరుస్తారన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో ఉక్రెయిన్ రష్యాను టార్గెట్ చేసింది. ఆయిల్ కేంద్రాలే లక్ష్యంగా జరిపిన దాడిలో రష్యాలోని కీలక ఆయిల్ కేంధ్రం పూర్తిగా ధ్వంసమైంది. 1,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెర్మ్ ప్రాంత ఇంధన కేంద్రం లక్ష్యంగా చేసుకుని దాడిచేసింది. ఈ చర్య రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నంగా మారింది.
దాడి జరిగిందిలా..
పెర్మ్ ప్రాంతంలోని ఆయిల్ పంపింగ్ స్టేషన్పై ఉక్రెయిన్ డ్రోన్లు విజయవంతమైన దాడి చేశాయి. భారీ అగ్నిప్రమాదానికి గురైన ఈ కేంద్రం రష్యా చమురు పంపిణీ వ్యవస్థలో కీలక భాగం. మరోవైపు ఉక్రెయిన్ ప్రధాని జెలెన్స్కీ ‘చరిత్రలో అత్యంత సుదీర్ఘ దూర దాడి‘ అని ప్రకటించి, నల్ల పొగల వీడియో విడుదల చేశారు.
ఉక్రెయిన్ వ్యూహం
ఇటీవల రష్యా రిఫైనరీలు, నిల్వ కేంద్రాలు, పోర్టులను లక్ష్యంగా చేసుకునే ఉక్రెయిన్ డ్రోన్ దాడులు పెరిగాయి. గత వారంలో ర్యాజన్, ర్యాజాన్ ప్రాంతాల్లోని రిఫైనరీలపై కూడా దాడులు జరిగాయి. ఈ దాడులు రష్యా ఆర్థిక ప్రభుత్వాన్ని ఒత్తిడికి గురి చేస్తూ, యుద్ధాన్ని లాంగ్ టర్మ్గా టాన్ చేయాలనే వ్యూహంగా కనిపిస్తోంది.
దాడిని ధ్రువీకరించిన రష్యా..
ఉక్రెయిన్ దాడిని రష్యా ధ్రువీకరించింది. ఈశాన్య ఖర్కివ్లో 8 మంది గాయపడ్డారని తెలిపింది. సమీపంలోని 60 ఏళ్ల వృద్ధురాలు మరణించినట్లు పేర్కొంది. ఉక్రెయిన్ డ్రోన్ దాడులను తమ రక్షణ వ్యవస్థలు 95 శాతం అడ్డుకుందని పేర్కొన్నప్పటికీ, పెర్మ్ దాడిపై అధికారిక స్పందన లేదు. రష్యా ఆర్మీ ఈ దాడి ‘ఉగ్రవాద చర్య‘గా ప్రకటించింది.
చమురు సంక్షోభం మరింత తీత్రం..
రష్యా చమురు సరఫరాలో 15 శాతం ఉక్రెయిన్ దాడితో దెబ్బతినడంతో ప్రపంచ చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే హర్మూజ్ మూసివేత, గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడుల నేపథ్యంలో చమురు ధరలు పెరిగాయి. రవాణా గణనీయంగా తగ్గింది. దీంతో యూరప్ దేశాలతోపాటు భారత్, చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, జపాన్ వంటి దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. ఒపెక్ + నుంచి ఇరాన్, యూఏఈ వైదొలగడం, ఇదే సమయంలో రష్యా ఆయిల్ కేంద్రాలపై దాడి జరగడం గ్లోబల్ ఎనర్జీ మార్కెట్పై ఒత్తిడి పెంచింది.
ఆర్థిక పరిణామాలు
2026లో రష్యా చమురు ఎగుమతులు 20 శాతం తగ్గే అవకాశం ఉంది. ఈ దాడి రష్యా ఆర్థిక వ్యవస్థకు 2–3 బిలియన్ డాలర్ల నష్టం కలిగించవచ్చు. యూరప్, భారత్కు ఇంధన ధరల పెరిగే అవకాశం ఉంది. దీంతో ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది.
ఉక్రెయిన్ డ్రోన్ సాంకేతికత మరింత అభివృద్ధి చెందుతుంటే, రష్యా ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ దాడి యుద్ధాన్ని సైనికంగా కాకుండా ఆర్థిక యుద్ధంగా మలిచేస్తుంది. మరోవైపు ఉక్రెయిన్పై రష్యా ప్రతీకార చర్యలు తీవ్రంగా ఉంటాయని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
A report by Major General Yevhenii Khmara on our long-range sanctions – a new stage in the use of Ukrainian weapons to limit the potential of Russia’s war. I am grateful to the guys from the Security Service of Ukraine for their precision.
The straight-line distance is over… pic.twitter.com/8wFRJ6cE8R
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) April 29, 2026