spot_img
HomeతెలంగాణVote for note case  : ఓటుకు నోటు కేసులో సంచలనం.. బిఆర్ఎస్ నేత పిటిషన్...

Vote for note case  : ఓటుకు నోటు కేసులో సంచలనం.. బిఆర్ఎస్ నేత పిటిషన్ పై స్పందించిన కోర్టు!

Vote for note case : న్యాయస్థానాల్లో ఏపీ సీఎం చంద్రబాబు కు వరుస ఉపశమనం కలుగుతోంది. ప్రధానంగా ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ఇరికించాలని తెలంగాణలో బిఆర్ఎస్, ఏపీలో వైసిపి ప్రయత్నిస్తూనే ఉంది. కానీవారి ప్రయత్నాలు ఫలించడం లేదు. న్యాయస్థానాల్లో పిటీషన్లు రద్దవుతున్నాయి. తిరస్కరణకు గురవుతున్నాయి. ఓటుకు నోటు కేసును తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి మార్చాలని బిఆర్ఎస్ నాయకుడు ఒకరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిని కోర్టు తిరస్కరించింది. కొద్ది రోజుల కిందట మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సైతం సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో చంద్రబాబు పేరును జతచేస్తూ కొత్తగా విచారణ చేపట్టాలని ఒక పిటిషన్, కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లు రాజకీయ దురుద్దేశంతో వేసినవేనని భావించిన సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజకీయ యుద్ధాలకు న్యాయస్థానాలను వేదికగా చేసుకోవద్దని హితవు పలికింది. వాస్తవానికి 2016 నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ఇరికించాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆయన దాఖలు చేసిన ప్రైవేటు కంప్లైంట్ పరిగణలోకి తీసుకునివరుసగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ వచ్చారు. కానీ చివరిగా అత్యున్నత న్యాయస్థానం తప్పు పట్టింది. ఏకంగా పిటిషన్లను రద్దు చేసింది.

* సీఎంలుగా ఉండడంతో ప్రభావితం
మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ప్రస్తుతం కేసు తెలంగాణ కోర్టులో నడుస్తోంది. దీంతో కేసు పై ఇద్దరు నేతలు ప్రభావం చూపుతారని బిఆర్ఎస్ అనుమానిస్తోంది. ఆ పార్టీకి చెందిన జగదీశ్వర్ రెడ్డి ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసును తెలంగాణ హైకోర్టు నుంచి మధ్యప్రదేశ్ హైకోర్టుకు మార్చాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఇద్దరు సీఎంలు అయినందున కేసును ప్రభావితం చేస్తారా అంటూ ప్రశ్నించింది. ఇలా కేసులను బదిలీ చేసుకుంటూ పోతే ఎలా అని వ్యాఖ్యానించింది. పిటిషన్ ను కొట్టివేసింది.

* అప్పట్లో ప్రలోభ పరిచారని
2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఓటు కోసం అప్పట్లో రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. టిడిపికి మద్దతుగా ఓటు వేయాలని కోరారు. అయితే ఆ సమయంలో ప్రలోభాలకు గురి చేశారు అన్నది అభియోగం. అప్పట్లో రేవంత్ టిడిపిలోనే ఉండేవారు. అధినేత చంద్రబాబుతో నేరుగా స్టీఫెన్సన్ మాట్లాడించారు. ఈ క్రమంలో నమోదైన కేసు.. అప్పటినుంచి తెలంగాణ హైకోర్టులో విచారణ దశలో ఉంది.

* ఆ రెండు పార్టీలది అదే ప్రయత్నం
అయితే చంద్రబాబుకు ఉమ్మడి శత్రుత్వం ఉండడంతో అటు వైసిపి, అదే సమయంలో బిఆర్ఎస్ చంద్రబాబును ఎలాగైనా ఇరికించాలని చూశాయి. అందుకే ఏపీ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి, తెలంగాణ నుంచి జగదీశ్వర్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. కానీ న్యాయస్థానాలు మాత్రం వారి పిటిషన్లను పరిగణలోకి తీసుకోలేదు. ఆళ్ల పిటిషన్ పై రాజకీయ దురుద్దేశాన్ని గుర్తించింది కోర్టు. ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ కూడా అలానే ఉందని అభిప్రాయపడింది. మొత్తానికైతే ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు వరుసగా ఉపశమనం దక్కుతుండడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Japan And US

Japan And US: జర్మనీ అణు రహస్యం జపాన్‌కు చేరకుండా అడ్డుకున్న అమెరికా.. లేదంటే ప్రపంచ పటమే మారిపోయేది!

Japan And US: ప్రపంచంలో ప్రస్తుతం అణ్వస్త్రాలు కలిగిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. తర్వాత రష్యా, చైనా, భారత్‌ కూడా ఉన్నాయి. ఇక ఏ దేశం కూడా అణ్వాయుధాలు కలిగి ఉండకుండా...
Jana Nayagan Collection

Jana Nayagan Collection: ‘జన నాయగన్ ‘ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇంత తక్కువ గ్రాస్...

Jana Nayagan Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై ,...
Kajal Aggarwal

Kajal Aggarwal: అతను ఎవ్వరూ లేని సమయం చూసి నా రూమ్ లోకి ప్రవేశించాడు అంటూ కాజల్ అగర్వాల్...

Kajal Aggarwal: సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, సక్సెస్ అవ్వాలని ఎంతో మందికి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అమ్మాయిల తల్లిదండ్రులు...
Nara Rohith

Nara Rohith: ‘ఆదర్శ కుటుంబం’ నుండి నారా రోహిత్ లుక్ విడుదల.. ఈ రేంజ్ లో ఉన్నాడేంటి..

Nara Rohith: 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా...
Dhruv Vikram:

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...
Oktelugu Epaper