Homeజాతీయ వార్తలుTRS MLA Car Accident: టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు బీభత్సం.. ఒకరిని చంపి.....

TRS MLA Car Accident: టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు బీభత్సం.. ఒకరిని చంపి.. ముగ్గురిని గాయపరిచినా చర్యల్లేవా?

TRS MLA Car Accident:  అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టిక్కర్ తో ఉన్న కారు హైదరాబాద్ లో బీభత్సం సృష్టించింది. వీధి వ్యాపారుల కుటుంబానికి చెందిన ఓ పసికందు ప్రాణాన్ని తీసి ముగ్గురిని తీవ్ర గాయాలపాలు చేసింది. ఇంత జరిగినా పోలీసులు ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇది వీవీఐపీ కార్ల రిజిస్ట్రేషన్ లోపాలు, టీఆర్ నెంబర్ ప్లేట్లతో జరుగుతున్న దారుణాలను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది.

నిజామాబాద్ జిల్లా బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టిక్కర్ కారుపై ఉండడం.. ఈ కారు 2 నెలల బాలుడిని చంపడం.. ముగ్గురిని తీవ్ర గాయాలు పాలు చేసింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు కారులో ఉన్నది ఎవరు? డ్రైవింగ్ చేసింది ఎవరు వంటి వివరాలన్నీ గోప్యంగా ఉంచడం చర్చనీయాంశమైంది. బాధితులు ప్రమాదం జరిగిన వెంటనే కారును వదిలేసి డ్రైవర్ , మరొక వ్యక్తి పారిపోయారని తెలిపారు. ఇక ట్విస్ట్ ఏంటంటే ఖరీదైన జూబ్లీహిల్స్ లో ఈ ప్రమాదం జరిగింది. ఆ ఘటన స్థలంలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని పోలీసులు చెప్తుండడం విమర్శలకు తావిస్తోంది. హైటెక్ సిటీ అని చెప్పుకునే పోలీసులే ఈ కేసులో నిందితులను తప్పిస్తున్నారా? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ కారు నడిపింది ఎమ్మెల్యే కుమారుడు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ కారు యాక్సిడెంట్ జరిగి 24 గంటలు అయినా యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ఆచూకీని పోలీసులు కనిపెట్టకపోవడం విస్మయపరుస్తోంది. ఎమ్మెల్యే  షకీల్ కుమారుడు డ్రైవింగ్ సీట్లో ఉన్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సదురు నిందితుడిని తప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఉన్నట్టుండి అకస్మాత్తుంగా నిందితుడిని పట్టుకున్నామంటూ మీర్జా అనే వ్యక్తిని తెరపైకి తీసుకొచ్చారని తెలిసింది.

ప్రమాదానికి కారణమైన కొత్త కారుపై బోధన్ ఎమ్మెల్యే అనే స్టిక్కర్ ఉంది. కానీ బోధన ఎమ్మెల్యే మాత్రం అసలు తనకు ఈ కారుతో సంబంధం లేదని.. స్టిక్కర్ అడిగితే తాను ఇచ్చానని తెలుపడం విశేషం.

ఇక కారు తరుఫున వచ్చిన కొందరు వైద్యం ఖర్చులకు అని రూ.2 లక్షల రూపాయలు ఇచ్చి బాధితులను వారి సొంతూరు మహారాష్ట్రకు పంపించినట్టు సమాచారం. నిమ్స్ ఆస్పత్రిలో డిశ్చార్జి అయిన బాధితురాలు కాజల్ చౌహాన్, కుటుంబ సభ్యులు, మృత శిశివును తీసుకొని సొంతూరుకు బయలు దేరింది. దీన్ని బట్టి దీనివెనుక పెద్ద తతంగమే ఉన్నట్టు తెలుస్తోంది.

తన ప్రభుత్వంలో ఏ చిన్న తప్పు జరిగినా ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల కొడుకునైనా సరే జైలుకు పంపిస్తానని బీషణ ప్రకటన చేసిన సీఎం కేసీఆర్.. ఇలా ఓ ఎమ్మెల్యే కారు స్టిక్కర్ ఉన్న కారు యాక్సిడెంట్ చేసి వీధి వ్యాపారుల కుటుంబంలోని ఓ పసిబాలుడి ప్రాణాలు తీస్తే ఇంతవరకూ చర్యలు తీసుకోకపోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కారు అవ్వడం వల్లే యాక్షన్ తీసుకోవడం లేదని.. నిందితులను పట్టుకోవడం లేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

2 COMMENTS

  1. […] YCP vs BJP: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. వైసీపీ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఇన్నాళ్లు వైసీపీ గురించి పల్లెత్తు మాట అనని బీజేపీ ఇప్పుడు స్వరం పెంచింది. వైసీపీని నిందించేందుకు సిద్ధమైంది. రాయలసీమ సీఎంలతో రాష్ట్రం వెనుకబడిపోతోందని దుయ్యబట్టింది. బీజేపీ ఈ మేరకు జగన్ పై దుందుడుకు చర్యలకు దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో వైసీపీ ఇక ఒంటరిపోరు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఏపీలో కొనసాగుతున్న పరిణామాలతో రాజకీయ ముఖచిత్రం మొత్తం మారిపోతోందని తెలుస్తోంది. […]

  2. […] Brother Anil: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. జగన్ వ్యతిరేక శక్తులన్ని ఒక్కటవుతున్నాయి. ఇందులో భాగంగానే వ్యూహాలు మారుతున్నాయి. వైఖరులు ఖరారు అవుతున్నాయి. జగన్ కు గత ఎన్నికల్లో వెన్నంటి నిలిచిన వారందరు ఎదురు తిరుగుతున్నారు. గతంలో షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టొద్దని జగన్ ఎంత మొత్తుకున్నా వినకుండా ఆమె పార్టీ ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్రంలో కూడా జగన్ షర్మిల మద్య అభిప్రాయ భేదాలు వస్తుండటంతో ఇప్పుడు బ్రదర్ అనిల్ కూడా జగన్ పై విమర్శలు చేస్తున్నారు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular