spot_img
Homeజాతీయ వార్తలురేవంతరెడ్డి ప్రాంతీయపార్టీ పెడతాడా?

రేవంతరెడ్డి ప్రాంతీయపార్టీ పెడతాడా?

రేవంత్ రెడ్డి ప్రవర్తన మారదా ? ఇది ప్రజల మనస్సులో తొలుస్తున్న ప్రశ్న. తనకి రాష్ట్రంలో అభిమానులు పెద్ద సంఖ్యలో ఉండొచ్చు. కానీ తను ఓ మోనార్క్ లాగా ప్రవర్తించటం ప్రజలకు, ముఖ్యంగా పార్టీలో ఎప్పటినుంచో ఉంటున్న నాయకులకు నచ్చటం లేదు. తాను చెప్పిందే జరగాలని కోరుకోవటం, లేకపోతే మీడియా కి ఎక్కటం ఏ విధంగా చూసినా సమర్ధనీయం కాదు. పార్టీ లో తనో పెద్ద నాయకుడినని తనకు తాను ఊహించుకోవటం వలనే ఇదంతా జరుగుతుంది. అందువల్ల తను ఎక్కువమంది శత్రువులను కొని తెచ్చుకుంటున్నాడని గ్రహించలేకపోతే తన గొయ్యి తానే తవ్వుకున్నట్లవుతుంది.

రేవంతరెడ్డి తో సమస్యల్లా ఒక్కసారి పెద్ద నాయకుడు కావాలని అనుకోవటం. తన మాటే చెల్లుబాటు కావాలని కోరుకోవటం. లేకపోతే తిరుగుబాటు చేయటం. రేవంత రెడ్డి రాజకీయ ప్రస్థానం తెరాస తో మొదలయ్యింది. ప్రస్తుతం కాంగ్రెస్ లో కొనసాగుతున్నాడు. ఇక్కడా ఎన్నిరోజులు ఉంటాడో తెలియదు. ఎందుకంటే ఈ ధోరణితో ఉంటే కాంగ్రెస్ నాయకులు తనని బయటకు పంపించమని అధిష్టానం పై ఒత్తిడి తేవటం ఖాయం. అసలు సమస్యల్లా తను ఎక్కడున్నా అందరూ తన నాయకత్వాన్ని ఆమోదించాలని భావించటం. ఇటీవలే సోనియా గాంధీ ని కుటుంబ సభ్యులందరితో కలిసాడు. తనను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిని చేయమని ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తుంది. అసలు కాంగ్రెస్ లో ప్రతి వాడూ నాయకుడే. కొత్తగా చేరిన రేవంత్ రెడ్డి కింద పనిచేయటానికి ఏ సీనియర్ నాయకుడూ ఒప్పుకోడు. అటువంటప్పుడు రేవంతరెడ్డి కోరిక ఎలా తీరుతుంది. తన స్వంత జిల్లా మహబూబ్ నగర్ లోనే ఎవ్వరూ రేవంతరెడ్డిని ఒప్పుకోలేదు. రేవంతరెడ్డి ముందు ముందు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా తయారయ్యే అవకాశముంది. నల్గొండ జిల్లాలో వున్నంతమంది నాయకులు కాంగ్రెస్ లో ఏ జిల్లా లో లేరు. అటువంటిచోట రేవంత్ రెడ్డి వేలుపెడితే ఎవరు ఒప్పుకుంటారు. అందుకే ఉత్తమ్ రెడ్డి కన్నా ముందుగా కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి రియాక్ట్ అయ్యాడు.

ఇది చదవండి: ‘హౌడీ మోడీ’ పై పాకిస్తాన్ కుట్ర!

రేవంతరెడ్డి ముందుగా బీజేపీ లో చేరటానికి సంసిద్దమయ్యాడని, అయితే తనని అధ్యక్షుడిని చేయమని షరతు పెట్టాడని , అందుకు బీజేపీ సిద్ధంగా లేకపోవటం తో కాంగ్రెస్ లో చేరి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడని అందరూ అనుకుంటున్నారు. రేవంత రెడ్డి కి పార్టీ కన్నా తన పదవే ముఖ్యమని ఇప్పటికే ప్రజలకు అర్ధమయింది. దానితోపాటు బహిరంగంగా కులరాజకీయాలు చేయటం కూడా నెగటివ్ పాయింట్ అయ్యిందని అనుకుంటున్నారు. పరిస్థితులు చూస్తుంటే రేవంత రెడ్డి ఎక్కడా ఇమిడే అవకాశాలు లేవు. తనకి ఒక్కటే ప్రత్యామ్నాయం కనబడుతుంది. తానే ఒక ప్రాంతీయపార్టీ పెట్టుకొని దానికి జీవితకాల అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం. చివరకు అదే జరిగే అవకాశాలు సమీప భవిష్యత్తులో కనబడుతున్నాయి అని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper