Priyamani : దేశంలో కామాంధులు ఎక్కువైపోయారు. పెంపకమో తినే ఆహారమో తెలియదు కానీ యువతను పెడదారి పట్టిస్తుంది. మరీ దారుణమైన ఆలోచనలు యువకుల మెదళ్లలో పురుడు పోసుకుంటున్నాయి. ఆడది కనబడితే కబళించే మగాళ్లు ఎక్కువైపోయారు. లైంగిక దాడులు మనుషులను దాటి జంతువులకు వ్యాపించాయి. బీహార్ రాజధానిలో జరిగిన ఓ ఘటన అత్యంత నీచమైనదని చెప్పొచ్చు. ఓ యువకుడు కుక్కను రేప్ చేశాడట. ఈ ఘటన మీద ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
ఈ విషయం హీరోయిన్ ప్రియమణి దృష్టికి వచ్చింది. ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కుక్కను రేప్ చేసిన యువకుడు ఫోటోని షేర్ చేశారు. అలాగే ఛీ ఇది అత్యంత నీచం అంటూ కామెంట్ పెట్టారు. అలాగే బూతులు తిడుతున్న మీనింగ్ ఇచ్చే ఎమోజీలు పోస్ట్ చేశారు. ఒక కుక్కపై జరిగిన లైంగిక దాడి మీద ప్రియమణి స్పందించడం విశేషంగా మారింది. అసలు కుక్కలను కూడా వదలకుండా కామ వాంఛలు తీర్చుకుంటున్నారా? అని ఆమె పరోక్షంగా అసహనం వ్యక్తం చేశారు.
ప్రియమణి ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. నెటిజన్స్ కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. ఇక ప్రియమణి కెరీర్ పరిశీలిస్తే ఆమె సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. సినిమాలు, వెబ్ సిరీస్లు చేస్తూ జోరు చూపిస్తున్నారు. త్వరలో ఆమె నాగ చైతన్య మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. నాగ చైతన్య-కృతి శెట్టి జంటగా నటించిన కస్టడీ చిత్రంలో ప్రియమణి కీలక రోల్ చేస్తున్నారు.
2003లో నటిగా ప్రియమణి కెరీర్ మొదలైంది. ఎవరే అతగాడు ఆమె మొదటి చిత్రం. అనంతరం పెళ్ళైన కొత్తలో చిత్రంలో జగపతిబాబుకు జంటగా నటించారు. తమిళ చిత్రం పరుత్తివీరన్ కి గానూ నేషనల్ అవార్డు అందుకున్నారు. ఎన్టీఆర్, బాలకృష్ణ వంటి టాప్ స్టార్స్ తో జతకట్టారు. 2017 లో ఈవెంట్ ఆర్గనైజర్ ముస్తఫా రాజ్ ని ప్రియమణి ప్రేమ వివాహం చేసుకున్నారు.