Homeకరోనా వైరస్Covid Fourth Wave: కోవిడ్ నాలుగో వేవ్ వ‌స్తుందా ? భయపెడుతున్న ఒమిక్రాన్ స‌బ్...

Covid Fourth Wave: కోవిడ్ నాలుగో వేవ్ వ‌స్తుందా ? భయపెడుతున్న ఒమిక్రాన్ స‌బ్ వేరియంట్!

Covid Fourth Wave: కరోనా వైరస్ ఏ క్షణంలో బయటపడిందో కానీ ఇది మానవజాతిని ఇబ్బంది పెడుతూనే ఉంది. ఇప్పటికే మూడు వేవ్‌లు ప్రపంచాన్ని అతలాకుతలం చేశాయి. ఇప్పుడు నాలుగో వేవ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూఎస్ లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. దేశంలో కరోనా కేసుల విజృంభణ మళ్లీ మొదలవుతోందా? డెయిలీ కేసుల పెరుగుతుండడం అందుకు నిదర్శనమా? జూన్‌ కంటే ముందే.. ఫోర్త్‌ వేవ్‌ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయా?.. అవుననే సంకేతాలు ఇ‍స్తూనే అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.

Covid Fourth Wave
Covid Fourth Wave

కరోనా వైర‌స్ మనుషుల్ని విడిచి వెళ్లేలా కనిపించడం లేదు. ఇప్పుడిప్పుడే థ‌ర్డ్ వేవ్ త‌గ్గి మ‌ళ్లీ జ‌న జీవ‌నం గాడిలో ప‌డుతోంది అనుకుంటున్న స‌మ‌యంలో యూఎస్, చైనా, ఆస్ట్రేలియా, జపాన్‌, సింగపూర్‌, హాంకాంగ్‌, ఆస్ట్రియా, జర్మనీ, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, యునైటెడ్ కింగ్‌డమ్‌లో కొత్త కేసులు పెరుగుతున్నాయి. అయితే ఈ కేసుల పెరుగుద‌లను గ‌మ‌నిస్తే మ‌ళ్లీ మ‌రో వేవ్ వ‌స్తుందా అనే ఆందోళ‌న‌ల‌కు ఎక్కువ‌వుతున్నాయి. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తాజాగా విడుద‌ల చేసిన డేటా ప్రకారం.. యూఎస్‌లో బ‌య‌ట‌ప‌డుతున్న కొత్త కోవిడ్ కేసుల్లో నాలుగింట ఒక వంతు ఒమిక్రాన్‌కు చెందిన BA.2 స‌బ్ వేరియంట్ క‌నిపిస్తోంది.

Also Read: Telangana BJP: ప‌ద‌వి లేక‌పోతే ఫైర్ త‌గ్గుతుందా.. బీజేపీలో ఆ ముగ్గురికి ఏమైంది..?

నాలుగో వేవ్.. నాలుగు నెలల పాటు..
భారత్‌తో గత కొద్ది రోజులుగా రోజువారీ కొత్త కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నాయి. దేశంలో కోవిడ్ మూడో దశ క్షీణించింది. అయితే కరోనా నాలుగో దశ జూన్ 22 నాటికి ప్రారంభమవుతుందని తాజా పరిశోధనలు అంచనా వేస్తున్నాయి. నాలుగో వేవ్.. నాలుగు నెలల పాటు కొనసాగనుందని ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు అంచనా వేశారు. అయితే తీవ్రత.. వైరస్ వ్యాప్తి, కొత్త వేరియంట్‌ల ఆవిర్బావం, బూస్టర్ డోస్ పంపిణీ, ప్రజల వ్యాక్సినేషన్ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. అక్టోబర్ 24 వరకు కోవిడ్ నాలుగో వేవ్ కనసాగే అవకాశం ఉందని తెలిపింది. నాలుగో వేవ్ ఆగస్టు 15 నుంచి 31 మధ్య కాలంలో గరిష్టానికి చేరుకుంటుందని పరిశోధకులు అంచనా వేశారు. ఆ తర్వాత కేసులు తగ్గుముఖం పడతాయని తెలిపారు. దేశంలో కోవిడ్ వేవ్‌లకు సంబంధించి ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు అంచనా వేయడం ఇది మూడోసారి. ముఖ్యంగా కరోనా థర్డ్ వేవ్ అంచాల విషయంలో కొద్ది రోజుల తేడాతో దాదాపు కచ్చితమైన అంచనా వేశారు.

ఫోర్త్‌ వేవ్‌ హెచ్చరికలు!
భారత్‌లో వరుసగా 11 వారాల పాటు తగ్గుముఖం పట్టిన కరోనా కేసుల్లో ఒక్కసారిగా పెరుగుల చోటు చేసుకుంది. గత ఒక్కవారంలోనే 35 శాతం కేసులు పెరుగుదల కనిపిస్తోంది. దేశంలో కొన్ని రోజులుగా రోజువారీ కేసులు వెయ్యికి దిగువనే నమోదవుతున్నాయి. కానీ, ఇప్పుడు ఆ సంఖ్య ఒకేసారి రెండు వేలను దాటేసింది. రోజూవారీ పాజిటివిటీ రేటు చూసుకుంటే.. 0.31 శాతం నుంచి 0.83 శాతానికి పెరిగింది. ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌లో ఇన్‌ఫెక్షన్‌ల పెరుగుదల ఎక్కువగా నమోదు అయ్యింది. అయితే చాలాచోట్ల కేసులు తగ్గుముఖం పట్టిన పరిస్థితులు కనిపిస్తున్నా.. కొత్త వేరియెంట్లను తక్కువగా అంచనా వేయొద్దని, కేసులు ఒక్కసారిగా వెల్లువెత్తే అవకాశం లేకపోలేదని, ఈ పెరుగుదలను ఫోర్త్‌ వేవ్‌కి సంకేతాలుగా భావించి అప్రమత్తంగా ఉండాలని పలు రాష్ట్రాల ప్రభుత్వాలకు వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Covid Fourth Wave
Covid Fourth Wave

కేసుల్ని పరిశీలించండి
వైరస్‌ తీవ్రత లేదన్న ఉద్దేశం, వ్యాక్సినేషన్‌ కారణంగా ప్రభుత్వాలు సైతం కరోనాను పెద్దగా పట్టించుకోవడం లేదు. చాలాచోట్ల టెస్టింగ్‌-ట్రేసింగ్‌ కూడా జరగడం లేదు. ఈ తరుణంలో కరోనా మృతుల సంఖ్య కూడా అనూహ్యంగా పెరగడం కలవరపరుస్తోంది. గత 24 గంటల్లో దేశంలో 214 మరణాలు నమోదయ్యాయి. వీటిలో 62 కేరళ బ్యాక్ లాగ్ మరణాలు ఉన్నప్పటికీ… అంతకు ముందు రోజులో పోలిస్తే రెగ్యులర్‌ కరోనా మరణాల సంఖ్య భారీగానే నమోదు అయ్యాయి.

ఇప్పటికే కరోనా తీవ్రత తగ్గడంతో పలు రాష్ట్రాలు ఆంక్షల్ని సడలించడం, పూర్తి ఎత్తేయడం చేశాయి. దీంతో మాస్క్‌ ల్లేకుండా జనాలు స్వేచ్ఛగా సంచరించడం పెరిగింది. ఇదే కేసులు పెరగడానికి కారణం అవుతుందని ఎయిమ్స్‌ వైద్యులు భావిస్తున్నారు. ఈ తరుణంలో.. కేసుల పెరుగుదలపై దృష్టిసారించాలని వైద్య నిపుణులు రాష్ట్రాలకు కీలక సూచన చేస్తున్నారు. ఇన్‌ఫెక్షన్‌ నుంచి రక్షణ కవచంగా భావించే ‘మాస్క్‌’ ధరించడాన్ని రూల్‌ తప్పనిసరి అమలు చేయాలని వాళ్లు కోరుతున్నారు.

ఇప్పుడే చెప్పలేమంటున్న కేంద్రం..
ఇదిలా ఉండగా.. ఈ పరిస్థితులు ఫోర్త్‌ వేవ్‌కి దారి తీస్తాయో లేదో ఇప్పుడే చెప్పలేమన్న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ.. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మాత్రం ఉందని గుర్తు చేస్తోంది. దేశరాజధాని ఢిల్లీలో 517 కేసులు నమోదు అయ్యాయి. గత పదిహేను రోజుల్లో క్లోజ్‌ కాంటాక్ట్‌ 500 శాతం పెరిగినట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఘజియాబాద్‌, నోయిడా రీజియన్‌లోనూ పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. విద్యార్థులతోనే కరోనా విజృంభిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో స్కూల్స్‌ మూతపడుతున్నాయి.

Also Read: BJP Navakumar: బీజేపీకి వాయిస్ గా మారిన ‘నవ కుమార్’
Recommended Videos

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

3 COMMENTS

  1. […] Prashant Kishor: ఒకే ఒక్కడు. ఇప్పుడు దేశంలో అరవీర భీకరంగా తయారైన బీజేపీని మట్టికరిపించగలడా? కనీసం ఉనికి లేకుండా ఊసూరుమంటున్న కాంగ్రెస్ లో జవసత్వాలు నింపగలడా? పీకే చేరికతో కాంగ్రెస్ కు అధికారం సాధ్యమవుతుందా? బీజేపీ ఓడిపోతుందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు అందరిలోనూ ఉదయిస్తున్నాయి.. అయితే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ చేరికపై కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తోంది. కొన్ని కండీషన్లు పెడుతోంది. ప్రస్తుత రాజకీయాల్లో ఇది మళ్లీ చర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌లో ప్రశాంత్‌ కిషోర్‌ చేరికతో లాభం పొందే అవకాశాలున్నప్పటికీ పీకే ఇప్పటికే చేసుకున్న కమిట్మెంట్ల విషయంలో అధిష్టానం అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్ర సీఎం జగన్, వైఎస్సార్‌ టీపీ అధ్యక్షురాలు వైఎస్‌.షర్మిలతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేసుకున్న తర్వాతనే పీకే కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular