Iran blocks Pakistan naval ship: ఇరాన్ పై యుద్ధం ముగించేందుకు ఓవైపు అమెరికా ప్రయత్నిస్తోంది. యుద్ధం మొదలుపెట్టి తప్పు చేశామని ట్రంప్ కు ఆలస్యంగా అర్థమైంది. దీంతో మొదటగా ఐదు రోజులపాటు విరామం ప్రకటించారు. మీరంటే చర్చలు జరుపుతున్నట్లు ప్రకటించారు. మరో వైపు హీరోయిన్ కూడా చర్చలకు సానుకూలత వ్యక్తం చేసింది. ఈ క్రమంలో పాకిస్తాన్ ను మధ్యవర్తిగా అమెరికా ఎంపిక చేసింది. ఇదే సమయంలో పాకిస్తాన్ కు ఇరాన్ షాక్ ఇచ్చింది.
నౌకకు అనుమతి ఇవ్వని ఇఆర్జీసీ..
ఒకవైపు పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వానికి సన్నద్ధమవుతుండగా.. ఇరాన్ ఐఆర్జీసీ కరాచీ బౌండ్ సెలెన్ కంటైనర్ షిప్ను హర్మూజ్ దాటకుండా అడ్డుకుంది. దీనిని కాబూల్లోని ఇరాన్ రాయబారి కార్యాలయం ధ్రువీకరించింది.
సెలెన్ షిప్ వివరాలు
షార్జా నుంచి కరాచీకి వెళ్లే సెలెన్ (6850 DWT) షిప్ హార్ముజ్ వద్ద ఐఆర్జీసీ నావికా దళం అడ్డుకుంది. చట్టపరమైన ప్రోటోకాల్ ఉల్లంఘన చెప్పి తిప్పింది. అనుమతి, సముద్రాధికారులతో సమన్వయం లేకుండా ప్రయత్నం చేయడమే కారణమని ప్రకటించింది. ఈ షిప్ పర్షియన్ గల్ఫ్లో యాంకర్ వేసి ఉంది.
పాక్ దౌత్యిక ఆకాంక్షలు..
అమెరికా. ఇరాన్ చర్చలకు మధ్యవర్తి అవుతామని పాకిస్తాన్ ప్రకటించినా ఐఆర్జీసీ చర్యలు ఇబ్బందిగా మారాయి. ఇరాన్ సార్వభౌమత్వాన్ని నొక్కి చెప్పి, ప్రతి షిప్కు ముందస్తు సమన్వయం తప్పనిసరి అని ఇరాన్ పునరుద్ఘాటించింది. ఇది పాక్ ప్రభావశీలతను ప్రశ్నార్థకం చేస్తోంది.
వాణిజ్య, ఆర్థిక పరిణామాలు
హార్ముజ్ 21% ప్రపంచ చమురు, 20% ఎల్ ఎన్ జీ రవాణాకు కీలకం. ఈ ఆటంకాలు ధరలు పెంచుతాయి. పాక్ వాణిజ్య షిప్లు ఆలస్యాలు, అదనపు ఖర్చులు ఎదుర్కొంటాయి; గల్ఫ్ రవాణా మార్గాలు ప్రభావితమవుతాయి. షిపింగ్ కంపెనీలు మార్గాలు మార్చుకుంటున్నాయి.
ఇరాన్ తన సముద్ర ప్రాంతంపై పూర్తి అధికారాన్ని నిర్ధారించి, ఘర్షణల మధ్య నియంత్రణ బలపరుస్తోంది. పాక్, ఇతరులు భవిష్యత్ ప్రయాణాలకు ఇరాన్ అధికారులతో ముందుగా సంప్రదించాలని సూచన. నిపుణులు దీర్ఘకాలిక దౌత్య సమాధానాలు అవసరమని చెబుతున్నారు.
