
సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గంలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 9 గంటల వరకు 12.74 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు దుబ్బాక మండలం బొప్పాపూర్ గ్రామంలో ఓటేశారు. అలాగే కరోనా నేపథ్యంలో వైద్య సిబ్బందిని, అంబులెన్స్లను అందుబాటులో ఉంచారు. అన్ని నియోజకవర్గ పరిధిలో పోలీస్ బందోబస్తు పటిష్టంగా ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో ఇక్కడ పోలింగ్ సమయాన్ని పెంచారు. సాధారణంగా 5 గంటల వరకు పోలింగ్ సమయం ఉంటుంది. అయితే భౌతిక దూరం పాటిస్తూ పోలింగ్ కేంద్రాలకు తక్కువ మందినే అనుమతించడంలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.