Homeక్రీడలుక్రికెట్‌Vaibhav Suryavanshi India Team Chances: వైభవ్ సూర్య వంశీ ఎంట్రీకి . అనేక చిక్కుముళ్లు.....

Vaibhav Suryavanshi India Team Chances: వైభవ్ సూర్య వంశీ ఎంట్రీకి . అనేక చిక్కుముళ్లు.. జాతీయ జట్టులో అడుగు పెట్టడం కష్టమేనా..

Vaibhav Suryavanshi India Team Chances: చిచ్చరపిడుగు వైభవ్ సూర్య వంశీ జాతీయ జట్టులో అడుగుపెడతాడని మొన్ననే కదా అనుకున్నాం. ఈ బుడ్డోడు ఊచ కోత మొదలుపెడితే పరుగుల సునామీ ఖాయమని అంచనా వేశాం. కానీ మన అంచనాలు.. తప్పే ప్రమాదం కనిపిస్తోంది. ఎందుకంటే వైభవ్ సూర్య వంశీ టీమ్ ఇండియాలో అడుగుపెట్టేది.. సచిన్ రికార్డులను బద్దలు కొట్టేది ఇంకా ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈనెల 26 నుంచి ఐర్లాండ్ జట్టుతో జరిగే రెండు టి20 మ్యాచ్ […]

Vaibhav Suryavanshi India Team Chances: చిచ్చరపిడుగు వైభవ్ సూర్య వంశీ జాతీయ జట్టులో అడుగుపెడతాడని మొన్ననే కదా అనుకున్నాం. ఈ బుడ్డోడు ఊచ కోత మొదలుపెడితే పరుగుల సునామీ ఖాయమని అంచనా వేశాం. కానీ మన అంచనాలు.. తప్పే ప్రమాదం కనిపిస్తోంది. ఎందుకంటే వైభవ్ సూర్య వంశీ టీమ్ ఇండియాలో అడుగుపెట్టేది.. సచిన్ రికార్డులను బద్దలు కొట్టేది ఇంకా ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.

ఈనెల 26 నుంచి ఐర్లాండ్ జట్టుతో జరిగే రెండు టి20 మ్యాచ్ ల సిరీస్ లో వైభవ్ సూర్య వంశీ టీమ్ ఇండియాలోకి అడుగుపెడతాడని అందరూ అనుకున్నారు. అయితే ప్రస్తుతం ఐర్లాండ్ దేశంలో పరిస్థితులు ఏమాత్రం బాగోలేదు. ఉత్తర ఐర్లాండ్ ప్రాంతంలో అక్కడి బెల్ ఫాస్ట్ ఏరియాలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. దీంతో ఇండియా, ఐర్లాండ్ సిరీస్ వాయిదా పడి అవకాశం కనిపిస్తోంది. ఇదే కనుక జరిగితే వైభవ్ జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం కాస్త ఆలస్యం అవుతుంది.

అక్కడ అల్లర్లు జరుగుతున్నాయి. భారీగా నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఉద్రిక్తతలు తీవ్రస్థాయిలో ఉన్నాయి.. అక్కడ నిరసనలు తగ్గుముఖం పట్టకపోవడంతో లిస్ బర్న్ ప్రాంతంలో జరగాల్సిన ఇంటర్ ప్రెవెన్షియల్ టి20 టోర్నీని మొత్తానికి రద్దు చేశారు. ఈ ఆదివారం జరిగే సీనియర్ కప్, నేషనల్ కప్ మ్యాచ్ ల పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ మ్యాచ్ ల పై వచ్చే నలభై ఐదు గంటల్లో కీలక నిర్ణయం తీసుకుంటామని ఐర్లాండ్ వెల్లడించింది.

ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్లేయర్లు, కోచ్ లు, అభిమానుల భద్రత తమకు అత్యంత ముఖ్యమని ఐర్లాండ్ క్రికెట్ స్పష్టం చేసింది. ఒకవేళ పరిస్థితుల్లో ఏమైనా మార్పు వస్తే ఇండియాతో సిరీస్ జరుగుతుంది. ఒకవేళ పరిస్థితులు దిగజారిపోతే అప్పుడు సిరీస్ షెడ్యూల్ మారుతుంది. ఐర్లాండ్ తో భారత్ ఈనెల 26న తొలి టి20 మ్యాచ్ ఆడుతుంది. 28న రెండవ మ్యాచ్ ఆడుతుంది. బెల్ ఫాస్ట్ లోనే ఈ రెండు మ్యాచ్లు జరుగుతాయి. ఒకవేళ ఈ సిరీస్ వాయిదా పడితే.. అప్పుడు సూర్య వంశీ జాతీయ జట్టులో ఎంట్రీ ఇవ్వడానికి ఇంగ్లాండ్ సిరీస్ దాకా ఎదురుచూడాల్సి ఉంటుంది. సూర్యవంశీ ప్రస్తుతం శ్రీలంకలో ఉన్నాడు. ఇండియా ఏ జట్టు తరఫున ఆడుతున్నాడు. తొలి మ్యాచ్లో శ్రీలంక జట్టుపై 14 పరుగులు.. ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 44 పరుగులు చేశాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper