TS SSC Results 2023: తెలంగాణలో పదవ తరగతి ఫలితాలు మరికొన్ని గంటల్లో విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నారు. రిజల్ట్స్ ఎప్పుడా అని ఎదురుచూస్తున్న స్టూడెంట్స్తోపాటు వారి తల్లిదండ్రులు మరికొన్ని గంటల్లో ఈ ఫలితాలు చూసుకోవచ్చు.
4,84,384 మంది హాజరు..
ఈ ఏడాది జరిగిన పదో తరగతి పరీక్షలకు రెగ్యులర్ విద్యార్థులు 4,86,194 మంది దరఖాస్తు చేసుకోగా 4,84,384 మంది హాజరయ్యారు. వీరంతా రిజల్ట్స్ కోసం దురు చూస్తున్నారు. ఏప్రిల్ 11వ తేదీన తెలంగాణ పదో తరగతి పరీక్షలు ముగియగా 14వ తేదీన వాల్యుయేషన్ ప్రక్రియ ను ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా 18 కేంద్రాల్లో వాల్యుయేషన్ నిర్వహించారు. ఏప్రిల్ 21వ తేదీ వరకు పూర్తిచేశారు.
ఫలితాల్లో తప్పులు దొర్లకుండా..
తుది ఫలితాల్లో తప్పులు దొర్లకుండా అధికారులు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఒకటికి రెండుసార్లు వెరిఫికేషన్ చేస్తున్నారు. టెక్నికల్ ట్రయల్స్ను పలుమార్లు నిర్వహించారు. అంతా సవ్యంగా జరుగడంతో బుధవారం ఫలితాలు ప్రకటించాలని నిర్ణయించారు.
వెబ్సైట్లో ఫలితాలు..
టెన్త్ రిజల్ట్స్ను అధికారులు వెబ్సైట్లో పెట్టే ప్రక్రియ కూడా పూర్తి చేశారు. మధ్యాహ్నం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలు విడుదల చేయగానే https://bse.telangana.gov.in/ లో వెబ్సైట్లో రిజల్ట్స్ చూసుకునేలా ఏర్పాట్లు చేశారు. వెబ్సైట్పై క్లిక్ చేసి హాల్టికెట్ నంబర్ ఎంటర్ చేయగానే ఫలితాలు డిస్ప్లే అవుతాయి. ప్రింట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.