Home Blog Page 8570

కోటి విలువ చేసే మాస్కులు పట్టివేత

కరోనా వైరస్ పేరు చెబితేనే ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. చైనాలోని వూహాన్లో సొకిన కరోనా వైరస్ క్రమంగా అన్నిదేశాలకు పాకింది. ప్రస్తుతం ఇండియాలోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కరోనా నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తోంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నివారణ కోసం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు ప్రజలకు ఉపయోగపడే మాస్కులు పెద్దఎత్తున అక్రమ నిల్వలు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది.

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మహారాష్ట్రలో ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ రాష్ట్రంలోనే అక్రమంగా నిల్వచేసిన కోటి రూపాయల విలువైన మాస్కులు తాజాగా బయటపడ్డాయి. లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర సరుకుల నిల్వలను అరికట్టడానికి జరిపిన దాడుల్లో మాస్కుల అక్రమ నిల్వలు వెలుగు చూశాయి. మంగళవారం రాత్రి పక్కా సమాచారంతో గోదాములపై పోలీసులు దాడిచేశారు. గోదాముల్లో నిల్వచేసిన 200బాక్సుల ఫేస్ మాస్క్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు.

ఈ మేరకు మాస్కులను అక్రమంగా నిల్వచేసిన గోడౌన్ యజమాని, ఏజెంట్, సరఫరాదారుడితోపాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో ఫేస్ మాస్క్‌లు, శానిటైజర్‌లు వంటి ముఖ్యమైన వస్తువులను నిల్వ చేయడం నేరమని పోలీసులు పేర్కొంటున్నారు. సోమవారం కూడా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రూ.15.25కోట్ల విలువచేసే మాస్కులను సీజ్ చేశారు. పోలీసుల దాడుల నేపథ్యంలో గత రెండ్రోజులుగా మాస్కుల అక్రమ నిల్వలు బయటపడుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో పోలీసులు ఇలాంటి దాడులకు పాల్పడితే మొత్తంలో మాస్కులు, శానిటైజర్లు, ఇతర నిత్యావసర సరుకుల నిల్వలు పెద్దఎత్తున బయటపడుతాయని పలువురు అంటున్నారు. ఈ దిశగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

చైనాపై పలు అనుమానాలు!

చైనాలో పుట్టిన కరోనా వైరస్ రక్కసి ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఆందోళనకు గురి చేస్తోంది. ఈ వైరస్ కారణంగా (మర్చి 26 2020నాటికి) ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 లక్షల 17వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా 18వేల 600 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ సీఫుడ్ మార్కెట్ నుంచి పుట్టిందని తొలుత చైనా వెల్లడించింది. ఒకవేళ సీఫుడ్ నుంచి వచ్చినట్లైతే.. చైనాలో అనేక ప్రాంతాలలో కరోనా కేసులు నమోదు కావాలి కానీ ఒక్క వుహాన్ సిటీలోనే రావడం పై అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతానికి 30 కి.మీ. దూరంలోనే వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోసేఫ్టీ లాబోరేటరీ ఉండటం అనుమానాలకు తావిచ్చింది.ఇక్కడ ఎబోలా, నిఫా లాంటి ప్రమాదకర వైరస్‌ లపై ప్రయోగాలు చేపడతారు.ఈ ల్యాబ్ నుంచే తయారు చేసిన జీవాయుధం (బయో వెపన్) అనే కరోనా వైరస్ బయటకు లీకైందనే వార్త చక్కర్లు కొడుతోంది.

 

గ్రేట్ గేమ్ ఇండియా అనే ఆన్‌ లైన్ పోర్టల్ కథనం ప్రకారం.. ఈ వైరస్ మూలాలు కెనడాలో ఉన్నాయి. ‘‘చైనాకు చెందిన ఇద్దరు బయోలాజికల్ వార్‌ ఫేర్ ప్రోగ్రాం ఏజెంట్లు ఈ వైరస్‌ ను గుట్టు చప్పుడు కాకుండా చైనాకు తీసుకెళ్లారు. ఆ కథనంలో ఇంకేముందంటే.. 2012 జూన్ 13న సౌదీకి చెందిన 60 ఏళ్ల వ్యక్తి ఏడు రోజులపాటు జ్వరం, దగ్గు, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతూ జెడ్డాలోని ఓ ప్రయివేట్ హాస్పిట్లో చేరాడు. ఆయనకు పొగ అలవాటు లేదు, దీర్ఘకాలికంగా మందులేవీ తీసుకోవడం లేదు. దీంతో ఈజిప్షియన్ వైరాలజిస్ట్ డాక్టర్ అలీ మహ్మద్ జాకీ ఆ పేషెంట్ ఊపిరితిత్తుల్లో కరోనా వైరస్ ఆనవాళ్లు ఉన్నాయని అనుమానించాడు. నెదర్లాండ్స్‌ లోని ఎరాస్మస్ మెడికల్ సెంటర్‌‌ లో వైరాలజిస్ట్‌ గా పని చేసే రోన్ ఫౌఛిర్‌ ను సంప్రదించాడు. జాకీ పంపిన శాంపిల్‌ ను పరీక్షించిన ఫౌచిర్ ఓ శాంపిల్‌ ను కెనడాలోని నేషనల్ మైక్రోబయాలజీ ల్యాబ్‌ లో పని చేసే డాక్టర్ ఫ్రాంక్ ప్లమ్మర్‌ కు అందజేశాడు. ఇక్కడి ల్యాబ్ నుంచి చైనా ఏజెంట్లు వైరస్‌ను తస్కరించారు. 2019 మార్చిలో అనుమానాస్పద వస్తువు ఒకటి కెనడా ల్యాబ్ నుంచి చైనాకు వెళ్లింది. విచారణలో చైనీస్ వైరాలజిస్టులు దీన్ని కెనడా ల్యాబ్ నుంచి పంపించారని తేలింది’’ అని ఆ కథనం చెబుతోంది.

అంతే కాకుండా చైనా ల్యాబ్‌ ల్లో జీవాయుధం తయారు చేస్తుండొచ్చని ఇజ్రాయెల్‌ లెఫ్టినెంట్ కల్నల్ అనుమానం వ్యక్తం చేశారు. ఆయన మెడికల్ మైక్రోబయాలజీ నుంచి డాక్టరేట్ పొందారు. కెనడా నుంచి కరోనా వైరస్‌ను చైనా తస్కరించిందనడానికి, జీవాయుధాలు తయారు చేస్తోందనడానికి తగిన ఆధారాలేవీ లేవు. అదేసమయంలో దీనికి వుహాన్‌‌ లో ప్రయోగశాలే కారణమని తాను నమ్మడం లేదని ఆస్ట్రేలియా డిఫెన్స్ అనలిస్ట్ డాక్టర్ మాల్కమ్ డేవిస్ ట్వీట్ చేశారు. కానీ బయో సైన్స్‌ లో చైనా భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతుండటం, నైతికతకు కట్టుబడి ఉండని దాని వైఖరి అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం చైనాలో కరోనా వైరస్ నియంత్రించే విషయంలో ఆ దేశం విజయం సాధించిందని చెప్పొచ్చు. ఈ విషయంలో నోరు మెదపకపోవడంతో అనుమనాలు మరింతగా పెరుగుతున్నాయి.

వ్యాపారస్తులకు నటుడు అలీ విన్నపం

ఒక పక్క దేశమంతా కూడా భయంకరమైన కరోనా వైరస్ వలన తీవ్రమైన భయాందోళనకు గురవుతున్న సమయంలో వ్యాపారులు అతి తెలివితో నిత్యావసరాలు, కూరగాయల ధరలు అమాంతం పెంచేస్తున్నారు . ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాలోచన్లో ఉన్నారు. అయితే ఈ విషయం ఫై స్పందించిన ప్రముఖ సినీ నటుడు అలీ … వ్యాపారులు డబ్బు సంపాదించడానికి ఇది సరైన సమయం కాదని, ఒకవైపు కరోనా వైరస్ వలన ప్రజలందరూ కూడా ఇప్పటికే భయాందోళనకు గురవుతున్నారని అలాంటి సమయం లో వ్యాపారులు మరింతగా ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని విజ్ఞప్తి చేశారు.

అంతేకాకుండా సాధారణ రేట్లకు నిత్యావసరాలను అమ్మి వ్యాపారులు కూడా తమ మానవత్వాన్ని చాటుకోవాలని అలీ వాఖ్యానించారు. కాగా భయంకరమైన కరోనా వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో, ఆ వైరస్ నివారణకై రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు చెరోక లక్ష రూపాయల విరాళం ఇచ్చి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఇకపోతే భయంకరమైన కరోనా వైరస్ మన దేశం నుంచి వెళ్లిపోవాలని తాను గత 10 రోజులుగా ఇంట్లోనే నమాజ్ చేస్తున్నానని కూడా అలీ వ్యాఖ్యానించారు. కాగా ప్రజలందరూ కూడా ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు మేరకు సహకరించాలని, అందరం మూకుమ్మడిగా కరోనాని తరిమికొట్టాలని నటుడు అలీ కోరారు .

ఏపీలో నాలుగు ఆసుపత్రులలోనే కరోనా వైద్య సేవలు

కరోనా వైరస్ సోకినా వారికి నాణ్యమైన సేవలను ఒకే చోట కేంద్రీకరించి ఇచ్చేందుకు, ఆసుపత్రులలో ఇతరులకు ఆ వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోంది. రాష్ట్రంలోని నాలుగు ప్రముఖ ఆసుపత్రులలో ఈ వైద్య సేవలను కేంద్రీకరించి, రోగులు అందరిని ఇక్కడికే చేర్చేందుకు సిద్ధం చేస్తున్నది.

విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాల (ఇక్కడ వైరాలజీ ల్యాబ్‌ కూడా ఉంది), నెల్లూరులోని ప్రభుత్వ వైద్య కళాశాల, విశాఖపట్నంలోని విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (విమ్స్‌), తిరుపతిలోని ఎస్వీఎంసీ (రుయా)లను పూర్తిగా కరోనా వైద్యానికే కేటాయిస్తున్నారు. ఈ ఆసుపత్రులను కరోనా కేసులకు మాత్రమే చికిత్స కోసం వినియోగించడం ద్వారా సాధారణ రోగులకు ఈ వైరస్‌ సోకకుండా చేయవచ్చని చూస్తున్నారు.

ఈ నాలుగు కాలేజీల్లో కరోనా వైద్యానికి 4 వేలకు పైగా పడకలు గురువారం నాటికి అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రులలో అందిస్తున్న ఇతర వైద్య సేవల కోసం ప్రజలను సమీపంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులకు వేలమంది సూచిస్తున్నారు. కరోనా చికిత్సకు ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో ఇతరత్రా ఔట్‌ పేషెంట్, ఇన్‌పేషెంట్, అత్యవసర సేవల నిలిపివేస్తున్నారు.

ఇలా ఉండగా, ఏపీలో కరోనా రోగుల సంఖ్య 10 కి పెరిగింది. బుధవారం విజయవాడ, గుంటూరుకు చెందిన ఇద్దరికి పాజిటివ్‌గా రావడంతో ఈ సంఖ్యా పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు అనుమానిత లక్షణాలున్న 312 మంది నుంచి నమూనాలు సేకరించి వైద్యపరీక్షలకు పంపించారు.

అందులో 229 నెగిటివ్‌ కాగా మరో 73 నమూనాలకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. బుధవారం ఒక్కరోజు 13 నమూనాలు పంపించారు. రాష్ట్రంలో హోం క్వారంటైన్‌లో ప్రస్తుతం 15,143 మంది ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ గత రాత్రి తెలిపింది.

ట్రంప్ నిర్లక్ష్యంతో అమెరికా భారీ మూల్యం చెల్లిస్తున్నదా!

అత్యాధునిక వైద్య సదుపాయాలు, అపారమైన వనరులు గల అమెరికా నేడు కరోనా వైరస్ తో కకావికలం కావడానికి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తొలి దశలో అనుసరించిన నేరమయ నిర్లక్ష్య వైఖరియే కారణమా? అవుననే ఆ దేశంలోని సీనియర్ అధికారులు, రాజకీయ నేతలు వాపోతున్నారు.

మొదట్లో ఈ వైరస్ తీవ్రతను గుర్తించడంలో విఫలం కావడమే కాకుండా, వైట్ హౌస్ లోని ఉన్నతాధికారులు దృష్టికి తెచ్చే ప్రయత్నం తెచ్చినా కొట్టిపారవేశారని చెబుతున్నారు. ఇప్పుడు అమెరికాలో మృతుల సంఖ్య 1,000 కు చేరుకోగా, మొత్తం నమోదైన కేసులు 9,200 దాటిన్నట్లు తెలుస్తున్నది.

జనవరి 3నే ఈ విషయమై ట్రంప్ ను సంప్రదించడం కోసం అమెరికా ఆరోగ్య కార్యదర్శి అలెక్స్ అజార్ ప్రయతించారు. అయితే పక్షం రోజుల తర్వాత గాని ఆయనతో ఈ విషయమై చర్చించే సౌలభ్యం ట్రంప్ కలిగించలేదు. అమెరికాకు ఈ వైరస్ ప్రమాదం ముంచుకొస్తుందనే ఉన్నతాధికారుల ఆందోళనను ఆయన మార్చి మొదటి వరకు ఖండిస్తూ వచ్చారు.

ఇప్పుడు `చైనా వైరస్’ అంటూ నిద్రిస్తున్న ఆయన మొదట్లో దీనిని ఘనంగా కట్టడి చేస్తున్నదని ఆ దేశాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. చైనా వాస్తవాలను చెప్పడం లేదని, తీవ్రతను తక్కువ చేసి చూపుతున్నదని నిఘా నివేదికలు కూడా తెలుపుతున్నా పట్టించుకోలేదు. చైనా ఎంతో `పారదర్శకత’తో వ్యవహరిస్తున్నట్లు జనవరి 24న కూడా ట్రంప్ కొనియాడారు.

చైనాకు విమానాలను, రాకపోకలను జనవరి 17నే భారత్ కట్టడి చేయగా, అమెరికా ఫిబ్రవరి 3న గాని తగు చర్యకు పూనుకోలేదు. అప్పుడు కూడా చైనాలో రెండు వారల పాటు ఉన్నవారిని అమెరికాలో ప్రవేశింపకుండా మాత్రమే నిషేధం విధించారు.

ఇప్పుడు కూడా భారత్ తో సహా పలు దేశాలు సంపూర్ణ లాక్ డౌన్ ను ప్రకటించినా, ట్రంప్ అందుకు సిద్దపడటం లేదు. ఆ విధంగా చేస్తే దేశం ఆర్ధిక వ్యవస్థ కుదేలవుతోందని అంటున్నారు. పైగా, మొత్తం ప్రపంచం లాక్ డౌన్ ప్రకటించినా తాను మాత్రం ప్రకటించానని భీషించుకొని కూర్చున్నారు.

ఇటువంటి పరిస్థితులలో చరిత్రలో ఎరుగనంత భారీగా 2 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక ప్యాకేజీని రూపొందించవలసి రావడం తెలిసింది.

కారు ఆపినందుకు యువతి హల్ చల్..

దేశవ్యాప్తంగా కేంద్రం 21రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పోలీసులు రోడ్లపై పహారా కాస్తూ ప్రజలు గుమ్మికూడకుండా చర్యలు తీసుకుంటున్నారు. సరైన కారణాలు లేకుండా రోడ్లపైకి వచ్చే వారికి కౌన్సిలింగ్ చేసి తిరిగి పంపిస్తున్నారు. టూవీలర్ పై ఒకరు, ఫోర్ వీలర్లలో ఇద్దరు కంటే ఎక్కువగా తిరుగుతున్న వారికి జరిమానాలు విధంచడంతోపాటు వాహనాలు సీజ్ చేస్తున్నారు. అయినప్పటికీ కొంతమందిలో మార్పు రావడం లేదు. ఇలాంటి వారికి పోలీసులు తమదైన శైలిలో ట్రీట్మెంట్ ఇస్తున్న సంఘటనలు చూస్తున్నాం. తాజాగా ఓ యువతి తన కారును ఆపినందుకు ట్రాఫిక్ పోలీస్ చేయికొరికి హల్ చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో లాక్డౌన్ అమలులో భాగంగా పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈక్రమంలోనే బిదాన్ నగర్ ప్రాంతంలో పోలీసులు అటుగా వచ్చిన ఓ కారును ఆపారు. ఎందుకు ప్రయాణం చేస్తున్నారని ట్రాఫిక్ పోలీసులు వారిని ప్రశ్నించారు. ఈక్రమంలోనే కారు డ్రైవర్, మరో యువకుడికి పోలీసులు పక్కకు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే ఇంతలోనే కారు దిగిన 20 ఏళ్ల యువతి పోలీసులపై దాడికి దిగి హల్ చల్ సృష్టించింది.

ఈక్రమంలోనే యువతితోపాటు కారులో వచ్చిన యువకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. విచక్షణ కోల్పోయిన యువతి ట్రాఫిక్ పోలీస్ చేతిని కొరికి రక్తం కళ్ల చూసింది. ఆ రక్తాన్ని మరో పోలీస్ చొక్కాపై ఉమ్మేసింది. ఈ ఘటనతో షాకైన పోలీసులు వెంటనే ఆ యువతిని, యువకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసులకు సహకరించాల్సిందిపోయి కొంతమంది వారిపై తిరగబడుతుండటం శోచనీయంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

కరోనా పోరాటానికి కలిసొస్తున్న సెలబ్రెటీలు

కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. ఇండియాలోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. కరోనా నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు అమలు చేస్తున్నాయి. ఇప్పటికే కేంద్రం దేశవ్యాప్తంగా 21రోజులపాటు లాక్డౌన్ చేపట్టింది. కరోనా నివారణ కోసం పోరాడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలువురు సిని స్టార్లు విరాళాలను ప్రకటిస్తూ తమవంతు సహకారం అందజేస్తున్నారు.

జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కరోనా నివారణ కోసం 2కోట్ల విరాళాన్ని ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎం సహాయ నిధులకు 50లక్షల చొప్పున, ప్రధానమంత్రి సహాయనిధికి ఒక కోటి విరాళాన్ని అందజేయనున్నట్లు ట్వీటర్లో పేర్కొన్నారు. అదేవిధంగా మాటల మాంత్రికుడు రెండు తెలుగు రాష్ట్రాలకు 10లక్షల చొప్పున మొత్తం 20లక్షలకు ప్రకటించనున్నారని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ట్వీటర్లో ప్రకటించారు.

అదేవిధంగా టాలీవుడ్ నటుడు నితిన్ ఏపీ, తెలంగాణకు 10లక్షల చొప్పున మొత్తం 20లక్షలు, కామెడియన్ అలీ తెలుగు రాష్ట్రాలకు లక్ష చొప్పున స్వచ్చంధంగా అందజేయనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా సీని కార్మికుల కోసం జీవిత రాజశేఖర్, మా మాజీ అధక్ష్యుడు శివాజీ రాజా నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. తమిళనాడులోని సీనీ ప్రముఖుల కోసం సూపర్ స్టార్ రజనీ 50లక్షలు, విజయ్ సేతుపతి 50లక్షలు, సూర్య, కార్తీ 10లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. వీరితోపాటు మరింత మంది సీఎం సహాయనిధికి విరాళాలు అందించేందుకు ముందుకొస్తున్నారు.

సుకుమా ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు కూడా మృతి!

ఛత్తీస్ ఘర్ లోని సుకుమా జిల్లా దండకారణ్యంలో గత శనివారం మావోయిస్టు లతో జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన 17 మంది పోలీస్ దళాలతో పాటు, ముగ్గురు మావోయిస్టులు కూడా మృతి చెందిన్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాము పోలీసుల నుండి స్వాధీనం చేసుకున్న ఆయుధాల ఫొటోలతో పాటు మావోయిస్టులు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఈ విషయమై వెల్లడైనది.

ఈ పోరులో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందిన్నట్లు దక్షిణ సబ్ జోనల్ దండకారణ్య విభాగం పేరుతో విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. వారి పేర్లు కోవసి సక్రు, కొట్టం రాజేష్, కరాటం సుక్కు గా తెలుపుతూ, వారికి తామే అంత్యక్రియలు జరిపినట్లు వెల్లడించారు.

ఇలా ఉండగా, ఈ ప్రకటనలో తాము 19 మంది పోలీసులను చంపమని, మరో 20 మంది గాయపడ్డారని తెలిపారు. కానీ ఈ ప్రకటనతో పాటు విడుదల చేసిన ఆడియా క్లిప్ లో మావోయిస్టు అధికార ప్రతినిధి వికల్ప్ మాత్రం 17 మంది పోలీసులు చనిపోయారని, 15 మంది గాయపడ్డారని మాత్రమే పేర్కొన్నారు.

పోలీసుల కధనం ప్రకారం 17 మంది మృతి చెందగా, 13 మంది గాయపడ్డారు. ఈ రెండు ప్రకటనలు భిన్నంగా ఉండడం విస్మయం కలిగిస్తున్నది.

కాగా, మృతి చెందిన 17 మంది పోలీసులతో 13 మంది స్థానిక గిరిజనులు, సుక్మా జిల్లావారు కావడమే కాకుండా, వారంతా మాజీ మావోయిస్టులే కావడం గమనార్హం. గతంలో పోలీసులకు లొంగిపోవడంతో ప్రభుత్వం వారికి పునరావాస కార్యక్రమం క్రింద పోలీస్ దళాలతో చేర్చుకున్నవారే.

మరోవంక ఈ ఎన్‌కౌంటర్‌లో ఇంతటి భారీ నష్టం జరగడం వ్యూహాత్మక లోపమా, సమానవ్యయ లోపమా అని సీనియర్ పోలీస్ అధికారులు తలలు పెట్టుకొంటున్నారు. ప్రతీకారంగా పెద్ద ఎత్తున మావోయిస్టులపై తెగబడడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది. భద్రతా బలగాల్లో విశ్వాసం పెంచడానికి, మావోయిస్టులను గట్టి దెబ్బ తియ్యడానికీ కేంద్రంతో సహా సరిహద్దు రాష్ట్రాల ఉన్నతాధికార్లు వ్యూహం పన్నుతున్నట్లు చెబుతున్నారు.

ఎల్మాగుండలో మావోయిస్టులు సంచరిస్తున్నారని, అదేవిధంగా చత్తీస్‌గఢ్‌-తెలంగాణా రాష్ట్ర సరిహద్దుల్లో మావోయిస్టు అగ్ర నేతల మధ్య సమావేశాలు జరుగుతున్నాయని నిఘా వర్గాల సమాచారం మేరకు దళాలను పంపించారు. అయితే అక్కడెవరూ కనిపించక పోవడంతో తిరిగి వస్తున్న వారు తమను వారు దిగ్బంధనం కావించే అవకాశం గురించి అనుమానించి, తగు జాగ్రత్త పడలేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

పైగా, తిరిగి వచ్చే సమయంలో రెండు బృందాలుగా విడిపోయారు. వారి మధ్య తగు సమాచారం లోపించడంతోనే ఈ అనర్ధం జరిగిన్నట్లు స్పష్టం అవుతున్నది. మంచి సామర్ధ్యం గల సుమారు వందమందితోగల డిఆర్‌జి బృందానికి మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటుచేసుకొని భద్రతా దళ భటులు ప్రాణాలు కోల్పోతున్నా మరో దారిలో వెళ్తున్న పెద్ద బృందం (సుమారు 400 మంది) నుండి డిఆర్‌జి వారికి మద్దతు లభించిన దాఖలాల్లేవు.

నిజానికి స్థానిక (డిఆర్‌జి) దళాలతో పోల్చితే ఎస్‌టిఎఫ్‌, కోబ్రా దళాలు శక్తివంతమైనవి. వారి ఆయుధ సంపత్తి, శిక్షణ, సామర్ధ్యమూ ఎక్కువే. అయినా వారందరూ బేస్‌ క్యాంప్‌నకు చేరిపోయారేతప్ప తమ సహచర దళం సమాచారం తెలుసుకోలేకపోవడం వ్యూహాత్మక వైఫల్యాన్ని వెల్లడి చేస్తున్నది.

ఆంద్రప్రదేశ్ కి రావాలంటే 14రోజుల క్వారంటైన్

కరోనా వైరస్ నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుండి స్వగ్రామాలకు వచ్చే వారిపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకొంది. హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు ఎవరైనా సరే తప్పనిసరిగా 14రోజుల క్వారంటైన్ లో ఉండాలని, క్వారంటైన్ పూర్తయిన తరువాత వారి వారి స్వగ్రామాలకు పంపిస్తామని ఈ నిబంధనకు అంగీకరించేవారు మాత్రమే ఏపీకి రావాలని ఆదేశించింది.

దీంతో స్వగ్రామాలకు వచ్చేందుకు ప్రయత్నించిన ప్రయాణికులను తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న పోలీసులు వారిని నిలిపివేశారు. నిన్న వేలాది మంది విద్యార్థులను జగ్గయ్యపేట చెక్ పోస్ట్ వద్ద నిలిపివేశారు.అదేవిధంగా తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలకు డాక్టర్లను పంపిస్తామని, కరోనా వైరస్ టెస్ట్ ల అనంతరం హోం క్వారంటైన్ కు పంపిస్తున్నట్లు చెప్పారు.

క్వారంటైన్ కు అంగీకరించిన వారిని నూజివీడు ట్రిపుల్ ఐటికి పంపించేందుకు ఏపీ అధికారులు సర్వం సిద్ధం చేశారు. దీంతో క్వారంటైన్ అంగీకరించిన వారిని బస్సుల్లో తరలిస్తుండగా…క్వారంటైన్ కు ఒప్పుకోని వారు నగరానికి తిరుగు ప్రయాణ మయ్యారు.

కరోనా విపత్తుకి పవన్ కళ్యాణ్ భారీ విరాళం

జనసేన పార్టీ అధినేత మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ మరోసారి తన ఉదారత చాటుకున్నాడు. జాతికి విపత్తు వచ్చినపుడు ఎపుడూ ముందుండే ఈ మంచి మనిషి కరోనా బాధితులకు అండగా ఉండాలని తనకు తోచిన రీతిలో సాయం చేయ బోతున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపధ్యం లో పవన్ కళ్యాణ్ ముందుకొచ్చి ఆర్ధిక సాయం ప్రకటించాడు. తెలంగాణ , ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల చొప్పున కోటి రూపాయలు విరాళం ప్రకటించాడు. తక్షణమే వాటిని ప్రభుత్వానికి అందజేసే దిశగా తనవంతు కృషి చేస్తున్నాడు.

జనసేన నేత పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ భారీ సాయం విషయం తెలుసుకొన్న అభిమానులు, సామాన్య జనం ఆయన్ని అభినందిస్తున్నారు. ఇక జనసైనికులు అయితే మా నాయకుడు చేసిన పనికి గర్వంగా ఉంది అని చెబుతున్నారు. గతంలో కూడా హుద్ హుద్ తూఫాన్ వంటి ప్రకృతి విపత్తులు వచ్చినపుడు కూడా ఇలాగే అందరికంటే ముందు పవన్ కళ్యాణ్ నిలిచాడని గుర్తు చేసుకొన్నారు.

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ మరో కోటి రూపాయలను ప్రధాన మంత్రి సహాయ నిధికి ఇస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. కాగా దేశం లో కోటి రూపాయల భారీ మొత్తాన్ని విరాళంగా ఇచ్చిన ఏకైక హీరో పవన్ కళ్యాణ్ కావడం విశేషం. ప్రధాన మంత్రి జాతి విపత్తు నుంచి మనల్ని బయట పడేయడానికి చేస్తున్న ప్రయత్నాల్లో తాను కూడా భాగస్వామి కావాలని తపనతో ఈ కోటి రూపాయల సాయం చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ తెలిపాడు. ఇప్పటికే సామాజిక మాధ్యమాల ద్వారా కరోనా వైరస్ ఫై ప్రజలకు జాగ్రత్తలు చెబుతున్న పవన్ కళ్యాణ్ ఈ కోటి రూపాయల సాయం తో మరో అడుగు ముందు వేయడం జరిగింది. ప్రకృతి విపత్తులు జరిగినపుడు సాయం చేయడం పవన్ కళ్యాణ్ కి ఇదేమి కొత్త కాదు ఇప్పటికే చాలా సార్లు ఆర్ధిక సాయం చేసి తన పెద్ద మనసు చాటు కోవడం జరిగింది.

వార్షిక వృద్థిరేటు 2.5శాతానికే ప‌రిమితం

క‌రోనా వైర‌స్ మహమ్మారి క‌ట్ట‌డికి దేశం మొత్తం 21 రోజుల‌పాటు లాక్‌డౌన్ ప్ర‌క‌టించడంతో దేశ వృద్ధి రేటుపై దారుణమైన ప్రభావం చూపే అవకాశం కనిపిస్తున్నది. దేశ వార్శిక వృద్థిరేటు కేవలం 2.5శాతానికే ప‌రిమితం కావ‌చ్చ‌ని బార్‌క్లే బ్యాంకు అంచ‌నా వేసింది. ఈ ఏడాది దేశ వృద్దిరేటు 4.5శాతం ఉండ‌వ‌చ్చ‌ని గ‌తంలో అంచ‌నా వేశారు. కానీ ఈ ఏప్రిల్ – జూన్ త్రైమాసికంలో లాక్‌డౌన్ ప్ర‌భావం అసాధార‌ణంగా ఉంటుంద‌ని బార్‌క్లే తెలిపింది.

పైగా, 2021 ఆర్థిక సంవ‌త్స‌రంలో కూడా ఈ ఉత్పాతం ప్ర‌భావం ఉంటుంద‌ని భావిస్తున్నారు. వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రం కూడా వృద్ధి రేటు ముందుగా అంచ‌నా వేసిన‌ట్లు 5.2శాతం ఉండ‌ద‌ని, అది కేవ‌లం 3.5శాతానికే ప‌రిమితం అవుతుంద‌ని తాజాగా అంచనా వేసింది. లాక్‌డౌన్‌.. దేశ ఆర్థిక వ్యవస్థను రూ.9 లక్షల కోట్ల మేర ప్రభావితం చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశ జీడీపీలో ఈ మొత్తం 4 శాతానికి సమానం కావడం గమనార్హం.

ఇలా ఉండగా, కంపెనీల‌న్నీ ఉద్యోగులకు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ ఇవ్వాలని ప్రభుత్వం సూచించినా తమకు పూర్తిగా సాధ్యం కాదని ప‌లు ఐటీ కంపెనీల అధిప‌తులు స్పష్టం చేస్తున్నారు. లాక్‌డౌన్ నుంచి మిన‌హాయింపు ల‌భించిన రంగాల్లో ఐటీ లేక‌పోవ‌టంతో ఆయా ఉద్యోగులంద‌రూ ఇండ్ల‌కే ప‌రిమితం కావాల్సి వ‌స్తున్న‌ది.

దాంతో తాము జాతీయ అంత‌ర్జాతీయ క్ల‌యింట్ల‌కు సేవ‌లు అందించ‌టంలో ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని భార‌తీయ ప్ర‌ముఖ ఐటీ సంస్థ‌లు టీసీఎస్‌, ఇన్‌ఫోసిస్ సీఈవోలు సోష‌ల్ మీడియా ద్వారా అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

ముఖ్యంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్య‌వ‌స‌ర సేవ‌లు అందిస్తున్న ప‌లు ప్ర‌భుత్వ, ప్రైవేటు సంస్థ‌ల‌కు త‌మ సేవ‌లు ఆగిపోయే ప్ర‌మాదం ఉంద‌ని, అందువ‌ల్ల కొంత‌మంది ఉద్యోగులైనా ఆఫీసు నుంచి ప‌నిచేయాల్సిందేన‌ని టీసీఎస్ సీఈవో రాజేష్ గోపీనాథ‌న్ పేర్కొన్నారు.

ఇంకోవైపు, వ్యాపార‌స్తులు బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు చెల్లించే ప‌రిస్థిలో లేమ‌ని చేతులెత్తేస్తున్నారు. ముఖ్యంగా రియ‌ల్ ఎస్టేట్‌, టూరిజం, ఆతిథ్య‌రంగాల వ్యాపారాలు క‌రోనా దెబ్బ‌కు కుదేల‌య్యాయి. వ్యాపారాలు పూర్తిగా మూత ప‌డ‌టంతో క‌నీసం ఉద్యోగుల‌కు జీతాలు కూడా చెల్లించ‌లేని ప‌రిస్తితిలోకి కంపెనీలు జారుకున్నాయి.

ఇలాంటి ప‌రిస్థితుల్లో వ్యాపారాల కోసం బ్యాంకుల వ‌ద్ద తీసుకున్న అప్పుల‌కు వాయిదాలు చెల్లించ‌లేమ‌ని ప‌లు సంస్థ‌ల నిర్వాహ‌కులు చేతులెత్తేస్తున్నారు. వ్యాపార నిబంధ‌న‌ల్లోని యాక్ట్ ఆఫ్ గాడ్ (దేవుడి లీల‌) సెక్ష‌న్ ఇప్పుడు త‌మ‌కు వ‌ర్తిస్తుంద‌ని, ఆ మేర‌కు వెసులుబాటు ఇవ్వాల‌ని అంటూ ఉండడంతో బ్యాంకులు ఖంగారు చెందుతున్నాయి. అదే జరిగితే తమకు కుప్పకూలి పోవలసి వస్తుందని ఆందోళన చెందుతున్నాయి.

విద్యార్థులకు చుక్కలు చూపించిన పోలీసులు!

జగ్గయ్యపేట సమీపంలోని గరికపాడు చెక్ పోస్టు దగ్గర పోలీసులు ఏపీ విద్యార్థులకు చుక్కలు చూపించారు. 21 రోజుల లాక్ డౌన్ నేపథ్యంలో జంటనగరాలలో ఇరుక్కుపోయిన వారిని, వారి వారి గ్రామాలకు పట్టణాలకు వెళ్లేందుకు నిన్న ఒక్కరోజు అనుమతి లభించడంతో విద్యార్థులు వందల సంఖ్యలో బయలుదేరారు. అయితే ఆంధ్రప్రదేశ్ లోకి విద్యార్థుల ఎంట్రీపై జగ్గయ్యపేట సమీపంలోని గరికపాడు చెక్ పోస్టు దగ్గర అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. హైదరాబాద్ లో హాస్టళ్లు, మెస్సులతో అన్నింటినీ మూసివేశారు. దీంతో నగరంలో ఏపీ విద్యార్థులు, యువతతోపాటు ఇతరులు ఏపీకు పయనం అయ్యారు. జగ్గయ్యపేట దగ్గర వారిని ఏపీలోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.

జంటనగరాల నుండి బయలుదేరే ముందే విద్యార్థులు పోలీసులను ఆశ్రయించారు. చెక్ పోస్టులు, టోల్ గేట్లలో ఆపకుండా వారికి నిరభ్యంతర పత్రాలను జారీ చేశారు. వాటిని పట్టుకొని వెళ్లిన విద్యార్థులను ఏపీ బార్డర్ జగ్గయ్యపేట సమీపంలోని గరికపాడు చెక్ పోస్టు వద్ద అందరినీ ఆపేశారు. రాత్రి వరకు వారిని ఏపీలోకి అనుమతించలేదు. దీంతో విద్యార్థులంతా పడిగాపులు గాశారు.

ఉదయం నుంచి తమ సమస్యపై స్పందించకపోవడంతో విద్యార్థులు..అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సమస్య ఏపీ మంత్రి బొత్స సత్యానారయణ దృష్టికి వెళ్లింది. వెంటనే బొత్స..తెలంగాణ మంత్రి కేటీఆర్ తో మాట్లాడారు. కేటీఆర్ తో చర్చించిన విషయాలను బొత్స…జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ సీఎం జగన్ దృష్టికి సమస్య రావడంతో యుద్ధ ప్రాతిపదికన స్పందించారు. వెంటనే తెలంగాణ సీఎం కేసీఆర్ తో మాట్లాడారు. అనంతరం జగ్గయ్యపేట చేరుకున్న ఏపీ వారికి హెల్త్ ప్రోలో కాల్ పాటించి ఏపీలోకి అనుమతించాలని నిర్ణయించారు.

ఆంధ్రా, తెలంగాణ బార్డర్ లో చిక్కుకుపోయిన విద్యార్థులు, ఇతర ప్రయాణికుల సమస్య ఓ కొలిక్కి వచ్చింది. కొంతమంది క్వారంటైన్లకు వెళ్లిపోగా మరికొంతమంది హైదరాబాద్ కు తరిగివస్తున్నారు. దీంతో నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన హైడ్రామాకు తెర పడినట్లైంది. 7 గంటలకు పైగా గరికపాడు వద్ద విద్యార్థులు పడిగాపులు కాశారు. క్వారంటైన్ కు అంగీకరించిన వారికి మాత్రమే ఏపీలోకి అనుమతించారు.

సీఎం సహాయ నిధికి పవన్ కళ్యాణ్ భారీ విరాళం

జనసేన పార్టీ అధినేత మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ మరోసారి తన ఉదారత చాటుకున్నాడు. జాతికి విపత్తు వచ్చినపుడు ఎపుడూ ముందుండే ఈ మంచి మనిషి కరోనా బాధితులకు అండగా ఉండాలని తనకు తోచిన రీతిలో సాయం చేయ బోతున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపధ్యం లో పవన్ కళ్యాణ్ ముందుకొచ్చి ఆర్ధిక సాయం ప్రకటించాడు. తెలంగాణ , ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల చొప్పున కోటి రూపాయలు విరాళం ప్రకటించాడు. తక్షణమే వాటిని ప్రభుత్వానికి అందజేసే దిశగా తనవంతు కృషి చేస్తున్నాడు.

జనసేన నేత పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ భారీ సాయం విషయం తెలుసుకొన్న అభిమానులు, సామాన్య జనం ఆయన్ని అభినందిస్తున్నారు. ఇక జనసైనికులు అయితే మా నాయకుడు చేసిన పనికి గర్వంగా ఉంది అని చెబుతున్నారు. గతంలో కూడా హుద్ హుద్ తూఫాన్ వంటి ప్రకృతి విపత్తులు వచ్చినపుడు కూడా ఇలాగే అందరికంటే ముందు పవన్ కళ్యాణ్ నిలిచాడని గుర్తు చేసుకొన్నారు.

కరోనా పేరుతొ కుట్ర జరిగిందా !

ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా ? కరోనావైరస్ పేరుతో చైనా ప్రపంచాన్ని మోసం చేసిందా? ఇలాంటి ఎన్నో అనుమానాలు ఇప్పుడు తెరమీదకి వస్తున్నాయి.

అందుకు కారణం లేకపోలేదు. అమెరికా, యూరప్ కి చెందిన బిజినెస్ మాగ్నెట్స్ చైనాలోని లీడింగ్ కంపెనీలలో తమకున్న విలువైన షేర్లను అతి తక్కువ ధరలకే చైనా ప్రభుత్వానికే అమ్ముకోవాల్సి రావడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

చైనాలో బలంగా స్థిరపడిన యూరప్, అమెరికాకు చెందిన పెట్టుబడిదారులను సాగనంపే దారిలో చైనా ఈ కుట్ర పన్నినట్టుగా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇంతకు ముందు చైనాలో పేరొందిన రసాయన, సాంకేతిక పరిశ్రమలలో యూరప్, అమెరికాకు చెందిన వ్యాపార సంస్థల పెట్టుబడులే అధికం. అందులో సగం లాభాలను ఆ రెండు అగ్ర దేశాల వారే పంచు కోవడం చైనాకు కంటగింపు గా మారింది. అదీగాక చైనా కరెన్సీ యాన్ అగ్ర రాజ్యాల డాలర్ వల్ల నిత్యం ఒడిదొడుకులను ఎదుర్కొంటోందన్న నమ్మకం చైనా వారిలో బలంగా ఉంది. దరిమిలా చైనా కరోనాను అస్త్రంగా వాడుకున్నట్టుగా యూరప్ దేశాలు చెందిన విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆ క్రమం లో చైనా మొత్తం కాకుండా వ్యుహాన్ నగరం వరకే కరోనా వైరస్ పరిమితమయ్యేలా ఆ దేశం చూసుకొంది. కరోనా వైరస్ ని ఎదుర్కొనేందుకు తమ ఆర్ధిక వ్యవస్థ సిద్ధం గా లేదని ,ఇంకా చెప్పలాంటే కనీసం ముఖానికి తొడుక్కొనే మాస్కులు కొనే ఆర్థిక పరిస్థితులు కూడా తమకు లేవని బుకాయించింది. కరోనా వైరస్ ప్రమాదం ఫై చైనా అధ్యక్షుడు జిన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు చైనా పారిశ్రామిక రంగంపై విపరీత ప్రభావం చూపింది. దాంతో అగ్ర రాజ్యాల పెట్టుబడిదారులు తమ వాటాలను లాభాలకు అతీతంగా అమ్ముకున్నారు. కాగా మొత్తం ఈ కుట్ర వ్యవహారం లో ఉన్న నిజానిజాలు త్వరలోనే మనకు వెల్లడి కానున్నాయి. అని తెలుస్తోంది ,.

చైనాలో అమెరికా , యూరప్ దేశాల పెట్టుబడి దారులు అమ్మిన వాటాల విలువ 20 బిలియన్ డాలర్ల పైగానే ఉంది .ఇదంతా కేవలం రెండే రెండు రోజుల్లో జరిగిపోయింది. మొత్తం ఈ వ్యవహారం లో ఏ మాత్రం అనుమానం రాకుండా చైనా చాలా పకడ్బందీగా వ్యవహరించింది. దీనిని అర్ధం చేసుకునే సరికి అమెరికా, యూరప్ పెట్టుబడిదారుల షేర్లన్నీ చైనా ప్రభుత్వం చేతిలోకి వెళ్లిపోయాయి.

ఇవన్నీ ఒక ఎత్తయితే కరోనా వైరస్ వల్ల చైనా తీవ్ర ఇబ్బందులు పడ్డట్టు చెప్పే కథనాలన్నీ నిజమేనా అన్న అనుమానాలు లేక పోలేదు. అదీగాక కరోనా వైరస్ కి సంబంధించిన యాంటీ వైరస్ ని చైనా ఇప్పటికే తయారు చేసుకుని ఉంచుకుందని వార్తలొస్తున్నాయి.

ఇక కరోనా బాధితుల గణాంకాలు చూస్తే కరోనా వైరస్ పుట్టిన చైనాలో ఇప్పటి వరకు 81,053 కేసులు నమోదు కాగా అందులో 72,441 కేసులు రికవరీ అయ్యాయి. అదే ఇటలీలో మొత్తం 53,580 కేసులు నమోదు అయితే, అందులో కేవలం 6,070 మంది మాత్రమే రికవరీ అయ్యారు. ఇక మిగతా ప్రపంచ దేశాల గణాంకాలు కూడా ఇలానే ఉన్నాయి. రికవరీ కేసులు ఏమంత ఆశాజనకంగా లేవు.

చివరగా తేలుతుంది ఏమిటంటే కరోనా వైరస్ పుట్టి పెరిగిన చైనాలో ఎక్కువ మంది వ్యాధి నుంచి కోలుకోవడం జరిగింది. ఆ లెక్కన చైనా దేశం కరోనా వైరస్ కి విరుగుడు గా యాంటీ వైరస్ ని ఆల్రెడీ తయారు చేసుకుందేమోనన్న అనుమానాలు మొలకెత్తు తున్నాయి. .

పండుగాడు-పూరీ కాంబినేషన్లో మూవీ?

సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస హిట్లతో మంచి జోష్ మీదున్నారు. ‘శ్రీమంతుడు’, మహర్షి’, ‘సరిలేరునికెవ్వరు’ వరుస హిట్లను మహేష్ బాబు అందుకున్నాడు. ఇటీవల సంక్రాంతి సందర్భంగా రిలీజైన ‘సరిలేరునికెవ్వరు’ మహేష్ బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో మహేష్ జోడిగా రష్మిక మందన్న నటించింది. వీరిద్దరి జోడీకి ప్రేక్షకులు కలెక్షన్ల వర్షం కురిపించారు. ఈ మూవీ తర్వాత మహేష్ తర్వాత మూవీపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

‘సరిలేరునికెవ్వరు’ మూవీ తర్వాత పలువురు క్రేజీ దర్శకులతో మహేష్ బాబు నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. మహేష్ బాబు-వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన తదుపరి మూవీ ఉంటుందని అందరు భావించారు. అయితే ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో చిత్రంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా మహేష్ బాబు-పర్శురాం దర్శకత్వంలో నటిస్తాడని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉండగానే మహేష్ బాబు-పూరి కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కనుందని వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

దర్శకుడు పూరీ జగన్నాథ్‌-సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో గతంలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్టుగా నిలిచాయి. ‘పోకిరి’, ‘బిజినెస్‌మేన్’ బాక్సాఫీస్ హిట్టందుకున్నాయి. ఈ మూవీ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరో మూవీ రాలేదు. తాజాగా మహేష్ బాబుకు సరిపోయే కథను పూరి సిద్ధం చేసినట్లు తెల్సింది. మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే సినిమా చేసేందుకు పూరి సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం పూరి జగన్మాథ్ విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ మూవీ తెరకెక్కిస్తున్నాడు. మహేష్ బాబు వంశీపైడిపల్లి, పరుశురాం దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో మూడో చిత్రం రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Sakshi Agarwal Latest Photo Stills

మెగాస్టార్ కు మెగా కోడలు సర్ ప్రైజ్ విషెస్

మెగాస్టార్ చిరంజీవి ఉగాది రోజున సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. తన అభిమానులతో తన భావాలను షేర్ చేసుకునేందుకు ఓ వేదిక కోసం సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. అన్నట్లుగా ఉగాది రోజున ఉదయం 11గంటల 11నిమిషాలకు మెగాస్టార్ ట్వీటర్లో తన తొలి ట్వీట్ చేశారు. ‘తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు’ అంటూ తొలి ట్వీట్ చేశారు. అదేవిధంగా కరోనాపై నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మరో ట్వీట్ చేశారు.

మెగాస్టార్ ట్వీటర్ అకౌంట్ ఓపెన్ చేయగానే లక్షల్లో అభిమానులు ఆయన ఫాలో అయ్యేందుకు రెడీ అయ్యారు. దీంతో జెట్ స్పీడుతో ఫాలోవర్ల సంఖ్య పెరుగుతూ పోయింది. మెగాస్టార్ తొలి ట్వీట్ చేయగా అభిమానులు వెల్ కమ్ టూ ట్వీటర్ అంటూ స్వాగతం పలికారు. అదేవిధంగా ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మెగా కోడలు కోడలు ఉపాసన ‘వెల్కమ్ టు ట్విట్టర్ మామయ్య’ అనే ట్వీట్ తో స్వాగతం పలికింది. అభిమానులతోపాటు ఆమె కూడా మెగాస్టార్ కు ట్వీటర్లో ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

ఉపాసన రాంచరణ్ సినిమా కార్యక్రమాలను చూసుకోవడంతోపాటు సేవా కార్యక్రమాలతో బీజీగా ఉంటారు. అదేవిధంగా అపోలోకు సంబంధించిన బిజినెస్ చూసుకుంటుంటారు. ఇటీవల ఓ యూబ్యూబ్ ఛానల్ ప్రారంభించి హెల్త్ కు సంబంధించిన అవగాహన కల్పిస్తున్నారు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా పోస్టు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఉపాసనకు కూడా సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. కేవలం సినిమాల్లో, రాజకీయాల్లో మాత్రమే చూసే అభిమానులకు చిరంజీవితో నేరుగా తమ భావాలను పంచుకునేందుకు వేదిక దొరకడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.