Kalvakuntla Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిద దాఖలు చేసుకున్న బెయిల్ పనిటిషన్లపై సోమవారం(మే 6న) తీర్పు రానుంది. ఈడీ, సీబీఐ నమోదు చేసిన రెండు కేసుల్లోనూ బెయిల్కు సంబంధించి ఢిల్లీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పులు ఇవ్వనున్నారు.
మార్చి 15న అరెస్ట్..
లిక్కర్ కేసులో ఈడీ మార్చి 15న ఈడీ కవితను అరెస్టు చేసింది. ఆ కేసులో జుడీషియల్ కస్టడీలో ఉండగానే ఏప్రిల్ 11న సీబీఐ కూడా కవితను పిటీ వారెంట్తో అరెస్టు చేసింది. ఈ కేసులకు సంబంధించి కవిత వేర్వేరుగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. కుమారుడి పరీక్షల నేపథ్యంలో తల్లిగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉందంటూ ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ కోరారు కవిత. మరోవైపు బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్గా తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని మహిళలపరమైన కొన్ని సమస్యలు ఉన్నాయని సీబీఐ కేసులో బెయిల్ కోరారు.
స్టేట్మెంట్ల ఆధారంగా అరెస్టు..
తనకు లిక్కర్ కేసుతో సబంధం లేదని, ఇతరుల స్టేట్మెంట్ల ఆధారంగానే తనను అరెస్టు చేశారని, మహిళను కాబట్టి బెయిల్కు అర్హురాలినని ఆమె తరఫు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. మరోవైపు ఈ రెండు బెయిల్ పిటిషన్లు దర్యాప్తు సంస్థలు వ్యతిరేకించాయి. కవితకు బెయిల్ ఇస్తే ఆధారాలు ధ్వంసం చేసే అవకాశం ఉందని, దర్యాప్తుపై ప్రభావం పడుతుందని కోర్టుకు విన్నవించాయి. ఈ పిటిషన్లపై వాదనల ఇప్పటికే పూర్తయ్యాయి. తీర్పును మే 6వరకు రిజర్వు చేశారు.
బెయిల్ రాకుంటే హై కోర్టుకు..
ప్రత్యేక కోర్టులో కవితకు బెయిల్ రానిపక్షంలో వెంటనే హైకోర్టుకు వెళ్లాలని కవిత తరఫు న్యాయవాదులు భావిస్తుతన్నారు. మరోవైపు కవిత జ్యుడీషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. సోమవారం బెయిల్ రాకుంటే మంగళవారం ఆమెను న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చాల్సి ఉంటుంది. ఈసారి తనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా నేరుగా కోర్టుకు హాజరయ్యేలా చూడాలని కవిత ఇప్పటికే కోర్టును కోరారు.