HomeతెలంగాణCoronavirus: తెలంగాణలో కరోనా కలకలం.. ఒకరు మృతి

Coronavirus: తెలంగాణలో కరోనా కలకలం.. ఒకరు మృతి

Coronavirus: తెలంగాణలో కరోనా కేసుల వ్యాప్తి పెరుగుతోంది. మొన్న నాలుగు కేసులు నమోదు కాగా.. నిన్న 6 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 14 కి చేరింది. కువిట్ పారిన పడిన ఒకరు ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ వ్యాప్తంగా కలవరం ప్రారంభమైంది. నిన్నటి వరకు దేశవ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయని తెలియడం ఆందోళన కలిగించింది. ఇప్పుడు ఏకంగా ఒక వ్యక్తి మృతి చెందడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు తేలుతోంది.

2020లో కరోనా వ్యాప్తి ప్రారంభమైంది. 2021లోనూ కొనసాగింది. వేలాదిమంది మృత్యువాత పడ్డారు. ప్రపంచాన్ని వణికించింది ఈ మహమ్మారి. వ్యాక్సినేషన్ ప్రారంభం కావడంతో వైరస్ వ్యాప్తి తగ్గింది. గత రెండు సంవత్సరాలుగా ఎటువంటి ప్రభావం చూపలేదు. కానీ తాజాగా కొత్త సబ్ వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉంది. దీంతో దేశవ్యాప్తంగా కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా కేరళలో మాత్రం పరిస్థితి విషమంగా ఉంది. అక్కడ వందలాది కేసులు నమోదవుతుండడంతో ప్రభుత్వం అలెర్ట్ అయింది.

తాజాగా తెలంగాణలో కేసులు పెరుగుతుండడం.. ఒక వ్యక్తి మృత్యువాత పడటంతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. వైద్య శాఖ సన్నద్ధంగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయ అన్ని రాష్ట్రాల మంత్రులతో కోవిడ్ సన్నద్ధతపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ మంత్రి దామోదర రాజనర్సింహతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం మంత్రి దామోదర రాజనర్సింహ రాష్ట్ర అధికారులతో సమావేశం నిర్వహించారు. గురువారం అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం పాజిటివ్ రేటు కేవలం 0.37 ఉన్నట్లు అధికారులు మంత్రికి వివరించారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular