Homeఅంతర్జాతీయంBaloch Liberation Army: పాకిస్తాన్ కు దిమ్మతిరిగేలా చేసిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ.. ఏకంగా 22...

Baloch Liberation Army: పాకిస్తాన్ కు దిమ్మతిరిగేలా చేసిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ.. ఏకంగా 22 మంది..ఇది మామూలు దెబ్బ కాదు..

Baloch Liberation Army: ఇన్నాళ్లపాటు భారత్ లో మతకల్లోలాలు రేపింది. చేతకాని ప్రభుత్వాలు అధికారంలో ఉండడంతో దాడులు చేసింది. భీకరమైన ప్రాణ నష్టానికి కారణమైంది. అంతేకాదు సరిహద్దుల్లో రక్తపుటేర్లు ప్రవహించేలా చేసింది. అంతేకాదు మన దేశానికి సంబంధించిన అనేక విషయాలలో వేలు పెట్టి.. అమెరికాతో అంటకాగి ఇబ్బంది పెట్టేది. ఇంతటి దుర్మార్గమైన పాకిస్తాన్ ఆటలు ఇప్పుడు సాగడం లేదు. మనదేశంలో బలమైన ప్రభుత్వం ఉండడంతో ఉగ్రవాద కార్యకలాపాలలో ముందడుగు పడటం లేదు. పైగా పాకిస్తాన్ దేశంలో గుర్తుతెలియని […]

Baloch Liberation Army: ఇన్నాళ్లపాటు భారత్ లో మతకల్లోలాలు రేపింది. చేతకాని ప్రభుత్వాలు అధికారంలో ఉండడంతో దాడులు చేసింది. భీకరమైన ప్రాణ నష్టానికి కారణమైంది. అంతేకాదు సరిహద్దుల్లో రక్తపుటేర్లు ప్రవహించేలా చేసింది. అంతేకాదు మన దేశానికి సంబంధించిన అనేక విషయాలలో వేలు పెట్టి.. అమెరికాతో అంటకాగి ఇబ్బంది పెట్టేది.

ఇంతటి దుర్మార్గమైన పాకిస్తాన్ ఆటలు ఇప్పుడు సాగడం లేదు. మనదేశంలో బలమైన ప్రభుత్వం ఉండడంతో ఉగ్రవాద కార్యకలాపాలలో ముందడుగు పడటం లేదు. పైగా పాకిస్తాన్ దేశంలో గుర్తుతెలియని అజ్ఞాత సాయుధ దళాలు కాల్పులకు పాల్పడుతున్నాయి. ఉగ్రవాదులను అత్యంత సమీపంలో నుంచి కాల్చేస్తున్నాయి. అజ్ఞాత సాయుధ దళాలకు తోడుగా ఇప్పుడు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ రంగంలోకి దిగింది. కొంతకాలంగా పాకిస్తాన్ ప్రభుత్వం మీద బలూచిస్థాన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పాకిస్తాన్ నుంచి విడగొట్టి తమను భారత దేశంలో కలపాలని.. లేదా సొంత దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.. అయితే పాకిస్తాన్ కూడా ఆర్మీ ని బలూచిస్థాన్ మీదికి ప్రయోగిస్తోంది. హింసాత్మక ఘటనలకు పాల్పడుతోంది. అయితే బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ దాడులను ఏమాత్రం లెక్కపెట్టడం లేదు. పైగా అంతకుమించి అనే స్థాయిలో దాడులు చేస్తోంది.

తాజాగా క్వెట్టా చమన్ గేట్ దగ్గరలో ఒక ప్యాసింజర్ రైలు లక్ష్యంగా చేసుకొని. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఈ దాడిలో మొత్తం 23 మంది చనిపోయారు. 47 మంది గాయపడ్డారు. ఇందులో ఎక్కువగా చిన్నారులు.. మహిళలు ఉన్నారు. అధికారులు సమాచారం అందుకొని అక్కడికి చేరుకున్నారు. వీరిలో చాలామంది పరిస్థితి దారుణంగా ఉంది. పాకిస్తాన్ దేశానికి భారీగా నష్టం కలిగించాలి అనే ఉద్దేశంతోనే ఈ దాడికి పాల్పడినట్టు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. పాకిస్తాన్లో జాఫర్ ఎక్స్ప్రెస్ లో ఆ దేశ ఆర్మీ పెషవర్ ప్రాంతానికి వెళ్తుందనే సమాచారంతో ఈ దాడికి పాల్పడింది బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ.

బాంబు పేలుడు వల్ల ఘోరమైన నష్టం జరిగింది. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల భవనాల అద్దాలు పగిలి పోయాయి. కిటికీలు విరిగిపోయాయి. రైల్వే ట్రాక్ దగ్గరగా ఉన్న అనేక వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి. ఒక భోగికి మంటలు కూడా అంటుకున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper