Mohan Babu: సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం టాలీవుడ్ ఇండస్ట్రీలో పెను విషాదాన్ని మిగిల్చింది. ఒక గొప్ప రైటర్ ను కోల్పోయింది. ఆయన చనిపోయి రోజులు గడుస్తున్నా ఇంకా జ్ఞాపకాలను సినీ ప్రముఖులు గుర్తు చేసుకుంటున్నారు. ప్రతీ సందర్భంలో ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. తాజాగా నటుడు మోహన్ బాబు సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి ఎమెషనల్ వ్యాఖ్యలు చేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతిక కాయం సందర్శనార్థం మోహన్ బాబు ఫ్యామిలీ వెళ్లలేదట.. ఎందుకంటే మోహన్ బాబు సొంత తమ్ముడు మరణించడతో ఆయన కుటుంబంలో విషాద చాయలు నెలకొన్నాయి. అయితే ఇటీవల ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా ‘రుద్రంకోట’ సినిమా కార్యక్రమానికి హాజరైన మోహన్ బాబు సిరివెన్నెల గురించి భావోద్వేగానికి గురయ్యారు.

‘సిరివెన్నెల గారి మరణంతో ఇండస్ట్రీ పెద్ద దిక్కును కోల్పోయింది. ఇంట్లో జరిగిన సంఘటన వల్ల అక్కడికి వెళ్లలేకపోయాం. కానీ ఆయన ఎక్కడున్నా ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఆయనను ఇండస్ట్రీ మరిచిపోయినా ఆయన రాసిన పాటలు ముందు ముందు కూడా వింటారు. పరిశ్రమలో వరుసగా విషాధ సంఘటనలు చోటు చేసుకోవడం నన్నెంతో బాధకు గురిచేస్తోంది’ అని అన్నారు.
Also Read: కత్రినా- విక్కీ వివాహ వేడుకలో సెలబ్రిటీలకు కఠినమైన రూల్స్.. అవేంటో తెలిస్తే షాక్?
రుద్రం కోట సినిమాపై మోహన్ బాబు ఈ సందర్భంగా మాట్లాడారు. ‘చిన్న సినిమాలే ఇండస్ట్రీని కాపాడుతాయిన మా గురువుగారు చెప్పారు. ప్రతి ఒక్కరు చిన్నస్థాయి నుంచే పెద్ద స్థాయికి వస్తారు. అలాగే కొత్త డైరెక్టర్, కొత్త హీరో, కొత్త హీరోయిన్ అని ఎవరూ ఫీల్ కావద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మొదటి సినిమా కొత్తగానే ఉంటుంది. మేం కూడా కొత్తగా పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆ తరువాత ఇండస్ట్రీలో స్థిరపడ్డాం. అందువల్ల కొత్త అని ఫీల్ కాకుండా మంచి సినిమాలు తీయాలి. అప్పుడే పైకి ఎదుగుతారు.’ అని మోహన్ బాబు అన్నారు.
సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు..?
‘ఒక సినిమాలో ప్రతి ఒక్కిరికీ ప్రాధాన్యత ఉంటుంది. కాకపోతే నిర్మాత హ్యాపీగా ఉంటే సినీ ఇండస్ట్రీ బాగుపడుతుంది. నిర్మాత బాగు గోసం మిగతావారు వారి పనులను సమర్థవంతంగా నిర్వహిస్తే సరిపోతుంది. అయితే మేం సినిమాలు తీసే రోజుల్లో ఎన్నో కష్టాలు పడ్డాం. గుడిసెల్లో నివసిస్తూ సినిమాలు తీయాల్సి వచ్చింది. ఎలాంటి సౌకర్యాలు లేకున్నా మంచి మంచి సినిమాలు తీశాం. కానీ ఇప్పుడున్న సౌకర్యాలతో గొప్ప సినిమాలు చేయాలి’ అని ఇండస్ట్రీ తీరుపై మోహన్ బాబు విసుర్లు కురిపించారు.
Also Read: మనం మనం భాయ్ భాయ్… స్టార్ హీరోలందరూ కలిసిపోయారా!
Khiladi Telugu Movie Review
[…] […]
[…] […]
[…] Prashanth Neel KGF 2: భారీ అంచనాల నడుమ కేజీఎఫ్ ఛాప్టర్ 2 ప్రపంచ వ్యాప్తంగా రిలీజై హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఊహించని స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయి. కన్నడ సూపర్ స్టార్ యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 1 భారీ సక్సెస్ సాధించడంతో చాప్టర్ 2 కి విపరీతమైన హైప్ వచ్చింది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మళయాలంలో భాషలలో కేజీయఫ్ 2 ఒకే రోజు విడుదలైంది. తక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కిన ఈ సినిమా అంచనాలను మించి సక్సెస్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ కాగా బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టాండన్ తదితరులు కీలక పాత్ర పోషించారు. […]
[…] Bigg Boss Telugu OTT: రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ వేదికగా అలరిస్తోంది. కంటెస్టెంట్ల మాటలు, టాస్క్ లు, ఎలిమినేషన్ ఎపిసోడ్, కెప్టెన్సీ టాస్క్ లు రంజుగా సాగుతున్నాయి. ఎవరికి వారే రెచ్చిపోతున్నారు. కొందరు బూతులు మాట్లాడుతూ హౌస్ లో రచ్చ చేస్తున్నారు. గ్రుపులుగా మారి ఒకరిపై మరొకరు తిట్టి పోసుకుంటున్నారు. కాగా మొత్తం 17 మందిలో ముమైత్ ఖాన్, శ్రీరాపాక, సరయు, తేజస్వి, ఆర్జే చైతు, స్రవంతి.. ఈ ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. ముమైత్ ఖాన్ ను ఒకసారి ఎలిమినేట్ చేసి.. వైల్డ్ కార్డ్ ద్వారా మళ్లీ హౌస్లోకి తీసుకుని వచ్చి.. మళ్లీ ఎలిమినేట్ చేశారు. ప్రస్తుతం హౌస్ లో ఇంకా 11 మంది కొనసాగుతున్నారు. […]