
తెలంగాణలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన బులిటెన ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,436 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ఏడుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,24,545 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,282గా ఉన్నట్లు బులిటెన్లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,02,577 మంది కోలుకోగా ప్రస్తుతం 22,686 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 17,208 ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు.