
మరక మంచిదే అన్నట్లు.. సినిమాల్లో బోల్డ్ ఇమేజ్ మంచిదేనని పాయల్ రాజ్ ఫుత్ హాట్ కామెంట్ చేసింది. ఓ ఇంటర్యూలో పాయల్ రాజ్ ఫుత్ బోల్డ్ ఇమేజ్ పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాను బోల్డ్ ఇమేజ్ కోరులేదని, ప్రేక్షకులే తనకు బోల్డ్ ఇమేజ్ ఇచ్చారని తెలిపింది. తనకు మంచే చేసిందని హీరోయిన్ పాయల్ రాజ్ ఫుత్ అన్నారు. అభిమానులు కోరుకున్న క్యారెక్టర్లో నటించడంలో తప్పేమీ లేదని చెప్పింది. ఈ ఇమేజ్ ఇలానే కొనసాగుతుందని పాయల్ రాజ్ ఫుత్ స్పష్టం చేసింది.
Read More: అందాలతో కాక రేపుతున్న శ్రీముఖి..
ఆర్ఎక్స్-100 మూవీతో తెలుగు ప్రేక్షకులకు పాయల్ రాజ్ ఫుత్ పరిచయమైంది. ఈ సినిమా పాయల్ నటనతోపాటు అందాల ఆరబోతకు కుర్రకారు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో పాయల్ ఏమాత్రం బెరుకులేకుండా అందాలను ఆరబోసింది. ఈ సినిమా విజయంలో పాయల్ కీ రోల్ అని చెప్పొచ్చు. ఈ సినిమాతో యువతలో పాయల్ కు భారీగా క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా నుంచి ఆమెకు వరుసగా బోల్డ్ ఇమేజ్ క్యారెక్టర్లు చేస్తూ వస్తుంది. ఆర్ఎక్స్-100 తరహాలోనే ఆర్డీఎక్స్ లవ్ మూవీలోనూ బోల్డ్ క్యారెక్టర్ చేసింది. కానీ ఈ సినిమా అనుకున్నంత సక్సస్ కాలేదు. దీంతో ఆమెకు అవకాశాలు తగ్గాయి. అయితే పాయల్ బోల్డ్ ఇమేజ్ దూరంగా క్యారెక్టర్లు చేస్తుందనే వార్తలు వస్తున్నాయి.
ఇటీవలే హీరో వెంకటేష్ సరసన వెంకీమామలో మంచి నటనతో ఆకట్టుకుంది. అలాగే కిందటివారం విడుదలైన డిస్కో రాజాలోనూ పాయల్ రవితేజ సరసన నటించింది. అయితే పాయల్ గ్లామర్ పాత్రలకు దూరమవుతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో పాయల్ రాజ్ ఫుత్ ఈ హాట్ కామెంట్ చేసింది. బోల్డ్ ఇమేజ్ అంటే కొందరు హీరోయిన్లు భయపడుతారు. అలాంటి బోల్డ్ ఇమేజ్ ను వదిలేదని ఈ హాట్ బ్యూటీ స్పష్టం చేస్తుంది. ఏదిఏమైనా పాయల్ ను అభిమానులు ఏవిధంగా కోరుకుంటారో అలా చేయడానికి తాను రెడీ అని బోల్డ్ గా చెబుతోంది. ఆమె మాటలు దర్మక, నిర్మాతలకు చేరాయో లేదోగానీ, పాయల్ అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు.