spot_img
Homeమిర్చి మసాలాజగన్ దెబ్బకు...'అబ్బా..'అంటున్న టీడీపీ నేతలు!

జగన్ దెబ్బకు…’అబ్బా..’అంటున్న టీడీపీ నేతలు!

 

వైసీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు టీడీపీ నాయకులకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. జగన్ తీసుకునే ఒక్కో నిర్ణయం చంద్రబాబు సైతం తల పట్టుకునేలా చేస్తుంది. జగన్ ప్రవేశపెట్టె సంక్షేమ పథకాలు ప్రజల్లోకి దూసుకుపోతుంటే దిక్కుతోచని స్థితిలో టీడీపీ నాయకులంతా బిక్క మొహం వేస్తున్నారు.

 

ఒకవైపు పార్టీలోని నాయకులంతా ఖాళీ చేస్తుంటే…మరోవైపు జగన్ పథకాలు ప్రజల్లోకి వెళ్లి మంచి పేరు సంపాదిస్తున్నాయి. అటు పార్టీని బలోపేతం చేసుకోవాలా ఇటు జగన్ పధకాలని ప్రజల్లోకి వెళ్లకుండా ఆపాల అనే గందరగోళంలో బాబుగారు సతమతమవుతున్నారు. దీనికి తోడు రాజధాని విషయం బాబుగారికి పెద్ద సమస్య అయిపోయింది. కొన్న భూములు ఎక్కడ ధర తగ్గుతాయో అని రాజధాని తరలింపు ఆపాలని నానా తంటాలు పడుతున్నాడు.

 

జగన్ మాత్రం హాయిగా నవ్వుతూ తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఈ రాజధాని ఉద్యమాలు అతనికి చీమ కుట్టినట్టుగా కూడా లేవేమో…ఈరోజు చిత్తూరు మీటింగులో కూడా చక్కగా నవ్వుతూ కూర్చుంన్నాడు.

 

బాబుగారు ఐదు సంవత్సరాలు కష్టపడి వేసుకున్న లెక్కలన్నీ ఒక్క దెబ్బతో చెల్లాచెదురు చేసాడు. లెక్కలన్నీ పారదర్శకంగా ఉంటె ఎవరేం చేయలేరు కానీ మన బాబుగారి లెక్కలో కావలసినన్ని బొక్కలు ఉన్నాయి. ఇంకా జగన్ మాత్రం ఏం చేస్తాడు చెప్పండి అన్నిటిని బయటికి తీయటం తప్ప. బాబుగారు చేసిన అన్ని పథకాలు మీద సమీక్షలు అవసరమైన అన్ని చోట్ల రివర్స్ టెండరింగు పద్దతి.

 

ఇన్ని చేస్తుంటే బాబుగారు మాత్రం కుదురుగా ఎలా ఉంటాడు, జగన్ ని ఆపటానికి సాధ్యమైనంత వరకు కష్టపడుతున్నాడు. ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే జగన్ కేసులు ఎప్పుడు పూర్తి అవుతాయా..ఎప్పుడు జైలుకి వెళ్తాడా…అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Dharmendra Pradhan : ఇది విద్యార్థుల విజయం ప్రజాస్వామ్య విజయం

Dharmendra Pradhan : ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం, ముఖ్యంగా యువత గొంతు, పాలకులను నిర్ణయాలు మార్చుకునేలా చేయగలదని మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణపై వ్యక్తమైన అసంతృప్తి, వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీ...
OnePlus N6x

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...
POCO M8 Power

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...
Honda CB500

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...
Social Companionship

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...
Oktelugu Epaper