Neeraj Chopra : 2021లో జరిగిన ఒలంపిక్ పోటీల్లో భారతదేశానికి “బంగారు ఈటె” అందించిన నీరజ్ చోప్రా.. ఈసారి అంతకుమించి అనేలాగా అరుదైన ఘనత సాధించాడు. పురుషుల జావెలిన్ త్రో లో ప్రపంచ నెంబర్ వన్ సాధించాడు. గ్రెనడా కు చెందిన ప్రపంచ ఛాంపియన్ అండర్సన్ పీటర్స్(1433 పాయింట్లు) ను నీరజ్ చోప్రా (1455) వెనక్కి నెట్టి టాప్ ర్యాంక్ దక్కించుకున్నాడు. టోక్యో ఒలంపిక్స్ రజత పతక విజేత జాకబ్( చెక్ రిపబ్లిక్, 1,416) మూడో ర్యాంకులో నిలిచాడు. గత ఏడాది ఆగస్టు 30న రెండవ ర్యాంకు దక్కించుకున్న చోప్రా తన అద్భుత ప్రదర్శనతో కెరియర్లో తొలిసారి అగ్రస్థానానికి ఎగబాకాడు.