spot_img
Homeక్రీడలుక్రికెట్‌India Vs Australia: కమాన్ కోహ్లీ.. అచ్చొచ్చిన మైదానం పై సత్తా చాటాల్సిన తరుణం వచ్చేసింది!

India Vs Australia: కమాన్ కోహ్లీ.. అచ్చొచ్చిన మైదానం పై సత్తా చాటాల్సిన తరుణం వచ్చేసింది!

India Vs Australia: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గత రెండు బాక్సింగ్ డే టెస్ట్ లను టీమిండియా గెలిచింది. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తోంది. ఇది జరగాలంటే ఆటగాళ్లు సత్తా చాటాల్సి ఉంటుంది. దూకుడుగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే దురదృష్టవషత్తు టీమ్ ఇండియా ఆటగాళ్లు తమ స్థాయి ప్రదర్శన చేయడం లేదు. ఆస్ట్రేలియా బౌలర్ల చేతిలో వరుసగా విఫలమవుతున్నారు. ఇందులో స్టార్ ఆటగాళ్లు రోహిత్, విరాట్ ఉండడం అభిమానులను నిరాశ పరుస్తోంది. ముఖ్యంగా ఆస్ట్రేలియాపై ఎంతో ఘనమైన, బలమైన రికార్డు కలిగి ఉన్న విరాట్ కోహ్లీ తాజా సిరీస్లో దారుణంగా విఫలమవుతున్నాడు. ఇప్పటివరకు ఒక్క సెంచరీ మాత్రమే చేసిన అతడు.. మిగతా మ్యాచ్లలో దారుణంగా విఫలమయ్యాడు.

126 పరుగులే..

విరాట్ కోహ్లీ ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడాడు. కేవలం 126 పరులు మాత్రమే చేశాడు. 31.5 సగటును కొనసాగిస్తున్నాడు. వాస్తవానికి విరాట్ లాంటి ఆటగాడి నుంచి ఇలాంటి ప్రదర్శనను అతని అభిమానులు ఊహించలేకపోతున్నారు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ రెండవ ఇన్నింగ్స్ లో విరాట్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. ఏకంగా సెంచరీ చేశాడు. కానీ ఆ తర్వాత ఆ స్థాయిలో ఆడలేకపోయాడు.. ఇక డిసెంబర్ 26 నుంచి మెల్ బోర్న్ వేదికగా జరిగే నాలుగో టెస్టులో విరాట్ తన పూర్వపు ఆట తీరు ప్రదర్శించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మైదానంపై విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు ఆడిన మూడు టెస్ట్ లలో 52.66 సగటుతో 316 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2014లో మైదానంపై విరాట్ కోహ్లీ 169 రన్స్ చేశాడు. ఆ ఇన్నింగ్స్ తో విరాట్ పేరు సంచలనగా మారింది. ఇక అదే మ్యాచ్లో రెండవ ఇన్నింగ్స్ లో 54 పరుగులు చేసి జట్టుకు ఓటమిని తప్పించాడు. ఇక ఈ మైదానంపై రెండు సంవత్సరాల క్రితం విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. ఈ మైదానంలో రెండు సంవత్సరాల క్రితం టి20 ప్రపంచకప్ జరిగింది. ఆటోనిలో పాకిస్తాన్ జట్టుపై జరిగిన మ్యాచ్లో కేవలం 53 బంతుల్లో 82 పరుగులు చేసి, భారత జట్టును గెలిపించాడు. తద్వారా రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మైదానంపై విరాట్ కోహ్లీకి అరుదైన రికార్డులు ఉన్నాయి. ఈ క్రమంలో త్వరలో మెల్ బోర్న్ లో జరిగే నాలుగో టెస్ట్ లో విరాట్ కోహ్లీ తన పూర్వపు ఆట తీరును ప్రదర్శించాలని.. టీమిండియా కు విజయాన్ని అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper