England vs Sri Lanka T20 World Cup Rain Threat: టీ20 వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంక, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఆదివారం కీలకమైన మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ మీద ఆసక్తి ఏర్పడింది. సరిగ్గా గత నెలలో ఇంగ్లాండ్ జట్టు శ్రీలంక జట్టుతో జరిగిన మూడు టి20 మ్యాచ్ ల సిరీస్ ను వైట్ వాష్ చేసింది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ ఏ మేరకు శ్రీలంకను ఎదుర్కొంటుందనేది ఆసక్తికరంగా మారింది..
శ్రీలంక జట్టులో నిస్సాంక, కుశాల్ మెండిస్ కీలకమైన ప్లేయర్లు గా ఉన్నారు. స్పిన్నర్ తీక్షణ, మధు శంక, చమీరా సత్తా చూపిస్తే ఇంగ్లాండ్ జతకు ఇబ్బందులు తప్పవు. శ్రీలంక జట్టును వైట్ వాష్ చేసిన నేపథ్యంలో.. ఈసారి కూడా అదే ఫలితాన్ని కొనసాగించాలని ఇంగ్లాండ్ జట్టు భావిస్తోంది.
ఈ టోర్నీలో ఇంగ్లాండ్ జట్టు తన స్థాయికి తగ్గట్టుగా ఆడలేదు. అయితే లంక జట్టుపై వైట్ వాష్ చేసిన నేపథ్యంలో బ్రూక్ సేన అదే జోరు కొనసాగించే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. శ్రీలంక జట్టు బలమైన ఆస్ట్రేలియాను ఓడించింది. అదే సమయంలో జింబాబ్వే జట్టు చేతిలో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టును ఏ మేరకు ప్రతిఘటిస్తుందనేది చూడాల్సి ఉంది.
ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది. వర్షం కురిస్తే మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మ్యాచ్ రద్దు అయితే రెండు జట్లకు చెరొక పాయింట్ లభిస్తుంది. శనివారం పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. ఫలితంగా రెండు జట్లకు చెరొక పాయింట్ లభించింది. దీంతో ఈ రెండు జట్లు తదుపరి జరిగే రెండు మ్యాచ్లలో విజయం సాధించాల్సి ఉంది. ఒకవేళ అందులో ఓటమిపాలైతే.. మిగతా జట్ల ఫలితాల ఆధారంగానే సెమీస్ కు వెళ్లే అవకాశాలుంటాయి.
ఈ మైదానంలో మధ్యాహ్నం సమయంలో వర్షం కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీలంకలో ప్రస్తుతం వాతావరణం పూర్తిగా మారిపోయింది. అక్కడ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా మ్యాచ్ ల నిర్వహణకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి.