
తెలంగాణలో రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు నిన్నటితో పోలిస్తే కేసులు కాస్త పెరిగాయి. వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం వారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 565 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,70,833 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,462గా ఉన్నట్లు బులిటెన్లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,60,155 మంది కోలుకోగా ప్రస్తుతం 9,266యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 7,219 మంది ఇంట్లో చికిత్స పొందుతున్నారు.