
Balagam Rupa Lakshmi: ఇప్పుడు ఏ నోటా విన్నా.. ఏ సౌండ్ విన్నా ‘బలగం’ మూవీ గురించే. గుండెల్ని పిండిసే ఈ సినిమా గురించి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచంలోని తెలుగువారంతా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా తీసిన డైరెక్టర్ వేణుతో పాటు ఇందులో నటించిన వారు ఫేమస్ అయ్యారు. దీంతో కొన్ని మీడియా సంస్థలు ఒక్కొక్కరితో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.
బలగం సినిమాలో ప్రతీ క్యారెక్టర్ ఇంపార్టెంటే. అందుకే ఇందులో హీరో, హీరోయిన్ కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టులకు సరైన గుర్తింపు లభించింది. ఈ సినిమాలో చనిపోయిన కొమురయ్య కూతురుగా లచ్చవ్వ పాత్రకు మరింత గుర్తింపు వచ్చింది. అచ్చం సొంత బిడ్డలాగే నటించిన ఈమె ఏడ్వడం చూసి కన్నీళ్లు పెట్టుకోని మహళ లేరనే చెప్పొచ్చు. అయితే ఇంతకీ ఈ లచ్చవ్వ ఎవరు? ఆమె బలగం సినిమాలో నటించేటప్పుడు ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు?
ఈ సినిమాలో లచ్చవ్వ పాత్రలో నటించిన అమె పేరు రూపలక్ష్మి. ముందుగా సీరియల్ లో నటంచిన ఆమె ఆ తరువాత 2018లో ‘నీది నాది ఒకే కథ’ అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తరువాత కొన్ని సినిమాలో నటించినా గుర్తింపు రాలేదు. కానీ ‘బలగం’ ద్వారా ఆమె ఫేమస్ అయ్యారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో రూపలక్ష్మి తన తనుభవాల గురించి చెప్పారు. మిగతా సినిమాల్లో కంటే బలగం సినిమా తీసేటప్పుడు కొన్ని సీన్స్ గురించి ఆమె చెప్పేవారట. దీంతో డైరెక్టర్ వేణు ఏమాత్రం అభ్యంతరం చెప్పకుండా స్వేచ్ఛ ఇచ్చారని అంటున్నారు. ముఖ్యంగా తండ్రి పాడెమీద ఉన్నప్పుడు ముద్దు పెట్టుకునే సీన్ గురించి వేణుకు చెప్పగానే ఒకే చేశాడట. అయితే ఆ సీన్ ఎందుకు చేయాల్సి వచ్చిందని అడగగా.. ఆమె చెప్పిన వివరాలు ఆమె మాటల్లోనే…

‘తండ్రి ఒక వయసు దాటిన తరువాత బిడ్డలాగే మారుతాడు. ఆయన మనకు దూరమవుతాడు.. ఇక కనిపించడు అంటే ఆ పెయిన్ మాములుగా ఉండదు.. అందువల్ల నేను తండ్రిని ముద్దు పెట్టుకోవచ్చా..అని అడిగాను. వెంటనే చేయమని చెప్పారు. నేనేదైనా సీన్ గురించి చెప్తే వెంటనే ఓకే చేసేవారు. నేను ఏ సినిమా షూటింగ్ కు వెళ్లినా డైరెక్టర్ ఏం చెబుతాడు.. నేనేం చేయాలి.. అని అనుకునేదాన్ని..కానీ ‘బలగం’ మూవీ షూటింగ్ సమయంలోమాత్రం స్వేచ్ఛనిచ్చారు. కొన్ని సీన్స్ నేను చెప్పినవి ఎప్పుడ వద్దనలేదు.. ’అని అన్నారు.