Adipurush: ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న పాన్ ఇండియన్ సినిమాలలో ఒకటి ‘ఆదిపురుష్’.ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికే విడుదల కావాల్సి ఉంది.కానీ కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుండి విడుదల చేసిన టీజర్ కి ఘోరమైన నెగటివ్ ట్రోల్ల్స్ రావడం తో గ్రాఫిక్స్ రీ వర్క్ కోసం చిత్రాన్ని జూన్ నెలకి వాయిదా వేశారు.
దీనితో షూటింగ్ కార్యక్రమాలు ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ సినిమా కేవలం గ్రాఫిక్స్ రీ వర్క్ కోసమే ప్రత్యేకంగా మరో 150 కోట్ల రూపాయిల బడ్జెట్ పెట్టి ప్రముఖ VFX కంపెనీ తో చేయించుకున్నారు.అయితే దీనికి సంబంధించిన ఫైనల్ ఔట్పుట్ ని ఇటీవలే ప్రభాస్ చూశాడట.కానీ ప్రభాస్ ఇప్పటికి గ్రాఫిక్స్ పై అసంతృప్తి గానే ఉన్నట్టు తెలుస్తుంది.అసలు ఏమి చేస్తున్నారు మీరు,ఇప్పటికీ గ్రాఫిక్స్ మొత్తం కార్టూన్ లాగానే ఉన్నాయి అని అన్నాడట.
ప్రభాస్ తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసేలోపు, మళ్ళీ గ్రాఫిక్స్ పై రీ వర్క్ చేస్తారా..? అనే సందేహాలు మొదలయ్యాయి.ఇప్పటికే ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ 450 కోట్ల రూపాయిలను దాటేసింది.ఇప్పుడు మరోసారి రీ వర్క్ అంటే ఇక విడుదల చేసి దండగ అనే ఉద్దేశ్యానికి దర్శక నిర్మాతలు వచేసారట.ఇదంతా చూస్తూ ఉంటె అసలు ఈ సినిమాని విడుదల చేస్తారా..?, లేదా ఓటీటీ కి ఇచ్చేస్తారా అనే భయాందోళనలు అభిమానుల్లో నెలకొన్నాయి.
రామాయణం మీద సినిమా సరిగ్గా తీస్తే నార్త్ ఇండియా లో బాహుబలి 2 ఫుల్ రన్ కలెక్షన్స్ ని దాటేసి కేవలం నార్త్ నుండే వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసే అవకాశం ఉంటుంది.అదే సమయం లో మన చరిత్రని కాస్త తేడాగా తీసిన వాళ్ళ నుండి విపరీతమైన నిరసనలు ఎదురుకోవాల్సి వస్తుంది.ఎందుకంటే నార్త్ ఇండియా లో శ్రీ రాముడిని అంతలా కొలుస్తారు.మరి ఈ సినిమాకి సంబంధించి ఓం రౌత్ ఏమి చెయ్యబోతున్నాడో చూడాలి.
Also Read:Zodiac Signs On Holi: హోలీ తరువాత ఈ రాశుల వారికి అన్ని శుభాలే?
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read More