
ICC World Test Championship: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ–2023) ఫైనల్కు ఆసీస్ దూసుకెళ్లింది. రెండో స్థానంలో ఉన్న టీమిండియాకు శ్రీలంక నుంచి ముప్పు వాటిల్లేలా ఉంది. న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ను శ్రీలంక 2–0 తేడాతో గెలిస్తే.. భారత్ ఆశలకు అడ్డుకట్ట పడుతుంది. శ్రీలంక ఫైనల్కు వెళ్తుంది.
మూడో టెస్టు ఓటమితో..
బోర్డర్ – గావస్కర్ ట్రోఫీలో ఆసీస్కు తొలి విజయం దక్కింది. మూడు టెస్టు మూడో రోజు తొలి సెషన్లోపే ముగిసిన మ్యాచ్లో భారత్పై 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలుపొందింది. దీంతో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. వరుసగా రెండు టెస్టులను ఓడిపోయినప్పటికీ.. మూడో టెస్టులో విజయం సాధించడంతో డబ్ల్యూటీసీ ఫైనల్కు వెళ్లడం విశేషం. ఇక భారత జట్టు ఫైనల్ బెర్తు సంక్షిష్టంగా మారింది.
శ్రీలంకతో ముప్పు..
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆసీస్ 68.52 పర్సేంటేజీతో అగ్రస్థానంలో ఉంది. టీమ్ఇండియా 60.29 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. అయితే, శ్రీలంక (53.33), దక్షిణాఫ్రికా (52.38) భారత్కు పోటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రధానంగా శ్రీలకంతోనే టీమిండియాకు ముప్పు ఉంది.

భారత్ సమీకరణాలు ఇలా…
– మార్చి 9 నుంచి న్యూజిలాండ్ – శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం అవుతుంది. ఇందులో శ్రీలంక విజయం సాధిస్తే మాత్రం భారత్ అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి. ఒకవేళ ఆసీస్పై నాలుగో టెస్టులో టీమిండియా గెలిస్తే.. డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తు మనదే అవుతుంది.
– ఒకవేల న్యూజిలాండ్పై శ్రీలంక 2–0 తేడాతో టెస్టు సిరీస్ను గెలిచి.. టీం ఇండియా ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో ఓడితే మాత్రం ఆశలు గల్లంతు అయినట్లే. అప్పుడు శ్రీలంక డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరుతుంది. వరుసగా రెండోసారి ఫైనల్కు చేరదామని భావిస్తున్న భారత్కు చుక్కెదురువుతుంది. శ్రీలంక కనీసం ఒక్క టెస్టు ఓడిపోయినా భారత్ ముందంజ వేయడం ఖాయం. అప్పుడు ఆసీస్పై నాలుగో టెస్టు గెలిస్తే టీం ఇండియా అగ్రస్థానంతోనే డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరుతుంది.
– మార్చి 9 నుంచి ఆసీస్తో జరిగే నాలుగో టెస్టులో భారత్ విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా డబ్యూటీసీ ఫైనల్కు చేరుతుంది. అలాగే ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకుంటుంది.