అందమా.. అందుమా అంటూ నాడు అతిలోక సుందరి శ్రీదేవి అందాల గురించి గొప్పగా వర్ణించారు. కానీ నేడు ఆమె లేకున్నా ఆమె వారసత్వం బాలీవుడ్ లో ఉంది.
శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ బాలీవుడ్ లో హీరోయిన్ గా సెటిల్ అయ్యింది. వరుస చిత్రాలో మంచి గుర్తింపు పొందింది. ‘గుంజన్ సక్సేనా’ మూవీతో రియల్ జీవిత చరిత్రను చూపించి ఆకట్టుకుంది.
ఇక ఈ వేసవి కాలం వేడి తీవ్రతను తగ్గించుకునేందుకు జాన్వీకపూర్ మల్దీవుల బాటపట్టింది. చుట్టూ సముద్రం.. మధ్యలో విసిరేసినట్టు ఉండే ఈ దీవుల సమూహంలో చల్లటి ప్రకృతి అస్వాదనలో జాన్వీ కపూర్ సేదతీరింది.
తను సేదతీరడమే కాదు.. తన అందచందాలను బికినీ రూపంలో తన అభిమానులకు కనువిందు చేసింది. జాన్వీకపూర్ మల్దీవుల్లో బికినీ వేసుకొని సముద్రం తీరాన హోయలు ఒలికింది. ఈ ఫొటోలు నెటిజన్లకు మత్తెక్కిస్తున్నాయి. జాన్వీ అందాలపై బోలెడు కామెంట్లతో వారంతా హుషారెత్తిపోతున్నారు.
జాన్వీకపూర్ ఇన్ స్టాగ్రామ్ ఫొటోలు..
https://www.instagram.com/p/CNZ7BBrlr7K/?utm_source=ig_web_button_share_sheet