తాను చేసిన అప్పులు తీర్చేందుకు అఘాయిత్యానికి పాల్పడ్డాడో వ్యక్తి. సొంత తల్లిని,చెల్లిని అన్నంలో విషం కలిపి చంపి ఏం తెలియనట్టు నటించాడు. అయితే పోలీసులకు అందిన ఫిర్యాదుతో ఆ వ్యక్తిని విచారించిన పోలీసులకు అసలు నిజం తెలిసింది. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా రావల్ కోల్ కు చెందిన సాయిరెడ్డి బీటెక్ పూర్తి చేసినా చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. తన తండ్రి ప్రభాకర్ రెడ్డి కొంతకాలం కిందట మరణించడంలో ఆయన ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వాలని తల్లి సునీత, చెల్లి అనూషలతో గొడవపడేవాడు. అయితే క్రూరంగా ఆలోచించిన సాయిరెడ్డి ఈనెల 23న రాత్రి తన చెల్లి, తల్లి తినే భోజనంలో విషం కలిపాడు. అయితే మరుసటి రోజు ఉదయం వారు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఏం తెలియనట్టు మేడ్చల్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించాడు. ఈనెల 26న అనూష, 27న సునీతలు మరణించారు. అయితే అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో సాయిరెడ్డిని విచారించడంతో నిజం ఒప్పుకున్నాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read More