Homeట్రెండింగ్ న్యూస్Apple Store: ముంబైలో ప్రారంభించే ‘యాపిల్ స్టోర్’ ప్రత్యేకతలేంటో తెలుసా?

Apple Store: ముంబైలో ప్రారంభించే ‘యాపిల్ స్టోర్’ ప్రత్యేకతలేంటో తెలుసా?

Apple Store
Apple Store

Apple Store: ఐటీ మేటి దిగ్గజం ‘యాపిల్’ భారత్ భూభాగాన అడుగుపెడుతోంది. ప్రపంచవ్యాప్తగా ప్రసిద్ధి గాంచిన ఈ కంపెనీ స్టోర్ ను భారత్ లో లాంచ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. యాపిల్ స్టోర్ ను దేశంలో ప్రారంభించడం ద్వారా తన మార్కెట్ ను మరింత విస్తరించుకోవచ్చని ఆ సంస్థ భావిస్తోంది. భారత్ లో యాపిల్ అడుగుపెట్టి 25 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ స్టోర్ ను ఏప్రిల్ 18న ముంబైలో ప్రారంభిస్తున్నట్లు ఈ స్టోర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుమ్ తెలిపారు. అద్భుతమైన సాంప్రదాయాలు కలిగిన భారత్ లో స్టోర్ ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా యాపిల్ స్టోర్ ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని బీకేసీ బిజినెస్ డిస్ట్రిక్ లో యాపిల్ స్టోర్ ను ఏర్పాటు చేస్తున్నారు. 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు అంతస్థుల భవనంలో పలు ప్రత్యేకతలతో తీర్చిదిద్దారు. 100 మంది సిబ్బంది ఈ స్టోర్ లో ఒకేసారి విధులు నిర్వహించవచ్చు. అంతేకాకుండా ఇక్కడ పనిచేసే సిబ్బంది భారతదేశంలోని 18 భాషలు మాట్లాడేవారు ఉంటారు. వీరిలో సగం మంది మహిళా ఉద్యోగులు ఉంటారు. యాపిల్ కు సంబంధించిన అన్ని ఉత్పత్తులను రిపేర్ చేయడానికి అనువైన టెక్నాలజీని అందుబాటులో ఉంచినట్లు యాపిల్ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డెడ్రీ ఓ బ్రెయిన్ తెలిపారు.

ముంబై లాంచింగ్ తరువాత ఏప్రిల్ 20న మరో స్టోర్ ను ఢిల్లీలో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతారని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. యాపిల్ సంస్థకు భారత్ తో దీర్ఘకాలికంగా అనుబంధం ఉంది. ఆ నేపథ్యంలో భారత మార్కెట్లలో ఐ ఫోన్ ను మరింత విస్తరించేందుకు సత్సంబంధాలు నెలకొంటామని వారు పేర్కొంటున్నారు. భారత్ లో పెట్టుబడులు పెట్టడం, మానవాళికి సేవ చేసే ఆవిష్కరణలతో మెరుగైన భవిష్యత్ ను నిర్మిస్తామని అంటున్నారు.

Apple Store
Apple Store

చైనాలో కొవిడ్ తో పాటు ఆర్థిక పరమైన చిక్కులు ఏర్పడడంతో యాపిల్ భారత్ వైపు మళ్లింది. 2017 నుంచి ఐఫోన్ల తయారీని భారత్ లో చేపట్టింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సుమారు 5 బిలియన్ల డాలర్ల విలువైన యాపిల్ ఎగుమతులు భారత్ నుంచే ఎగుమతి కావడం విశేషం. ఈ నేపథ్యంలో భారత్ లో స్టోర్లు నెలకొల్పడం, కొత్త పర్యావరణ హిత కార్యక్రమాలు చేపట్టడం కీలక మైలురాయి అని ఆ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...
Modi Gen Z Video

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...
Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
KTR And Harish Rao In Bigg Boss

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper