
తెలంగాణలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం విడుదల చేసిన బులిటెన ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,440 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ఐదుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,50,331 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,377గా ఉన్నట్లు బులిటెన్లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,29,064 మంది కోలుకోగా ప్రస్తుతం 19,890 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 17,135 మంది ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారని ఆరోగ్యశాఖ తెలిరిపింది.