
తెలంగాణలో కరోనా స్ట్రెయిన్ వైరస్ కలకలం సృష్టిస్తోంది. యూకే నుంచి తెలంగాణకు వచ్చిన వారిలో 20 మందికి కరోనా పాజిటివ్గా వచ్చినట్లు వైద్యులు నిర్దారించారు. అయితే ఈ 20 మందిలో ఎంతమందికి కరోనా స్ట్రెయిన్ ఉందనేది తెలియాల్సి ఉంది. 20మంది శాంపిల్స్ జీన్ మ్యాప్ రిపోర్టులను సీసీఎంబీ కేంద్రానికి పంపింది. కరోనా స్ట్రెయిన్పై అన్ని రాష్ట్రాల నుంచి కేంద్రానికి రిపోర్టులు చేరుతున్నాయి. కొత్త స్ట్రెయిన్ గురించి వైద్యాధికారులు ఎవరూ మాట్లాడొద్దని కేంద్రం ఆదేశాలిచ్చింది. రేపు సాయంత్రం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖప్రెస్మీట్ ఏర్పాటు చేయనుంది.