
రాజకీయనాయకులు ఏం చేసినా అతిగానే ఉంటుంది. ప్రజల్లో నాయకులమీద వున్న సానుభూతిని ఎలా సొమ్ము చేసుకోవాలో వాళ్లకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. అందుకు ఓ ఉదాహరణ పథకాలకు నాయకుల పేర్లు. దేశంలో ఏమూలకెళ్లినా ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ పార్టీ నాయకుల పేర్లే కనపడతా ఉంటాయి. పార్టీలకు అతీతంగా వాళ్ళను ప్రజలూ చూడటంలేదు, పార్టీలు అంతకన్నా. చివరకు ఈ పేర్ల ప్రహసనం ఓ పెద్ద జోకు అయిపొయింది.
ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో కేవలం మహాత్మాగాంధీ పేరుతోనే పధకాలు గానీ, రోడ్లుగానీ, అన్నింటికన్నా ముఖ్యంగా విగ్రహాలుగానీ వెలిసేవి. అప్పట్లో పుట్టిన పిల్లలకు కూడా జాతీయనాయకుల పేర్లు పెట్టేవాళ్ళు. అయితే ప్రభుత్వాలు పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలే స్వచ్చందంగా విగ్రహాలు పెట్టే సంస్కృతి కూడా ఉండేది. నేతాజీ సుభాష్ చంద్ర బోసు విగ్రహాలు ఆంధ్రాలో ఏ మూలకెళ్లినా దర్శనమిచ్చేవి. ఇవి ప్రజలు స్వచ్చందంగా నిర్మించినవి. ఆ తర్వాత సంస్కృతి మారింది. కాంగ్రెస్ పార్టీ నెహ్రూ విగ్రహాలు ప్రతి గ్రామానా పెట్టారు. అయితే ఆయన గాంధీ తర్వాత అత్యంత పలుకుబడి కలిగిన నాయకుడు కాబట్టి అందుకు ప్రజలు పూర్తిగా కలిసివచ్చారు. ఆ తర్వాత దశలో అంబేద్కర్ విగ్రహాలు విరివిగా వచ్చాయి. అవి ప్రతిష్టించటం లో దళిత సంఘాలు ప్రధాన పాత్ర పోషించాయి. తర్వాత కాంగ్రెస్ కూడా ప్రోత్సహించటం మొదలు పెట్టింది. వాస్తవానికి అంబేద్కర్ భారత దేశం లోని అతి కొద్దిమంది మేధావుల్లో ఒకరు. ఆయన బ్రతికున్నంతకాలం రావాల్సినంత పేరు, ప్రఖ్యాతులు రాలేదు. ఆయన్ను పార్లమెంటుకు రానివ్వకుండా ఓడించారు. ఆ తర్వాత అవసర రీత్యా తప్పనిపరిస్థితుల్లో తనకు ప్రాచుర్యం కల్పించారు. అలాగే భారత దేశ ఇంకో దార్శనికుడు డాక్టర్ రామమనోహర్ లోహియా కు రావాల్సినంత ప్రాముఖ్యత రాలేదు. చరిత్రలోకి తొంగిచూస్తే దీనిపై ఇంకా ఎన్నో విషయాలు చర్చించుకోవచ్చు.
ఈ పేర్ల ప్రాముఖ్యం వింతపుంతలు తొక్కటం మొదలుపెట్టింది ఇందిరా గాంధీ తదనంతరం. ముందుగా ఇందిరా గాంధీ , తర్వాత రాజీవగాంధీ పేర్లు ప్రతి పధకానికి పెట్టటం మొదలయ్యింది. అది ఎక్కడిదాకా వెళ్లిందంటే ప్రజలకు మొహం మొత్తిందాకా. అయినా ప్రజలు ఏం చేస్తారు భరించటంతప్ప. ఈ ప్రహసనం కాంగ్రెస్ అప్రతిహంగా కొనసాగినంతకాలం బాగానే వుంది. కాంగ్రెసేతర ప్రభుత్వాలు రావటం మొదలుపెట్టింతర్వాత దీనిని సమీక్షించటం మొదలుపెట్టారు. అయితే వాళ్లలో ఆ స్టేచర్ వున్న నాయకులు లేరు కాబట్టి పేర్ల ప్రహసనం ఆగిపోయింది. మోడీ వచ్చినతర్వాత ప్రతి పధకానికి ఓ కొత్త నామాన్ని పెట్టటం మొదలుపెట్టాడు. పధకం ముందుగా ప్రధానమంత్రి పేరు తగిలిస్తున్నాడు. ఓ విధంగా ఇది రేపు అధికారం లోకి ఎవరొచ్చినా ఇబ్బంది ఉండదు.
ఇక మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి చూస్తే ఈ పేర్ల ప్రహసనం చంద్రబాబు నాయుడు తోనే మొదలయిందని చెప్పొచ్చు.ఎన్టీఆర్ పేరుని అన్నింటికీ తగిలించటం మొదలు పెట్టాడు. ఆ తర్వాత వచ్చిన వైఎస్సార్ ప్రతిగా ప్రతిపథకానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టటం
మొదలుపెట్టాడు. ఈ తంతు అధికారమార్పిడి జరిగినప్పుడల్లా నడిచింది. చివరగా చంద్రబాబు నాయుడు పోయిన ప్రభుత్వం లో ఎన్ టిఆర్ పేరు తో పాటు తనపేరుతో పధకాలు ప్రారంభించటం మొదలుపెట్టాడు. చంద్రన్న పధకాలు ప్రారంభించాడు. ఇది కొత్త ఒరవడి. దాన్నే జగన్ ఇప్పుడు కాపీ కొట్టాడు. తన తండ్రి వైఎస్సార్ తో పాటు తనపేరుతో కూడా పధకాలు ప్రారంభించాడు. ఇప్పుడు చంద్రన్న బదులు జగనన్న పధకాలు మొదలయ్యాయి. వీళ్లిద్దరూ బతికుండగానే వాళ్ళ పేర్లను ప్రాచుర్యం లోకి తెచ్చుకోవాలని తాపత్రయపడటం కొంత జుగుప్సాకరంగా వుంది. ముందు ముందు చంద్రబాబు, జగన్ విగ్రహాలను కూడా వాళ్లే ప్రారంభించుకుంటారేమో చూడాలి. రాజకీయాల దిగజారుడుతనానికి ఇంతకన్నా ఏం కావాలి?
బోల్డ్ ఇమేజ్ మంచిదే అంటున్న పాయల్ రాజ్ ఫుత్
మరక మంచిదే అన్నట్లు.. సినిమాల్లో బోల్డ్ ఇమేజ్ మంచిదేనని పాయల్ రాజ్ ఫుత్ హాట్ కామెంట్ చేసింది. ఓ ఇంటర్యూలో పాయల్ రాజ్ ఫుత్ బోల్డ్ ఇమేజ్ పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాను బోల్డ్ ఇమేజ్ కోరులేదని, ప్రేక్షకులే తనకు బోల్డ్ ఇమేజ్ ఇచ్చారని తెలిపింది. తనకు మంచే చేసిందని హీరోయిన్ పాయల్ రాజ్ ఫుత్ అన్నారు. అభిమానులు కోరుకున్న క్యారెక్టర్లో నటించడంలో తప్పేమీ లేదని చెప్పింది. ఈ ఇమేజ్ ఇలానే కొనసాగుతుందని పాయల్ రాజ్ ఫుత్ స్పష్టం చేసింది.
Read More: అందాలతో కాక రేపుతున్న శ్రీముఖి..
ఆర్ఎక్స్-100 మూవీతో తెలుగు ప్రేక్షకులకు పాయల్ రాజ్ ఫుత్ పరిచయమైంది. ఈ సినిమా పాయల్ నటనతోపాటు అందాల ఆరబోతకు కుర్రకారు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో పాయల్ ఏమాత్రం బెరుకులేకుండా అందాలను ఆరబోసింది. ఈ సినిమా విజయంలో పాయల్ కీ రోల్ అని చెప్పొచ్చు. ఈ సినిమాతో యువతలో పాయల్ కు భారీగా క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా నుంచి ఆమెకు వరుసగా బోల్డ్ ఇమేజ్ క్యారెక్టర్లు చేస్తూ వస్తుంది. ఆర్ఎక్స్-100 తరహాలోనే ఆర్డీఎక్స్ లవ్ మూవీలోనూ బోల్డ్ క్యారెక్టర్ చేసింది. కానీ ఈ సినిమా అనుకున్నంత సక్సస్ కాలేదు. దీంతో ఆమెకు అవకాశాలు తగ్గాయి. అయితే పాయల్ బోల్డ్ ఇమేజ్ దూరంగా క్యారెక్టర్లు చేస్తుందనే వార్తలు వస్తున్నాయి.
ఇటీవలే హీరో వెంకటేష్ సరసన వెంకీమామలో మంచి నటనతో ఆకట్టుకుంది. అలాగే కిందటివారం విడుదలైన డిస్కో రాజాలోనూ పాయల్ రవితేజ సరసన నటించింది. అయితే పాయల్ గ్లామర్ పాత్రలకు దూరమవుతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో పాయల్ రాజ్ ఫుత్ ఈ హాట్ కామెంట్ చేసింది. బోల్డ్ ఇమేజ్ అంటే కొందరు హీరోయిన్లు భయపడుతారు. అలాంటి బోల్డ్ ఇమేజ్ ను వదిలేదని ఈ హాట్ బ్యూటీ స్పష్టం చేస్తుంది. ఏదిఏమైనా పాయల్ ను అభిమానులు ఏవిధంగా కోరుకుంటారో అలా చేయడానికి తాను రెడీ అని బోల్డ్ గా చెబుతోంది. ఆమె మాటలు దర్మక, నిర్మాతలకు చేరాయో లేదోగానీ, పాయల్ అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు.