జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం కాంగ్రెస్ మెనిఫెస్టోను విడుదల చేసింది. ఈ సందర్భంగా తన మెనిఫెస్టోలో భారీగా వరదసాయాన్ని ప్రకటించింది. హైదరాబాద్ లో కురిసిన వర్షం కారణంగా నష్టపోయిన బాధితుల ఒక్కొక్కరికి రూ. 50 వేలు ఇస్తానని పేర్కొంది. అలాగే ఈ సంఘటనల్లో చనిపోతే రూ.25 లక్షలు చెల్లిస్తామంది. ఇక దెబ్బతిన్న ఇళ్లకు రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షలు ఇస్తామని తెలిపింది. ఇప్పటికే టీఆర్ఎస్ తన మేనిఫెస్టోలో వరద సాయం రూ. 10 వేలు ప్రకటించింది. కొందరికి అందించి కూడా. అయితే ఎన్నికలు రావడంతో ఆ సాయం నిలిచిపోయింది. దీంతో ఎన్నికలు పూర్తి కాగానే వరదసాయం అందిస్తామని తెలిపింది. ఇక బీజేపీ రూ.25 వేల వరదసాయం ఇస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ మాత్రం అందరిక కంటే ఎక్కువగా రూ.50 వేలు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Congress floodrelief rs 50000manifesto release
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com