spot_img
Homeక్రీడలుక్రికెట్‌IPL Schedule: మారిన ఐపీఎల్‌ షెడ్యూల్‌.. చాంపియన్స్ ట్రోఫీ కోసం కొనసాగుతున్న టీమిండియా ఎంపిక కసరత్తు!

IPL Schedule: మారిన ఐపీఎల్‌ షెడ్యూల్‌.. చాంపియన్స్ ట్రోఫీ కోసం కొనసాగుతున్న టీమిండియా ఎంపిక కసరత్తు!

IPL Schedule: ఈ ఏడాది జరిగి ఛాంపియన్స్‌ ట్రోఫీ క్రికెట్‌ టోర్నీకి పాకిస్తాన్‌ ఆతిథ్యం ఇస్తుంది. భారత్‌ మ్యాచ్‌లు మాత్రం దుబాయ్‌ వేదికగా జరుగనున్నాయి. ఈమేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో ఇండియన్‌ ప్రీమియర్‌లీగ్‌ (ఐపీఎల్‌) ట్రోఫీ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. తాజాగా షెడ్యూల్‌లో స్వల్పంగా మార్పులు చేసింది. ఈనెల 22 నుంచి ఇంగ్లండ్‌ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఆ సిరీస్‌ తర్వాత ఛాంపియన్స్‌ ట్రోఫీ జరుగనుంది. ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆడే భారత జట్టు ఎంపిక కోసం కసరత్తు కొనసాగుతోంది. కాస్త సమయం కావాలని బీసీసీఐ ఐసీసీనికోరింది. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్‌ ట్రోఫీ షెడ్యూల్‌పై క్లారిటీ వచ్చింది. మార్చి 23 నుంచి ఐపీఎల్‌ ప్రారంభం అవుతుంది. 65 రోజులపాటు సాగనున్న ఈ టోర్నీలో మే 25న ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది. మొదట మార్చి 14న ప్రారంభించేలా షెడ్యూల్‌ ఖరారుచేశారు. బిహార్‌ ఎన్నికలు, భద్రతా కారణాల దృష్ట్యా షెడ్యూల్‌ మార్పు చేశారు.

నెలాఖరుకు వేదికల ఖరారు..
ఇదిలా ఉంటే.. జనవరి చివరి వారంలో వేదికలు, మ్యాచ్‌ల వివరాల షెడ్యూల్‌ ప్రకటించే అవకాశం ఉంది. ఆదివారం(జనవరి 12న) జరిగిన బీసీసీఐ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఐపీఎల్‌ వేలంలో అన్ని జట్ల కూర్పు పూర్తయింది. లక్నో సూపర్‌ జెయింట్స్‌ రికార్డు ధరతో రిషబ్‌ పంత్‌ను సొంతం చేసుకుంది. పంత్‌ కోసం రూ.27 కోట్లు ఖర్చు చేసింది. ఆ తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌ ను పంజాబ్‌ కింగ్స్‌ రూ.26.75 కోట్లతో కొనుగులు చేసింది.

భారత జట్టు ఎంపికకు కసరత్తు…
ఇదిలా ఉంటే ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం టీమిండియా టీం ఎంపికకు కసరత్తు జరుగుతోంది. తుది జట్టు ఎంపిక కోసం ఈనెల 18, 19 తేదీల్లో కీలక సమావేశం జరుగనుంది. ఈనెల 12వ వరకు గుడువు ఉండగా, బీసీసీఐ గడువు కావాలని ఐసీసీని కోరింది. దీంతో వారం రోజులు గడువు పెంచింది. అయితే భారత జట్టు ఎంపికలో తీవ్ర జాప్యం జరుగుతోంది. బూమ్రా కోసమే జట్టు ఎంపికను ఆలస్యం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆస్ట్రేలియాలో బూమ్రా గాయపడ్డాడు. బెంగళూరులో చికిత్స పొందుతున్నాడు. బూమ్రా ఫిట్‌నెస్‌పై క్లారిటీ వచ్చిన తర్వాత జట్టును ఎంపిక చేస్తారని తెలుస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
Oktelugu Epaper