Homeక్రీడలుక్రికెట్‌Chennai Super Kings Latest Update Before IPL Season: ఐపీఎల్ ప్రారంభానికి ముందే.. చెన్నై...

Chennai Super Kings Latest Update Before IPL Season: ఐపీఎల్ ప్రారంభానికి ముందే.. చెన్నై సూపర్ కింగ్స్ మొదలుపెట్టింది..

Chennai Super Kings Latest Update Before IPL Season: ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా సమయం ఉంది. అయినప్పటికీ చెన్నై ముందుగానే కసరత్తు మొదలుపెట్టింది. ఈసారి చెన్నై జట్టును ఎవరు నడిపిస్తారు? ధోని పాత్ర ఏంటి? అనే ప్రశ్నలకు ఇంకా సమాధానాలు లభించలేదు. ఈ సంశయం కొనసాగుతున్నప్పటికీ.. చెన్నై మేనేజ్మెంట్ తన దూకుడు అయిన నిర్ణయాలు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్ బయటకు వచ్చింది.

Also Read: టీమిండియా గెలిచింది అడ్డి మారి గుడ్డి దెబ్బతో కాదు.. ఇన్ని అద్భుతాలు జరిగాయి మరి

చెన్నై జట్టుకు ప్రధాన కోచ్ గా స్టీఫెన్ ఫ్లెమింగ్ వ్యవహరిస్తున్నాడు. క్రమంలోనే చెన్నై జట్టు ఫీల్డింగ్ విభాగాన్ని పటిష్టం చేయడానికి కసరత్తు మొదలుపెట్టింది. ఫీల్డింగ్ కోచ్ గా జేమ్స్ పోస్టర్ ను నియమించినట్టు వార్తలు వస్తున్నాయి. గత సీజన్లో చెన్నై జట్టు అట్టడుగు స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్లో గొప్ప ప్రదర్శన చేయాలని చెన్నై జట్టు భావిస్తోంది. అందువల్లే ఇంగ్లాండ్ మాజీ వికెట్ కీపర్, బ్యాటర్ జేమ్స్ పోస్టర్ ను చెన్నై జట్టు ఫీల్డింగ్ కోచ్ గా నియమించింది. పోస్టర్ కు 45 సంవత్సరాల వయసు ఉంటుంది. ఇతడు 2001 నుంచి 2009 మధ్య ఏడు టెస్టులు, 11 వన్డేలు, 5 t20 మ్యాచ్ లలో ఇంగ్లాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ నెల చివరిలో అతడు చెన్నై జట్టుతో తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడని తెలుస్తోంది.

“అతడు మాతో త్వరలో చేరుతాడు. ఫీల్డింగు కోచ్ గా వ్యవహరిస్తాడని” చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ పేర్కొన్నాడు. గతంలో పోస్టర్ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్ గా పనిచేశాడు. గతంలో డెసర్ట్ వైపర్స్, నర్తన సూపర్ ఛార్జర్స్, పెద్దాపురం జల్మీ వంటి జట్లకు కూడా పనిచేశాడు. చెన్నై జట్టుకు ప్రధాన కోచ్ గా ఫ్లెమింగ్, మైక్ హస్సి (బ్యాటింగ్ కోచ్), ఎరిక్ సైమన్స్ (బౌలింగ్ కోచ్), శ్రీధరన్ శ్రీరామ్ (అసిస్టెంట్ బౌలింగ్ కోచ్) పనిచేస్తున్నారు.

ఇటీవల చెన్నై జట్టు ఆటగాళ్ల కోసం ఫ్రీ సీజన్ ట్రైనింగ్ సెషన్ మొదలుపెట్టింది. ఇందులో ధోని నుంచి మొదలుపెడితే ఆయుష్ మాత్రే వరకు హాజరయ్యారు.. వచ్చే సీజన్లో గొప్ప ప్రదర్శన చేయాలని చెన్నై జట్టు ఆటగాళ్లు తహతహలాడుతున్నారు. అందువల్లే హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో తర్ఫీదు పొందినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular