Home Blog Page 85

ఉద్యోగం కోసం భార్య దుబాయ్ వెళ్తే.. భర్త మరో దుకాణం తెరిచాడు.. ఇలా దొరికాడు

Tamil Nadu Marriage Dispute
Tamil Nadu Marriage Dispute

Tamil Nadu Marriage Dispute: కట్టుకున్న వాడిని ఆమె పూర్తిగా నమ్మింది. ఉద్యోగం వస్తే దుబాయ్ వెళ్ళింది. అతనితో నిత్యం మాట్లాడుతూనే ఉండేది. తన గురించి ఎప్పటికప్పుడు చెబుతూనే ఉండేది. కానీ ఇటీవల కాలంలో భర్త ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. అతడు సరిగ్గా మాట్లాడటం లేదు. ఫోన్ చేసిన సరే ఎత్తడం లేదు. కొన్ని సందర్భాలలో బిజీ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు అనుమానం వచ్చింది. ఆ తర్వాత ఇండియాకు వచ్చింది. ఆమె అనుమానం చివరికి నిజమైంది. ఆమె కళ్ళతో చూసిన దృశ్యాలతో గుండె బద్దలైపోయింది. దీంతో భర్తను పూర్తి ఆధారాలతో పట్టుకోవాలని డిసైడ్ అయింది. మరో మాటకు తావు లేకుండా దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చేసింది. నేరుగా చెన్నై వెళ్ళిపోయింది. చెన్నైలోని ఒక ప్రైవేటు హోటల్లో రూమ్ తీసుకుంది. ఆ తర్వాత భర్త కదలికలను నిత్యం గమనించడం మొదలుపెట్టింది.

అది తమిళనాడు రాష్ట్రం కడలూరు ప్రాంతం. ఇక్కడ అభినయ అనే ఒక యువతి ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగ రావడంతో దుబాయ్ వెళ్లిపోయింది. ఈమెకు గతంలోనే వివాహం జరిగింది. ఆమె భర్త పేరు ఆరుళ్ ప్రసాద్.. ఇతడు వెస్ట్ మాంబళం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఉంటాడు. ఇది చెన్నైకి దగ్గరగా ఉండే ప్రాంతం.. అభినయ దుబాయ్ వెళ్లిపోవడంతో ప్రసాద్ మరో దుకాణం తెరిచాడు. మరొక మహిళతో సంబంధం మొదలుపెట్టాడు. సరిగ్గా కొద్ది నెలల క్రితం చెన్నై వచ్చింది అభినయ. భర్త వ్యవహారం తెలిసింది. అతడు గొడవ పడింది.

భర్త వ్యవహారం తెలిసిన ఆమె ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది.. వాటిని తన మొబైల్ ఫోన్ కు కనెక్ట్ చేసింది. అనంతరం దుబాయ్ వెళ్లిపోయింది. మళ్లీ కొద్దిరోజుల తర్వాత చెన్నై వచ్చింది. ఒక ప్రైవేటు హోటల్లో రూమ్ తీసుకొని ఉంది. ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు రికార్డులను మొత్తం చూసింది. ప్రసాద్ ఒక మహిళను ఇంటికి తీసుకొచ్చినట్టు ఆ వీడియోలో ఆమె గుర్తించింది. మరో మాటకు తావు లేకుండా వెంటనే ఇంటికి వెళ్లిపోయింది. ఆమె రాగానే భర్త వెళ్లిపోయాడు. దీంతో అభినయ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన మొబైల్లో ఉన్న ఆధారాలను పోలీసులకు చూపించింది.

16 గోల్స్.. మెస్సి అంటేనే ఓ మాయ..ఫిఫా లో సరికొత్త రికార్డు

Lionel Messi FIFA Record
Lionel Messi FIFA Record

Lionel Messi FIFA Record: ఫుట్బాల్ చరిత్రలో మెస్సికి ప్రత్యేకమైన అధ్యాయాలు ఉంటాయి. ఎందుకంటే అతడి గేమ్ ప్లాన్ అలా ఉంటుంది. బంతిని ఎలాగైనా గోల్ పోస్టులోకి పంపిస్తుంటాడు. మైదానంలో పాదరసం మాదిరిగా కదులుతూ ఉంటాడు. బంతిని చాకచక్యంగా తప్పిస్తూ ఉంటాడు. ప్రత్యర్థులకు చిక్కకుండా.. వారి వ్యూహాలకు దొరకకుండా గోల్స్ చేస్తూ ఉంటాడు. అందువల్లే అతడిని గోట్ అని పిలుస్తుంటారు.

ప్రస్తుత ఫిఫా కప్ లో కూడా మెస్సి అదరగొడుతున్నాడు. అర్జెంటీనా జట్టు తరుపున సంచలనాలు సృష్టిస్తున్నాడు.. తాజాగా టెక్సాస్ లోని డాలస్ స్టేడియంలో ఆస్ట్రియా జట్టు జరిగిన మ్యాచ్లో అర్జెంటీనా అద్భుతమైన విజయం అందుకుంది. రెండు గోల్స్ తేడాతో విక్టరీ సాధించింది. ఈ రెండు గోల్స్ కూడా అర్జెంటీనా ఆటగాడు మెస్సి నుంచి వచ్చాయి. అతడు బిగినింగ్ నుంచి చివరి వరకు ఒకటే టెంపోలో ఆడాడు. బంతిని ఎక్కువ శాతం తన వద్ద ఉంచుకున్నాడు. రకరకాల విన్యాసాలు చేస్తూ ఆస్ట్రియా ప్లేయర్లకు చుక్కలు చూపించాడు.

ఆస్ట్రియా మీద రెండు గోల్స్ చేయడం ద్వారా మెస్సి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ (19) సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఆస్ట్రియాతో జరిగిన మ్యాచ్లో 38వ నిమిషంలో గోల్ చేసి.. సరికొత్త రికార్డును తన పేరు మీద సృష్టించుకున్నాడు. తద్వారా జర్మనీ ఆటగాడు క్లోస్(16) రికార్డును అధిగమించాడు. ఆ తర్వాత మరొక గోల్ కూడా చేసి మెస్సి సరికొత్త చరిత్ర తన పేరు మీద రాసుకున్నాడు. ఫిఫా టోర్నీలలో వరుసగా ఆరు మ్యాచ్లలో గోల్స్ సాధించిన మూడవ ఆటగాడిగా మెస్సి ఘనత సొంతం చేసుకున్నాడు.

మెస్సి కంటే ముందు ఫ్రాన్స్ ఆటగాడు ఫాంటైన్, బ్రెజిల్ ఆటగాడు జైర్ ఈ ఘనత సృష్టించారు. మెస్సి ప్రస్తుత వరల్డ్ కప్ లో తిరుగులేని ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అతడు సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అర్జెంటీనా జట్టులో మిగతా ప్లేయర్లు కేవలం ప్రేక్షక పాత్ర పరిమితమవుతుంటే.. మెస్సి మాత్రం మెస్మరైజ్ చేస్తున్నాడు.. యంగ్ ప్లేయర్లు కూడా అసూయ పడేవిధంగా గోల్స్ చేస్తూ సత్తా చాటుతున్నాడు.

ఈ ఐదు రాశుల వారికి ఈరోజు శుభయోగం..

Today 23 June 2026 Horoscope
Today 23 June 2026 Horoscope

Today 23 June 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై హస్త నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకోకుండా ఈరోజు ధన లాభం ఉండే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. దీంతో పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు అధికారుల మద్దతుతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల కొన్ని పనులను సులభంగా పూర్తి చేయగలుగుతారు. పెద్దల ఆశీస్సులతో కొత్తగా పెట్టుబడులు పెడతారు. ఇంటికి సంబంధించిన వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈ రోజు సమాజంలో గౌరవం పొందుతారు. అప్పుల నుంచి బయటపడేందుకు మార్గం ఏర్పడుతుంది. వ్యాపారులు గతంలో కంటే ఇప్పుడు మెరుగైన లాభాలు పొందుతారు. కొన్ని విజయాలు సాధించాలంటే కష్టాల నుంచి బయట పడాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే గురువుల మద్దతు ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు కుటుంబ జీవితాన్ని సంతోషంగా గడుపుతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అవసరమైన వనరులు అందడంతో ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. రాజకీయాల్లో ఉండే వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : కొన్ని అదనపు బాధ్యతల కారణంగా ఉద్యోగులు బిజీగా మారుతారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులు ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు పొందుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. ఉద్యోగులు అధికారుల మద్దతు ఉండడంతో పదోన్నతులు పొందుతారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. పెద్దల అండదండలు ఉండడంతో వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. అయితే గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఆశించిన లాభాలు రాకపోవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు కొన్ని పనుల నిమిత్తం అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సివస్తుంది. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. దూరపు బంధువుల నుంచి అవసరానికి డబ్బు అందుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు సమస్యల నుంచి బయటపడతారు. స్నేహితుల సహకారంతో అప్పులు తీరే అవకాశం ఏర్పడుతుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాల వల్ల వ్యాపారులు మెరుగైన లాభాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగులకు అవసరమైన వనరులు అందుతాయి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారులు గతంలో కంటే ఇప్పుడు అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అవసరమైన వనరులు అందడంతో ప్రాజెక్ట్లను పూర్తి చేస్తారు. స్నేహితుల సహకారంతో అప్పుల నుంచి బయటపడతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో రాణించాలంటే గురువుల మద్దతు ఉండాలి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల పాల్గొంటే విజయం సాధిస్తారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు రాజకీయాల్లో రాణిస్తారు. శక్తి సమాచారం మేరకు అనుకున్న పనులను పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని విజయాలే ఉంటాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు ఉంటాయి. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండాలి.

బాలయ్య ఇమేజ్ ను పెర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసిన దర్శకులు వీళ్లేనా..?

Balayya Koratala Shiva Film
Balayya Koratala Shiva Film

Balakrishna blockbuster films : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణకు చాలా మంచి ఇమేజ్ అయితే ఉంది. వాళ్ళు చేసిన ప్రతి సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరించింది. మాస్ లో విపరీతమైన క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్న నటుడు కూడా తనే కావడం విశేషం… చిరంజీవికి పోటీని ఇస్తూ ఎప్పటికప్పుడు తను కొత్త పంథాలో సినిమాలను చేసుకుంటూ వచ్చిన ఘనత కూడా బాలయ్య బాబుకి దక్కుతుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ ఏజ్ లో కూడా ఆయన డిఫరెంట్ సబ్జెక్టులతో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం అనేది నిజంగా చాలా గొప్ప విషయామనే చెప్పాలి.

ఇక ఇప్పటివరకు బాలయ్య బాబు ఇమేజ్ ను పర్ఫెక్ట్ గా వాడుకొని అద్భుతమైన సినిమాలను చిత్రీకరించిన వాళ్ళలో బి.గోపాల్ మొదటి స్థానంలో ఉంటాడు. పర్ఫెక్ట్ గా బాలయ్య ఇమేజ్ ను వాడుకొని భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందించాడు. ఆయన చేసిన సినిమాల్లో లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి సినిమాలు ఉండడం విశేషం…

ఇక బోయపాటి శ్రీను సైతం బాలయ్య ఇమేజ్ ను చాలా పర్ఫెక్ట్ గా వాడుకున్నాడు. సింహ, లెజెండ్, అఖండ లాంటి మూడు వరుస బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందించాడు… ఇక వీళ్ళు మాత్రమే బాలయ్య ఇమేజ్ ను చాలా పర్ఫెక్ట్ గా వాడుకున్నారు. ఇక మిగిలిన దర్శకులు ఒకటి రెండు సినిమాలతో సక్సెస్ లను సాధించి పెట్టినప్పటికి ఆయన పూర్తి ఇమేజ్ ను వాడుకున్న ఘనత మాత్రం బి గోపాల్, బోయపాటి శ్రీను లకు మాత్రం దక్కుతుంది.

ఇక రాబోయే రోజుల్లో వీళ్ళ లాగానే బాలయ్య బాబు ఇమేజ్ ను పర్ఫెక్ట్ గా డీల్ చేయగలిగిన దర్శకులు ఎవరైనా దొరుకుతారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వీరసింహారెడ్డి అనే సినిమా వచ్చింది. ఆ సినిమా భారీ విజయాన్ని సాధించింది…

అల్లు అర్జున్ - లోకేష్ కనకరాజ్ కాంబోలో చేయబోతున్న మూవీ రెండు పార్టులుగా రాబోతోందా..?

Allu Arjun Lokesh Kanagaraj
Allu Arjun Lokesh Kanagaraj

Allu Arjun Lokesh Kanagaraj movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కి చాలా మంచి క్రేజ్ ఉంది. ఆయనతో పాటు పోటీ పడే హీరోలు ఇండస్ట్రీలో ఎవరూ లేరు. సినిమా సినిమాకి తన రేంజ్ పెంచుకుంటూ పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేయడమే కాకుండా బాహుబలి 2 రికార్డ్స్ ను సైతం బ్రేక్ చేసిన ఘనత తనకే దక్కుతుంది. అలాంటి అల్లు అర్జున్ ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో ఇంకాస్త స్పెషల్ కేర్ ని తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది… అట్లీ డైరెక్షన్లో చేస్తున్న సినిమా పూర్తయిన వెంటనే ఆయన లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడనే విషయం మనందరికి తెలిసిందే. ఇక ఆఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అయితే ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కించబోతున్నారనే వార్తలైతే వస్తున్నాయి.

ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన 2 పార్టుల కథలను రెడీ చేశారట. ఇక అల్లు అర్జున్ సైతం ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రెండు పార్ట్ లలో కూడా చాలా వాల్యుబుల్ కథని చెప్పబోతున్నాం అనే ఒక దృఢ సంకల్పంతో అల్లు అర్జున్ అయితే ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాలోని కథ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందా? లోకేష్ కనకరాజు ఇప్పటివరకు చేసిన కథలను మించి ఈ సినిమా కథ ఉండబోతుందా? అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఇంతకుముందు అల్లు అర్జున్ ఆర్య ఆర్య 2, పుష్ప పుష్ప 2 లాంటి సిక్వెల్స్ తో ఉన్న రెండు సినిమాల్లో నటించాడు. ఇక ఇప్పుడు మూడోసారి అదే స్టైల్ ని రిపీట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. లోకేష్ కనకరాజ్ మేకింగ్ లో చాలా అద్భుతాలు సృష్టిస్తాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల్లో మేకింగ్ చాలా అద్భుతంగా ఉంటుందనే విషయం మనందరికి తెలిసిందే.

మరి ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా కోసం సరికొత్త మేకింగ్ విధానాన్ని అలవర్చుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రేక్షకులను సైతం కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతున్నారట… లోకేష్ అల్లు అర్జున్ కి సూపర్ హిట్ అందిస్తే మాత్రం ఆయన ఇండియాలోనే టాప్ డైరెక్టర్ అవుతాడు…

'బిగ్ బాస్ 9' ఫేమ్ దివ్వెల మాధురి ని ఈడ్చుకెళ్ళిన పోలీసులు.. సంచలనం రేపుతున్న వీడియో..

Duvvada Madhuri

Duvvada Madhuri : తెలుగు రాష్ట్ర ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు దివ్వెల మాధురి అలియాస్ దువ్వాడ మాధురి. ఈమె సినీ నటి కాకపోయినా , పాపులర్ వైసీపీ నాయకుడికి ప్రేయసి కావడం తో , ఈమె పేరు సోషల్ మీడియా లో , మెయిన్ ఎలక్ట్రానిక్ మీడియా లో మారుమోగిపోయింది. అలా వచ్చిన ఫేమ్ తో ఈమెకు గత ఏడాది ‘బిగ్ బాస్ 9’ లో వైల్డ్ కార్డు ఎంట్రీ గా హౌస్ లోపలకు అడుగుపెట్టే అవకాశం కలిగింది. హౌస్ లోకి ఎంట్రీ ఇచినప్పటి నుండి , ఎలిమినేట్ అయ్యే వరకు ఒక ఫైర్ బ్రాండ్ గా ఈమె ఇచ్చిన కంటెంట్ వేరే లెవెల్ అనే చెప్పాలి. ఉన్నది తక్కువ రోజులే అయినప్పటికీ, తన మార్క్ ని ఆడియన్స్ లో బలంగా వేయడంలో సక్సెస్ అయ్యింది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఈమె తన భర్త దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూస్ కూడా బాగా వైరల్ అయ్యాయి.

అయితే నేడు ఆమె పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి , తన భర్త కోసం పోరాటం చేయడం , పోలీసులు ఆమెని ఈడ్చుకొని వెళ్లడం , అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే గతంలో దువ్వాడ శ్రీనివాస్ ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసాడు. అందుకు జనసేన పార్టీ కార్యకర్తల నుండి కూడా చాలా బలమైన కౌంటర్ అటాక్ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనపై పవన్ కళ్యాణ్ అభిమానులు , మరియు కార్యకర్తలు కేసులు కూడా నమోదు చేశారు. అధికారం లోకి వచ్చిన తర్వాత దువ్వాడ శ్రీనివాస్ కచ్చితంగా పరిణామాలను ఎదురుకోవాల్సి ఉంటుందనే సంకేతాలు బలంగా కనిపించాయి.

అయితే నేడు ఈ కేసు విచారణ నిమిత్తం , దువ్వాడ శ్రీనివాస్ ని పోలీసులు తీసుకెళ్లారు. దీనిపై దివ్వెల మాధురి ఫైర్ అయ్యింది. రాష్ట్రము లో ఎన్నో అన్యాయాలు , హత్యలు , అక్రమాలు జరుగుతున్నాయి , వాళ్ళని ఏమో వదిలేస్తున్నారు , ఎప్పుడో రెండేళ్ల క్రితం నా భర్త పవన్ కళ్యాణ్ ని అన్న మాటలను పట్టుకొని ఇప్పుడు విచారిస్తున్నారు , ఇదెక్కడి న్యాయం అంటూ ఆమె పోలీస్ స్టేషన్ బయట బైఠాయించి ధర్నా చేసింది. ఆమెతో పాటు భారీ ఎత్తున దువ్వాడ శ్రీనివాస్ అనుచరులు పోలీస్ స్టేషన్ వద్దకు రావడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు ఆమెని ఈడ్చుకొని వెళ్లాల్సి వచ్చింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

సీఎం విజయ్ పుట్టినరోజు ని పట్టించుకోని త్రిష.. ఫ్యాన్స్ కి ఊహించని ట్విస్ట్..

Trisha request rejected by Vijay
Trisha request rejected by Vijay

Vijay birthday  Trisha Krishnan : గత కొంతకాలం గా తెలుగు , తమిళ మీడియా లో తమిళనాడు సీఎం విజయ్ , హీరోయిన్ త్రిష జంటపై సోషల్ మీడియా లో ఎలాంటి ప్రచారం జరిగిందో మనమంతా చూశాము. తమిళనాడు రాష్ట్రానికి విజయ్ ముఖ్యమంత్రి అయ్యినప్పుడు ఆయన పేరు నేషనల్ లెవెల్ లో ఏ రేంజ్ లో ట్రెండ్ అయ్యిందో , హీరోయిన్ త్రిష పేరు కూడా అదే రేంజ్ లో ట్రెండ్ అయ్యింది. ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే ఇంటికి వెళ్లి మరీ శుభాకాంక్షలు తెలియజేయడం, ప్రమాణస్వీకారానికి హాజరవ్వడం, అంతే కాకుండా రెండు మూడు సందర్భాల్లో ఇద్దరు కలిసి ఒకే ఈవెంట్ కి వెళ్లడం వంటివి చాలానే జరిగాయి. అంటే మేమిద్దరం లివింగ్ రిలేషన్ లోనే ఉన్నామని జనాలకు చెప్పకనే చెప్తున్నారు. అయితే నేడు విజయ్ పుట్టిన రోజు అనే విషయం అందరికీ తెలిసిందే.

ప్రతీ ఏడాది క్రమం తప్పకుండా విజయ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపే త్రిష , ఈసారి మాత్రం ఎలాంటి శుభాకాంక్షలు తెలియచేయకపోవడం ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ హాట్ టాపిక్ గా మారింది. అటు ఇన్ స్టాగ్రామ్ లోనూ , ఇటు ట్విట్టర్ లోనూ అభిమానులు త్రిష శుభాకాంక్షలు కోసం చాలా ఆతృతగా ఎదురు చూశారు , కానీ ఆమె నుండి మాత్రం ఒక్క పోస్ట్ కూడా పడలేదు. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ అంశం లో ఈమధ్య కాలం లో అత్యధికంగా త్రిష టార్గెట్ అవుతోంది , ఆమె పై ట్రోల్స్ విపరీతంగా పడుతున్నాయి, ఇప్పుడు విజయ్ కి శుభాకాంక్షలు చెప్తే ఇంకా ఎక్కువ టార్గెట్ చేస్తారు , అందుకే సైలెంట్ గా ఉందని విశ్లేషకులు అంటున్నారు . కానీ వాళ్ళు బహిరంగంగానే అనేక సందర్భాల్లో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు కదా, ఇప్పుడు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తే ఏమి అవుతుంది అని అంటున్నారు.

కచ్చితంగా వీళ్ళ మధ్య ఎదో అలజడి రేగిందని , విజయ్ తన భార్య సంగీత తో కలిసిపోబోతున్నాడు అనే వార్తల్లో నిజం ఉందని, అందుకే త్రిష విజయ్ కి దూరం గా జరిగిందంటూ సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతోంది. ఇందులో ఏది నిజం , ఏది అబద్దం అనేది పక్కన పెడితే, విజయ్ పుట్టినరోజు కి త్రిష నుండి శుభాకాంక్షలు రాకపోవడం మాత్రం , కచ్చితంగా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయమే. మరోపక్క విజయ్ వీరాభిమాని , ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా శుభాకాంక్షలు తెలియచెయ్యలేదు. ఈమెతో విజయ్ రిలేషన్ మైంటైన్ చేసేవాడని రూమర్స్ సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో ప్రచారం అయ్యాయో అందరికీ తెలిసిందే, మళ్లీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపితే ఎలాంటి నెగెటివిటీ వస్తుందో అని భయపడి ఆమె కూడా సైలెంట్ అయ్యినట్టు తెలుస్తోంది.

'కల్కి 2' లో జూనియర్ ఎన్టీఆర్.. ఏ పాత్రలో కనిపించబోతున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Jr NTR in Kalki 2

Kalki 2898 AD sequel : ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సీక్వెల్స్ లో అభిమానులతో పాటు , ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సీక్వెల్ ‘కల్కి 2’. చాలా సినిమాలకు సీక్వెల్స్ ప్రకటిస్తున్నారు కానీ , అసలు సీక్వెల్ అవసరమయ్యేంత సబ్జెక్టు ఉన్న సినిమా మాత్రం ‘కల్కి’ నే, అందులో ఎలాంటి సందేహం లేదు. కల్కి జనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్న సుప్రీమ్ యాస్కీన్ ఆటలను భైరవ , అశ్వద్దామా ఎలా అరికట్టించారు?, కల్కి జననానికి వాళ్ళు ఎలాంటి యుద్ధం చేశారు అనే అంశం పైనే ‘కల్కి 2’ తెరకెక్కబోతుంది. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ని మొదలు పెట్టి , రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేశారు. ఈ రెండు షెడ్యూల్స్ లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి వారు పాల్గొన్నారు.

సెప్టెంబర్ నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ చాలా ఫాస్ట్ గా జరుగుతుందని డైరెక్టర్ నాగ్ అశ్విన్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఇది కాసేపు పక్కన పెడితే, ఇప్పుడు సోషల్ మీడియా లో ఈ సినిమాకు సంబంధించి వినిపిస్తున్న వార్త , అభిమానులను సంబరాలు చేసుకునేలా చేస్తోంది. ఈ చిత్రం లో జూనియర్ ఎన్టీఆర్ ఒక చిన్న గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడని , ఆయన పాత్ర నందమూరి అభిమానులకు ఒక విజువల్ ఫీస్ట్ లాగా ఉంటుందని , జీవితాంతం ఆ పాత్రని గుర్తించుకుంటారని అంటున్నారు. అయితే కల్కి లో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించాల్సి వస్తే, అది కచ్చితంగా శ్రీ కృష్ణుడి పాత్ర నే అయ్యుంటాది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంచనా వేస్తున్నారు. నేటి తరం స్టార్ హీరోల్లో శ్రీకృష్ణుడి పాత్రకు ఎన్టీఆర్ , మహేష్ బాబు వంటి వారు మాత్రమే సూట్ అవుతారని, ఎన్టీఆర్ నటించబోతున్నాడు అంటున్నారు కాబట్టి కచ్చితంగా శ్రీకృష్ణుడి పాత్రనే అయ్యుంటుందని అంటున్నారు.

కల్కి చిత్రం శ్రీ కృష్ణుడి ముఖాన్ని చూపించకుండా దాచి పెట్టారు , అది కచ్చితంగా ఎన్టీఆర్ కోసమే అలా సర్ప్రైజ్ ఎలిమెంట్ లాగ ఉంచారని , ‘కల్కి 2’ లో మహాభారతం ఎపిసోడ్స్ 30 నిమిషాలకు పైగానే ఉంటుంది కాబట్టి , ఎన్టీఆర్ ని రీసెంట్ గానే నాగ్ అశ్విన్ కలిసి రిక్వెస్ట్ చేసాడని , అందుకు ఎన్టీఆర్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది.

అయితే తాజా ట్విస్ట్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ కృష్ణుడిగా కాదని.. పరుశురాముడి పాత్రలో నటిస్తారని సమాచారం. ‘కల్కి-2’ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ పరశురాముడి పాత్రలో కనిపించనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయన పాత్ర అతిథి పాత్ర (క్యామియో) మాత్రమేనని సమాచారం. కల్కి పురాణం ప్రకారం  విష్ణువు చివరి అవతారమైన శ్రీ కల్కికి యుద్ధ విద్యలు నేర్పించే గురువు పరశురాముడు. ఈ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తే సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశముందని అభిమానులు భావిస్తున్నారు. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సెప్టెంబర్ నెలలోనే దీనిపై స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరో కొత్త సినిమా ఒప్పుకున్న పవన్ కళ్యాణ్.. మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్.. డైరెక్టర్ ఎవరంటే..

Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan new movie : పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రస్తుతం ‘ఓజీ 2’ మేనియా లో మునిగి తేలుతున్నారు . రీసెంట్ గానే ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుందని అధికారిక ప్రకటన చేయడం తో , అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. సెప్టెంబర్ 2 న ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన చేసి, నవంబర్ నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ని మొదలుపెట్టే పనిలో ఉన్నారని, పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఈ చిత్రం ఒక ల్యాండ్ మార్క్ గా నిలిచిపోతుందని అంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయకపోవచ్చు , పూర్తి స్థాయి ఫోకస్ పాలనపై పెడతాడేమో అని అంతా అనుకున్నారు. కానీ ఆయన ఈ సినిమాతో పాటు మరో సినిమాని కూడా ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడట. ఈ చిత్రానికి మారుతీ దర్శకత్వం వహిస్తాడని టాక్.

రీసెంట్ గానే ‘రాజా సాబ్’ చిత్రం తో భారీ డిజాస్టర్ ఫ్లాప్ ని అందుకొని తీవ్రమైన ట్రోల్స్ ని ఎదురుకున్న ఆయన , రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ ని కలిసి ఒక కథ ని వినిపించాడని , అది ఆయనకు తెగ నచ్చేసిందని అంటున్నారు. ‘ఓజీ 2’ తో పాటు , సమాంతరంగా ఈ ప్రాజెక్ట్ ని కూడా ఆయన పట్టాలెక్కించబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ వ్యవహరించబోతున్నాడు అట. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇదే కనుక నిజమైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో అని విశ్లేషకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ ప్రస్తుతం ఇలాంటి కాంబినేషన్స్ ని తీసుకునే పరిస్థితి లో లేరు. ఉస్తాద్ భగత్ సింగ్ తోనే ఇలాంటి కాంబినేషన్స్ ని ఆదిరించడం ఆపేశారు.

అలాంటిది ఇప్పుడు మారుతీ లాంటి ఫార్మ్ లో లేని డైరెక్టర్ తో సినిమా చేస్తే , పవన్ ఫ్యాన్స్ రియాక్షన్ చాలా వైల్డ్ గా ఉండొచ్చు. అయితే సోషల్ మీడియా లో ఇలాంటి వార్తలు రోజుకి ఒకటి పుట్టుకొస్తూనే ఉంటాయని , పవన్ కళ్యాణ్ కచ్చితంగా ఇలాంటి డైరెక్టర్స్ తో ఇప్పుడు సినిమాలు తీయడని, ఇదంతా ఫేక్ న్యూస్ అని కొంతమంది అభిమానులు అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాలంటే , డైరెక్టర్ మారుతీ రెస్పాన్స్ ఇవ్వాల్సిందే.

'మా ఇంటి బంగారం' 3 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ట్రిపుల్ బ్లాక్ బస్టర్ దిశగా అడుగులు..

Maa Inti Bangaram 13 Days Collections
Maa Inti Bangaram 13 Days Collections

Maa Inti Bangaram collections : సమంత ప్రధాన పాత్ర పోషించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని , భారీ ఓపెనింగ్స్ ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. కేవలం రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కును అందుకొని లాభాల్లోకి అడుగుపెట్టిన ఈ సినిమా, మూడవ రోజుతో బ్లాక్ బస్టర్ హిట్ స్టేటస్ ని చేరుకుంది. ఊపు చూస్తుంటే ఫుల్ రన్ లో ఈ చిత్రం కచ్చితంగా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. మొదటి రోజు కంటే రెండవ రోజు ఎక్కువ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం , రెండవ రోజు కంటే మూడవ రోజు ఎక్కువ వసూళ్లను రాబట్టింది. దీంతో సంక్రాంతి సీజన్ తర్వాత అంతటి స్థాయి లాభాలను చూసిన ఏకైక చిత్రం గా ‘మా ఇంటి బంగారం’ నిల్చింది.

మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, 2 వ రోజున 3 కోట్ల 27 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి, ఇక మూడవ రోజున అయితే ఏకంగా 4 కోట్ల 6 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 9 కోట్ల 68 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 18 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి చూస్తే, నైజాం ప్రాంతం నుండి 5 కోట్ల 28 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఆంధ్ర ప్రదేశ్ నుండి 4 కోట్ల 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా తమిళ వెర్షన్ నుండి ఈ చిత్రానికి దాదాపుగా 1 కోటి రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 2 కోట్ల 40 లక్షలు , ఓవర్సీస్ నుండి 6 కోట్ల 60 లక్షలు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 19 కోట్ల 68 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, 39 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. విడుదలకు ముందు వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 12 కోట్ల రూపాయిలు కాగా, 7 కోట్ల 63 లక్షల రూపాయిల లాభాలు వచ్చాయి. ఫుల్ రన్ లో మరో 7 కోట్ల రూపాయిల లాభాలు తేలికగా రావొచ్చు , ఆ స్థాయిలో ఈ సినిమా థియేట్రికల్ రన్ కొనసాగుతోంది.

చెన్నై కోసం ప్రాణం పెట్టాను.. ధోని ఫోన్ కలవలేదు.. జడేజా గుండెలో ఇంతటి ఆవేదన

MS Dhoni And Ravindra Jadeja
MS Dhoni And Ravindra Jadeja

Ravindra Jadeja Chennai Super Kings : 2026 ఐపిఎల్ ప్రారంభంలో చెన్నై, రాజస్థాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో రాజస్థాన్ విజయం సాధించింది. ఆ విజయాన్ని రాజస్థాన్ ప్లేయర్లు ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేసుకున్నారు. వారందరి కంటే ఎక్కువగా సంతోష పడింది రవీంద్ర జడేజా. వాస్తవానికి అతడు ఆ స్థాయిలో సంబరాలు జరుపుకుంటాడని.. ఉత్సాహాన్ని ప్రదర్శిస్తాడని చెన్నై అభిమానులు కలలో కూడా ఊహించలేదు.

ఐపీఎల్ లో చెన్నై జట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. ఆ చెన్నై జట్టులో రవీంద్ర జడేజా కూడా అంతే స్థాయిలో ప్రత్యేక స్థానం ఉంది. అటువంటి రవీంద్ర జడేజా 2026 ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ జట్టుకు వెళ్లిపోతాడని.. అతడి స్థానంలో సంజు శాంసన్ వస్తాడని ఎవరూ ఊహించలేదు. కనీసం కలలో కూడా అంచనా వేయలేదు. రవీంద్ర జడేజా రాజస్థాన్ జట్టు తరుపున మెరుగైన ప్రదర్శన చేశాడు. దానికంటే ముందు చెన్నై జట్టు తరుపున ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడాడు. అటువంటి రవీంద్ర జడేజాను మేనేజ్మెంట్ ఎందుకు పక్కన పెట్టింది అనేది ఇప్పటికి క్లారిటీ లేదు.

నాడు చెన్నై జట్టు తనను రాజస్థాన్ జట్టుకు పంపించే విషయం చివరి నిమిషం వరకు చెప్పలేదని రవీంద్ర జడేజా పేర్కొన్నాడు. ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా చేసిన వ్యాఖ్యలు కంట నీరు తెప్పిస్తున్నాయి. ఎందుకంటే చెన్నై జట్టుతో అతడికి బలమైన సంబంధం ఉంది. ధోనితో సోదరుడి కంటే ఎక్కువ అనుబంధం ఉంది. ఇన్ని ఉన్నప్పటికీ చెన్నై మేనేజ్మెంట్ అతడిని పక్కన పెట్టడం.. రాజస్థాన్ జట్టుకు పంపించడం ఏమాత్రం అతడికి నచ్చలేదు. చివరి నిమిషంలో చెప్పడంతో.. మేనేజ్మెంట్తో మాట్లాడేందుకు అతడు ప్రయత్నించాడు. మేనేజ్మెంట్ వినిపించుకోలేదు. మహేంద్ర సింగ్ ధోనీకి చెప్పాలని ఫోన్ చేశాడు. అతడి ఫోన్ కలవలేదు. దీంతో బాధాకరమైన హృదయంతోనే అతడు రాజస్థాన్ జట్టుకు వెళ్లిపోయాడు.

రాజస్థాన్ జట్టుకు వెళ్లిపోయిన తర్వాత కొద్ది రోజుల వరకు జడేజా ఇబ్బంది పడ్డాడు. ఎందుకంటే చెన్నై జట్టుతో అతడికి ఉన్న జ్ఞాపకాలు అటువంటివి. కొద్దిరోజుల వరకు మనసులో కలత ఉంది. ఆ తర్వాత క్రమక్రమంగా కుదుటపడ్డాడు. రాజస్థాన్ జట్టుకు ట్యూన్ అయ్యాడు. ఐపీఎల్ అనేది కమర్షియల్ గేమ్. ఇందులో సెంటిమెంట్లకు అవకాశం లేదు. బలమైన బంధాలకు ఆస్కారం లేదు. కానీ కొంతమంది ప్లేయర్లు దీనిని కమర్షియల్ గా చూడరు. ఆటలాగానే చూస్తారు. అనుబంధాలు పెంచుకుంటారు. వాటిని తుంచేస్తే ఇదిగో ఇలానే బాధపడుతుంటారు. అచ్చం రవీంద్ర జడేజాలాగా.

అనిల్ రావిపూడి కొత్త సినిమా కోసం కళ్యాణ్ రామ్ కి ఆ కండిషన్ పెట్టాడా..?

Anil Ravipudi Kalyan Ram movie

Anil Ravipudi Kalyan Ram movie : కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన దర్శకుడు అనిల్ రావిపూడి…ఇక ఆయన ఏది చేసినా కూడా పెను సంచలనంగా మారుతుంది. ఈ మధ్యకాలంలో ఆయనకు చాలా మంచి గిరాకీ పెరిగింది. ఇక ఇప్పటికే ఈ సంవత్సరం చిరంజీవితో చేసిన ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇక ఇప్పుడు వెంకటేష్ – కళ్యాణ్ రామ్ లను హీరోలుగా పెట్టి ఆయన ఒక కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. ఈ సినిమా 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు…ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా రాని గుర్తింపు అనిల్ రావిపూడి సినిమాతో తెచ్చుకోబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు…

ఇక వరుసగా తన ఖాతాలో పదో విజయాన్ని కూడా అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే అనిల్ రావిపూడి పటాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి అతనితోనే సినిమా చేస్తున్నాడు. ఇక దీనికోసం అనిల్ రావిపూడి కళ్యాణ్ రామ్ కు ఒక కండిషన్ అయితే పెట్టాడట.

ఈ సినిమా పూర్తి అయ్యేంతవరకు తను వేరే సినిమా ఏది చేయకూడదని ఆరు నెలల వరకు ఈ సినిమా కోసమే తన డేట్స్ మొత్తం కేటాయించాలని చెప్పారట. ఎందుకంటే ఈ సినిమా కోసం తనకు కొత్త మెకోవర్ అయితే ఇవ్వబోతున్నాడట. అలాగే ఈ మూవీ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. కాబట్టి కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండబోతుందట. అలాగే తను రాయలసీమ యాస లో మాట్లాడబోతున్నాడట.

ఇక దానికోసం ఆయన స్పెషల్ కేర్ తీసుకొని మరి రాయలసీమ యాస నేర్చుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే తనకు ఒక ట్రైనర్ ని పెట్టి రాయలసీమ యాసను నేర్పించే పనిలో అనిల్ రావిపూడి బిజీగా ఉన్నాడట… ఇక ఈ సినిమాతో మరో సక్సెస్ ని సాధించి కళ్యాణ్ రామ్ మార్కెట్ లోకి రాబోతున్నాడు అనేది చాలా క్లారిటిగా తెలుస్తుంది…

'పెద్ది' 18 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. నార్త్ అమెరికా లో 'అజ్ఞాతవాసి'ని మించిన డిజాస్టర్..

Peddi Movie Collections
Peddi Movie Collections

Peddi 18 days collection : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం మరో భారీ మైల్ స్టోన్ ని దాటింది. 18 రోజుల థియేట్రికల్ రన్ లో ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి 200 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. దీంతో రామ్ చరణ్ ఏకంగా 200 కోట్ల షేర్ క్లబ్ లోకి సోలో హీరో గా అడుగుపెట్టింది. దీంతో మన టాలీవుడ్ లో రెండు సార్లు 200 కోట్ల షేర్ క్లబ్ లోకి అడుగుపెట్టిన మూడవ హీరో గా రామ్ చరణ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒక పక్క సమంత ‘మా ఇంటి బంగారం’ ఫ్రెష్ గా విడుదలై , బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్నప్పటికీ కూడా ‘పెద్ది’ వసూళ్లపై ఎలాంటి ప్రభావం చూపించలేదు.

ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఈ చిత్రానికి 18 వ రోజున 1 కోటి 51 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను తెలుగు రాష్ట్రాల నుండి రాబట్టింది. అంతా బాగానే ఉంది కానీ , నార్త్ అమెరికా లో మాత్రం ఈ చిత్రం డబుల్ డిజాస్టర్ గా నిల్చింది. కేవలం నార్త్ అమెరికా ఒక్కటే కాదు , ఓవర్సీస్ మొత్తం కూడా ఇదే పరిస్థితి. 10 మిలియన్ డాలర్లకు ఈ సినిమాని కొంటే , కనీసం 5 మిలియన్ డాలర్ల గ్రాస్ కూడా రాలేదు. బయ్యర్ కి ఒకప్పుడు అజ్ఞాతవాసితో ఏ రేంజ్ నష్టం వచ్చిందో , మళ్లీ ఇన్నేళ్లకు అదే రేంజ్ నష్టం వచ్చిందని అంటున్నారు. ఇక ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే , ఒక నైజాం ప్రాంతం నుండే ఈ చిత్రానికి 18 రోజుల్లో 54 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా సీడెడ్ లో 21 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టిందో.

ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే ఉత్తరాంధ్ర నుండి 22 కోట్ల 66 లక్షలు రాబట్టిన ఈ చిత్రణకి తూపు గోదావరి నుండి 12 కోట్ల 76 లక్షలు , పశ్చిమ గోదావరి నుండి 9 కోట్లు , గుంటూరు జిల్లా నుండి 12 కోట్ల 50 లక్షలు, కృష్ణ నుండి 10 కోట్ల 10 లక్షలు , నెల్లూరు నుండి 5 కోట్ల 78 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అలాగే కర్ణాటక నుండి 15 కోట్ల 20 లక్షలు , తమిళ నాడు + కేరళ నుండి 2 కోట్ల 40 లక్షలు , హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 12 కోట్ల 10 లక్షలు, ఓవర్సీస్ నుండి 23 కోట్ల 40 లక్షలు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 200 కోట్ల 76 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 341 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఈనాడులో రామోజీరావు క్రెడిట్ చోరీ.. ఆయనకు నచ్చలేదు.. ఆ తర్వాత తెలుగు ప్రింట్ మీడియాలో ఏం జరిగింది..

Ramoji Rao Eenadu history

Ramoji Rao Eenadu history : రామోజీరావు.. తెలుగు మీడియా మొగల్ అని చాలామంది చెబుతుంటారు. తిట్టే వాళ్లు తిడుతుంటారు. మెచ్చుకునే వాళ్ళు మెచ్చుకుంటారు. తమకు జర్నలిజం విలువలు నేర్పారని.. తమకు బతుకునిచ్చారని ఈనాడులో పనిచేస్తున్న వారు అంటుంటారు. ఆయన పని రాక్షసుడని.. డబ్బు తప్ప దేనిని ప్రేమించరని.. ప్రతి దానిని వ్యాపార కోణంలో చూస్తుంటారని రామోజీరావు నచ్చని వారు అంటుంటారు.

రామోజీరావు ఇప్పుడు జీవించిలేరు. ఉన్నన్ని రోజులు తెల్లటి దుస్తులతో మెరిసిపోయేవారు. తన ఈనాడును చూసుకుంటూ మురిసిపోయేవారు. రామోజీరావు చివరి దశలో మినహా.. మిగతా కాలం మొత్తం చీఫ్ ఎడిటర్ గా ఆయన పేరు మాత్రమే ఉండేది. అయితే అంతకుముందు చీఫ్ ఎడిటర్ గా రామోజీరావు ఉండేవారు కాదట. రామోజీరావు ఈనాడు పత్రికను ప్రారంభించిన తొలి రోజుల్లో ఏబీకే ప్రసాద్ ఎడిటర్ గా ఉండేవారు.

ఏబీకే ప్రసాద్ కు క్షేత్రస్థాయి పరిస్థితులపై స్పష్టమైన అవగాహన ఉంటుంది. అందువల్లే ప్రతి వార్త విషయంలో ఆయన జాగ్రత్తలు తీసుకునేవారు. ఈనాడు అనతి కాలంలోనే ఆస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రధాన కారణం ఏ బి కే ప్రసాద్.. ఏబీకే ప్రసాద్ ఆధ్వర్యంలో ఈనాడు విజయవంతంగా నడుస్తున్న సమయంలో రామోజీరావుకు.. ఒక ఆశ పుట్టింది. చీఫ్ ఎడిటర్ గా తన పేరును వేసుకోవాలని అనుకున్నారు. పైగా ఈనాడు తన పత్రిక.. తన ఇష్టం. ఏ బి కేకు చెప్పాల్సిన అవసరం లేదనుకున్నారు. మరుసటి రోజు చీఫ్ ఎడిటర్ గా తన పేరు వేసుకోవడం మొదలుపెట్టారు. ఇది ఏబీకే ప్రసాద్ కు నచ్చలేదు. ఆ తర్వాత ఈనాడు నుంచి బయటికి వచ్చారు. రామోజీరావు క్రెడిట్ చోరీ ని చూస్తూ ఉండలేక మొహమాటం లేకుండా ఈనాడు కాంపౌండ్ నుంచి బయటికి వచ్చేసారు.

బయటికి వచ్చిన తర్వాత ఆంధ్రజ్యోతి హైదరాబాద్ ఎడిషన్ రూపకల్పనలో ఏబికే కృషి మామూలుది కాదు. నాటి రోజుల్లోనే ఆయన కలర్లో ఆంధ్రజ్యోతి హైదరాబాద్ ఎడిషన్ ను తీసుకొచ్చారు. అదే కాదు దాసరి నారాయణరావు ఉదయం పత్రికకు తొలి ఎడిటర్ గా కూడా ఏబీకే ప్రసాద్ పనిచేశారు.. నాడు ఉదయం పత్రికకు భిన్నమైన ట్యాగ్ లైన్ రూపొందించారు ఏబీకే. ప్రపంచంలో అందరికీ ఉదయం ఒక్కటే.. తెలుగు వాళ్లకు రెండు ఉదయాలు అనే ట్యాగ్ లైన్ రచించారు.

ఉదయం నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆంధ్రభూమిలో ఆయన పని చేశారు. సొంతంగా పత్రిక ఏర్పాటు చేయాలని వార్త పేరుతో రిజిస్టర్ చేయించారు.. అయితే నాడు గిరీష్ సంగి కంపెనీలకు సంబంధించిన ఒక ప్రైవేట్ రోడ్డు మూతపడింది. ఆ పోరాటానికి బిజెపి నేత ఇంద్రసేనారెడ్డి కర్త కర్మ క్రియ లాగా వ్యవహరించారు. నాడు ఇంద్రసేనారెడ్డి పోరాటాన్ని ఈనాడు గొప్పగా రాసింది. దీంతో గిరీష్ సంఘీకి తనకంటూ ఒక మీడియా కావాలి అనిపించింది.

అప్పట్లో హైదరాబాద్ లో నేషనల్ చెస్ ఛాంపియన్ పోటీ జరిగింది. దానికి గిరీష్ సంఘీ గ్రూప్ స్పాన్సర్ చేసింది. అయితే ఆ కంపెనీ పేరు రాయకుండా ఈనాడు వార్త రాసింది. ఇది గిరీష్ లో మరింత కోపాన్ని పెంచింది. ఆ తర్వాత ఆయన ఏబీకే ఆధ్వర్యంలో వార్తాపత్రికను తీసుకొచ్చారు. 1995లో ఈ పత్రిక తెలుగు ప్రింట్ మీడియాలో సంచలనం కలిగించింది. ఆ తర్వాత ఈనాడు.. వార్త మధ్య వైరం పెరిగిపోవడం.. వార్త యాజమాన్యానికి రకరకాల అవ లక్షణాలు ఉండడంతో.. క్రమంగా తన ప్రభను కోల్పోయింది. ఆంధ్రజ్యోతి మళ్ళీ రీ ఓపెన్ అయింది. ఈ లోగానే సాక్షి పుట్టింది. ఇక ఇప్పుడు ప్రింట్ మీడియా కొడిగట్టిన దీపం లాగా ఉంది..

గాయమైందా.. తప్పించారా.. హార్థిక్ పాండ్యా భవితవ్యం పై నీలి నీడలు..

Hardik Pandya
Hardik Pandya

Hardik Pandya Injury : కపిల్ దేవ్ లాగా సీమ్ బౌలింగ్ వేస్తుంటాడు.. బ్యాటింగ్ కూడా అదే విధంగా చేస్తుంటాడు. ఫీల్డింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇది హార్దిక్ పాండ్యా గురించి విశ్లేషకులు చెప్పే మాట. తనను తాను అనేక సందర్భాలలో నిరూపించుకున్నాడు. కీలకమైన దశలో.. క్లిష్టమైన సందర్భాలలో జట్టుకు ఆపద్బాంధవుడుగా నిలిచాడు. ఐపీఎల్ లో గుజరాత్ జట్టుకు ట్రోఫీని కూడా అందించాడు. ఈ స్థాయి ఖ్యాతిని సొంతం చేసుకున్న హార్దిక్ పాండ్యా ఇప్పుడు అవమానాలు ఎదుర్కొంటున్నాడు. విమర్శలు ఎదుర్కొంటున్నాడు. చివరికి జట్టులో కూడా స్థానాన్ని కోల్పోయి.. అనామక ఆటగాడిగా మిగులుతున్నాడు.

ఇంగ్లాండ్ జట్టుతో జరిగే వన్డే సిరీస్ కోసం మేనేజ్మెంట్ భారత జట్టును ఎంపిక చేసింది. ఇందులో హార్థిక్ పాండ్యాకు చోటు లభించలేదు. ఏమైందని విలేకరులు ప్రశ్నిస్తే సెలెక్టర్లు ఆశించిన స్థాయిలో సమాధానం చెప్పలేదు.. అతడికి గాయమైందా.. లేక కావాలని జటనుంచి తొలగించారా.. ఒక వన్డేలో అతడు కనీసం 10 ఓవర్లు కూడా బౌలింగ్ చేసే స్థితిలో లేడా.. అందువల్లే మేనేజ్మెంట్ పక్కన పెట్టిందా.. అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి..

హార్దిక్ పాండ్యా ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో చికిత్స పొందుతూనే ఉన్నాడు. ఐపీఎల్ తర్వాత జూన్ 2న అతడు బెంగళూరు వెళ్ళిపోయాడు. అప్పటినుంచి అతడు అక్కడే ఉంటున్నాడు. పెర్ఫార్మెన్స్ బ్లాక్ ప్రోగ్రాం లో అతడు శిక్షణ పొందుతున్నాడు. అతడి సొంత అభ్యర్థన మేరకే బీసీసీఐ శిక్షణ ఇస్తోందని తెలుస్తోంది. పెర్ఫామెన్స్ బ్లాక్ అనేది ఒక కేంద్రీకృత శిక్షణ. ఇందులో ఆటగాళ్లకు అత్యంత పకడ్బందీగా శిక్షణ ఇస్తుంటారు. ఎప్పటికప్పుడు కనిపెట్టుకొని ఉంటారు. బంతి వేసే విధానం.. బంతిని ఆపడానికి పరుగులు పెట్టే తీరు.. బంతిని కొట్టడానికి బ్యాట్ ఉపయోగించే పద్ధతి.. ఇవన్నీ అత్యంత సూక్ష్మంగా పరిశీలిస్తూ ఉంటారు.

హార్దిక్ పాండ్యాకు మొదట్లో వెన్ను నొప్పి ఉందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అతడు క్యాడ్రీ సెప్స్ కండరాల నొప్పితో బాధపడుతున్నాడని తెలియ వచ్చింది. దీంతో అతడు పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని పొందడానికి సమయం పడుతుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.. అయితే వీటిపై హార్దిక్ పాండ్యా ఇప్పటివరకు కూడా అధికారికంగా ప్రకటించలేదు.. అయితే జూన్ 9న హార్దిక్ పాండ్యా కాలులో స్వల్పకాలిక నొప్పి ఏర్పడింది. అప్పుడు అతడు దానిని స్కాన్ చేయించుకున్నాడు. పరీక్షించిన వైద్యులు అతడు పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని పొందడానికి నాలుగు నుంచి ఐదు రోజుల సమయం పడుతుంది అని అన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు మూడు వారాల పాటు చికిత్స పొందాలని సూచించారు.

మరోవైపు జూలై నెలాఖరు నాటికి పాండ్యా పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని సొంతం చేసుకుంటాడని వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో విరాట్ కోహ్లీని ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక చేయడం పట్ల అతని అభిమానులు సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కోహ్లీని ఏ ప్రమాణాల ప్రకారమైతే జట్టులోకి తీసుకున్నారో .. అవే ప్రమాణాలను హార్థిక్ పాండ్యా విషయంలో పాటించగలుగుతారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ హార్థిక్ పాండ్యా ఇప్పుడు ఒక రకమైన సంధి దశను ఎదుర్కొంటున్నాడు. దీనిని దాటి అతడు 2027 వన్డే వరల్డ్ కప్ లో చోటు సంపాదించగలడా.. సత్తా సాధించగలడా.. మునుపటి ఆల్రౌండర్ లాగా అతడు కనిపించగలడా.. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

#Mega158 మేకింగ్ వీడియో వచ్చేసింది.. 70 ఏళ్ళ వయస్సులో మెగాస్టార్ ఎనర్జీ చూస్తే మెంటలెక్కిపోతారు..

Mega158 making video

Chiranjeevi : ‘మన శంకర వరప్రసాద్ గారు ‘ వంటి సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ బాబీ తో కలిసి ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు అవ్వని ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ రీసెంట్ గానే మొదలైంది. మొదటి షెడ్యూల్ ని పొలాచ్చి లో గ్రాండ్ లెవెల్ లో షూట్ చేశారు. చిరంజీవి, ప్రకాష్ రాజ్, నివేత పెతు రాజ్, అనశ్వర రాజన్ లపై పలు కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. ఈ షెడ్యూల్ పూర్తివు అయ్యాక కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి , నేడు హైదరాబాద్ లో రెండవ షెడ్యూల్ ని మొదలు పెట్టారు. అలా జెట్ స్పీడ్ లో ఈ చిత్రాన్ని పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు డైరెక్టర్ బాబీ. ఎట్టిపరిస్థితిలోనూ వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని తీసుకొని రావాలని ప్లాన్.

ఇకపోతే నేడు డైరెక్టర్ బాబీ పొలాచ్చి షెడ్యూల్ కి సంబంధించిన మేకింగ్ వీడియో ని విడుదల చేశారు. ఈ వీడియో లో కొన్ని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ తో పాటుగా, కొన్ని కాలేజీ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఇందులో చిరంజీవి కి కూతురుగా అనశ్వర రాజన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమెపైన అత్యధిక సన్నివేశాలు చిత్రీకరించినట్టు ఈ మేకింగ్ వీడియో లో చూపించారు. ఇక చివర్లో చిరంజీవి కి సంబంధించిన కొన్ని షాట్స్ ని చూపించి ‘జీవించెసావు అన్నయ్య’ అని అంటాడు డైరెక్టర్ బాబీ. మేకింగ్ వీడియో చూస్తుంటే మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న ఇంటెన్స్ గ్యాంగ్ స్టర్ డ్రామా అని అనిపిస్తోంది. పర్ఫెక్ట్ గా డీల్ చేస్తే మరోసారి ఇండస్ట్రీ హిట్ ని మెగాస్టార్ అవలీలగా అందుకుంటాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గతం లో డైరెక్టర్ బాబీ , మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఎంత పెద్ద కమర్షియల్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.

ఆ సినిమాలో రవితేజ క్యారెక్టర్ మామూలు రేంజ్ లో క్లిక్ అవ్వలేదు. ఈ చిత్రం లో కూడా అలాంటి క్యారెక్టర్ ఒకటి డిజైన్ చేసాడట డైరెక్టర్ బాబీ. ఈ క్యారెక్టర్ లో మోహన్ లాల్ కానీ , బాలీవుడ్ సూపర్ స్టార్స్ లో ఒకరైన అనిల్ కపూర్ కానీ నటించే అవకాశం ఉందట. ఇకపోతే ఈ చిత్రంలో ఒక లేడీ విలన్ క్యారెక్టర్ కూడా ఉంటుందని , ఆ క్యారెక్టర్ కోసం డింపుల్ హయాతి ని ఎంచుకున్నారని అంటున్నారు. త్వరలోన్ ఈ చిత్రం లో నటించబోయే నటీనటులకు సంబంధించిన అప్డేట్స్ ని అధికారికంగా ప్రకటించబోతున్నారు మేకర్స్.

మమతా బెనర్జీ.. ఓడిపోయింది.. 900 కోట్ల దందా ఆగిపోయింది.. బంగ్లాదేశ్ కు ఈ చీకటి వ్యాపారానికి ఏంటి సంబంధం..

Mamata Banerjee
Mamata Banerjee

Bangladesh illegal immigration : నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్.. ఓ డైలాగ్ అంటాడు గుర్తుందా.. ఈ ప్రపంచంలో ప్రతి సంఘటనను నేచర్ డిసైడ్ చేస్తుందని.. ఎక్కడ వాలే సీతాకోకచిలుకలు.. మరెక్కడో కురిసే వర్షాన్ని ముందే చెప్పేస్తాయని.. సేమ్ అలాంటిదే ఇక్కడ కూడా జరిగింది. ఇది వర్షం కాదు.. సీతాకోకచిలుకలు అంతకంటే కాదు.. ఇది ముమ్మాటికి నల్లటి దందా. అక్షరాల 900 కోట్ల చీకటి వ్యాపారం. ఇన్నాళ్లు తెలుపు చీర కట్టుకొని.. దీదీ అంటూ ప్రశంసలు పొందిన బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసలు స్వరూపం.

900 కోట్లు.. ఇదేమి చిన్న స్థాయి డబ్బు కాదు. సిక్కిం రాష్ట్ర బడ్జెట్లో దాదాపు సింహభాగం. ఇంతటి డబ్బు కొన్ని సంవత్సరాలుగా దర్జాగా చేతులు మారింది. ఒక రకంగా చెప్పాలంటే బ్రహ్మాండంగా సరిహద్దులు దాటిపోయింది. బెంగాల్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ఉన్నంతకాలం ఈ చీకటి కోణానికి అడ్డు అనేది లేకుండా సాగిపోయింది. ఎప్పుడైతే ఇక్కడ బిజెపి గెలిచిందో అప్పుడే కథ మారింది. 900 కోట్ల నలుపు ధనం ఆగిపోయింది. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో మమత అసలు రంగు బయటపడుతోంది.

మనకు తెలుసు కదా పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉంటుందని.. ఇక్కడ సుమారు 1000 పాయింట్లు ఉంటాయి. ఈ పాయింట్ల ద్వారా బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోకి రోజుకు వందలమంది అక్రమ మార్గాలలో ప్రవేశించేవారు. బెంగాల్ ప్రజలు దీనిని ధూర్ పారాపార్ అని పిలుస్తుంటారు. దీనికి అర్థం సరిహద్దులు దాటించడం. ఈ సరిహద్దులు దాటించే విధానం కూడా ఇక్కడ మూడు రకాలుగా పనిచేస్తూ ఉంటుంది.

స్థానికంగా ఉండే అక్రమార్కులు.. వీరు బంగ్లాదేశ్ ప్రజలతో ముందుగానే ఒప్పందాలు చేసుకుంటారు. ఈ ఆక్రమార్కులు మొత్తం టిఎంసి పార్టీకి చెందిన వారై ఉంటారు. బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి రావాలనుకునే ఒక్కొక్కరి నుంచి 15 వేల టాకాల వరకు వసూలు చేస్తూ ఉంటారు. వారిని మన దేశ సరిహద్దు వరకు అత్యంత సురక్షితంగా తీసుకొస్తుంటారు.

పర్యవేక్షకులు

ఈ పర్యవేక్షకులు కూడా మమత పార్టీకే చెందిన వారే. వీరు బంగ్లాదేశ్ ప్రజలను జనపనార చేలలో ఉంచుతారు. జవాన్ల కళ్ళు కప్పి సరిహద్దులను దాటిస్తుంటారు. రాత్రిపూట ఈ పనులు చేస్తుంటారు. కొన్ని సందర్భాలలో బంగ్లాదేశ్ ఆడవాళ్ళ మీద ఆ పని కూడా చేస్తుంటారు. అయితే బంగ్లాదేశ్ ఆడవాళ్లు కూడా ఆ పనికి ఒప్పుకోవడం విశేషం. ఎలాగూ దేశం నుంచి ఇండియాకు వస్తున్నాం కాబట్టి.. ఇది పెద్ద విషయం కాదని అక్కడి మహిళలు వ్యాఖ్యానించడం కొసమెరుపు.

పహారా కాసేవాళ్లు

వీరిని గైడ్స్ అని పిలుస్తుంటారు. వీరు హౌరా.. సీయల్దా రైల్వే స్టేషన్లకు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారిని అక్రమంగా తరలిస్తారు. అక్కడినుంచి దేశం నలుమూలకు పంపిస్తుంటారు. ఇది చెప్పడానికి సులభంగానే ఉన్నప్పటికీ.. దీని వెనక చాలామంది చేతులు ఉన్నాయి. ఓ నివేదిక ప్రకారం ప్రతి ఏడాది ఇలా 900 కోట్ల రూపాయలను ఇలా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా తీసుకొచ్చినందుకు ఇక్కడ టీఎంసీ నాయకులు వసూలు చేస్తూ ఉంటారు.

ఇక్కడితోనే ఆగిపోలేదు.. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారికి మన దేశ పౌరసత్వాన్ని.. గుర్తింపు కార్డులను.. చివరికి ఓటు హక్కును కూడా కల్పించడం మమత నాయకత్వంలోనే సాగిపోయింది. దీనికోసం పెద్ద మాఫీ అని వచ్చింది. ఈ అక్రమార్కులకు ధ్రువపత్రాలు అందించడానికి టిఎంసి ప్రభుత్వం కొంతమంది వ్యక్తులను అనధికారికంగా నియమించింది. వారంతా కూడా పాత పత్రాలను సృష్టించి.. వాటిని రంగు నీళ్ళల్లో ముంచి.. పాడైపోయాయని నమ్మించేవారు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి గుర్తింపు కార్డులు పొందేవారు.

ఎప్పుడైతే బిజెపి ఇక్కడ అధికారంలోకి వచ్చిందో.. బంగ్లాదేశ్ నుంచి వలసలు ఆగిపోయాయి. సరిహద్దుల్లో రక్షణ గోడలు నిర్మితమవుతున్నాయి. అంతేకాదు 900 కోట్ల నల్లధనం ఆగిపోయింది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ దేశ ప్రజలకు.. ముఖ్యంగా బెంగాల్ వాసులకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. ఇప్పటికే కట్ మనీ ఆగిపోయింది. కట్ మనీ తీసుకున్నవాళ్లు తిరిగి ఇచ్చేస్తున్నారు.