Home Blog Page 91

'ఇరుముడి' రవితేజ కెరీర్ బెస్ట్ మూవీ అవుతుందని అనుకున్నారు.. కానీ చివరికి ఇలా అయ్యిందేంటి..

Ravi Teja Irumudi
Ravi Teja Irumudi

Ravi Teja Irumudi: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో మార్కెట్ ని పూర్తిగా కోల్పోయే స్థితికి వచ్చిన హీరోల్లో ఒకరు మాస్ మహారాజ రవితేజ. ‘ధమాకా’ తర్వాత ఆయన హీరోగా చేసిన ప్రతీ చిత్రం ఒక దానిని మించి ఒకటి డిజాస్టర్ ఫ్లాప్స్ అవుతూ వచ్చాయి. ఇక రవితేజ అప్డేట్ అవ్వకపోతే కష్టం, లేదంటే ఆయనతో సినిమాలు చేసేందుకు ఎవ్వరూ ముందుకు రారు అని అనుకుంటున్న సమయంలో ‘ఇరుముడి’ చిత్రాన్ని ప్రకటించారు. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తీసిన శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అయ్యప్ప స్వామి బ్యాక్ డ్రాప్ తో ఈ చిత్రం తెరకెక్కబోతుంది అని తెలియడంతో సినిమా పై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేయగా, దానికి కూడా ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

మొత్తానికి రవితేజ కం బ్యాక్ కనీవినీ ఎరుగని రేంజ్ లో ఉండబోతుంది, సూర్య ఎలా అయితే ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద తన విశ్వరూపం చూపించాడో, రవితేజ కూడా అదే రేంజ్ మాస్ ర్యాంపేజ్ చూపిస్తాడని అనుకున్నారు. కానీ ఇప్పుడొచ్చిన పెద్ద సమస్య ఏమిటంటే విడుదల తేదీ. ఈ చిత్రాన్ని ఆగస్టు 21 న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. ఈ సినిమా విడుదలైన 5 రోజులకే పాన్ ఇండియా లెవెల్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకునేం ‘టాక్సిక్’ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని దిల్ రాజు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. నైజాం ప్రాంతం లో ఆయన థియేటర్స్ ఏ రేంజ్ లో హోల్డ్ చేస్తాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పైగా ‘ఇరుముడి’ చిత్రాన్ని ‘మైత్రీ మూవీ మేకర్స్’ సంస్థ నిర్మించింది.

గత కొన్నేళ్లుగా దిల్ రాజు మరియు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థల మధ్య ఏ రేంజ్ లో గొడవలు నడుస్తున్నాయి మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. కాబట్టి ‘ఇరుముడి’ చిత్రానికి దిల్ రాజు ప్రాపర్టీస్ లో విడుదల ఇవ్వడం దాదాపుగా కష్టమేనని, అదే కనుక జరిగితే నైజాం ప్రాంతం లో చాలా నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంటున్నారు. రవితేజ చాలా కాలం తర్వాత భారీ కం బ్యాక్ ఇవ్వబోతున్నాడని అటు అభిమానులు , ఇటు మూవీ లవర్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో ఈ పరిస్థితి రావడం గమనార్హం. దీన్ని రవితేజ ఎలా అధిగమిస్తాడో చూడాలి , ఆడియన్స్ నుండి భారీ లెవెల్ లో పాజిటివ్ టాక్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

నేడు పవన్ కళ్యాణ్ ని కలవబోతున్న డైరెక్టర్ సుజిత్.. 'ఓజీ 2' గురించి సెన్సేషనల్ అప్డేట్..

Sujeeth Meets Pawan Kalyan
Sujeeth Meets Pawan Kalyan

Sujeeth Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న సందర్భం రానే వచ్చింది. వారం రోజుల క్రితం ‘ఓజీ 2’ గురించి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ ఒక అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ‘ఇచ్చిన మాట ప్రకారం పవన్ కళ్యాణ్ ఓజీ 2 చేయబోతున్నాడు. టైమింగ్ ఒక్కటే నిర్ణయించుకోవాల్సి ఉంది. సుజిత్ ఇండియా కి తిరిగి వచ్చిన తర్వాత దీనిపై చర్చిస్తాము’ అని ఒక ట్వీట్ వచ్చింది అంతే, సోషల్ మీడియా మొత్తం అల్లకల్లోలం అయ్యింది. ఈ ట్వీట్ కి ఏకంగా 1 కోటి 20 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇప్పటి వరకు కొంతమంది స్టార్ హీరోల ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి కూడా ఈ రేంజ్ రెస్పాన్స్ రాకపోవడం గమనార్హం. దీనిని బట్టీ ఈ చిత్రానికి ఎలాంటి క్రేజ్ ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు.

ఇకపోతే డైరెక్టర్ సుజిత్ రెండు రోజుల క్రితమే ఇండియా కి తిరిగి వచ్చేశాడు . పవన్ కళ్యాణ్ ని ఎప్పుడెప్పుడు కలుస్తాడా అని అభిమానులు ఎదురు చూస్తున్న తరుణం లో , నేడే ఆయన పవన్ కళ్యాణ్ ని కలవబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మంగళగిరి లో ఉన్నాడు. సుజిత్ కూడా మంగళగిరి కి బయలుదేరినట్టు సమాచారం. నేడు సాయంత్రం లోపు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ నుండి ‘ఓజీ 2’ గురించి మరో సెన్సేషనల్ అప్డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ సుజిత్ పవన్ కళ్యాణ్ ని కలిసిన ఫోటో ని సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తే , మరోసారి ఇంటర్నెట్ మొత్తం షేక్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంటర్నేషనల్ లెవెల్ లో సంచలన టాపిక్ గా మరోసారి నేడు నిలవబోతుంది ఈ చిత్రం.

సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ని అధికారికంగా ప్రకటించబోతున్నారు మేకర్స్. నవంబర్ నెల నుండి ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది కాసేపు పక్కన పెడితే , ‘ఓజీ 2’ నిర్మాణం లో దివీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ భాగం అవ్వడం లేదట. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ తో పాటు , టాలీవుడ్ లో పేరు మోసిన మరో బడా ప్రొడక్షన్ హౌస్ నిర్మాణం లో భాగం అవ్వబోతుందట. ‘ఓజీ’ లాగా కాకుండా , ఈ చిత్రాన్ని ఈసారి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో , అన్ని భాషల్లోనూ గ్రాండ్ గా విడుదల చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నాడట డైరెక్టర్ సుజిత్. సినిమా షూటింగ్ అత్యధిక శాతం జపాన్ లోనే జరిగే అవకాశం ఉంది.

నటనలో కమల్ హాసన్ కి చిరంజీవికి మధ్య ఉన్న తేడా అదేనా..?

Kamal Haasan vs Chiranjeevi
Kamal Haasan vs Chiranjeevi

Kamal Haasan vs Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో వారసత్వం ఉన్నవారు మాత్రమే సక్సెస్ లను సాధిస్తారు. వాళ్లకు మాత్రమే ఇక్కడ ఎక్కువ అవకాశాలను వస్తాయి అనేది సరైనది కాదు. ఇండస్ట్రీ లో బ్యాక్గ్రౌండ్ ఉండి డబ్బులు ఉన్నంత మాత్రాన ఇక్కడ స్టార్ హీరోలు అయిపోరు. నటుడిగా రాణించానుకున్న ప్రతి ఒక్కరు ఎప్పటికప్పుడు తమ పంథాను మార్చుకొని ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలను చేస్తుండాలి. అలా చేసినప్పుడే వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వస్తాయి…ఇక ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతుంది. ఇక ఇప్పటివరకు మన వాళ్ళు సాధించిన విజయాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి… గత 50 సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి… క్లాస్ మాస్ ఏ తేడా లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకున్న నటుడు కూడా తనే కావడం విశేషం… కొన్ని సందర్భాల్లో ఆయన ఎక్స్పరిమెంటల్ సినిమాలు చేసినప్పటికి అవి ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు.

కానీ నటుడిగా మాత్రం ఆయనకి ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. ఎలాంటి డిఫరెంట్ పాత్రలో అయినా సరే పరకాయ ప్రవేశం చేసి నటించి మెప్పించగలిగే కెపాసిటి చిరంజీవి సొంతం… ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో హీరోగా కెరియర్ ను స్టార్ట్ చేసిన కమల్ హాసన్ ఆ తర్వాత అతను చేసిన సినిమాలన్నింటిని తెలుగులో డబ్ చేసి సక్సెస్ లను సాధించి ఇక్కడ కూడా టాప్ హీరోగా మారిపోయాడు.

ఇక ఇప్పటికి ఎవరైనా డిఫరెంట్ గా యాక్టింగ్ చేస్తూ కొత్తదనాన్ని ప్రవేశపెట్టినట్టుగా కనిపిస్తే చాలు వాళ్ళను కమల్ హాసన్ తో పోలుస్తూ ఉంటారు. ఇక అలాంటి కమల్ హాసన్ దిగ్గజ నటుడు అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. నిజానికి చిరంజీవి కూడా మంచి నటుడు అయినప్పటికి కమల్ హాసన్ – చిరంజీవి మధ్య వ్యత్యాసం ఏంటి అని కొంతమంది కొన్ని కామెంట్లు చేస్తున్నారు.

కమల్ హాసన్ ఎలాంటి పాత్ర చేసిన కూడా దాన్ని స్క్రీన్ మీద పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేసి ప్రేక్షకుడి మనసుకి తాకేలా నటించి మెప్పిస్తాడు. ఇక చిరంజీవి లాంటి నటుడు సైతం ఆ పాత్రను ఓన్ చేసుకొని దాన్ని ఎలివేట్ చేసి నటించే ప్రయత్నం చేస్తాడు. అందువల్ల చిరంజీవి నటించినప్పుడు ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు. కానీ కమల్ హాసన్ నటించినప్పుడు మాత్రం ఆడియన్ ఆ పాత్రతో ట్రావెల్ చేస్తాడు…ఇక అందులో కమల్ హాసన్ కనిపించడు. ఆ క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది…

ప్రభాస్ నీడతో అల్లకల్లోలం సృష్టించిన సందీప్ వంగ.. సంచలనం రేపుతున్న లేటెస్ట్ పోస్ట్..

Spirit Movie
Spirit Movie

Spirit Movie: టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ సినిమాల్లో ఒకటి ‘స్పిరిట్’. ప్రభాస్, సందీప్ వంగ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అభిమానుల్లో కాదు , ప్రేక్షకుల్లో , ఇతర ఇండస్ట్రీస్ లో కూడా అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి. ఎందుకంటే ‘యానిమల్’ , ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’ చిత్రాలతో సందీప్ వంగ క్రియేట్ చేసిన మ్యాజిక్ అలాంటిది మరి. యుక్త వయస్సులో ఉన్నప్పుడు రామ్ గోపాల్ వర్మ టేకింగ్ ఎలా ఉండేదో , సందీప్ వంగ టేకింగ్ అంతకు మించి అద్భుతంగా ఉంది. అలాంటి తోపు డైరెక్టర్ కి ప్రభాస్ లాంటి యాక్షన్ హీరో తగిలితే ఎలా ఉంటుందో , అలాగే ఉండబోతుంది ‘స్పిరిట్’ చిత్రం. రీసెంట్ గానే రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టుకోగా, నేడు హైదరాబాద్ లోని చంచల్ గూడ జైలు లో లేటెస్ట్ షెడ్యూల్ ని మొదలు పెట్టారు.

సినిమాలో అత్యంత కీలకంగా నిలిచే జైలు సీక్వెన్స్ లు తెరకెక్కించబోతున్నారు. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ తో పాటు ప్రకాష్ రాజ్, హీరోయిన్ త్రిప్తి దిమిరి మరియు ఇతర ప్రధాన తారాగణం కూడా పాల్గొంటుంది. అయితే లేటెస్ట్ షెడ్యూల్ ప్రారంభం అవ్వబోతున్న సందర్భంగా నిన్న సందీప్ వంగ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఒక ఫోటో అప్లోడ్ చేశాడు . అది ఇప్పుడు సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తోంది. ఈ ఫొటోలో ప్రభాస్ కి స్క్రిప్ట్ పేపర్స్ ని ఇచ్చి , సన్నివేశాన్ని సందీప్ వంగ వివరిస్తున్నాడు. ప్రభాస్ క్యాప్ పెట్టుకొని ఉన్నాడు. అయితే ఈ ఫొటోలో కేవలం వీళ్లిద్దరి నీడలు మాత్రమే ఉన్నాయి. దానికే సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుందంటే ఈ సినిమాకు ఉన్నటువంటి క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

సందీప్ వంగ మేకింగ్ తాలూకు మార్క్ కేవలం ఆ ఫోటోలోనే కనిపించింది, ఇక సినిమాలో ప్రభాస్ తో ఎలాంటి యాక్షన్ సన్నివేశాలు డిజైన్ చేసి ఉండుంటాడో మీరే ఊహించుకోండి అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. మార్చి 7 న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఇండియన్ భాషలతో పాటు , ఫారిన్ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచన లో ఉన్నారు. ఇకపోతే ఈ సినిమాలో విలన్స్ గా వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్య మీనన్ నటిస్తున్నారు. సందీప్ వంగ సినిమాల్లో విలన్స్ ఎంత వైల్డ్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం లో అంతకు మించిన వైల్డ్ గా చూపించబోతున్నారట.

తేజస్విని ఎద అందాలు చూడతరమా?

Tejaswi Madivada latest photos
Tejaswi Madivada latest photos

ఎన్టీఆర్ 'దాన వీర సూర కర్ణ' డైలాగ్ ని అవలీలగా చెప్పేసిన భాగ్యశ్రీ.. వీడియో వైరల్..

Bhagyashri Borse
Bhagyashri Borse

Bhagyashri Borse: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకొని స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదగడం అనేది సాధారణమైన విషయం కాదు. ఈమధ్య కాలం లో ఇలాంటి సంఘటన శ్రీలీల విషయం లో జరిగింది , ఇప్పుడు భాగ్యశ్రీ భోర్సే విషయం లో కూడా జరగబోతుంది. ఈమె ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. అయినప్పటికీ కూడా యూత్ ఆడియన్స్ దృష్టిని ఈమె ప్రత్యేకంగా ఆకర్షించింది. అందం తో పాటు , నటన కూడా అద్భుతంగా ఉందని , డ్యాన్స్ లో గ్రేస్ ఉందని టాలీవుడ్ కి దొరికిన ఆణిముత్యం లాంటి హీరోయిన్ భాగ్యశ్రీ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. కేవలం ఒక్క హిట్ వస్తే చాలు ఎవ్వరూ ఊహించనంత రేంజ్ కి వెళ్ళిపోతుందని కితాబిచ్చారు.

‘మిస్టర్ బచ్చన్’ తర్వాత ఈమె ‘కింగ్డమ్’, ‘ఆంధ్రా కింగ్ తాలూకా’, ‘కాంత’ వంటి చిత్రాల్లో నటించింది. అన్నీ డిజాస్టర్ ఫ్లాప్స్ అయ్యాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ఆమె అక్కినేని అఖిల్ తో కలిసి ‘లెనిన్’ అనే చిత్రం లో న్బటించింది. ఈ చిత్రం అఖిల్ కి ఎంత ముఖ్యమైన సినేమానా , భాగ్యశ్రీ కి కూడా అంతే ముఖ్యమైన సినిమా. ముందుగా ఈ చిత్రాన్ని జూన్ 25 న విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ కి మరింత సమయం కోరారు. దీంతో ఈ చిత్రాన్ని జులై 10 కి వాయిదా వేశారు. ఈ సందర్భంగా అక్కినేని అఖిల్ , భాగ్యశ్రీ ప్రొమోషన్స్ కూడా మొదలు పెట్టేసారు. ప్రముఖ యాంకర్ సుమతో కలిసి వీళ్లిద్దరు ఒక కుకింగ్ ప్రోగ్రాం లో పాల్గొని ఆమెతో చేసిన చిట్ చాట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

అయితే ‘లెనిన్’ టీజర్ లో భాగ్యశ్రీ సీనియర్ ఎన్టీఆర్ ‘దాన వీర సూర కర్ణ’ చిత్రం లోని డైలాగ్ కొడుతోంది గుర్తుందా ?, ఆ డైలాగ్ ని ఈ స్పెషల్ ఇంటర్వ్యూ లో మరోసారి గుక్క తిప్పుకోకుండా చెప్పింది భాగ్యశ్రీ. మధ్యలో కొన్ని తప్పులు ఉన్నాయి , కానీ ఏ మాత్రం తడబడకుండా, ఆమె ఈ డైలాగ్ ని చెప్పే ప్రయత్నం చేయడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. కుర్రాళ్ళు భాగ్యశ్రీ ముద్దులొలికే మాటలకు ఫిదా అయిపోయారు. తెలుగు రాకపోయినా నేర్చుకొని , ఈ డైలాగ్ ని కొట్టింది , రాబోయే రోజుల్లో నూటికి నూరు శాతం పర్ఫెక్షన్ తో ఈ డైలాగ్ మరోసారి కొడుతోంది అంటూ ప్రశంసిస్తున్నారు.

టైర్ వన్ హీరోల లిస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ పక్కకు తప్పుకోబోతున్నాడా..? కారణమేంటంటే..?

Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan: ప్రస్తుతం పాన్ ఇండియాలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నెంబర్ వన్ పొజిషన్లో కొనసాగుతుంది. ఇంతకుముందు బాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ పొజిషన్లో ఉండేది. కానీ మనవాళ్ళు బాలీవుడ్ వాళ్ళను వెనక్కి నెట్టేసి తెలుగు సినిమా ఇండస్ట్రీని నెంబర్ వన్ పొజిషన్ లోకి తీసుకువచ్చారు. ముఖ్యంగా రాజమౌళి చేసిన ‘బాహుబలి’ సినిమా పాన్ ఇండియాలో ఎంతటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేసిందో మనందరికి తెలిసిందే. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వరుసగా మన స్టార్ హీరోలు, డైరెక్టర్లు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను సాధించడంతో ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ టాప్ పొజిషన్లోకి వెళ్లిపోయింది. ఇక ఇప్పుడు కూడా మన దర్శక నిర్మాతలు సైతం భారీ ఎత్తున సినిమాలను నిర్మిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…అయితే గత కొద్ది రోజుల నుంచి టైర్ వన్ హీరోల లిస్టులో మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లు ఉన్నారు…

పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో చాలా బిజీగా ఉండి సినిమాలను సరిగ్గా చేయలేకపోవడం వల్ల ఆయన మార్కెట్ అనేది అంతకంతకు పడిపోతూ వస్తుంది. మిగతా హీరోలతో పోలిస్తే ప్రస్తుతం ఉన్న హీరోల్లో టైర్ వన్ లిస్ట్ లో పవన్ కళ్యాణ్ కి చాలా తక్కువ మార్కెట్ ఉంది. ఆయన సినిమాలు కేవలం తెలుగుకి మాత్రమే పరిమితమవుతుండటం వల్ల ఆయన కలెక్షన్స్ ని భారీగా రాబట్టలేకపోతున్నాడు…

ఇక ముందు రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ ఇదే రీతిలో కలెక్షన్స్ ని సాధించినట్టయితే మాత్రం ఆయన టైర్ వన్ హీరోల లిస్ట్ నుంచి తప్పుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మినిమం మిగతా హీరోలు ఎంతటి వసూళ్లను సాధిస్తున్నారో అందులో 40% కలెక్షన్స్ అయిన పవన్ కళ్యాణ్ సాధించాల్సి ఉంది. లేకపోతే మాత్రం ఆయన టైట్ వన్ హీరోల లిస్ట్ నుంచి బయటికి వెళ్ళిపోయే ప్రమాదమైతే ఉంది.

ఒకవేళ ఆయన టైర్ వన్ హీరోల లిస్ట్ నుంచి అవుట్ అయిపోతే ఆ లిస్టులోకి చేరే కొత్త హీరో ఎవరు అనే దాని మీద కూడా చాప చర్చలు జరుగుతున్నాయి. మరో రెండు మూడు సంవత్సరాల్లో టైర్ వన్ హీరోల లిస్టులోకి కొత్తగా వచ్చే హీరోలు ఎవరు అనేదానిమీద ఒక సరైన క్లారిటి అయితే వస్తుంది అంటూ చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…

అజ్ఞాతంలోకి కొడాలి నాని?!

Kodali Nani
Kodali Nani

Kodali Nani: ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరచూ ఆరోపిస్తూ ఉంటుంది. వైసిపి హయాంలో టిడిపి శ్రేణులను ఇబ్బంది పెట్టిన నేతలతో పాటు అధికారుల పేర్లు రాసుకుంటున్నానని చెప్పి లోకేష్ రెడ్ బుక్ చూపించారు అప్పట్లో. అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతుందని సంకేతాలు ఇచ్చారు. వైసీపీకి అది ప్రతికూల అంశం గా కనిపించవచ్చు. కానీ టిడిపి శ్రేణులు మాత్రం రెడ్ బుక్ ను ఒక పవిత్ర గ్రంథంగా చూస్తున్నారు. అయితే కూటమి రెండేళ్ల పాలన పూర్తవుతున్న తరుణంలో రెడ్బుక్ సైతం అమలు చేయాలని కోరుతున్నారు తమ పార్టీ యువ నేత లోకేష్ ను. మొన్ననే రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది కూటమి. తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని పై కేసు విచారణలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఏ క్షణం అయినా కొడాలి నాని అరెస్టు తప్పదన్న ప్రచారం నడుస్తోంది. ఆయన సైతం అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు టాక్ నడుస్తోంది.

* ఎన్నికల నియమావళి ఉల్లంఘన..
వైసిపి హయాంలో 2021లో పంచాయితీ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో ప్రభుత్వంతో రాష్ట్ర ఎన్నికల అధికారి వివాదం నడిచింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారిగా ఉండేవారు. ఈ వివాద క్రమంలో అప్పట్లో మంత్రిగా ఉన్న కొడాలి నాని చంద్రబాబుతో పాటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఫిర్యాదు చేసిన కేసు విచారణ జరగలేదు. కొడాలి నాని మంత్రిగా ఉండడంతో ప్రభుత్వ అనుమతి లేదని భావించి.. విచారణ జరపలేదు. అయితే ఇప్పుడు ప్రాసిక్యూషన్కు రాష్ట్ర ప్రభుత్వ హోం శాఖ అనుమతి జారీ చేసింది. దీంతో విచారణ ప్రారంభమైంది. అయితే ఆ ఒక్క కేసు మాత్రమే కాదు. వరుసగా కేసులు నమోదు కానున్నాయి కొడాలి నాని పై.

* ఏ క్షణమైనా అరెస్టు..
తాజాగా కొడాలి నాని పై కేసులు నమోదు అవుతుండడంతో.. ఆయన అరెస్టు తప్పదన్న ప్రచారం జరుగుతోంది. మళ్లీ రెడ్ బుక్ పాలన మొదలైందని వైసిపి ఎద్దేవా చేస్తోంది. కానీ కూటమి పార్టీల శ్రేణులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇప్పటివరకు నమోదైన కేసులు, అరెస్టులు ఒక ఎత్తైతే.. కొడాలి నాని అరెస్టు మరో ఎత్తు. అంతలా కూటమి పార్టీల శ్రేణులను టార్గెట్ చేశారు.. వారి మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారు కొడాలి నాని. ఆయన అరెస్టు జరిగితే రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరగడం ఖాయం. బహుశా అరెస్టు భయంతోనే కొడాలి నాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

అదీ చంద్రబాబు అంటే.. చూస్తూ ఉండిపోయిన రాందేవ్ బాబా..

Chandrababu Naidu Yoga
Chandrababu Naidu Yoga

Chandrababu Naidu Yoga: మనకు యోగ అంటే ఎవరు గుర్తుకొస్తారు.. ఇంకెవరు రాందేవ్ బాబానే.. ఒళ్ళును విల్లులాగా వంచుతూ ఉంటారు ఆయన. అనేక రకాల ఆసనాలు చేస్తూ ఉంటారు. ఫలితంగా ఈ వయసులో కూడా అత్యంత చైతన్యవంతుడిగా కనిపిస్తుంటారు. వేదికల మీద అత్యంత కఠినమైన ఆసనాలు వేస్తూ అందరిని ఆశ్చర్యంలో ముంచేస్తుంటారు రాందేవ్ బాబా. అటువంటి రాందేవ్ బాబా కూడా ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఆయన ఎందుకు ఆశ్చర్యపోయారో తెలుసా..

అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రాందేవ్ బాబా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం విజయవాడ లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఐటి శాఖ మంత్రి నారా లోకేష్.. పౌర శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వంటి వారు పాల్గొన్నారు.

Chandrababu Naidu Yoga (1)
Chandrababu Naidu Yoga (1)

వేదిక మీద రాందేవ్ బాబా రకరకాల యోగాసనాలు వేశారు. చంద్రబాబు… నారా లోకేష్ కూడా ఇందులో పాల్గొన్నారు. నారా లోకేష్ రాందేవ్ బాబా చెప్పినట్టుగా యోగాసనాలు వేశారు.. ఇటీవల కాలంలో పూర్తిగా బరువు తగ్గిపోయిన నారా లోకేష్.. అత్యంత సులువుగా యోగాసనాలు వేశారు. ఏపీ సీఎం ఈకాలపు యువకుడి లాగా రాందేవ్ చెప్పినట్టు యోగాసనాలు వేశారు. ఆయన యోగాసనాలు వేస్తుంటే రాందేవ్ బాబా అలానే చూస్తూ ఉండిపోయారు. మీరు నాకే యోగ ఆసనాలు నేర్పించే విధంగా ఉన్నారని చంద్రబాబును ఉద్దేశించి రాందేవ్ బాబా వ్యాఖ్యానించారు.

చంద్రబాబు ప్రతిరోజు యోగా చేస్తూ ఉంటారు. ఈ వయసులో కూడా ఆయన ఆ స్థాయిలో ఉత్సాహంగా ఉండడానికి ప్రధాన కారణం యోగానే. పైగా ఆయన అత్యంత కఠినంగా డైట్ కొనసాగిస్తూ ఉంటారు. అన్నం అసలు ముట్టుకోరు. తన రోజువారి మెనూ లో కచ్చితంగా ఫైబర్.. ప్రోటీన్స్ ఉండేలా చూసుకుంటారు. కార్బోహైడ్రేట్ లను తక్కువ మోతాదులో తీసుకుంటారు. ప్రోటీన్లను ఎక్కువగా శాకాహార వంటల నుంచి ఆయన గ్రహిస్తారు. అందువల్లే చంద్రబాబు ఇంత ఆరోగ్యంగా ఉన్నారు.

2024 ఎన్నికల్లో మండే ఎండల్లో కూడా చంద్రబాబు ప్రచారం చేశారు. చాలా దూరం నడిచారు. అంతేకాదు ఏమాత్రం అలసిపోలేదు. ఇబ్బంది కూడా పడలేదు. తోటి నాయకులు ఎండకు తట్టుకోలేక అవస్థలు పడుతుంటే.. చంద్రబాబు మాత్రం ఉత్సాహంగా కనిపించారు. తాజాగా యోగేంద్ర కార్యక్రమంలో చంద్రబాబు రాందేవ్ బాబాను సైతం ఆశ్చర్యంలో ముంచేశారంటే.. ఆయన శరీర సామర్థ్యం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మిత ఆహారం.. ఒత్తిడి లేని దినచర్య.. శారీరక వ్యాయామం.. వంటివి చంద్రబాబు ఆరోగ్య రహస్యాలు.

ఏడాదికి 36% లాభం.. మొత్తంగా 5,978 కోట్లు..ఏకంగా దేశాన్నే కుదిపేసింది ఈ మహిళ..

Nauhera Shaik
Nauhera Shaik

Nauhera Shaik: సాధారణంగా భారతీయ మహిళలు చాలా పొదుపు చేస్తూ ఉంటారు. అనవసరంగా ఖర్చు పెట్టరు. ఒకవేళ ఖర్చుపెట్టినా దాని వెనక ఎంతో ఆలోచిస్తూ ఉంటారు. పైసా పైసా కూడబెట్టడంలో వారి తర్వాత ఎవరైనా. ప్రపంచంలో ఎవరైనా పొదుపు పాఠాలు నేర్చుకోవాలంటే ముందుగా చూసేది భారతీయ మహిళల వైపే. మనదేశంలో గ్రామీణ ప్రాంతాలు.. పట్టణ ప్రాంతాలు.. నగర ప్రాంతాలు.. ఇలా ఏవైనా సరే.. ప్రతి ఇల్లు ఆర్థిక స్థిరత్వం సాధించడంలో మహిళలదే కీలకపాత్ర.

మహిళలందరూ మహారాణులు కాదనట్టుగా.. పొదుపు చేసే మహిళలు అందరూ మంచివాళ్ళు కాదు. ఇందులో ముంచేవాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇలా ముంచే వాళ్లలో ఈమె ఏకంగా పిహెచ్డి చేసింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 5,978 కోట్లను సేకరించింది.. కాదు కాదు.. అన్ని కోట్లకు అందరిని ముంచింది. ఈమె చేసిన వ్యవహారం మనదేశ ఆర్థిక రంగంలోనే అతిపెద్ద కుంభకోణం. దీనికోసం ఆమె భారీగా ప్రచారం చేసుకోలేదు. పెద్ద ఎత్తున కార్యాలయాలు తెరవలేదు. కేవలం.. ఒక మాట చెప్పింది. తెలివైన ఎత్తుగడ వేసింది.

హీరా గ్రూప్ పేరుతో నౌహెరా షేక్ అనే మహిళ.. వడ్డీ లేని ఇస్లామిక్ వ్యాపారాన్ని మొదలుపెట్టి. దీనిని హలాల్ ఇన్వెస్ట్మెంట్ అని పిలుస్తుంటారు. దీని పేరుతో బంగారం.. టెక్స్టైల్స్.. రియల్ ఎస్టేట్ రంగాలలో పెట్టుబడి పెట్టాలని చాలామంది ప్రజలను ఆకర్షించింది. ఏకంగా ప్రతి ఏడాది 36% లాభాలు అందజేస్తామని ప్రకటించింది. ఇలా ఇన్వెస్టర్ల నుంచి భారీగా డబ్బు సేకరించింది. వేలకోట్లను తన సొంత బంధువులు.. తన పేరు మీద మళ్లించుకుంది. విదేశాలలో భారీగా ఆస్తులు కొనుగోలు చేసింది.

ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్లకు లాభాలు చూపించకపోవడం.. డబ్బు అడిగితే సమాధానం చెప్పకపోవడంతో మోసపోయామని గ్రహించారు. దీంతో వారు ఈ విషయాన్ని పోలీసులు దృష్టికి తీసుకెళ్లారు. మొదట్లో పోలీసులు ఈ వ్యవహారాన్ని చిన్న కేసు గానే భావించారు. ఆ తర్వాత లోతుల్లోకి వెళితే వారికే దిమ్మ తిరిగిపోయింది. ఒకటి కాదు రెండు కాదు 5978 కోట్లకి పైగా నిధులను సేకరించారు. ఈమె ఆంధ్ర ప్రదేశ్.. తెలంగాణ.. కేరళ రాష్ట్రాలలో భారీగా నిధులు సేకరించారు. వీటిని పక్కదారి పట్టించడంతో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ రంగంలోకి దిగింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆమెకు సంబంధించిన దాదాపు 428 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది.. అయితే నౌహెరా కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు…. రాజకీయ నాయకురాలు కూడా.. ఈమె ఆల్ ఇండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీకి అధ్యక్షురాలు. ఈ పార్టీని ఈమె స్థాపించారు..

నౌహెరా ఆర్థిక మోసానికి పాల్పడిన నేపథ్యంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్రకారం ఈ నెల 19న కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు నౌహెరా కు సంబంధించిన 159 కోట్ల విలువైన 23 ఆస్తులకు వేలం వేశారు. ఇలవేల మీదగా వచ్చిన మొత్తాన్ని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో మోసపోయిన వారికి తిరిగి చెల్లించబోతున్నారు. దీనికంటే ముందు సుప్రీంకోర్టు నౌహెరా బెయిల్ రద్దు చేసింది. అయితే ఆమె అధికారుల నుంచి తప్పించుకోవడానికి అనేక రకాల నకిలీ పత్రాలు రూపొందించింది. నకిలీ గుర్తింపు పత్రాలతో హర్యానాలో తలదాచుకుంది. అయితే గత నెల 21న అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె హైదరాబాదులో జైల్లో ఉన్నారు. ఈ ఆస్తులను వేలం వేసే ప్రక్రియను నిరోధించడానికి నౌ హేరా పర్సనల్ అసిస్టెంట్ అన్సారి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తే.. ఆమెను కూడా ఈడి అధికారులు అరెస్ట్ చేశారు.

మంత్రుల్లో గెలిచేది వారే.. ఏపీలో సంచలన సర్వే!

Andhra Pradesh Ministers Survey
Andhra Pradesh Ministers Survey

Andhra Pradesh Ministers Survey: ఏపీలో కూటమి పాలనకు రెండేళ్లు అవుతోంది. మూడో సంవత్సరంలో అడుగు పెట్టింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేల పనితీరుపై అనేక రకాల విమర్శలు వచ్చాయి. మంత్రుల వ్యవహార శైలిపై కూడా అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. కానీ రెండేళ్ల పాలనలో భారీ వివాదాలు రాకుండా పూర్తి చేయగలిగారు పాలనను. ప్రభుత్వ పెద్దలపరంగా బాగానే కష్టపడుతున్నారు. దానికి తగ్గట్టుగానే మంచి ఫలితాలు వస్తున్నాయి. అయినా సరే ఈ రెండేళ్లలో లోపాలతో పాటు మైనస్లను సరి చేసుకుని ముందుకెళ్తేనే కూటమికి మరో ఛాన్స్ ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలతో పాటు మంత్రుల పనితీరుపై ఫీడ్ బ్యాక్ తెలుసుకుంటున్నారు సీఎం చంద్రబాబు. ఇంకోవైపు ప్రముఖ మీడియా సంస్థలు సైతం అంచనా వేస్తున్నాయి.

* ఓ డిజిటల్ మీడియా సర్వే..
తాజాగా మంత్రుల పనితీరుపై ఓ ప్రముఖ డిజిటల్ మీడియా ఒక సర్వే చేసినట్లు తెలుస్తోంది. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలిచేవారు, పర్వాలేదనిపించుకున్న వారితో పాటు ఓడిపోతారు అనే విషయాన్ని ఆ సర్వే తెలుసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న సీఎం చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రుల్లో తొమ్మిది మంది కచ్చితంగా గెలుస్తారని సదరు సర్వే తేల్చి చెప్పింది
* సీఎం చంద్రబాబు కుప్పం నుంచి మరోసారి గెలుస్తారు అని ఈ సర్వే తేల్చింది. 1983 నుంచి కుప్పం నియోజకవర్గం నుంచి గెలుస్తూ వచ్చారు చంద్రబాబు. 2019లో వైసీపీ గెలుపుతో పాటు కుప్పం నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. దీంతో వై నాట్ కుప్పం అని నినాదంతో ముందుకు సాగిన వైసీపీకి 2024 ఎన్నికల్లో షాక్ తప్పలేదు. మరోసారి కుప్పం నుంచి చంద్రబాబు కచ్చితంగా గెలుస్తారని ఈ సర్వే తేల్చింది.
* పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ మరోసారి తప్పకుండా గెలుస్తారని ఈ సర్వే ద్వారా తేలింది. మొన్నటి ఎన్నికల్లో పొత్తులో భాగంగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కు 70 వేలకు పైగా మెజారిటీ వచ్చింది ఈ నియోజకవర్గం నుంచి. మంత్రితో పాటు డిప్యూటీ సీఎం గా ఉండడంతో పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేస్తున్నారు. అందుకే ఇక్కడ ప్రజలు మరోసారి పవన్ కళ్యాణ్ కి అవకాశం ఇస్తారు అని ఈ సర్వే ద్వారా తేలింది.
* మంగళగిరి నుంచి నారా లోకేష్ కచ్చితంగా గెలుస్తారు. మంత్రిగా ఉంటూ ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.. అయినా సరే మంగళగిరి నియోజకవర్గాన్ని తన సొంత డబ్బులతో అభివృద్ధి చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కనివిని ఎరుగని అభివృద్ధి మంత్రంతో ముందుకు వెళ్తున్నారు. అందుకే అక్కడి ప్రజలు మరోసారి లోకేష్ కు అవకాశం ఇస్తారని తేలిపోయింది.
* టెక్కలి నుంచి మరోసారి కింజరాపు అచ్చం నాయుడు గెలుపు తధ్యమని తేలిపోయింది. ఇక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా వీక్ గా ఉంది. ఆపై మంత్రికి మంచి ఇమేజ్ ఉంది. టెక్కలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారన్న పేరు ఉంది. అందుకే ఇక్కడ ప్రజలు మరోసారి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది.
* పాలకొల్లు నుంచి మరోసారి నిమ్మల రామానాయుడుకు ప్రజలు అవకాశం ఇవ్వనున్నారు. తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్న నియోజకవర్గం. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఒకసారి మాత్రమే ఓడిపోయింది. నిమ్మల రామానాయుడు నిత్యం ప్రజల్లోనే ఉంటారు. మంచి నేతగా పేరు ఉంది. ఇక్కడ వైసిపి కొత్త ప్రయోగాలు చేస్తోంది కానీ వర్కౌట్ కాలేదు.
* రేపల్లె నుంచి అనగాని సత్యప్రసాద్ మరోసారి గెలుస్తారని ఈ సర్వే ద్వారా తేలింది. అక్కడ ఆయన హ్యాట్రిక్ విజయం సాధించారు. స్థానికంగా మంచి పట్టు సాధించారు. సత్యప్రసాద్ను ఓడించేందుకు వైసిపి చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ అవేవీ వర్కౌట్స్ కాలేదు. ఈసారి కూడా ఆయనదే విజయం అని తేలిపోయింది.
* అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్ మరోసారి కచ్చితంగా విజయం సాధిస్తారు. ఈ నియోజకవర్గంలో టిడిపి తో పాటు వైసీపీకి పట్టు ఉంది. కానీ వ్యక్తిగతంగా గొట్టిపాటి రవికుమార్ తన ఇమేజ్ పెంచుకున్నారు. ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేసిన గెలుపు తథ్యం అన్నట్టు పరిస్థితి ఉంది. అందుకే మరోసారి ఆయన విజయం ఖాయమని తేలిపోయింది.
* గజపతినగరం నుంచి కొండపల్లి శ్రీనివాస్ గెలుపు మరోసారి ఖాయం అన్నట్టు ఉంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు మంత్రివర్గంలో స్థానం దక్కింది. మంచి ఇమేజ్ ఉంది. అందుకే అక్కడి ప్రజలు ఆయన నాయకత్వానికి మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమైంది.
* నిడదవోలు నుంచి మరోసారి జనాలు కందుల దుర్గేష్ కు ఛాన్స్ ఇస్తారని ఈ సర్వే ద్వారా స్పష్టమైంది. పొత్తు ఉన్నంతవరకు నిడదవోలులో కూటమి గెలుపు ఖాయం. పైగా దుర్గేష్ గెలిచిన నాటి నుంచి నియోజకవర్గాన్ని తనదైన రీతిలో అభివృద్ధి చేస్తున్నారు. అది కలిసి వచ్చే అంశం. ఇలా తొమ్మిది మంది కూటమి పాలనలో కచ్చితంగా గెలుస్తారు అని స్పష్టం కావడం విశేషం.

ప్యారడైజ్ మూవీలో చిలుకలు, పావురాలు, కాకుల మధ్య చూపించబోయే తేడా ఇదేనా..?

Nani Paradise Movie
Nani Paradise Movie

Nani Paradise Movie: నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్యారడైజ్ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఈ సినిమా ఆగస్టు 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటూ అనౌన్స్ చేశారు. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారమైతే సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో పోస్ట్ పోన్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ సినిమా ఎప్పుడు వచ్చిన కూడా పెను సంచలనాన్ని క్రియేట్ చేస్తుందనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటివరకు నాని చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి కొత్త ఇమేజ్ ను తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు.

శ్రీకాంత్ ఓదెల సైతం ఈ సినిమాని చాలా డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన మొదటి గ్లింప్స్ లో చిలకలు, పావురాల గురించి విన్నాం కానీ కాకుల గురించి ఎవ్వరు రాయలేదు అంటూ ఒక ఒక డైలాగ్ ను హైలెట్ చేశారు. మరి ఆ డైలాగులను బట్టి చూస్తే మోహన్ బాబు మాలిక్ అనే విలన్ క్యారెక్టర్ లో చేస్తున్నాడు. కాబట్టి చిలకను రిప్రజెంట్ చేస్తూ ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇచ్చారు.

అలాగే మోహన్ బాబు కొడుకు విక్రమ్ మాలిక్ పాత్రను చేస్తున్న వ్యక్తి ది కూడా పావురం ఇన్స్పిరేషన్తో ఫస్ట్ లుక్ ఇచ్చారు. వీళ్ళందరినీ ఎదురుకోవడానికి కాకులు లాంటి మన హీరో టీమ్ కసరతులు చేశాయి. వాళ్ళమీదకి ఎలా అటాక్ చేశాయి. వాళ్ళని ఎలా ఓడించాయి అనేది ఈ సినిమా కథగా తెలుస్తుంది.

నాని ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలన్నింటిలో ఓవర్ హైప్ తో తెరకెక్కుతున్న సినిమా కూడా ఇదే కావడం విశేషం… ఇక ఈ సినిమా మీద సగటు ప్రేకగ్కులు సైతం మంచి అంచనాలు పెట్టుకున్నారు. వాళ్ల నమ్మకాన్ని నిలబెడుతూ ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ సక్సెస్ గా నిలుస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుంది లేదని మీద క్లారిటి రావడం లేదు…

టాలెంట్ ఉండి భారీ సక్సెస్ లను అందుకోలేకపోతున్న హీరోలు వీళ్లేనా..?

Talented Heroes
Talented Heroes

Talented Heroes: సినిమా ఇండస్ట్రీలో చాలామందికి టాలెంట్ ఉంటుంది. కానీ దానిని సక్రమంగా వినియోగించుకోలేరు. మొత్తానికైతే కొంతమందికి టాలెంట్ తో సంబంధం లేకుండా అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఎవరైతే ఇక్కడ నటులుగా ప్రూవ్ చేసుకుంటారో వాళ్లకు తప్పకుండా అవకాశాలు వస్తాయని మరికొంత మంది చెబుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది కుర్ర హీరోలు సైతం మంచి అవకాశాలను అందుకుంటున్నప్పటికి సక్సెస్ లను సాధించకపోవడంతో వాళ్ళని ఎవరు పట్టించుకోవడం లేదు. ఇక అలాంటివారిలో సత్యదేవ్ మొదటి స్థానంలో ఉన్నాడు.

ఆయన వరుసగా సినిమాలను చేస్తున్నాడు. హీరోగా చేస్తూనే కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇవన్నీ చేసినప్పటికి ఆయనకు అనుకున్న గుర్తింపైతే రావడం లేదు. కారణం ఏదైనా కూడా తన నుంచి వచ్చే సినిమాల విషయంలో ఆయన ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ సినిమా మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు…

ఇక సంగీత్ శోభన్ సైతం వరుస సినిమాలు చేస్తున్న ఆయనకు పెద్దగా సినిమాలైతే కలిసి రావడం లేదు. ఒకటి రెండు అడపాదడప సక్సెస్ లు సాధించినా కూడా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందుకోలేకపోతున్నాడు. తన నుంచి వచ్చే సినిమాల విషయంలో ఎందుకని ఆయన అలా డీలాపడిపోతున్నాడు ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యాన్ని చూపించాలనే ప్రయత్నం చేసినా కూడా ఆయనను ఎవరు పట్టించుకోవడం లేదు.

అందువల్లే ఆయన చాలా వరకు వెనకబడి పోతున్నాడు అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు భారీ సక్సెస్ అయితే వస్తుంది. ఆ రోజు వరకు వెయిట్ చేస్తూ ముందుకు సాగితేనే ఇక్కడ మనుగడ కొనసాగుతుంది. మనం కూడా టాప్ పొజిషన్ కి వెళ్లే అవకాశం ఉంటుందని మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు… మొత్తానికైతే సినిమా ఇండస్ట్రీ సక్సెస్ రావడం అనేది అంత ఈజీ అయితే కాదు… కానీ ప్రయత్నిస్తే పెద్ద కష్టం కూడా కాదు…

ట్రంప్‌కు ఏమైంది.. మెలోనితో గొడవకు కారణం అదేనా?

Donald Trump And Meloni
Donald Trump And Meloni

Donald Trump And Meloni: ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన జి7 సమ్మిట్‌లో ఫొటో విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఇటలీ ప్రధాని మెలోనీ మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. ట్రంప్‌ ఒక ఇటాలియన్‌ మీడియా ఇంటర్వ్యూలో మెలోని తనతో ఫొటో తీసుకోవడానికి బాగా బ్రతిమాలిందని, తాను కరుణించి అంగీకరించానని చెప్పారు. ఈ వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. మెలోని ఈ ఆరోపణలను తిరస్కరించారు. ఆమె ‘‘నేను లేదా ఇటలీ ఎవరినీ బ్రతిమాలడం జరగదు’’ అని స్పష్టం చేశారు. ట్రంప్‌ సోషల్‌ మీడియాలో మళ్లీ ఈ విషయాన్ని ప్రస్తావించి, మెలోని తన దేశంలోని సమస్యల నుంచి దృష్టి మరల్చడానికి ఈ వివాదాన్ని ఉపయోగిస్తోందని వ్యాఖ్యానించారు.

ట్రంప్‌ ఎందుకిలా..
మెలోని ఇటలీ ప్రధానిగా పనితీరు తగ్గుతోందని, తనతో అనుబంధం ద్వారా ఆమె ప్రజాదరణ పెంచుకోవాలని చూస్తోందని ట్రంప్‌ పేర్కొన్నారు. ఆమె ఇరాన్‌ విషయంలో అమెరికాకు మద్దతు ఇవ్వలేదని కూడా ఆరోపించారు. మెలోని తరఫు నుంచి ఇది అసత్యమని, అనవసరమైన వ్యాఖ్యలని తిప్పి చెప్పారు. ఇటలీ విదేశాంగ మంత్రి అమెరికా పర్యటనను రద్దు చేయడం ఈ వివాదం ఎంత తీవ్రమైందో చూపిస్తోంది. రెండు నాయకులు ఒకప్పుడు దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నారు. ఇప్పుడు బహిరంగంగా వాదులాడుతున్నారు.

ఇరాన్‌ యుద్ధానిక సహాయ నిరాకరణ..
ఈ వివాదం వెనుక ఇరాన్‌తో అమెరికా సంఘర్షణలో ఇటలీ తీసుకున్న నిర్ణయాలు కీలక పాత్ర పోషించాయి. మార్చి 2026లో అమెరికా ఇరాన్‌పై సైనిక చర్యలు చేపట్టిన సమయంలో, ఇటలీ సిసిలీలోని సిగోనెల్లా ఎయిర్‌బేస్‌ను అమెరికన్‌ బాంబర్లకు ఉపయోగించనివ్వలేదు. ఇటలీ వర్గాలు ఇది అధికారిక అనుమతి లేకపోవడం వల్ల అని చెప్పాయి. ట్రంప్‌ ఇది అమెరికాకు మద్దతు ఇవ్వకపోవడంగా భావించారు. మెలోని ఇరాన్‌పై అమెరికా చర్యలను ‘‘చట్టవిరుద్ధం’’ అని ప్రకటించినట్లు కూడా నివేదికలు ఉన్నాయి. ఇది ట్రంప్‌కు కోపం తెప్పించింది.

పోప్‌పై విమర్శలు..
ఏప్రిల్‌ 2026లో ట్రంప్‌ పోప్‌ లియోపై విమర్శలు చేసినప్పుడు మెలోని వాటిని అని ఖండించారు. ఆమె కాథలిక్‌ చర్చి నాయకుడికి మద్దతు ఇచ్చారు. ట్రంప్‌ ఇది కూడా తనపై వ్యతిరేకతగా చూశారు. ఇటలీ నాటో సంకల్పాలు, అంతర్జాతీయ నియమాలు పాటించడం, జాతీయ ప్రయోజనాలు రక్షించడం వంటి అంశాలు ఈ వివాదానికి ఆధారంగా ఉన్నాయి. మెలోని ఇటలీలో తన ప్రజాదరణను కాపాడుకోవడానికి స్వతంత్ర వైఖరి తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.

దౌత్య సంబంధాలపై ప్రభావం..
ఈ వాగ్వాదం కేవలం ఫొటో విషయంలో మాత్రమే కాదు. ఇది అమెరికా, యూరోపియన్‌ మిత్రుల మధ్య ఉన్న విభేదాలను బయటపెడుతోంది. ట్రంప్‌ తన విధానాలకు మద్దతు కోరుతున్నారు. మెలోని ఇటలీ సార్వభౌమత్వం, అంతర్జాతీయ చట్టాలు, యూరోపియన్‌ సంకల్పాలను ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటలీ సైనిక స్థావరాలను ఉపయోగించనివ్వకపోవడం నాటోలోని సభ్య దేశాలు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే సంకేతం. ట్రంప్‌ ఇలాంటి విమర్శలు చేయడం ద్వారా మిత్రులను ఒత్తిడి చేస్తున్నారు. అయితే ఇది దీర్ఘకాలిక సంబంధాలను దెబ్బతీయవచ్చు. మెలోని ఇటలీలో ఆమె ప్రజాదరణ స్థిరంగా ఉంది. ట్రంప్‌ వైఖరి యూరోపియన్‌ మిత్రులతో ఉన్న ఒప్పందాలను పునరాలోచించేలా చేస్తోంది.

ఈ వివాదం అకస్మాత్తుగా కనిపించినా, ఇరాన్‌ సంఘర్షణ, సైనిక సహకారం, మతపరమైన వ్యాఖ్యల వంటి లోతైన కారణాలు ఉన్నాయి. దౌత్యం ద్వారా పరిష్కారం కావాలి. లేకపోతే అమెరికా–యూరోప్‌ సంబంధాలు మరింత ఉద్రిక్తం కావచ్చు. ఇది ప్రపంచ రాజకీయాల్లో మారుతున్న సమతుల్యతను సూచిస్తోంది.

జనసేన ఎమ్మెల్యేలపై పవన్ ఆగ్రహం!

Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan: మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. వారు అనుకున్న స్థితిలో పనిచేయకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలపై జనసేన ఎమ్మెల్యేలు స్పందించడం లేదని పవన్ ప్రస్తావించారు. గతంలో కూడా సొంత పార్టీ ఎమ్మెల్యేల తీరుపై ఇదే మాదిరిగా మాట్లాడారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో ఏ పరిణామం జరిగినా తనను వైసీపీ కార్నర్ చేస్తోందని.. జనసేన ఎమ్మెల్యేలు తిప్పి కొట్టకపోతే ఎలా అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. కాకినాడలో మాటామంతి పేరుతో నిర్వహించిన సమావేశంలో వేదికపై ఉన్న ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఘాటుగానే వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్.

* పవన్ ఓపెన్..
పవన్ కళ్యాణ్ ఇటీవల బ్లాస్ట్ అవుతున్నారు. కాపుల విషయంలో ఫుల్ క్లారిటీ ఇస్తున్నారు. తనకు కాపు కులం మాత్రమే కొమ్ముకాయ లేదని.. రాష్ట్రంలో ఉన్న ప్రతి వర్గం అండతోనే కూటమి అధికారంలోకి వచ్చిందని తేల్చి చెబుతున్నారు. ఇటీవల సాయి కృష్ణ అనే యువకుడు అదృశ్యమయ్యాడు. అయితే ఆయనపై అనేక నేరాలు ఉన్నాయి. అటువంటి వ్యక్తి అదృశ్యమైతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. కానీ జనసేన నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఆశించిన స్థాయిలో లేదు. దానిపైనే ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. కులం ఓట్లు, మతం ఓట్లు, ఓ వర్గం ఓట్లు పోతాయని భావించవద్దని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగానే ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

* వైసీపీని ధీటుగా ఎదుర్కోండి..
గతంలో కూడా జనసేన ఎమ్మెల్యేలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు పవన్ కళ్యాణ్. ఎమ్మెల్సీ మెగా బ్రదర్ నాగబాబుకు సైతం చురకలు అంటించారు. వైసీపీ నుంచి ప్రభుత్వం పై ఆ స్థాయిలో విమర్శలు వస్తుంటే ఎందుకు చెక్ పెట్టలేకపోతున్నారని ప్రశ్నించారు. అది టిడిపి ప్రభుత్వం మాత్రమే కాదని కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ఓటమిలో జనసేన కీలక భాగస్వామ్యం అని గుర్తించుకోవాలన్నారు. అప్పట్లో కొద్ది రోజులపాటు జనసేన ఎమ్మెల్యేలు గట్టిగానే ఎదుర్కొన్నారు వైసీపీ విమర్శలపై. తరువాత ఆ విమర్శలు తగ్గిపోయాయి. ఇప్పుడు సాయి కృష్ణ ఉదంతంతో పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడం ప్రారంభించారు. కాపులకు అన్యాయం జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నించారు. అయితే దీనిపై పవన్ ఏం చేస్తారు? ఒక క్రిమినల్ అదృశ్యమైతే పవన్ ఎందుకు బాధ్యత తీసుకుంటారు? అని జనసేన ఎమ్మెల్యేలు ఎవరు నిలదీయలేదు. దానినే ప్రస్తావించారు పవన్ కళ్యాణ్. వైసీపీ నుంచి వస్తున్న విమర్శలను ఎదుర్కోవడంలో జనసేన ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గుతుండడాన్ని ప్రస్తావించారు. ఇకనుంచి అటువంటి పరిస్థితి లేకుండా గట్టిగానే మాట్లాడాలని సొంత పార్టీ ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ పిలుపునివ్వడం విశేషం.

సుకుమార్ - రామ్ చరణ్ సినిమాలో విలన్ గా మెగాస్టార్ చేస్తున్నాడా..? ఇదెక్కడి ట్విస్ట్...

Ram Charan And Sukumar
Ram Charan And Sukumar

Sukumar And Ram Charan Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంటలిజెంట్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్… ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. రామ్ చరణ్ తో ఇంతకుముందు ఆయన చేసిన రంగస్థలం సినిమా ఎంతటి గొప్ప విజయాన్ని సాధించిందో మనందరికి తెలిసిందే. ఇక అల్లు అర్జున్ తో చేసిన పుష్ప సినిమా రెండు పార్టులుగా వచ్చి సూపర్ డూపర్ సక్సెస్ ను సాధించింది. ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇక రాబోయే సినిమాలతో కూడా అదే రేంజ్ లో సక్సెస్ లను సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…ప్రస్తుతం ఆయన డిఫరెంట్ సబ్జెక్టులను ఎంచుకుంటున్నాడు. రామ్ చరణ్ తో చేయబోతున్న సినిమా విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా వ్యవహరిస్తున్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన ‘రంగస్థలం’ సినిమాను మించి ఈ సినిమా ఉండాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమాలో విలన్ గా మలయాళం మెగాస్టార్ ముమ్ముట్టిని తీసుకుంటున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

ఇక ఈ సినిమా పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతుంది. కాబట్టి ఇతర భాషల్లో ఉన్న నటులను సైతం ఇందులో భాగం చేస్తే సినిమా మీద భారీ బజ్ క్రియేట్ అవుతుందని తద్వారా ప్రేక్షకులు సైతం ఆ సినిమాకి కనెక్ట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉంటాయనే ఉద్దేశంతోనే ఆయన ప్రతి ఒక్కరిని ఇందులో భాగం చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…

మొత్తానికైతే సుకుమార్ సినిమాలో విలన్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా కూడా ప్రాపర్ రీజన్ ఉంటుంది. ఈ సినిమాలో మెగాస్టార్ మమ్ముట్టి ఏ రేంజ్ లో కనిపిస్తాడు. తనని సుకుమార్ ఏ రేంజ్ లో చూపిస్తాడు. మొత్తానికైతే డిఫరెంట్ పాత్రలో మమ్ముట్టి కనిపిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక పెద్ది సినిమా కొంతవరకు తేడా కొట్టడంతో సుకుమార్ తో చేయబోయే సినిమా విషయంలో రామ్ చరణ్ కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు.

ఒకటికి పదిసార్లు ఒక సన్నివేశాన్ని రాసుకుని అది పర్ఫెక్ట్ గా కుదిరిన తర్వాతే నెక్స్ట్ సీన్ కి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే విలన్ గా మాత్రం మమ్ముట్టిని ఫిక్స్ చేసుకున్నారు. మరి తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా లేదా అనేది తెలియాలంటే సినిమా యూనిట్ నుంచి అఫిషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సిందే…

రాజమౌళి చేసిన ఆ ఒక్క హెల్ప్ ను చిరంజీవి ఇప్పటికి మర్చిపోలేదా..?

Rajamouli
Rajamouli

Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంది. గత 26 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న ఘనత కూడా రాజమౌళికే దక్కుతుంది. అలాంటి రాజమౌళి ఒక విషయంలో చిరంజీవికి హెల్ప్ చేశారట. ఇక విషయాన్ని చిరంజీవి ఇప్పటికి గుర్తు పెట్టుకొని రాజమౌళి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి దాని గురించి డిస్కస్ చేస్తూ ఉంటారట. ఆ హెల్ప్ ఏంటి అంటే రామ్ చరణ్ సెకండ్ సినిమా అయిన ‘మగధీర ‘ సినిమా కోసం రాజమౌళిని సంప్రదించినప్పుడు రాజమౌళి ఆ ప్రాజెక్టుని రిజెక్ట్ చేయకుండా ఆ మూవీ చేద్దామని చెప్పి చరణ్ కి సంబంధించిన లుక్స్ ని మొత్తం మార్చేసి తనకు అనుగుణంగా రామ్ చరణ్ ను మార్చుకొని మరి ఆ సినిమాని చేశాడు.

అందువల్ల రామ్ చరణ్ సైతం రెండోవ సినిమాతోనే ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన హీరోగా హిస్టరీలో నిలిచిపోయాడు. అలాంటి రామ్ చరణ్ ను టాప్ హీరోగా మార్చడంలో రాజమౌళి కీలక పాత్ర వహించారు. కాబట్టి రాజమౌళి తనకు చేసిన హెల్ప్ ను ఎప్పుడు చిరంజీవి గుర్తు పెట్టుకుంటూనే ఉంటారట. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం రామ్ చరణ్ స్టార్ హీరోగా అవతరించాడు.

అలాంటి నటుడు ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో కొంతవరకు తడబడ్డప్పటికి భారీ బడ్జెట్ తో చేసే సినిమాల విషయంలో ఆయన చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు…ఇక చిరంజీవి సైతం 70 సంవత్సరాల పైబడిన వయసులో కూడా అలవోకగా సినిమాలను చేస్తూ కుర్ర హీరోలకు పోటీని ఇస్తున్నాడు.

ఈ సంవత్సరం ఇప్పటికే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఆయన నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి కి మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక చిరంజీవి లాంటి నటుడు ఈ ఏజ్ లో కూడా ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా అహర్నిశలు కష్టపడుతున్నాడు అంటే అతనికి సినిమా అంటే ఎంత ఇష్టమో మనం అర్థం చేసుకోవచ్చు…