
ఏపీలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం చదువులు అందించాలన్న జగన్ సంకల్పం నెరవేరడం లేదు. ప్రతిపక్షాలు, కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు దీనిని వ్యతిరేకిస్తున్నారు. మంచి సదుద్దేశంతో జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై పేద విద్యార్థులు సంతోషంగా ఉన్నారు. కానీ ప్రతిపక్షాల వల్ల ఇప్పుడు ఈ అద్భుతమైన కార్యక్రమానికి అడ్డు తగులుతోంది. తాజాగా మరోసారి ఏపీ సర్కార్ కు ఇంగ్లీష్ మీడియం రాష్ట్రంలో అమలు విషయంలో సుప్రీం కోర్టులో చుక్కెదురైంది.
ఏపీలో ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తే ఏపీ ప్రభుత్వం ఇటీవలే 81,85 జీవోలు తీసుకొచ్చింది. అయితే ఏపీలో 6వ తరగతి వరకు ఇంగ్లీష్ ను తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోలపై కొందరు హైకోర్టుకు ఎక్కారు. హైకోర్టు ఈ జీవోను కొట్టివేసింది.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే విచారణ జరిపిన సుప్రీం కోర్టులో ప్రతివాదులు.. ఏపీలో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేయడం సరికాదని.. మాతృభాషలోనే బోధించాలని వాదించారు.
అయితే సుప్రీం మాత్రం హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలన్న ఏపీ ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తామని ఆదేశించింది. వారి స్పందన చూశాక నిర్ణయిస్తామని తెలిపింది. విచారణను సెప్టెంబర్ 25కు వాయిదా వేసింది.
ఏపీలో సీఎం జగన్ ఈ విద్యాసంవత్సరం మొదట్లోనే ఇంగ్లీష్ మీడియం పెట్టడానికి డిసైడ్ అయ్యారు. ప్రతిపక్ష చంద్రబాబు అండ్ మీడియా జగన్ ప్రభుత్వంపై ఎన్నో విమర్శలు చేసింది. హైకోర్టుకు వివాదం చేరగా.. రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం ఇంగ్లీష్ మీడియంపై ముందుకెళ్లాలని జగన్ సర్కార్ ను హైకోర్టు ఆదేశించింది.
దీంతో ఏపీ ప్రభుత్వం విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసింది. 97శాతం మంది తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం కావాలని కోరారు. 3శాతం మంది మాత్రమే తెలుగు మీడియంకు ఓటేశారు. ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకిస్తున్న చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెలో కూడా ఇంగ్లీష్ మీడియం కావాలని తీర్మానం చేసి పంపించారు.
అయితే హైకోర్టులో కొందరు దీనికి వ్యతిరేకంగా పిటీషన్ వేయగా జీవోలను కోట్టివేసింది. సుప్రీం కోర్టుకు జగన్ సర్కార్ వెళ్లగా అక్కడా చుక్కెదురైంది. దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలా ముందుకెళుతుందనేది వేచిచూడాలి.


















ఒకవైపు చర్చలు అంటూనే.. మరో వైపు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమైంది. ఇప్పటికే చైనాకు షాకుల మీద షాకులు ఇస్తున్నా మన సైన్యాన్ని రెచ్చగొడుతూనే ఉంది. అంతకుమించి మన భూభాగాన్ని ఆక్రమించింది. రెండు కొండలను కైవసం చేసుకుంది. దీనికి దీటుగా భారత్ కూడా చైనా భూ భాగాన్ని ఆక్రమించి సమాధానం ఇచ్చింది. అయినా.. తన వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. ఇక చైనా సైన్యంతో పోరాడేందుకు భారత్ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. ఇందులోభాగంగా భారత్ టుటు రెజిమంట్ను రంగంలోకి దించుతోంది. ఇంటెలిజెన్స్ రెజిమెంట్గా గుర్తింపు పొందిన ఈ దళం.. సైన్యాధికారికి బదులు రా ద్వారా నేరుగా ప్రధానమంత్రికి నివేదిస్తుంది.





‘బాహుబలి’తో ప్రభాస్ టాలీవుడ్ రేంజ్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయారు. ‘బాహుబలి’ సిరీస్ లు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అన్నిచోట్ల భారీ కలెక్షన్లు రాబట్టడంతో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా వరల్డ్ వైడ్ గా పాపులర్ అయ్యాడు. ఈ మూవీ తర్వాత ప్రభాస్ వరుసబెట్టి పాన్ ఇండియా మూవీలే చేస్తున్నాడు. ‘బాహుబలి’ తర్వాత వచ్చిన సాహో కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కి మంచి విజయం సాధించింది. ఇక ప్రభాస్ రాముడిగా నటించనున్న ‘ఆదిపురుష్’ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది.









ప్రభుత్వం అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది రెవెన్యూ, పోలీసు శాఖలు. రెవెన్యూ అంటేనే ఆదాయం.. ఆ ఆదాయం ప్రభుత్వానికి చేర్చేలాగా ఆ శాఖ పనిచేయాలి. కానీ.. తెలంగాణ రాష్ట్రంలో అంతా రివర్స్. ప్రభుత్వానికి ఆదాయం ఇస్తే తమకేమస్తుందని అనుకుంటున్నారో ఏమో ముందు తమ బ్యాంకు ఖాతాలను నింపుకోవాలని చూస్తున్నారు. అందుకే ఎక్కడ చూసినా ఆ శాఖ వారు లంచాలకు మరిగారు. నిత్యం ఎక్కడో ఓ చోట.. ఏదో ఒక స్థాయి అధికారి ఏసీబీకి పట్టుబడుతూనే ఉన్నాడు. అయినా.. శాఖ తీరులో మాత్రం మార్పు రావడం లేదు.
