Homeఆంధ్రప్రదేశ్‌YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు: కోర్టులో ఆయన కూతురు సంచలన...

YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు: కోర్టులో ఆయన కూతురు సంచలన వాదనలు

YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో సీఎం జగన్ తనకు రెండు కళ్లు అని పేర్కొన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, అవినాశ్ రెడ్డి లు ఆయన కూతురు వైఎస్ సునీత సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు కోర్టులో ఆమె చేసిన వాదనలు చర్చనీయాంశమయ్యాయి.  సునీత గతంలో డీజీపీని కలిశారు. ఆ సమయంలో సీఎం జగన్ తనకు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, అవినాశ్ రెడ్డి లు  రెండు కళ్లు అని చెప్పినట్లు సునీత 164 స్టేట్ మెంట్లో డీజీపీతో అన్నారు. అయితే దేవిరెడ్డికి వైఎస్ వివేకా హత్య కేసులో అరెస్ట్ అయ్యి మొదటి బెయిల్ కొట్టివేసిన తరువాత కూడా పరిస్థితిలో ఎటువంటి మార్పులేదన్నారు. ఈ సమయంలో బెయిల్ ఇవ్వడం అంత మంచిది కాదని వైఎస్ వివేకానంద హత్య కేసులో సునీత తరుపున న్యాయవాది వాదనలు వినిపించారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, మాజీ ఎంపీ వివేకానంద హత్య కేసుపై సీరియస్ గా విచారణ సాగుతోంది. తాజాగా ఆయన కుమార్తె వేసిన పిటిషన్ పై సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఈ కేసులో దేవిరెడ్డి శివశంకర్ కీలకంగా ఉన్నారని, అతనికి బెయిల్ ఇవ్వొద్దని కోరారు. అతనికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. అయితే దేవిరెడ్డి తరుపున న్యాయవాది మాట్లాడుతూ ఆరున్నర నెలలుగా దేవిరెడ్డి జ్యూడిషియల్ కస్టడీలోనే ఉన్నారని, ఈ నేపథ్యంలో అతడు బెయిల్ కు అర్హుడన్నారు. అయితే మరికొన్ని వాదనలు వినేందుకు కోర్టు నేటికి వాయిదా వేసింది. అంటే ఈ కేసుపై నేడు విచారణ సాగనుంది.

ఈ కేసు మొత్తంలో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కీలకంగా ఉన్నారని సునీత తరుఫున న్యాయవాది అన్నారు. వివేకానంద చనిపోయిన రోజు ఆ సంఘటనను గుండెపోటుగా చిత్రీకరించేందుకు తీవ్రంగా ప్రయత్నించారన్నారు. అలాగే వివేకా మృతదేహానికి పోస్టుమార్టం జరగకుండా పోలీసులపై ఒత్తిడి తెచ్చారని తెలిపారు. ఆ ఏడాది మే 26న బెయిల్ పై బయటకు రావడంతో పాటు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి సాక్షులను ప్రభావితం చేశారని అన్నారు. కొందరు రాజకీయ నాయకులు తనను కలిశారని, ఈ సమయంలో సీబీఐ తనను వేధిస్తుందంటూ ఉదయ్ కుమార్ రెడ్డి కేసు పెట్టారన్నారు. ఉదయ్ కుమార్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎంపీ అవినాశ్ రెడ్డి మంచి మిత్రులని న్యాయవాది వెంకటేశ్వర్లు కోర్టుకు తెలిపారు.

ఈ వాదనలపై దేవిరెడ్డి తరుపున న్యాయవాది స్పందించారు. దేవిరెడ్డికి బెయిల్ పొందేందుకు అర్హుడని తెలిపారు. ఎందుకంటే గత ఆరు నెలలుగా ఆయన జ్యూడిషియల్ కస్టడీలోనే ఉన్నారన్నారు. ఆయనపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో బెయిల్ ఇచ్చే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతానికి దేవిరెడ్డిపై 5 కేసులు పెండింగులో ఉన్నాయన్నారు. అయితే మిగిలిన వారి వాదనలు వినేందుకు కోర్టు నేటికి వాయిదా వేసింది. అయితే నేటి వాదనలతో కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Bigg Boss 10 Telugu

Bigg Boss 10 Telugu: పోలీస్ బిడ్డ.. ఆర్మీ బిడ్డ.. మధ్యలో జపాన్ బిడ్డ.. ‘బిగ్ బాస్...

Bigg Boss 10 Telugu: కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న 'బిగ్ బాస్ 10' సెప్టెంబర్ 6 న గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది. గత ఏడాది...
Himalayan Disaster

Himalayan Disaster: హిమాలయాల్లో విపత్తు.. వాతావరణ మార్పులతో ముప్పు!

Himalayan Disaster: ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో కుంభవృష్టి, వరదలు, కొండచరియలు విధ్వంసం సృష్టించాయి. ఇంతకు ముందు డోడా, కిష్వార్‌ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌...
Divvela Madhuri

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...
Tollywood Directors

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...
Jana Nayagan

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...
Oktelugu Epaper