Homeక్రీడలుక్రికెట్‌Team India WTC Final Qualification: ఆఫ్గనిస్తాన్ మీద గెలిచినా.. టీమిండియాకు అదే దుస్థితి.. WTC...

Team India WTC Final Qualification: ఆఫ్గనిస్తాన్ మీద గెలిచినా.. టీమిండియాకు అదే దుస్థితి.. WTC ఫైనల్స్ వెళ్లాలంటే ఇది జరగాలి

Team India WTC Final Qualification: ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన ఏకైక టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 300 పరుగుల విజయం సాధించింది.. తద్వారా టీమ్ ఇండియా టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. టీమిండియా ఈ స్థాయిలో విజయాన్ని అందుకున్నప్పటికీ.. డబ్ల్యూటీసి పాయింట్ల పట్టికలో ఇంకా ఆరవ స్థానంలోనే కొనసాగుతోంది. స్థూలంగా చెప్పాలంటే బంగ్లాదేశ్ కంటే దిగువ స్థానంలో కొనసాగుతోంది.

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్లు ఆడిన ఆస్ట్రేలియా ఏడు విజయాల సొంతం చేసుకుంది.. ఆ జట్టు ఖాతాలో 84 పాయింట్లు ఉన్నాయి. రెండో స్థానంలో సౌత్ ఆఫ్రికా కొనసాగుతోంది. సౌత్ ఆఫ్రికా ఏకంగా నాలుగు మ్యాచ్లు ఆడి.. మూడు విజయాలు సాధించింది. సౌత్ ఆఫ్రికా ఖాతాలో 75 పాయింట్లు ఉన్నాయి. మూడో స్థానంలో శ్రీలంక కొనసాగుతోంది. శ్రీలంక రెండు మ్యాచ్ లు ఆడి.. ఒక దాంట్లో విజయం సాధించింది. మరొక మ్యాచ్ డ్రా అయింది. శ్రీలంక ఖాతాలో 66.67 పాయింట్లు ఉన్నాయి.

నాలుగో స్థానంలో న్యూజిలాండ్ కొనసాగుతోంది. న్యూజిలాండ్ జట్టు నాలుగు మ్యాచ్లు ఆడి.. రెండు విజయాలు సాధించింది. ఇందులో ఒక మ్యాచ్ ఓడిపోగా.. మరొక మ్యాచ్ డ్రా అయింది.. ఐదవ స్థానంలో బంగ్లాదేశ్ కొనసాగుతోంది. బంగ్లాదేశ్ నాలుగు మ్యాచ్ లు ఆడింది. ఇందులో రెండు విజయాలు.. ఒక ఓటమి.. మరొక డ్రా ఉన్నాయి. ఆరో స్థానంలో ఇండియా కొనసాగుతోంది. ఇండియా ఖాతాలో 48.15 పాయింట్లు ఉన్నాయి.

టీమిండియా తదుపరి శ్రీలంక, న్యూజిలాండ్ జట్లతో సిరీస్ లు ఆడుతుంది.. ఈ సిరీస్లలో టీమిండియా కచ్చితంగా గెలవాలి. స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో ఎదురైన వైట్ వాష్ పరాభవానికి బదులు తీర్చుకోవాలి. శ్రీలంక జట్టు మీద కూడా ఏకపక్షమైన విజయాన్ని సాధిస్తేనే టీమ్ ఇండియాకు డబ్ల్యూటీసి ఫైనల్ వెళ్లే అవకాశం ఉంటుంది.

గత రెండు పర్యాయాలు టీమిండియా డబ్ల్యూటీసి ఫైనల్ వెళ్ళింది. ఫైనల్ లో ఒకసారి న్యూజిలాండ్.. మరొకసారి ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. గత సీజన్లో టీం ఇండియా అంతగా ఆకట్టుకోలేదు. అందువల్ల డబ్ల్యూటీసీ ఫైనల్ వెళ్లలేకపోయింది. అయితే ఈసారి న్యూజిలాండ్, శ్రీలంక జట్లతో జరిగే సిరీస్లలో విజయాలు సాధించి.. డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోవాలని భావిస్తోంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా జట్టుతో జరిగే సిరీస్లో అదరగొడితే టీమ్ ఇండియాకు ఇక ఎదురు ఉండదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular