ప్రముఖ విమానయన సంస్థ ఇండిగో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కొత్త రూట్లలో విమాన సర్వీసులను ప్రారంభించడానికి ఇండిగో సిద్ధమైంది. ఇండిగో తీసుకున్న నిర్ణయం వల్ల కర్నూలు, చుట్టుపక్కల జిల్లాల నుంచి ప్రధాన పట్టణాలకు వెళ్లడానికి సమయం తగ్గనుంది. మార్చి నెల 28వ తేదీ నుంచి ఇండిగో సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
వైజాగ్, చెన్నై, బెంగళూరు నగరాలకు విమానయాన సర్వీసులు ప్రారంభం కానుండగా భవిష్యత్తులో ఇతర ప్రాంతాలకు కూడా కర్నూలు నుంచి విమాన సర్వీసులు నడిపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇండిగో సంస్థ ఉడాన్ స్కీమ్ లో భాగంగా ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. ఏపీ మూడు రాజధానులలో కర్నూలు కూడా ఒకటి కావడంతో ఇండిగో విమానయాన సర్వీసులను ప్రారంభించడానికి ఆసక్తి చూపింది.
వారంలో 4 సార్లు కర్నూలు నుంచి బెంగళూరు, కర్నూలు నుంచి చెన్నై, కర్నూలు నుంచి వైజాగ్ కు విమానయాన సర్వీసులు ఉంటాయి. కర్నూలు నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారికి ఈ నిర్ణయం వల్ల ప్రయోజనం చేకూరుతుంది. కర్నూలు నుంచి ఈ నగరాలకు వెళ్లాలనుకునే వారికి భారీగా సమయం ఆదా కానుంది. సౌత్ ఇండియాలో కనెక్టివిటీ పెంచుకోవాలనే ఉద్దేశంతో ఇండిగో విమానయాన సర్వీసులను ప్రారంభించింది.
కొత్త రూట్లలో విమానయాన సర్వీసుల దిశగా అడుగులు పడటంతో కర్నూలు నుంచి తరచూ విమాన ప్రయాణాలు చేసేవాళ్లకు ప్రయోజనం చేకూరనుంది. కర్నూలు నుంచి హైదరాబాద్ కు దూరం తక్కువ కావడంతో హైదరాబాద్ కు విమాయన సర్వీసులు ఇప్పుడు తీసుకురావడం లేదని తెలుస్తోంది.