Home Blog Page 8498

‘రౌడీ’ని విష్ చేసిన పూరి


నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న విజయ్ దేవరకొండకు సెలబెట్రీలు, అభిమానులు పెద్దసంఖ్యలో విషెష్ చెబుతున్నారు. ‘అర్జున్ రెడ్డి’ మూవీతో విజయ్ దేవరకొండ యువతను ఆకట్టుకున్నారు. ఈ మూవీ తర్వాత ‘ట్యాక్సీవాలా, ‘గీతగోవిందం’, ‘మహానటి’ మూవీలతో స్టార్ హీరోగా మారిపోయాడు. అయితే ఇటీవల విజయ్ నటించిన డియర్ కామ్రేడ్, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కొంత నిరాశపరిచాయి. అయినప్పటికీ యువతలో విజయ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇటీవలే విజయ్ ఇన్ స్ట్రాగ్రామ్లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన దక్షిణాది హీరోగా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా 30ఏళ్లలోపు కంటే తక్కువ వయస్సు కలిగిన పోర్బ్స్ లిస్టులో టాప్ 30చోటు సంపాదించుకున్నాడు.

ఆంధ్రా న్యూస్ ఛానెళ్ల పని ఖతమేనా?

నేటితో విజయ్ 31ఏళ్ల పడిలోకి వెళుతున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ దర్శకుడు పూరి జగన్మాథ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఫ్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘ఫైటర్’లో విజయ్ నటిస్తున్నాడు. ఈ మూవీలో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ నటిస్తోంది. బాలీవుడ్లో కరణ్ జోహర్ ‘ఫైటర్’ మూవీని నిర్మిస్తుండగా తెలుగులో పూరి జగన్మాథ్, ఛార్మి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ పూరి జగన్మాథ్ విజయ్‌కు ట్విటర్లో విషెస్ చెప్పారు. ‘నేను నీతో ఎంతగా ప్రేమలో ఉన్నానో ఈరోజు మనస్ఫూర్తిగా చెప్పాలనుకుంటున్నాను.. పనిలో నీకు ఉన్న నిబద్ధత, కసి, పట్టుదల నిన్ను మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్తాయి.. నిన్ను మిస్సవుతున్నా.. త్వరలోనే సెట్స్‌లో కలుద్దాం.. నువ్వు ఎప్పటికీ నా ఫైటర్‌వే.. హ్యాపీ బర్త్‌డే విజయ్’ అంటూ పూరీ ట్వీట్ చేశారు. పలువురు సెలబ్రెటీలు, అభిమానులు విజయ్ కు సోషల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఓ తల్లి విషాదగాధ.. కూతురు చనిపోయిన 2రోజులకే డ్యూటీ!

మనసుకి నచ్చిన వారు దూరమైనప్పుడు ఆ బాధను తట్టుకోవడం కష్టం, ఆ పరిస్థితి నుండి కోలుకోని మరళా సాధారణ స్థితికి రావడం మరింత కష్టం. వారి జ్ఞాపకాలు మనిషిని అతలాకుతలం చేస్తాయి. కానీ, ఒడిశాలోని ఒక లేడీ హోమ్ గార్డ్ తన కుమార్తెను కోల్పోయిన రెండు రోజులకే తిరిగి విధుల్లోకి చేరి అందర్నీ అబ్బుర పరిచింది. ఆమెకున్న బాధ్యతలు ఆమెను విధుల్లోకి రప్పించాయని తెలిసినప్పుడు అనేకమంది కంటతడి పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని పూరిలో పిపిలి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న గౌరీ బెహారా అనే హోమ్ గార్డ్ కి 13 ఏళ్ల కుమార్తె ఉంది. ఆ కుమార్తె గత కొన్ని సంవత్సరాలుగా క్యాన్సర్‌ తో బాధపడుతుంది. గత నెల 24వ తేదీన ఆ పాప చనిపోయింది. కుమార్తె చనిపోయి నిండా రెండు రోజులు కూడా గడవకముందే గౌరీ బెహారా విధుల్లోకి వచ్చింది.

అది ఏప్రిల్ 24 , రాత్రి 8 గంటలు, లాక్ డౌన్ కారణంగా గౌరీ ఓవర్ టైం డ్యూటీ చేస్తుంది. ఇంతలో ఆమెకు ఇంటి దగ్గర నుండి ఒక ఫోన్ కాల్ వచ్చింది. “నీ కూతురి పరిస్థితి సీరియస్ గా ఉంది, ఆమె తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుంది నువ్వు వెంటనే రావాలి” అని అవతలి వ్యక్తి చెప్పారు. ఈ వార్త ఆమె చెవులకు చేరడంతో, వెంటనే తన సైకిల్ తో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటికి హుటా హుటీగా చేరుకుంది. ఆమె ఇంటికి చేరుకునే సమయానికి, ఆమె కూతురు చనిపోయి ఉంది. తన బిడ్డ ఎటువంటి కదలిక లేకుండా పడుకోవడాన్ని చూసిన ఆ తల్లి గుండెలవిసేలా ఏడ్చింది. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. అలా రెండు రోజులు గౌరీ బెహారా బాధపడ్డది. తన మీద ఆధారపడ్డ వృద్ధ తల్లిదండ్రులు, మానసిక వికలాంగడైన సోదరుడు కోసం ఉబికివస్తున్న కన్నీళ్ళను దిమింగుకొని, పుట్టెడు దుఃఖాన్ని అపుకొని మరళా విధుల్లోకి చేరింది.

కొన్ని సంవత్సరాల క్రితం కట్టుకున్న వాడు ఆమెను కాదనుకున్నాడు. క్యాన్సర్ తో బాధపడుతున్న కూతురి బాధ్యత ఒకవైపు, వృధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, మానసిక వికలాంగుడైన సోదరుడి బాధ్యత మరోవైపు తన భుజాల మీద వేసుకొని జీవనం సాగుతున్న గౌరీ బెహారా కి కూతురి మరణం అత్యంత చేదు వార్త. కాబట్టి ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని ఆమెకి సహాయం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

ప్రధానికి మరో లేఖ రాసిన ‘బాబు’..!

Chandrababu, Modi
Chandrababu, Modi


విశాఖ ఘటనపై దర్యాప్తు విషయంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు అధినేత చంద్రబాబు ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఇటీవల కరోనా అంశంపై కూడా ఆయన ప్రధానికి లేఖ రాశారు. ఈ లేఖపై వైసీపీ నాయకులు పెదవి విరిచారు. అవేమీ పట్టించుకోని చంద్రబాబు ఇటీవల చోటు చేసుకున్న విశాఖ ఎల్.జి ఘటనపై ప్రధానికి రాసిన లేఖలో కొన్ని సూచనలు చేశారు.

ఎల్.జి పాలిమర్స్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత..!

విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయించాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. ఎల్జీ పాలిమర్స్‌ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చిందన్నారు. దుర్ఘటనపై మీ సత్వర స్పందనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు. సత్వరమే మీరు స్పందించి చేపట్టిన చర్యలు విశ్వాసాన్నిచ్చాయని పేర్కొన్నారు. గ్యాస్‌ లీకేజీపై విచారణకు సైంటిఫిక్‌ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. విష వాయువు విడుదలకు దారితీసిన అంశాలపై దర్యాప్తు చేయించాలన్నారు. లీకైన వాయువు స్టైరీన్‌ అని కంపెనీ చెబుతుందని, అయితే స్టైరీన్‌తోపాటు మరికొన్ని వాయువులు ఉన్నాయని భిన్న నివేదికలు ఉన్నాయని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

చిరంజీవి పక్కన రానా


ఖైదీ నెంబర్ 150 సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన చిరంజీవి రెట్టించిన ఉత్సాహం తో ఇపుడు సినిమాలు ఒప్పుకోవడం జరుగుతోంది. `సైరా ` చిత్రం తరవాత కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య ” చిత్రంలో నటిస్తున్న మెగా స్టార్ ఆ తరవాత చేయబోయే చిత్రాలను కూడా వరుసలో పెట్టడం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ సమయంలో టైం వేస్ట్ చేయకుండా కధలను వింటూ దర్శకులను ఎన్నిక చేసుకొంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకొంటున్నాడు ఆ క్రమంలో ఇప్పుడు ముగ్గురు యువ దర్శకులు రాబోయే చిరంజీవి చిత్రాలకు దర్శకత్వం వహించ బోతున్నారు,

డిసెంబర్ చివరి వరకు వర్క్‌ ఫ్రం హోం..!

అలా చిరంజీవి సినిమాకి దర్శకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నవాళ్లలో మొదటి దర్శకుడు సాహో ఫేమ్ సుజిత్ . కాగా ఈ దర్శకుడు చిరంజీవి నటించ బోయే `లూసిఫెర్ ` రీమేక్ చిత్రానికి దర్శకత్వం వహించడానికి అవకాశం దక్కించు కొనడం జరిగింది ఇక ఈ దర్శకుడి తరవాత చిరంజీవి చిత్రానికి డైరెక్ట్ చేసే ఛాన్స్ యువ దర్శకులు అయిన మెహెర్ రమేష్ ( బిల్లా ఫేమ్ ), కె .ఎస్ . రవీంద్ర అలియాస్ బాబీ ( వెంకీ మామ ఫేమ్ ) దక్కించు కొన్నారు .

ప్రజారవాణాలో మార్పులు చేర్పులు!

ఇక మెహెర్ రమేష్ చిరంజీవి తో చేయబోయే చిత్రం తమిళ ” వేదాళం ” రీమేక్ కాగా , బాబీ మాత్రం తాను వ్రాసుకొన్న స్టోరీ ని చిరంజీవికి వినిపించడం జరిగిందట ..కాగా ఈ కథ చిరంజీవికి నచ్చడం జరిగిందట గాని ఈ చిత్రంలో ఇంకో హీరో కి కూడా కీలక పాత్ర ఉందని తెలుస్తోంది .దాంతో ఎన్నో తర్జన భర్జనలు అనంతరం రానా దగ్గుబాటి ని సెకండ్ హీరోగా సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. నిజానికి రానా దగ్గుబాటి కి కూడా చిరంజీవి తో కలిసి నటించాలని ఎప్పట్నుంచో కోరిక ఉందట …అదీగాక రానా , రామ్ చరణ్ లిద్దరూ చిన్ననాటి స్కూల్ మేట్స్ కావడం తో రానా నటించడం దాదాపు ఖాయమైంది అని అనుకోవచ్చు .

విశాఖ దుర్ఘటనపై జగన్ సలహాదారుల తత్తరపాటు


విశాఖ లో జరిగిన గ్యాస్ లీక్ దుర్ఘటనపై సర్ది చెప్పుకోలేక ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మద్దతు దారులు తరచూ ఆత్మరక్షణలో పడుతున్నారు. ప్రముఖ ఇంగ్లిష్ మీడియా చానెళ్లు నిర్వహించిన చర్చల్లో పాల్గొన్న జగన్ సలహాదారుల తత్తరబాటు చూస్తుంటే జాలి వేస్తుంది.

జగన్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఇద్దరు న్యూస్ ఛానల్ లో యాంకర్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక వైదొలగడం చూస్తుంటే జగన్ ఎటువంటి మద్దతు దారులపై ఆధారపడుతున్నారో వెల్లడి అవుతుంది. ప్రశ్నలకు అసహనం చెందేవారు ఆపద సమయంలో ప్రభుత్వాన్ని ఏ విధంగా మద్దతు కూడా తీసుకు రాగలరా అని విస్మయం కలిగిస్తుంది.

బ్రాండ్ విశాఖ: జగన్ కు లాభమా? నష్టమా?

ఇప్పుడు ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. అలా వెళ్లిపోయేంత కఠినమైన ప్రశ్నలు ఆ చర్చా నిర్వాహకులు అడగలేదు. బేసిక్ ప్రశ్నలు వేశారు. దానికే సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు.

రిపబ్లిక్ టీవీ చర్చలో ఒకరు ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో వైద్య, ఆరోగ్య అంశాలపై కీలక సలహాదారుడు పీవీ రమేష్ కాగా, మరొకరు టైమ్స్ నౌ చర్చలో జగన్‌కు మీడియా సలహాదారుగా ఉన్న ప్రముఖ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ ఇలా పక్కకు వెళ్లిపోయారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది.

విశాఖలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రభుత్వం వేగంగా స్పందించింది. భారీగా పరిహారం ప్రకటించింది. అయితే.. అసలు ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు వ్యవస్థల పనితీరే ప్రధానంగా చర్చకు వస్తుంది.

ఆంధ్రా న్యూస్ ఛానెళ్ల పని ఖతమేనా?

జగన్ ప్రకటించిన రూ. కోటి నష్టపరిహారం.. అబ్బో అనిపిస్తుంది. దాని గురించే చర్చించుకోవచ్చు. కానీ నేషనల్ మీడియా చూసే కోణం వేరేగా ఉంటుంది. వాళ్లు వ్యవస్థలపై చర్చిస్తారు. ఈ మాత్రం కసరత్తు లేకుండా.. సలహాదారులు మీడియా ముందుకెళ్లిపోయారు.

సహజంగానే ఆర్నాబ్ గోస్వామి గద్దించి ప్రశ్నలు వేస్తూంటారు. ఆయనను తట్టుకోవాలంటే అంతకు మించిన వేగం చూపాలి. కానీ ఐఏఎస్ అధికారిగా అనేక కీలక హోదాల్లో పని చేసి, రిటైరైన తర్వాత కూడా జగన్ టీంలో కీలకంగా ఉన్న పీవీ రమేష్ కనీసం గట్టిగా సమాధానం చెప్పలేకపోయారు.

బాధితులకు రూ. కోటి జగన్ ఇవ్వబోతున్నారని చెప్పడమే ఆయన ఎజెండాగా పెట్టుకున్నారు. చివరికి ఆర్నాబ్ వేసే ప్రశ్నలు తట్టుకోలేక పీవీ రమేష్ పక్కకెళ్లిపోయారు. దీనిపై ఆర్నాబ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాసేపటికి మళ్లీ వచ్చినా ఆర్నాబ్ ఆయనను సీరియస్‌గా తీసుకోలేదు.

డిసెంబర్ చివరి వరకు వర్క్‌ ఫ్రం హోం..!

ఇక టైమ్స్ నౌ చానల్‌లో దేవులపల్లి అమర్ మరింత క్లిష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. అది కూడా చాలా సింపుల్ ప్రశ్నలకు. పరిశ్రమ యాజమాన్యంపై ఏం చర్యలు తీసుకుంటున్నారన్న ప్రశ్నకు సీఎం కమిటీ వేశారని అమర్ చెప్పుకొచ్చారు.

ఆ కమిటీ కాలపరిమితి ఎంత… ఒక నెల.. రెండు నెలలు..మూడు నెలలా.. అని చర్చా కార్యక్రమం నిర్వహించే జర్నలిస్ట్.. గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తే.. జగ‌న్ కు జాతీయ మీడియాతో ఎలా వ్యవహరించాలో సలహాలిచ్చే జర్నలిస్టు దేవులపల్లి అమర్ చర్చ నుండి పక్కకు వెళ్లిపోయారు.

తమ వాదనను గట్టిగా వినిపించలేని వారిని జగన్ ఎంటర్‌టెయిన్ చేస్తున్నారన్న విమర్శలు సహజంగానే వస్తున్నాయి.

ప్రజారవాణాలో మార్పులు చేర్పులు!

Metro trains

గత 46 రోజులుగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ఆర్టీసీ,మెట్రో సర్వీసులు నిలిచిపోవడంతో కోట్ల రూపాయల నష్టం జరిగింది. అయితే మే 15న సమీక్షించి బస్సుల ప్రారంభం పై నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు.

అయితే మే 15 తర్వాత పలు మార్పులు చేసి ప్రజా రవాణాను ప్రారంభించేందుకు సర్కార్ సిద్దమైందని తెలుస్తోంది. బస్సులలో స్టాండింగ్ జర్నీ నిషేధించనున్నారు. అదే విధంగా ఇద్దరు కూర్చునే సీట్లలో ఒక్కరు, ముగ్గురు కూర్చునే సీట్లలో ఇద్దరికి అనుమతినివ్వనున్నారు. మెట్రో రైళ్లలో 900 మంది వరకు ప్రయాణించవచ్చు. ఇక నుంచి కొద్ది మందితోనే రైళ్లను నడపనున్నారు. అదే విధంగా మెట్రో స్టేషన్లలో ప్రయాణికులు నిల్చునేందుకు వీలుగా తెలుపు రంగు సర్కిళ్లు ఏర్పాటు చేయనున్నారు. బస్సులు మరియు మెట్రో రైళ్లలోకి మాస్కులు ఉంటేనే ప్రయాణికులను అనుమతించనున్నారు. స్టేషన్ లోకి వచ్చే ప్రయాణికులకు శానిటైజర్లు అందజేయనున్నారు. ప్రస్తుతం 3 జిల్లాలు గ్రీన్ జోన్ లో ఉన్నాయి. అదే విధంగా 22 జిల్లాల్లో గత 14 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దీంతో త్వరలోనే పలు మార్పులతో ప్రజా రవాణాను ప్రారంభించనున్నారని తెలుస్తోంది.

సాయిపల్లవికి ‘విరాటపర్వం’ సర్ ప్రైజ్ గిప్ట్

మే 9న సాయిపల్లవి బర్త్ డే సందర్భంగా ఆమె అభిమానులకు ‘విరాటపర్వం’ చిత్రబృందం సర్ ప్రైజ్ గిఫ్ట్ అందించింది. ‘ఫిదా’ మూవీతో తెలుగు ప్రేక్షకులను సాయిపల్లవి మెస్మరైజ్ చేసింది. న్యాచురల్ బ్యూటీగా పేరుతెచ్చుకొని వైవిధ్యమైన కథలతో విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళంలో స్టార్డమ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె రానా హీరోగా నటిస్తున్న ‘విరాటపర్వం’ మూవీలో నటిస్తుంది. వేణు ఉడుగుల ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. నేడు సాయిపల్లవి బర్త్ డే సందర్భంగా ఈ మూవీలో ఆమె లుక్ ను రిలీవ్ చేసి చిత్రబృందం అందరినీ సర్ ప్రైజ్ చేసింది.

వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న ‘విరాటపర్వం’లో సాయిపల్లవి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ మూవీలో సాయిపల్లవి పాత్రపై తొలి నుంచి చాలా ఇంట్రెస్టింగ్ వార్తలు విన్పించాయి. అందుకు తగ్గట్టుగా నేడు చిత్రబృందం సాయిపల్లవి సర్‌ప్రైజింగ్ లుక్ విడుదల చేసింది. అడవిలో అమరవీరుల స్థూపం వద్ద మెరూన్ కలర్ లంగావోణిలో తీక్షణంగా చూస్తూ కన్పిస్తుంది. ఆమె పాత్ర సినిమాకు ఎంతో కీలకమో ఈ లుక్ చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే ఈ మూవీ చిత్రీకరణ దాదాపు పూర్తి దశకు చేరుకుంది.

లాక్డౌన్ ముగిశాక మిగతా భాగం కాంప్లీట్ చేసి రిలీజ్ తేదిని ప్రకటించనున్నారు. ఈ మూవీలో నందితా దాస్, ప్రియమణి కూడా నటిస్తున్నారు. ఈ మూవీని సురేష్ బాబు, చురుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. సాయిపల్లవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు సర్ ప్రైజ్ గిప్ట్ ఇచ్చి మూవీపై భారీ అంచనాలను పెంచడంలో చిత్రబృందం సక్సస్ అయిందనే చెప్పొచ్చు.

ఎల్.జి పాలిమర్స్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత..!


విశాఖపట్నంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ వద్ద ఆర్‌ఆర్‌ వెంకటాపురం గ్రామస్థులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్యాస్‌ లీక్‌ ఘటనతో ఆ గ్రామానికి చెందిన పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పశువులు కూడా పెద్ద ఎత్తున మృతి చెందాయి. తమకు న్యాయం చేయాలంటూ పరిశ్రమ వద్ద గ్రామస్థులు ధర్నా చేస్తున్నారు. అప్పటికే అక్కడ విదుల్లో ఉన్న పోలీసులు ఆందోళనకారులను అడ్ఫుకునే యత్నం చేసినా వారు ఆగకుండా పరిశ్రమ వైపు దూసుకెళ్లారు.

బ్రాండ్ విశాఖ: జగన్ కు లాభమా? నష్టమా?

అదేవిధంగా ఆ పరిశ్రమను అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ పరిశ్రమను ఇక్కడ నుంచి తరలించే వరకు తమ ఆందోళనను విరమించబోమని గ్రామస్థులు మీడియాకు తెలిపారు.

ఆంధ్రా న్యూస్ ఛానెళ్ల పని ఖతమేనా?

మరోవైపు పరిశ్రమ వద్దకు కాసేపట్లో డీజీపీ గౌతమ్ సవాంగ్‌ రానున్నారు. అక్కడి పరిస్థితిని సమీక్షించి, గ్యాస్‌లీక్‌ ఘటనలో అస్వస్థతకు గురయిన పోలీసులను ఆయన పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత నెలకొనడం గమనార్హం. వందలాది మంది స్థానికులు పరిశ్రమ వద్దకు చేరుకుంటున్నారు. తమను అడ్డుకుంటున్న పోలీసులతో స్థానికులు వాగ్వివాదానికి దిగారు. దీంతో పరిశ్రమ పరిసరాల్లో ఆందోళనకర పరిస్థితి నెలకొంది.

డిసెంబర్ చివరి వరకు వర్క్‌ ఫ్రం హోం..!


లాక్ డౌన్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఐటి తదితర రంగాలలో పెద్ద ఎత్తున ప్రారంభించిన వర్క్‌ ఫ్రం హోం లాక్ డౌన్ పూర్తయిన తర్వాత కూడా కొంతకాలం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ చివరి వరకు అందుకు కంపెనీలకు అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు.

లాక్‌డౌన్‌ ఎత్తివేసిన వెంటనే కంపెనీలలోనే పనిచేయించుకోవాల్సి వచ్చిన పూర్తి సిబ్బందితో చేయించుకోనే అవకాశాలు కనబడటం లేదు. సంగం మందిని ఆఫీస్ కు రమ్మని, మిగిలిన వారితో ఇంటినుండి పనిచేయించుకొనే ఏర్పాట్లు జరిపే ఆలోచనలు చేస్తున్నారు.

బ్రాండ్ విశాఖ: జగన్ కు లాభమా? నష్టమా?

ఈ పద్దతిలో ఒక వారం ఇంటి నుండి, మరో వారం ఆఫీస్ నుండి వంతుల వారీగా పనిచేయించుకొనే ఆలోచనలు సాగుతున్నాయి. సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ కూడా ఇప్పటికే ఈ పద్ధతి అనుసరిస్తున్నట్లు తెలిపింది. లాక్‌డౌన్‌ సమయంలో ఇప్పటికే ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం కల్పించిన విషయం తెలిసిందే.

ఈ సంస్థతో పాటు మరో ప్రముఖ సెర్చ్‌ సంస్థ గూగుల్‌ కూడా ఇదే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి ప్రముఖ కంపెనీలన్నీ ఈ ఏడాది చివరి వరకూ వర్క్‌ ఫ్రం హోంకే మొగ్గు చూపుతున్నాయి.

భారత్ లో కూడా ప్రముఖ నగరాలైన హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైతో పాటు ముంబయి, ఢిల్లీలలో కూడా కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ నగరాల్లో ఇప్పటికే చాలా సంస్థలు తమ ఉద్యోగులతో ఇళ్లలో నుంచే పని చేయించుకుంటున్నాయి.

ఆంధ్రా న్యూస్ ఛానెళ్ల పని ఖతమేనా?

అయితే లాక్‌డౌన్‌ ఎత్తేయగానే ఉద్యోగులందరూ బయటికొచ్చేస్తే పరిస్థితి అదుపు తప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు ప్రముఖులు, అధికారులు, కంపెనీల యజమానులు సైతం ఆందోళన చెందుతున్నారు. మరికొన్నాళ్ల పాటు వర్క్‌ ఫ్రం హోం మంచిదని పలువురు వైద్యాధికారులు సైతం చెబుతున్నారు.

ప్రస్తుతం లాక్ డౌన్ లో కేంద్రం సడలింపులు ఇచ్చినప్పటికీ పలు కర్మాగారాలలో 30 శాతం మించి హాజరు కాకుండా చూసుకోవాలని నిబంధనలు పెట్టడం తెలిసిందే.

ఈ నెలాఖరు నాటికి సాధారణ పరిస్థితులు నెలకొనగలవని ఒక వంక అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా, ప్రస్తుతం దేశంలో కేసుల సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతూ ఉండడంతో ఆ తర్వాత పరిస్థితుల గురించి ఇప్పుడే ఒక అంచనాకు రాలేక పోతున్నారు. దానితో వర్క్ ఫ్రం హోం మరి కొంత కాలం తప్పని పరిస్థితులు స్పష్టం అవుతున్నాయి.

సెప్టెంబర్ 1 నుంచి బియ్యం డోర్ డెలివరీ!

ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో బియ్యం డోర్ డెలివరీ ని పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టారు. ఈ ప్రాజెక్టు ఆ జిల్లాలో విజయం సాధించడంతో రాష్ట్రం మొత్తం డోర్ డెలివరీ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టారు. సెప్టెంబరు 1 నుంచి నాణ్యమైన బియ్యాన్ని లబ్ధిదారుల ఇంటికే డోర్‌ డెలివరీ చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. అదే రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకు రావాలని ఆయన అన్నారు. పౌరసరఫాల శాక సమీక్షలో ఆయన ఈ ఆదేశాలు ఇచ్చారు.

ఎన్నికల హామీల్లో భాగంగా నాణ్యమైన, తినగలిగే బియ్యాన్ని డోర్‌ డెలివరీ చేస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. అప్పుడిచ్చిన మాటను సెప్టెంబర్ 1 నుంచి అమలుపరిచే విధంగా జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

మెగాస్టార్ కి రెండు బ్లాక్ బస్టర్ లిచ్చిన మే ‘9’


కేవలం వన్ ఇయర్ గ్యాప్ లో రెండు ఇండస్ట్రీ హిట్ సినిమాలు సాధించిన ఘనుడు మెగా స్టార్ చిరంజీవి. చాలా మందికి వరుస విజయాలు ఉన్నాయి గాని , చిరంజీవిలా ఒక సంవత్సరం గ్యాప్ లో 2 ఇండస్ట్రీ హిట్ సినిమాలు లేవు .
వైజయంతి మూవీస్ బ్యానర్ కి చిరంజీవికి ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు .ఆ బ్యానర్లో చిరంజీవి నాలుగు సినిమాల్లో నటిస్తే మూడు అల్ టైం హిట్స్ కాగా ఒకటి మాత్రం జస్ట్ హిట్ అయ్యింది. “జగదేక వీరుడు అతిలోక సుందరి , చూడాలని ఉంది , ఇంద్ర , జై చిరంజీవ ” వంటి నాలుగు చిత్రాల్లో చిరంజీవి నటిస్తే మొదటి మూడు సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. నాలుగో చిత్రం ‘జై చిరంజీవి `మాత్రం మామూలు సక్సెస్ సాధించింది. ఇక 1990 మే 9 వ తారీఖున వచ్చిన `జగదేకవీరుడు అతిలోకసుందరి `చిత్రం చిరంజీవి కెరీర్ లో ఒక మరపురాని చిత్రం అని చెప్పక తప్పదు. 29 కేంద్రాల్లో డైరెక్టుగా శతదినోత్సవం జరుపుకున్న ఈ చిత్రం , అనేక ఇతరకేంద్రాల్లో షిఫ్తుల్లో వంద రోజులు ప్రదర్శింపబడింది .కాగా ఈ చిత్రం విజయవాడ అప్సర థియేటర్ లో డైరెక్టుగా 200 రోజులు ప్రదర్శింపబడి నేటికీ రికార్డు గా నిలిచింది.


బ్రాండ్ విశాఖ: జగన్ కు లాభమా? నష్టమా?

`జగదేకవీరుడు అతిలోక సుందరి ` విడుదల అయిన సంవత్సరానికి 1991 మే 9 వ తారీఖున విడుదల అయిన శ్యాంప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్ వారి ” గ్యాంగ్ లీడర్ ” చిత్రం కూడా ఇండస్ట్రీ హిట్ అయ్యింది . మొత్తం 55 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న ` గ్యాంగ్ లీడర్` చిత్రం హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ లో 162 రోజులు ప్రదర్శింప బడి నేటికీ ఒక రికార్డుగా నిలిచింది .

అలా రెండు చిరంజీవి సినిమాలు ఒక సంవత్సరం గ్యాప్ లో ” మే 9 ” తేదీన విడుదలై ఇండస్ట్రీ హిట్ సినిమాలుగా నేటికీ నిలిచి పోయాయి .

దిల్ రాజు పాన్ ఇండియా మూవీ


స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు వరుస సినిమాలతో ఎపుడూ బిజీగా ఉంటాడు. ఆ క్రమంలో ఇపుడు దిల్ రాజు నిర్మాణం లో మూడు సినిమాల రూపొందుతున్నాయి. అందులో మొదటిది అయిన ” వి ” చిత్రం నాని హీరోగా దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన మూవీ. .కాగా ఇందులో మహేష్ బాబు బావ సుధీర్ బాబు కూడా మరో హీరోగా నటించడం జరిగింది. నిజానికి ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఈ పాటికి థియేటర్ లలోకి రావాల్సింది . కానీ లాక్ డౌన్ కారణంగా విడుదల వాయిపడింది. ఇక ఈ చిత్రం తరవాత పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ “వకీల్ సాబ్ ” కూడా దిల్ రాజు నిర్మాణంలో రూపొందినదే. ఈ సినిమా షూటింగ్ సైతం చివరి దశకు చేరుకుంది. కేవలం ఒక వారం , పది రోజుల పని మాత్రమే పెండింగ్ లో వుంది .ఇక మూడో చిత్రం దర్శకుడు వి .వి వినాయక్ హీరోగా ” శీనయ్య ” పేరుతొ తెరకెక్క బోతోంది .

బ్రాండ్ విశాఖ: జగన్ కు లాభమా? నష్టమా?

ఇవన్నీ ఒకెత్తు అయితే దిల్ రాజు దగ్గర ఓ భారీ పాన్ ఇండియా మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ ఒకటి ఉందని తెలుస్తోంది .దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి ఆ స్క్రిప్ట్ పూర్తి చేసి దర్శకత్వం చేసేందుకు రెడీ గా ఉన్నాడు అని తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీ కావడంతో కధకు తగ్గ స్టార్ హీరో కోసం నిర్మాత , దర్శకుడు ఎదురు చూస్తున్నారట…ఇక దీనితో పాటు అల్లు అర్జున్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో “ఐకాన్ ” అనే మూవీ చేయడానికి కూడా దిల్ రాజు ప్రణాళిక రూపొందించినట్టు తెలుస్తోంది .

అల్లు అరవింద్, కరణ్ జోహార్ కాంబోలో ప్రభాస్


బాహుబలి చిత్రం తరవాత ప్రభాస్ నటించే సినిమాలన్నీ భారీ బడ్జట్ తో పాన్ ఇండియా మూవీస్ గా నిర్మాణమౌతున్నాయి `సాహో ` చిత్రం తరవాత ప్రభాస్ చేస్తున్నజిల్ ఫేమ్ . రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీ కావడం విశేషం . కాగా ఈ చిత్రానికి ‘ఓ డియర్’ .. ‘రాధేశ్యామ్’ అనే టైటిల్స్ లో ఒకదానికి ఫిక్స్ అవ్వాలను కొంటున్నారు . ఇక ఈ చిత్రం తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ మరో పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో ఫాంటసీ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా సుమారు 500 కోట్ల బడ్జట్ తో రూపొందనుంది .. సూపర్ హీరోగా ప్రభాస్ కనిపించే ఈ సినిమా ఈ ఏడాది చివర్లో డిసెంబర్ నెలలో ప్రారంభం కానుంది .ఈ సినిమా పూర్తి కావడానికి సుమారు వన్ ఇయర్ పడుతుందట …

ఆంధ్రా న్యూస్ ఛానెళ్ల పని ఖతమేనా?

అదలావుంటే ఈ చిత్రం తరువాత ప్రభాస్ చేయనున్న సినిమా కూడా వందల కోట్ల భారీ బడ్జట్ రూపొందే చిత్రమే అని తెలుస్తోంది. తెలుగు , హిందీ భాషల్లో అగ్ర నిర్మాతలైన అల్లు అరవింద్ – కరణ్ జొహార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారని తెలుస్తోంది .. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ హిందీ భాషల్లో రూపొందే ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీ కావడం విశేషం . కాగా ఈ చిత్రం 2022లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది .

ప్రేయసి గొంతు కోసిన ఉన్మాది..!


ప్రేమ పేరుతో మైనర్ బాలిక గొంతు కోశాడు ఒక యువకుడు. గత కొంతకాలంగా ప్రేమ పేరుతో బాలికను వేధిస్తున్నాడు. ఈ రోజు ఏకంగా ఆమె ఇంట్లోకి వచ్చి హత్యా యత్నానికి పాల్పడ్డాడు. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా పెద్ద వడుగూరు మండలం గుత్తి అనంతపురం గ్రామంలో సుభద్ర అనే బాలిక తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. సుభద్ర పదవ తరగతి చదువుతుంది. అదే గ్రామంలో నివాసముంటున్న రామాంజనేయులు అనే యువకుడు కొంత కాలంగా ప్రేమ పేరుతో బాలికను వేధిస్తున్నాడు. బాలిక తల్లిదండ్రులు, బంధువులు హెచ్చరించినా యువకుడు తన వైఖరి మార్చుకోలేదు. ఈ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో సుభద్ర గొంతును బ్లెడ్ తో కోసి దాడికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుభద్రను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

బ్రాండ్ విశాఖ: జగన్ కు లాభమా? నష్టమా?

మరో ఘటనలో కంభం పట్టణంలోని కందులాపురం సెంటర్లో శుక్రవారం జక్కికాశీశ్వరరావు( 28) అనే యువకుడి హత్య సంచలనం సృష్టించింది. కంభం మండలం పొరుమామిల్ల పల్లి గ్రామానికి చెందిన కాశీశ్వరరావు బైకుపై వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన జక్కి కరుణాకర్ సాయంత్రం 4.30 గంటల సమయం లో తన కారుతో ఢీ కొట్టి హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు. తన చెల్లెలిని వేధిస్తున్న కాశీశ్వరరావును కరుణాకర్ పలుమార్లు హెచ్చరించినా వినకపోవడం తో ఈ సంఘటన కు పాల్పడినట్లు తెలుస్తోంది. కంభం ఎస్సై కె.మాధవ రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కొలిక్కి వచ్చిన నిమ్మగడ్డ కేసు..!


రాష్ట్ర మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు ఓ కొలిక్కి వచ్చింది. పిటీషనర్ లు, ప్రభుత్వం, ప్రస్తుత ఎస్.ఈ.సి కనగరాజ్ వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. ఎన్నికల కమిషన్‌కు సంబంధించి చట్టంలో మార్పులు చెయ్యదానికి, ఆర్డినెన్స్ తీసుకురావడానికి రాష్ట్ర అధికారాలకు ఆర్టికల్ 243(కె) వ్యతిరేకంగా భావించలేమని న్యాయవాది ఎస్ఎస్ ప్రసాద్ వాదనను వినిపించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులను ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. న్యాయవాదులు ఎల్ రవిచందర్, జ్వాలా నరసింహారావు రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా వాదించారు. న్యాయవాదులు వేదుల వెంకట రమణ, సత్య ప్రసాద్, జాంధ్యాల రవిశంకర్ నిమ్మగడ్డ తరుపున సమాధానం ఇచ్చారు. దీంతో ఈ కేసులో వాదనలు పూర్తయ్యాయి. ధర్మాసనం ఉత్తర్వులను కోర్టు రిజర్వు చేసింది.

బ్రాండ్ విశాఖ: జగన్ కు లాభమా? నష్టమా?

అంతకుముందు అడ్వకేట్ జనరల్ తన వాదనను వినిపించారు. సర్వీసు, పదవీ కాలం భిన్నంగా ఉన్నాయని, ఆర్టికల్ 243(కె) రమేష్ కుమార్‌ కు వర్తించదని ఆయన వాదించారు. న్యాయబద్ధంగా ఎన్నికలకు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ లో కొన్ని సంస్కరణను తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావించిందని, ఫలితంగానే ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని ఆయన అన్నారు. మాజీ ఎస్‌ఇసికి వ్యతిరేకంగా, అనుకూలంగా వ్యవహరించే ఉద్దేశ్యం ఇందులో లేదన్నారు. ఆయన కొన్ని సుప్రీంకోర్టు తీర్పులను ఉదహరించారు.

ఆంధ్రా న్యూస్ ఛానెళ్ల పని ఖతమేనా?

రాష్ట్ర ఎన్నికల సంఘం తరపున అడ్వకేట్ సివి మోహన్ రెడ్డి (మాజీ అడ్వకేట్ జనరల్) తన వ్రాతపూర్వక వాదనను సోమవారం దాఖలు చేసేందుకు ధర్మాసనం అనుమతించింది. మాజీ హైకోర్టు న్యాయమూర్తి ఎన్నికల కమిషన్‌కు తగిన వ్యక్తి అని, ఆయన నియామకాన్ని విమర్శించడానికి వయస్సు ఒక కారణం కాదని ఎస్‌ఇసి కనగరాజ్ తరపున న్యాయవాది ఎస్ఎస్ ప్రసాద్ వాదించారు.

ఆంధ్రా న్యూస్ ఛానెళ్ల పని ఖతమేనా?


ఆంధ్రా న్యూస్ చానెళ్ల పని ఖతమవుతోంది. జనాలు క్రమంగా వాటికి దూరం జరుగుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రా వాసులు కూడా తమ ప్రాంత చానెళ్లను చూడకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. హైదరాబాద్ లో ఉండి ఆంధ్రా వార్తలు వండి వారుస్తున్న ఆ ప్రాంత న్యూస్ చానెళ్లకు ఇప్పుడు గడ్డు కాలం ఎదురైంది. మొన్నటి వరకు పోటీపోటీగా పోటీపడ్డ ఆంధ్రా చానెళ్లను ఇప్పుడు తెలంగాణ చానెళ్లు వెనక్కి నెట్టడం షాక్ కు గురిచేస్తోంది. అనూహ్యంగా తెలంగాణ న్యూస్ చానెల్ వీ6 రెండో స్థానానికి ఎగబాకడం.. ఎన్టీవీ, టీవీ5 దిగజారడం మీడియా వర్గాల్లో హాట్ హాట్ చర్చకు దారితీస్తోంది.

*ఎప్పటిలానే టీవీ9 ఫస్ట్..
తాజాగా జీఆర్పీ రేటింగ్ లు విడుదలయ్యాయి. ఇందులో శరామామూలుగానే టీవీ9 అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ సంస్థ పెట్టినప్పటి నుంచి దానిదే అగ్రస్థానం. ఒకటిరెండు సార్లు అటూ ఇటూ అయినా ఎప్పటి నుంచో తెలుగు న్యూస్ చానెల్స్ లో అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది. ఇప్పుడు అదే నంబర్ 1లో కొనసాగుతోంది. విశేషం ఏంటంటే.. ఈ చానెల్ రేటింగ్ అందనంత ఎత్తులో ఉంది. దీనికి దరిదాపుల్లో ఆంధ్రా చానెల్స్ ఏవీ లేకపోవడం విశేషం. దీని తర్వాత రెండో స్థానంలో తెలంగాణ న్యూస్ చానెల్ వీ6 ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

*ఆంధ్రా చానెళ్ల పరిస్థితి మరీ ఘోరం
తాజాగా జీఆర్పీ రేటింగ్ లో టీవీ9 367.78 రేటింగ్ తో తొలి స్థానంలో ఉండగా.. దాని తర్వాత వీ6 272.96 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో తెలంగాణ న్యూస్ చానెల్ టీన్యూస్ 156.48 రేటింగ్ తో ఉంది. ఇక మొన్నటివరకు టీవీ9తో పోటాపోటీగా కొద్ది పాయింట్ల దూరంలోనే ఉన్న ఎన్టీవీ, టీవీ5 చానెల్ లు బాగా వెనుకబడడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఏకంగా ఎన్టీవీ 4వ స్థానంలో 108 పాయింట్లతో, టీవీ5 5వ స్థానంలో 90.94 పాయింట్లతో పరిమితమయ్యాయి. ఇక న్యూస్ పత్రికలను నడుపుతున్న ఈటీవీ 7వ స్థానంలో, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి 8వ స్థానంలో సాక్షి చానెల్ అయితే 10వ స్థానానికి దిగజారింది.

*ఎన్టీవీ, టీవీ5 వెనుకబాటుకు కారణమేంటి?
టీవీ9తో పోటాపోటీగా మొన్నటి వరకు పోటీపడ్డ ఎన్టీవీ, టీవీ5 రేటింగ్ లో దిగజారాయి. హైదరాబాద్ లో ఉన్న ఇవి ఎక్కువగా ఏపీ రాష్ట్రానికి సంబంధించిన వార్తలనే వండి వారుస్తున్నాయి. దీంతో హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రులు కూడా చూడడం లేదట.. హైదరాబాదీలంతా తెలంగాణకు సంబంధించిన వార్తలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. వారు తెలంగాణలో ఉండడంతో ప్రథమ ప్రాధాన్యం వాటికే ఇస్తున్నారు. అందుకే ఆంధ్రా వార్తలను ప్రసారం చేస్తున్న సదురు చానెళ్లను తిరస్కరిస్తున్నారు.

*దిగ్గజాలున్న ఆంధ్రాచానెళ్లకు ఇది అవమానామే..
ఎంత సేపు భజన.. అనవసర వివాదాలు.. ఆంధ్రా వార్తలను ఎక్కువగా ప్రసారం చేయడమే ఆంద్రా చానెళ్లు అయిన ఎన్టీవీ, టీవీ5, ఎబీఎన్, సాక్షి వెనుకబాటుకు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఒకే దానిపై ఎక్కువగా దృష్టి పెట్టకుండా అన్నింటిని ఇస్తూ వార్తలను వార్తలు చూపిస్తున్నందునే టీవీ9, వీ6 చానెళ్లకు ఆదరణ దక్కుతోందని చెప్పవచ్చు. ఇప్పటికైనా ఆంధ్రా వార్తలకే ప్రాధాన్యం ఇస్తే ఆ చానెళ్ల పరిస్థితి ఘోరంగా తయారవుతుందని రేటింగ్ చూస్తే అర్థమవుతోంది. సదురు చానెల్స్ తమ తీరు మార్చుకుంటే మనుగడ సాగిస్తాయి.. లేదంటే ఈ రేటింగ్ పతనం ఇంకా పెరిగే చాన్స్ ఉంది.

-నరేశ్ ఎన్నం

బ్రాండ్ విశాఖ: జగన్ కు లాభమా? నష్టమా?


బ్రాండ్ విశాఖ.. ఏపీకి కాబోయే రాజధానిగా పేరొందింది. వైసీపీ ప్రభుత్వం గద్దెనెక్కాక విశాఖను రాజధానిగా చేసేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. అక్కడ కరోనా వైరస్ మొదట్లో బాగా ప్రబలినా ఆ తర్వాత కట్టడి చేసింది వైసీపీ సర్కార్. విశాఖ బ్రాండ్ కు దెబ్బవస్తుందనే ఇక్కడ కరోనా కేసులు నమోదు చేయలేదన్న విమర్శలు వచ్చాయి. కానీ జగన్ సర్కార్ మాత్రం విశాఖ బ్రాండ్ దెబ్బతినకుండా అక్కడ కేసులు లేవంటోందన్నది ప్రతిపక్షాల ఆరోపణ.. ఏదైతేనేం విశాఖకు కరోనా ముప్పు పోయింది. ఇప్పుడు మరో ముప్పు వచ్చింది.

గ్యాస్ లీక్ వెనుక విజయసాయి రెడ్డి!

*వైసీపీ కలల రాజధానిగా విశాఖ సరిపోతుందా?
గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు.. ఆయన పార్టీ నేతలంతా ఏర్చికూర్చి అమరావతిని రాజధానిగా చేసి అభివృద్ధి చేశారు. వాళ్లు అభివృద్ధి అయ్యారు. కానీ వైసీపీ సర్కార్ గద్దెనెక్కాక పరిస్థితి మారిపోయింది. మూడు రాజధానులను తెరపైకి తెచ్చిన సీఎం జగన్ అమరావతిని హోల్డ్ చేసి.. విశాఖను పరిపాలన రాజధానిగా చేశారు. సకల సౌకర్యాలున్న విశాఖ ఏపీకి రాజధానిగా పర్ ఫెక్ట్ అని.. హైదరాబాద్ ను తలదన్నేలా అభివృద్ధి చెందిస్తామని తెలిపారు. కానీ వరుస దెబ్బలు విశాఖ రాజధానిగా ఏపీకి సూట్ అవుతుందా లేదా అన్న భయాన్ని సృష్టిస్తున్నాయి..

*గ్యాస్ లీక్ తో విశాఖ బ్రాండ్ కు దెబ్బ
విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి గ్యాస్ లీక్ కావడం.. ఆ వీడియోలు, ఫొటోలు వైరల్ కావడం.. ప్రజలు నిస్సహాయంగా పడిపోవడం.. చనిపోవడం చూసి దేశమే నివ్వెరపోయింది. ఇంతటి దుర్భరమైన జీవితం విశాఖలో ఉందా? గ్యాస్ కు అంతగా ప్రజలు అతలాకుతలం అయ్యారా? అని అందరూ షాక్ కు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఏపీకి రాజధానిగా విశాఖ పర్ ఫెక్ట్ అని ఇన్నాళ్లు చెప్పిన వైసీపీకి ఇది పెద్ద ఎదురుదెబ్బగా మారింది. గ్యాస్ లీక్ తో విశాఖ బ్రాండ్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గ్యాస్ లీకేజీ కారణంగా విశాఖలో గాలి నాణ్యత అసాధారణంగా క్షీణించడం పర్యావరణ వేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది.ఇది పరిపాలన రాజధానిగా మారితే పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన ఇప్పుడు అందరిలోనూ నెలకొంది.

కేంద్రం విద్యుత్ బిల్.. రైతుల పాలిట శాపం

*జగన్ కొనసాగిస్తారా? వెనక్కి తగ్గుతారా?
అయితే విశాఖకు పరిపాలను తరలిస్తే మంత్రులు, సీఎం, అధికారులంతా ఇక్కడి నుంచే పరిపాలించాలి. మరి విశాఖ భద్రత పరంగా సేఫేనా అన్న చర్చ మొదలైంది. విశాఖ బ్రాండ్ కు పడ్డ తొలగించుకునేందుకు సీఎం జగన్ నడుం బిగించారు. వెంటనే కాలుష్య నియంత్రణ మండలి సీనియర్ అధికారులతో మాట్లాడి విశాఖను సేఫ్ సిటీగా మలచడానికి ఏం చేయాలనే దానిపై చర్చించారు. చుట్టుపక్కల ఉన్న ప్రమాదకర కర్మాగారాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాద రహిత విశాఖ కోసం సమగ్ర రోడ్ మ్యాప్ ను సిద్ధం చేయాలని కోరారు. నివాసాలకు దూరంగా పరిశ్రమలను ఉంచాలని ఆదేశించారు. దీన్ని ఎన్ని ఉపద్రవాలు వచ్చినా విశాఖ రాజధాని విషయంలో జగన్ వెనక్కి తగ్గరని తేలింది.

*విశాఖ పరిస్థితులు కఠినం.. అయినా ముందుకే..
విశాఖలో పరిపాలన రాజధానికి అనువైనది కాదని తాజాగా గ్యాస్ లీక్ తో తేలింది. ఇక భూముల వ్యవహారాలు.. ఇతర అడ్డంకులు ఉండనే ఉన్నాయి. అయితే విస్తారమైన భవనాలు.. రాజధాని లక్షణాలు ఉన్నాయి. అందుకే ప్రమాదకర పరిశ్రమలున్నా జగన్ ముందుకే వెళ్లడానికి డిసైడ్ అయ్యారు. రాజధానిగా విశాఖకే మొగ్గు చూపుతున్నారు. విశాఖ బ్రాండ్ దెబ్బపడినా.. నష్టం చేకూరుస్తున్నా కూడా జగన్ విశాఖ రాజధానికే ఓటు వేస్తుండడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

-నరేశ్ ఎన్నం