T20 World Cup 2024: ఓ ఎండ్ లో ఐపీఎల్ జోరుగా సాగుతుంటే.. మరో ఎండ్ లో టీ – 20 వరల్డ్ కప్ నకు కౌంట్ డౌన్ మొదలైంది. ఇప్పటికే అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించాయి. ఇందులో భారత్ కూడా ఉంది. భారత క్రికెట్ బోర్డు ఇటీవల 15 మందితో కూడిన ఆటగాళ్ల జాబితాను ఐసీసీకి పంపించింది. ఐసీసీకి బీసీసీఐ పంపించిన జాబితాలో బలమైన ఆటగాళ్లు, నాణ్యమైన బౌలర్లు, కళ్ళు చెదిరే లా ఫీల్డింగ్ చేసే క్రీడాకారులు ఉన్నారు. అయితే వీరిలో ప్లే -11 జాబితాలో ఉండే ఆటగాళ్లు ఎవరంటే..
ప్రస్తుతం ఐపీఎల్ జోరుగా సాగుతోంది. అభిమానులకు అద్భుతమైన క్రీడా వినోదాన్ని అందిస్తోంది. మ్యాచ్ లు చూసేందుకు అభిమానులు భారీగా మైదానాలకు తరలివస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ ఐపీఎల్ పండుగ ముగుస్తుంది. అది ముగిసిన కొద్ది రోజులకే టి20 వరల్డ్ కప్ ప్రారంభమవుతుంది. ఈ టోర్నీకి అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. అమెరికాలో మైదానాల గురించి పక్కన పెడితే.. వెస్టిండీస్ లో మైదానాలు స్పిన్, పెస్ కు సహకరిస్తాయి. లైన్ అండ్ లెంగ్త్ తో బంతులు వేస్తే కచ్చితంగా వికెట్లు దక్కుతాయి. అప్పుడప్పుడు ఈ మైదానాలపై తేమ బ్యాటర్లకు సహకరిస్తుంది. దూకుడుగా ఆడే ఆటగాళ్లు పండగ చేసుకోవచ్చు.
ప్లే -11 లో కెప్టెన్ రోహిత్ శర్మ, యువ సంచలనం యశస్వి జైస్వాల్ భారత ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉండొచ్చు. విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా.. వంటి వారు మిడిల్ ఆర్డర్లో ఆడే అవకాశం ఉండొచ్చు. వీరు గనుక తమ పూర్వపు లయను దొరకబుచ్చుకొని ఆడితే.. మ్యాచ్ స్వరూపాన్ని జస్ట్ క్షణాల్లో మార్చేస్తారు.. మీరు మాత్రమే కాకుండా ఐపీఎల్లో అద్భుతమైన ఫామ్ లో ఉన్న శివం దుబే పై కూడా భారీ అంచనాలున్నాయి.. బుమ్రా కూడా పేస్ గుర్రం లాగా బంతులు వేస్తున్నాడు. ఐపీఎల్ లో లీడింగ్ వికెట్ టేకర్ గా ఉన్నాడు. పర్పుల్ క్యాప్ విభాగంలో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. అర్ష్ దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ కూడా ప్లే -11 లో కచ్చితంగా ఉంటారు.
ప్రధాన స్పిన్నర్లుగా రవీంద్ర జడేజా, కులదీప్ యాదవ్ కొనసాగే అవకాశం ఉంది.. జట్టు అవసరాల నేపథ్యంలో యజువేంద్ర చాహల్ కు అవకాశం లభించే అవకాశం ఉంది.. మరోవైపు సంజూ శాంసన్ కూడా ఐపీఎల్ లో అదరగొడుతున్నాడు. తాను నాయకత్వం వహిస్తున్న రాజస్థాన్ జట్టును తిరుగులేని స్థాయిలో నిలబెట్టాడు.. అందువల్ల బిసిసిఐ ఇతడిని కూడా ఎంపిక చేసింది. ఇతడు కూడా తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే టీమిండియా కు తిరిగి ఉండదు.. టీ 20 వరల్డ్ కప్ లో ఆడే ఆటగాళ్లలో నలుగురు ఆల్ రౌండర్లు ఉన్నారు. హార్దిక్ పాండ్యా, శివం దుబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ వంటి వారు తమదైన రోజున మ్యాచ్ ను మలుపు తిప్పగలరు. అయితే ఆటగాళ్లు మొత్తం తమ ఫామ్ దొరకబుచ్చుకొని ఆడితే.. టీమిండియాకు తిరుగు ఉండదు.