ప్రస్తుతం దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు, మరోవైపు కోవిడ్ మృతుల సంఖ్య ప్రజల్లో భయాందోళనలను సృష్టిస్తోంది. ఈ క్రమంలో ఏప్రిల్ 15న లాక్ డౌన్ ఎత్తివేసే సాహసం కేంద్ర ప్రభుత్వం చేస్తుందా..? అనేది కోట్లాది మందిని వెంటాడుతున్న ప్రశ్న.
దింతో ఏప్రిల్ 15న లాక్ డౌన్ ను ఎత్తివేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు మాత్రం రావడంలేదు. లాక్ డౌన్ ను మరికొన్ని నెలల పాటు పొడిగిస్తారని సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరిగినా దానిని కేంద్ర కొట్టిపారేసిన విషయం తెలిసిందే..
ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన ప్రఖ్యాత బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) భారత్ లో లాక్ డౌన్, ప్రస్తుత పరిస్థితులపై ఓ రిపోర్టుపై వెలువరించింది.
బీసీజీ విడుదల చేసిన రిపోర్టు ప్రకారం.. ‘దేశంలో లాక్ డౌన్ ను జూన్ నాలుగో వారం వరకు కొనసాగించే అవకాశం ఉంది. అప్పటికీ పరిస్థితి మెరుగుపడకపోతే సెప్టెంబర్ వరకు కొనసాగినా అశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే లాక్ డౌన్ ను ప్రకటించడం కన్నా.. దానిని ఎత్తివేయడం చాలా కష్టతరమైన విషయం. అత్యధిక జనాభా కలిగిన భారత్ లో ఇది మరింత కఠినం. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా ఏప్రిల్ 15న లాక్ డౌన్ ను ఎత్తివేస్తారని అనుకోవడం లేదు. లాక్ డౌన్ ను ఎత్తివేసిన తరువాత వైరస్ ను అదుపుచేయడం భారత్ వైద్యులకు అంత సులువైనది కాదు. వైరస్ వ్యాప్తి తగ్గకముందే లాక్ డౌన్ ఎత్తివేస్తే ఇబ్బందులు తప్పవు’ అని బీసీజీ తన నివేదికలో పేర్కొంది
దేశంలో మార్చి 24న దేశ వ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ ను విధించిన విషయం తెలిసిందే. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,567కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో 72 మంది మృతి చెందారు.
