Home Blog Page 8331

కళ్లు తిరిగే రెమ్యూనరేషన్ తీసుకుంటున్న టాలీవుడ్ హీరోలు?

Tollywood film Industryఒకప్పటి సినిమా నిర్మాణానికి నేటి సినిమాను తెరకెక్కించే విధానంలో చాలా తేడాలున్నాయి. ఒకప్పుడు పది, యాభైకోట్ల బడ్జెట్ తో సినిమా చేస్తే అది భారీ బడ్జెట్ సినిమా. చిన్న సినిమాల బడ్జెటే 10కోట్లు దాటిపోతుండగా ఇక పెద్ద సినిమాలైతే మినిమం 100కోట్లు ఉండాల్సిందే. ఇక ప్యాన్ ఇండియా లెవల్ మూవీలైతే ఈ బడ్జెట్ మరికాస్తా పెరగాల్సిందే. సినిమా నిర్మాణంలో ఎక్కువ భాగంగా హీరోహీరోయిన్లు, దర్మకుల రెమ్యూనేషన్ కే పోతుంది. అగ్రభాగం వీరి ఖాతాలోకి వెళుతున్నట్లు సమాచారం.

ఒకప్పుడు టాలీవుడ్ సినిమాలు వందకోట్లు వసూలు చేయాలంటే చాలా కష్టంగా మారింది. అయితే ఇటీవల కాలంలో చాలా సినిమాలు వంద కోట్ల మార్కును దాటేసి 200, 300 కోట్లను కేవలం వారంరోజుల్లో రాబడుతున్నాయి. దీంతో నిర్మాతలు కూడా భారీ బడ్జెట్లకు ఏమాత్రం వెనుకడం లేదు. ఇక కొందరు హీరోలైతే సినిమాల్లో వాటా తీసుకుంటూ అత్యధిక ఆదాయాన్ని గడిస్తున్నారు. ప్రస్తుత జనరేషన్లోని టాలీవుడ్ హీరోలు ప్యాన్ ఇండియా రేంజ్ కి చేరుకోవడంతో వారి పారితోషకం కూడా అంతేస్థాయిలో ఉంటుంది.

ప్రస్తుత జనరేషన్లో టాలీవుడ్ నుంచి అత్యధిక పారితోషకం అందుకుంటున్న వారిలో డార్లింగ్ ప్రభాస్ ముందున్నట్లు సమాచారం. ‘బాహుబలి’తో వరల్డ్ వైడ్ గా ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ మూవీ తర్వాత వరుసబెట్టి అన్ని ప్యాన్ ఇండియా మూవీలే చేస్తూ తన రేంజ్ ను పెంచుకుంటూ పోతున్నాడు. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం నాగ్ అశ్విన్ మూవీతోపాటు ‘ఆదిపురుష్’ మూవీ ఉంది. ఈ రెండు చిత్రాలు కూడా భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్నారు. ఈ రెండు చిత్రాలకు ప్రభాస్ ఏకంగా 100కోట్ల పారితోషికం తీసుకోనున్నారని టాక్ విన్పిస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఇటీవల తన రెమ్యూనరేషన్ డబుల్ చేసాడట. ‘సరిలేరునీకెవ్వరు’తో 200కోట్లు వసూలు చేసిన మహేష్ తన రెమ్యూనరేషన్ 40కోట్ల నుంచి 80కోట్లకు పెంచినట్లు గుసగుసలు విన్పిస్తున్నాయి. ఇక పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’కు ఏకంగా రూ.50కోట్లు తీసుకుంటున్నాడట. అదేవిధంగా స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సైతం ఇటీవల మంచి హిట్లతో దూసుకెళుతున్నాడు. ‘అలవైకుంఠపురం’ మూవీ తర్వాత వస్తున్న ‘పుష్ప’ మూవీకి రూ.35కోట్లు వసూలు చేస్తున్నాడట.

జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’లో నటించేందుకు రూ.33కోట్లు తీసుకుంటున్నాడట. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ‘రంగస్థలం’ హిట్టుతో మంచి ఫామ్ లో ఉన్నారు. అయితే ఆ వెంటనే వచ్చిన ‘వినయ విధేయ రామ’ డిజాస్టర్ గా మిగిలింది. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’లో రాంచరణ్ నటిస్తున్నందుకుగాను రూ.33కోట్లు తీసుకుంటున్నాడనే వార్తలు విన్పిస్తున్నారు. ఏదిఏమైనా టాలీవుడ్ స్టార్లు దిమ్మతిరిగే రెమ్యూనరేషన్లు అందుకుండటం చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్ లో తుఫాన్.. అతడే ఏకాకి? అసలేమైంది?

Indian Congress‘సీడబ్ల్యూసీని పునర్వ్యవస్థీకరించాలి. పీసీసీలకు మరిన్ని అధికారాలను అప్పగించాలి. పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేద్దాం. 6 నెలల్లో ఏఐసీసీ సమావేశాన్ని ఏర్పాటు చేయండి. పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోండి. అధికారం కేంద్ర స్థాయిలో ఎక్కువగా కేంద్రీకృతం కావడం, ప్రతీ చిన్న అంశాన్ని అగ్ర నాయకత్వమే నిర్ణయించడం దీర్ఘకాలంలో పార్టీకి ప్రతికూలంగా పరిణమిస్తుంది. అలాగే, కేంద్ర పార్లమెంటరీ బోర్డు, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీలను మళ్లీ కొత్తగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
2014, 2019 సాధారణ ఎన్నికల్లో పార్టీ ఓటమికి చాలా కారణాలున్నాయి. 2019 ఎన్నికలు జరిగి 14 నెలలు పూర్తయినా.. ఇప్పటికీ ఆ ఓటమిపై నిష్పక్షపాత సమీక్ష జరగలేదు. దేశంలో ప్రస్తుతం అభద్రతతో కూడిన భయం వాతావరణం నెలకొని ఉంది. ఈ పరిస్థితులను ఎదుర్కొనే క్రియాశీల విపక్షంగా నిలవాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉంది. ఎన్‌ఎస్‌యూఐ, యూత్‌ కాంగ్రెస్‌ల్లో ఎన్నికలు నిర్వహించాలి. ప్రజాస్వామ్య, లౌకిక శక్తులతో కూడిన దేశవ్యాప్త కూటమిని రూపొందించేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించాలి. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న నేతలందరినీ కూడా ఈ వేదికలో భాగస్వామ్యులను చేయాలి’  అంటూ ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌‌ నేతలు కాంగ్రెస్‌ చీఫ్ సోనియా గాంధీకి లేఖ రాశారు.

కాంగ్రెస్‌లో సంచలనం సృష్టించిన ఈ లేఖలో పలువురు కేంద్ర మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఇతర సీనియర్‌ నేతలు సంతకాలు చేశారు. వారిలో గులాం నబీ ఆజాద్, కపిల్‌ సిబల్, శశి థరూర్, పీజే కురియన్, ఆనంద్‌ శర్మ, మనీశ్‌ తివారీ, రేణుకా చౌదరి, మిలింద్‌ దేవ్‌రా, అజయ్‌ సింగ్, ముకుల్‌ వాస్నిక్, జితిన్‌ ప్రసాద, భూపిందర్‌ సింగ్‌ హూడా, రాజిందర్‌ కౌర్‌ భట్టల్, వీరప్ప మొయిలీ, పృథ్వీరాజ్‌ చవాన్, రాజ్‌ బబ్బర్, అరవింద్‌ సింగ్‌ లవ్లీ, సందీప్‌ దీక్షిత్‌ తదితరులున్నారు. ఇదిలా ఉండగా, రాహుల్‌ గాంధీ మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కోరుతూ మరి కొందరు నేతలు లేఖ రాశారు. ఎంపీ మానికం ఠాగోర్‌ ఈ డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. ‘గాంధీలు త్యాగానికి గుర్తులు. రాహుల్‌ గాంధీ మళ్లీ అధ్యక్షుడు కావాలని 1,100 మంది ఏఐసీసీ సభ్యులు, 8,800 పీసీసీ సభ్యులు, 5 కోట్లమంది పార్టీ కార్యకర్తలు, 12 కోట్ల మంది పార్టీ మద్దతుదారులు కోరుకుంటున్నారు’ అని ఆయన పేర్కొన్నారు.

దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఏఐసీసీ వెంటనే గత నెల 24న సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేసింది. అధ్యక్ష ఎంపికనే ప్రధాన అజెండాగా సాగాల్సిన సీడబ్ల్యూసీ మీటింగ్‌ లేఖ చుట్టే తిరిగింది. ఇదే సమావేశంలో ఎంపీ రాహుల్ గాంధీ అసమ్మతి వాదులంటూ.. పార్టీలో బీజేపీ ఏజెంట్లంటూ ఘాటు విమర్శలకు కూడా దిగారు. ఈ విమర్శలు చేసిన కాసేపటికే సీనియర్లైన ఆజాద్, సిబల్ రాహుల్ పై తీవ్రంగా ధ్వజమెత్తారు. దీంతో కాంగ్రెస్ శిబిర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

ఆ తర్వాత ఈ 23 మంది నేతలు ఆజాద్ ఇంట్లో సమావేశమయ్యారు. చాలా రోజులపాటు అందరూ ఒకే తాటిపై నిలబడ్డారు. కానీ.. మెళ్లిమెళ్లిగా ఆ అసంతృప్తుల్లోనూ చీలిక వచ్చింది. ఇప్పుడు రెండు శిబిరాలుగా విడిపోయినట్లుగా సమాచారం. చివరగా ఆజాద్‌ను ఏకాకీని చేసినట్లుగా తెలుస్తోంది. లేఖ, తదనంతర పరిణామాలను మరిచిపోయి తిరిగి క్రియాశీలకంగా మారిపోదాం అని ఓ నేత ప్రతిపాదనలు పెట్టగా.. ఆ ప్రతిపాదనల మీద విభేదాలు వచ్చినట్లు సమాచారం. డిమాండ్లపై అధిష్ఠానాన్ని ఓ పట్టు పట్టాల్సిందేనని, వెనక్కి తగ్గవద్దని తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో అసమ్మతి శిబిరం రెండు వర్గాలుగా చీలిపోయింది. ఈ వారంలోనే మరోసారి సమావేశం కావాలనుకున్నా.. హాజరు కాకూడదని ఓ వర్గం డిసైడ్ అయ్యింది. మరో వర్గం మాత్రం ఈ సమావేశంలోనే తదుపరి కార్యాచరణను సిద్ధం చేసుకుంటామని ప్రకటించింది.

అయితే లేఖ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన ఎంపీ శశి థరూర్ మాత్రం మళ్లీ ఈ లేఖపై చర్చించడానికి ఏమాత్రం సిద్ధపడటం లేదు. అది ‘ముగిసిన అంశమ’ని, మళ్లీ చర్చలెందుకని అంటున్నారు. పార్టీలో జూనియర్లైన జితిన్ ప్రసాద్‌ (యూపీ), అఖిలేశ్ ప్రసాద్ సింగ్ (బిహార్) కూడా అది ముగిసిన అధ్యాయమని పేర్కొంటున్నారు. అయితే ఈ శిబిరానికి అనధికారికంగా నాయకత్వం వహిస్తున్న గులాంనబీ ఆజాద్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈయనతోపాటు కపిల్ సిబల్, మనీశ్ తివారీ కూడా ఆజాద్ వైపే మొగ్గు చూపారు. లేఖలో పేర్కొన్న అంశాలపై తాము పోరాడతామని, మరి కొందరు కూడా కలిసి వస్తారని, ఇది వ్యక్తి గురించి కాదని, పార్టీ గురించి అని ఆజాద్ వర్గం స్పష్టం చేస్తోంది.

ఇన్ టాక్ : చీరాల, గన్నవరంలో వైసిపి వర్గపోరు

YSRCP clarified on alliance with BJP, says party will fight next election  alone in state - India News

గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు విస్తరిస్తోంది అన్న వార్తలు వింటూనే ఉన్నాం. చాపకింద నీరులా వర్గపు అనేది వైసీపీలో చల్లగా పాకుతోంది. వైఎస్ వర్ధంతి సందర్భంగా కృష్ణా, ప్రకాశం జిల్లాలలో వైసీపీ నేతల మధ్య అంతర్గత విభేదాలు మరోసారి బయటకు వచ్చాయి. 

ప్రకాశం జిల్లాలో కరణం, ఆమంచి వర్గాల మధ్య ఉన్న వైరం గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అది మరొకసారి బయటపడింది. వైసిపి వర్ధంతి సందర్భంగా కరణం వెంకటేష్, ఎమ్మెల్సీ పోతుల సునీత నాయకులు కార్యకర్తలు వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు చీరాల ప్రజలకు స్వేచ్ఛను ఇస్తామని గతంలో లాగా అరాచకాలు బెదిరింపులు సాగవని…. ఇక అలా కాదని బెదిరిస్తే చూస్తూ కూర్చోమని… జాగ్రత్తగా ఉండమని ఆమంచిని ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేశారు. అభివృద్ధి కోసమే వైసీపీలోకి వచ్చామని చెప్పి…. బాలినేని శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో అందరం కలిసి చీరాల అభివృద్ధి చేసుకుందాం అని వెంకటేష్ పిలుపునిచ్చారు. 

అయితే ఈ వ్యాఖ్యలకు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తీవ్రంగానే స్పందించారు. తన పేరుని ఉచ్చరించడానికి భయపడే వాళ్ళు కూడా ఇలా వార్నింగ్ లు ఇస్తున్నారని… చివరికి జగన్ పార్టీలో చేరి వీరంతా బ్రతికి పోయారు…. అని ఆయన తనదైన శైలిలో స్పందించారు. అధికారం లేకపోతే బ్రతకలేని వాళ్లు నా గురించి ఇలా మాట్లాడేవారే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక గన్నవరం లో కూడా వైసిపి వర్గ పోరు రోజురోజుకూ తీవ్రమవుతుంది. ఇక్కడ కూడా వైయస్ వర్ధంతి సందర్భంగానే పార్టీ నేతల మధ్య విభేదాలు బట్టబయలు కావడం గమనార్హం. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ,  వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు మధ్య ఉన్న విబేధాలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. ఉంగుటూరు మండలం తేలప్రోలు లో వైఎస్ విగ్రహానికి పూల మాలలు వేయడంతో వివాదం రాజుకుంది. 

మంత్రులు, ఎమ్మెల్యేలు రాకముందే దుట్టా వర్గీయులు పూల మాలలు వేయడంతో వంశీ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వంశీ తీరుపై దుట్టా కూడా తీవ్ర అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసలు సీఎం వైఎస్ జగన్ కు వంశీని తాను పరిచయం చేశానని వైఎస్ కుటుంబానికి తాను సన్నిహితుతుడినని దుట్టా అన్నారు. పార్టీని నమ్ముకుని బ్రతికున్నంత కాలం వైసీపీలోనే ఉంటామని అన్నారు. టిడిపి నుండి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తే సహించబోయేది లేదని…. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని నేనే అని ఆయన ప్రకటించుకోవడం గమనార్హం. ఇక అసలే అమరావతి అగ్గి బాగా రాజుకుంటున్న దశలో జిల్లా ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో అంతర్గత విభేదాలు వైసీపీ ని చూసి చూసి చావుదెబ్బ కొడతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

తెలంగాణ.. ఊపిరి పీల్చుకో..!

Money in Telanganaఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయాక కూడా తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమే. కానీ.. ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌, తదుపరి పరిణామాలతో అప్పుల కుప్పైంది. దీనికి తోడు కరోనా వైరస్‌ రాష్ట్ర ఖజానాను పూర్తిగా దెబ్బతీసింది. ప్రపంచ దేశాలను కుదిపేసిన వైరస్‌ రాష్ట్రాన్నీ వదల్లేదు. కేంద్రం విధించిన లాక్‌డౌన్‌తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారింది. అన్‌లాక్‌తో ఇప్పుడిప్పుడే ఖజానా నిండుతున్నట్లు కనిపిస్తోంది.

సెప్టెంబర్‌‌ నెలతో అన్‌లాక్‌ 4 ఓపెన్‌ అయింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ పరిస్థితులే కనిపిస్తున్నాయి. అన్నీ ఓపెన్‌ అయ్యాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కూడా సాధారణ స్థితికి చేరుకుంటోంది. లాక్‌డౌన్‌తో ఐదు నెలలుగా ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వానికి ఆగస్టు నెల కొంత ఉత్సాహాన్ని కల్పించింది. ఆగస్టు నెలలో అన్ని రకాల ఆదాయాలు కలుపుకొని రూ.13 వేల కోట్ల వరకు వచ్చింది. ఎక్సైజ్‌, రిజిస్ర్టేషన్‌, వాణిజ్య పన్నుల శాఖల నుంచి గతంలో అంత కాకున్నా.. చెప్పుకునే స్థాయిలోనే ఆదాయం వచ్చింది. దీంతో మళ్లీ అప్పులకు పోవాల్సిన ముప్పు తప్పింది.

లాక్‌డౌన్‌తో ఏప్రిల్‌లో ఏకంగా 83 శాతం ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయింది. ఆ నెలలో కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా కూడా కలుపుకుని వచ్చింది రూ.3,377 కోట్లు మాత్రమే. ఆ తర్వాత కొద్ది కొద్దిగా పెరుగుతూ వచ్చింది. ఆంక్షలు సడలించిన తర్వాత జూన్‌లో రూ.6,975 కోట్లు వచ్చింది. మరో రెండు నెలల తర్వాత ఇది రెట్టింపైంది. మద్యం అమ్మకాలు సాధారణ స్థితికి వచ్చాయి. దీంతో ఆదాయం పెరుగుతూ వచ్చింది.

దేశం మొత్తం మాంద్యం గుప్పిట్లో చిక్కుకుంటోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నా.. హైదరాబాద్‌లో మాత్రం ఆస్తుల లావాదేవీలు ఆశాజనకంగా సాగుతున్నాయి. ఆగస్టులో మద్యం, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.7 వేల కోట్లకు ఆదాయం వచ్చింది. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో నిర్మాణ రంగంతోపాటు ఇతర రంగాలు కూడా తిరిగి ప్రారంభమయ్యాయి. రాబోయే రోజుల్లో హోటళ్లు, ఇతర సేవా రంగాల కార్యకలాపాలు పుంజుకునే అవకాశాలూ లేకపోలేవు. కరోనాకు ముందు అంచనా వేసిన బడ్జెట్ అంచనాల ప్రకారం ఇంకా రాకున్నా మరో రెండు నెలల్లో ఆ స్థాయి ఆదాయం వస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

అచ్చెన్న జగన్ కు జీవితాంతం రుణపడిపోవాలా….?

achenna jagan will take a photo

2014లో నవ్యాంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని మెజారిటీతో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన టీడీపీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం చతికిల పడింది. 175 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఏపీలో కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. ఆ 23 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరంగా ఉన్నారు. మరికొంత మంది ఎమ్మెల్యేలపై 2014 – 2019 మధ్య కాలంలో అవినీతికి పాల్పడారనే ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి.

Also Read : బాబు వెంట ఉన్నది ఎంతమంది?

అలా ఏపీ ఈ.ఎస్.ఐ కుంభకోణంలో అరెస్ట్ అయిన ఎమ్మెల్యేలలో అచ్చెన్నాయుడు ఒకరు. ఈ కేసులో కొన్ని రోజులు జైలు జీవితం గడిపిన అచ్చెన్న తాజాగా బెయిల్ పై విడుదలయ్యారు. కరోనా బారిన పడిన అచ్చెన్న కొన్ని రోజుల క్రితమే వైరస్ నుంచి కోలుకున్నారు. అయితే జగన్ సర్కార్ హయాంలో నమోదైన కేసులే అచ్చెన్న పాలిట వరంగా మారాయి. చంద్రబాబు అచ్చెన్నను ఏపీ టీడీపీ శాన‌స‌స‌భ ప‌క్ష ఉప‌నేతగా నియమించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

అచ్చెన్నకు పదవి దక్కితే మాత్రం ఆయన జగన్ కు జీవితాంతం రుణపడి ఉండాలి. జగన్ అచ్చెన్నను జైలుకు పంపకపోతే చంద్రబాబుకు అచ్చెన్నాయుడికి పదవి ఇవ్వాలనే ఆలోచన సైతం వచ్చి ఉండేది కాదని టీడీపీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. అచ్చెన్నకు పదవి ఇవ్వడం ద్వారా ఉత్తరాంధ్రలోను, బీసీలలోను టీడీపీపై సానుకూలత వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయి. పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో అచ్చెన్నకు బాధ్యతలు అప్పగించడమే సరైన నిర్ణయమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. త్వరలో అచ్చెన్న పదవికి సంబంధించి అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Also Read : ఏపీ కేబినెట్: వరాలు కురిపించిన జగన్

పవన్ 30వ సినిమా కోసం గురుశిష్యుల పోటీ?

నిన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ అంతా ఆయన నామస్మరణతోనే గడిపేశారు. పవన్ 49వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఫ్యాన్స్ వేడుకలు చేసుకున్నారు. సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ చెప్పడంతోపాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఇక పవన్ తాజాగా నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ దర్శకులు ఒకదాని వెనుక ఒకటి ఇవ్వడంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీ అయ్యారు.

పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక వరుస సినిమాలతో ఫుల్ బీజీగా మారాడు. దిల్ రాజు నిర్మాణం తెరకెక్కుతున్న ‘వకీల్ సాబ్’ ఇప్పటికే 80శాతం షూటింగు పూర్తి చేసుకొంది. త్వరలోనే ఈ సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. నిన్న పవన్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంది. దీంతోపాటు పవన్-క్రిష్ కాంబోలో వస్తున్న సినిమాకు సంబంధించి ఫ్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. పవన్ తొలిసారి ఓ పీరియాడికల్ మూవీ చేస్తుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్-హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న చిత్రానికి సంబంధించిన అప్డేడ్ కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

పవన్ చివరగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అజ్ఞాతవాసి’లో నటించాడు. ఇది పవన్ 25వ మూవీగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. పవన్ 26వ మూవీగా ‘వకీల్ సాబ్’ రాబోతుంది. ఆ తర్వాత వరుసగా దర్శకుడు క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ కాంబినేషన్లో మూవీలు రాబోతున్నాయి. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఈ నాలుగు సినిమాలతో బీజీగా ఉన్నాడు. దాదాపు మూడేళ్లపాటు ఆయన డేట్స్ ఖాళీగా లేనట్లు తెలుస్తోంది. అయితే తాజాగా పవన్ 30వ సినిమాపై టాలీవుడ్లో జోరుగా చర్చ జరుగుతోంది.

పవన్ 30వ సినిమా కోసం దర్శకుడు త్రివిక్రమ్, అతడి శిష్యుడు వెంకీ కుడుముల పోటీపడుతున్నారట. ఇప్పటికే త్రివిక్రమ్ తో పవన్ కల్యాణ్ ఓ మూవీ చేసేందుకు కమిట్ అయినట్లు తెలుస్తోంది. దర్శకుడు వెంకీ సైతం పవన్ కోసం ఓ కథను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. వెంకీ కుడుముల త్రివిక్రమ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ పని చేశాడు. ఆ తర్వాత ఛలో, భీష్మ వంటి కమర్షియల్ హిట్లు సాధించి గురువు తగ్గ శిష్యుడు అనిపించుకున్నాడు. పవన్ 30వ సినిమా కోసం వీరిద్దరు పోటీపడుతుండటం ఆసక్తిని రేపుతోంది. వీరిద్దరిలో పవన్ ఎవరికి ఛాన్స్ ఇస్తారో వేచిచూడాల్సిందే..!

ఎన్టీఆర్ పాత ఇంట్లో త్రివిక్రమ్ !


త్రివిక్రమ్ గత వారం రోజులు నుండి డైలీ ఎన్టీఆర్ ఇంటికి వెళ్తున్నాడని.. ప్రస్తుతం ‘అయినను పోయి రావలె హస్తినకు’ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పై త్రివిక్రమ్ – ఎన్టీఆర్ మధ్య చర్చలు నడుస్తున్నాయని.. ప్రతి సీన్ ను త్రివిక్రమ్ తారక్ కు ఎక్స్ ప్లేన్ చేస్తున్నాడని.. ఈ సిట్టింగ్ తో దాదాపు స్క్రిప్ట్ లాక్ అయిపోతుందని త్రివిక్రమ్ టీమ్ లోని ఓ అసిస్టెంట్ ద్వారా అందుతున్న సమాచారం. అయితే ఈ కథా చర్చలు జరుగుతుంది ఎన్టీఆర్ ప్రస్తుతం ఉంటున్న ఇంట్లో కాదు అట. ఎన్టీఆర్ కి మోహిదీపట్నంలో ఓ ఇల్లు ఉంది. గతంలో తారక్ ఆ ఇంట్లోనే ఉండేవారు. ఇప్పుడు ఆ ఇంటిలోనే త్రివిక్రమ్ – తారక్ స్క్రిప్ట్ పనుల్లో ఉన్నారట. ప్రతి సీన్ లో ఇన్ వాల్వ్ అవుతూ బెటర్ మెంట్ చేయడం తారక్ కి అలవాటు. అరవింద సమేత సినిమాలో కూడా చాలా పాయింట్స్ తారక్ చెప్పినివే అని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో త్రివిక్రమే డైరెక్ట్ గా చెప్పిన సంగతి తెలిసిందే.

Also Read: హీరోయిన్ ఫీల్ ను అర్ధం చేసుకున్న పవన్ కళ్యాణ్ !

ఇప్పుడు ఈ స్క్రిప్ట్ లో కూడా తారక్ అలాగే ఇన్ వాల్వ్ అవుతున్నట్లు ఉన్నాడు. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం త్రివిక్రమ్ నేటి భిన్నమైన రాజకీయ నేపథ్యం ఎంచుకున్నారని… సినిమాలో రాజకీయాలతో పాటు ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు గాని, ఎన్టీఆర్ గనుక రాజకీయ నేపథ్యంలో సినిమా చేస్తే.. అది తెలుగు తమ్ముళ్లుకు మంచి ఎనర్జీని ఇస్తోంది. ఎలాగూ తెలుగుదేశం కూడా సరైన స్టార్ డమ్ ఉన్న నాయకుడు లేక, రోజురోజుకు నిరసించిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ నుండి రాజకీయ సినిమా అనగానే ఫ్యాన్స్ లో భారీ అంచనాలు పెరిగిపోయాయి.

Also Read: వయసు ముదిరినా తరగని అందం..

అందుకే త్రివిక్రమ్ కూడా ఈ సినిమాలో నటించే నటీనటుల విషయంలో కూడా భారీ తారగణాన్ని తీసుకుంటున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంలో మలయాళీ స్టార్ మోహన్ లాల్ కోసం త్రివిక్రమ్ ఓ కీలక పాత్రను రాశాడని.. అలాగే బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ కూడా ఈ సినిమాలో మరో కీలక పాత్రలో కనిపించబోతుందని వార్తలు వస్తున్నాయి. ఆమెది పక్కా రాజకీయ నాయకురాలి పాత్ర అట. అలాగే ఎన్టీఆర్ పాత్ర కూడా రాజకీయాలకి ముడిపడి ఉంటుందట. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. వారిలో ఒకరిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను అనుకుంటున్నారు. సెకెండ్ హీరోయిన్ గా రాశి ఖన్నాను తీసుకోవాలనే యోచనలో ఉన్నారు. ‘జై లవకుశ’లో ఎన్టీఆర్, రాశి ఖన్నాల జోడీ బాగా కుదిరింది. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

హీరోయిన్ ఫీల్ ను అర్ధం చేసుకున్న పవన్ కళ్యాణ్ !


మొత్తానికి హాట్ బ్యూటీ నికీషా పటేల్ కి పవన్ కళ్యాణ్ విషెస్ తెలిపాడు. అయితే పవన్ విషెస్ వెనుక ఓ ఆసక్తికరమైన ట్వీట్ ఉంది. పవన్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో జరిగిన హడావుడి గురించి తెలిసిందే. దేశ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ బర్త్ డే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయ్యేలా చేయడంలో పవర్ స్టార్ ఫ్యాన్స్ సక్సెస్ అయ్యారు. పవన్ పై కొంతమంది చేసిన బ్యాడ్ కామెంట్స్ కి కూడా పవన్ ఫ్యాన్స్ తమ శైలిలో బదులిస్తూ రెచ్చిపోయారు. ఇక ఎప్పటిలాగే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి ప్రముఖులు పోటీ పడ్డారు. టాలీవుడ్ నుంచే కాకుండా ఇతర సినీ పరిశ్రమల నుండి కూడా కొంతమంది హీరోహీరోయిన్లు పవన్‌కు తమ బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ క్రమంలో ఎప్పుడో పవన్ కళ్యాణ్ తో కొమురం పులిలో హీరోయిన్ గా నటించిన హాట్ బ్యూటీ నికీషా పటేల్ కూడా పవన్ ను విష్ చేస్తూ ట్వీట్ చేసింది. అయితే ఆమె తెలియజేసిన విషెస్ కాస్త ఆసక్తికరంగా ఉంది.

Also Read: ప్లాప్ డైరెక్టర్ మీద 500 కోట్లు పెట్టడమేమిటి ?

తనను పవన్ కళ్యాణ్ పెద్దగా పట్టించుకోవట్లేదని ఈ హీరోయిన్ బాగా అలిగినట్టుగా ట్వీట్ చేసింది. ఈ అలక వెనుక గతేడాది చేదు సంఘటన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నికీషా పటేల్ గతేడాది కూడా పవన్ కళ్యాణ్ బర్త్ డే విషెస్ చెప్పింది. అయితే అప్పుడు ఆమె తెలిసి తెలియక హ్యాష్ ట్యాగ్‌లో పవన్ కళ్యాణ్‌కు బదులు పావలా కళ్యాణ్ అనే హ్యాష్ ట్యాగ్‌ ను పెట్టి విష్ చేసి.. పవన్ ఫ్యాన్స్ దృష్టిలో ఘోరమైన తప్పిదం చేసేసింది. దాంతో ఈ బ్యూటీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి పోశారు పవన్ ఫ్యాన్స్. దెబ్బకు ట్వీట్ డిలీట్ చేసి మళ్లీ సరైన హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేసింది నికీషా పటేల్. అయినా నికీషాను మాత్రం పవన్ ఫ్యాన్స్ వదిలిపెట్టలేదు. ఆ తరువాత కొన్ని రోజులుపాటు బాగా ట్రోల్ చేశారు. ఫ్యాన్స్ తనని తిడుతున్నా పవన్ అప్పుడు రియాక్ట్ అవ్వలేదు అనుకుని ఫీల్ అయిందో ఏమో గాని నికిషా పవన్ కి కాస్త ఫీల్ అయినట్టు ట్వీట్ చేసింది.

Also Read: వయసు ముదిరినా తరగని అందం..

‘హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ గారూ.. మీరెప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అయితే మీ నుంచి మాత్రం నాకు ఎన్నడూ బర్త్ డే విషెస్ రాలేదు. రాకపోయినా సరే.. నేను మాత్రం ప్రతీ ఏడాది మీ బర్త్ డేకు ప్రత్యేకంగా విషెస్ చెబుతూ వస్తున్నాను. మీకు విషెస్ చెప్పడం ఎప్పుడూ మర్చిపోలేదు. ఇక ఈ సంవత్సరం మాత్రం నేను సరైన హ్యాష్ ట్యాగ్‌ను ఉపయోగించాను’ అంటూ నికీషా ట్వీట్ చేసింది. అయితే నికీషా ఫీల్ ను అర్ధం చేసుకున్న పవన్ కళ్యాణ్ స్పందించాడు. పవన్ ట్వీట్ చేస్తూ.. ‘బర్త్ డే విషెస్ చెప్పినందుకు థ్యాంక్స్.. నీకు అంతా మంచి జరగాలి అని పవన్ పోస్ట్ చేసాడు.

ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం.. ప్రముఖ హీరోయిన్ కు నోటీసులు

sandalwood

బాబు వెంట ఉన్నది ఎంతమంది?

0

టీడీపీ ఆవిర్భావం నుంచి ఎన్నడూ ఎదుర్కొని గడ్డు పరిస్థితులను ఆ పార్టీ ప్రస్తుతం ఎదుర్కొంటోంది. కిందటి ఎన్నికల్లో జగన్ ప్రభంజనం ముందు టీడీపీ బొక్కబొర్లాపడింది. టీడీపీ అధినేత చంద్రబాబు వేసుకున్న క్యాలిక్యులేషన్స్ ఏవీ కూడా ఆయనకు కలిసిరాలేదు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని నమ్మి ఎన్డీఏ కూటమి వీడి యూపీఏ పక్షాన చేరారు. అయితే కేంద్రంలో బీజేపీ.. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడంతో టీడీపీకి గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటోంది.

గతంలోనూ టీడీపీ ప్రతిపక్ష పాత్రను పోషించినప్పటికీ ప్రస్తుతం టీడీపీ నాయకత్వలేమితో కొట్టుమిట్టాడుతున్నట్లు కన్పిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంకా 20ఏళ్ల నాటి రాజకీయాలే చేస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. ఇక చంద్రబాబు నాయుడు తనయుడు సైతం పార్టీని ముందుండి నడిపించలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆయన క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకోవడం కేవలం ట్వీట్స్ కే పరిమితం అవుతుండటంతో ఆ పార్టీ నేతలంతా పక్కచూపులు చూస్తున్నారు.

కిందటి ఎన్నికల్లో టీడీపీ నుంచి 23మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు జగన్ కు జై కొట్టారు. దీనికితోడు అమరావతి రాజధాని విషయంలోనూ చంద్రబాబు తీరుతో ఇతర ప్రాంతాల్లోని టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి జంప్ అవుతున్నారు. తమ భవిష్యత్ గురించి ఆలోచించుకొని ముందస్తుగానే దుకాణాన్ని సర్దేసుకుంటుండటంతో టీడీపీ ఆయా జిల్లాల్లో ఖాళీ అవుతోంది.

చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబులు ప్రజా సమస్యలపై పోరాడకుండా కేవలం జగన్ పై ఆరోపణలకే సమయం కేటాయిస్తున్నారు. గతంలో వైసీపీ చంద్రబాబుపై ఎలాంటి ఆరోపణలు చేసిందో అవే ఆరోపణలను జగన్ పై చంద్రబాబు చేస్తున్నారు. నాడు చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న చర్యలకు.. ప్రస్తుతం జగన్ తీసుకుంటున్న చర్యలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రభుత్వంపై విమర్శలు వచ్చిన వెంటనే జగన్ తక్షణమే చర్యలు తీసుకుంటుండటంతో చంద్రబాబు కంటే జగనే బెటారన్ అనే టాక్ ప్రజల నుంచి విన్పిస్తోంది.

దీంతో టీడీపీలో గెలిచిన నేతలతోపాటు, ఓడిన నేతలు వైసీపీ కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో టీడీపీలో పెద్దఎత్తున వలసలు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఆపార్టీలో ఎంతమంది ఉన్నారనే లెక్క టీడీపీ అధినేతక దొరకడం లేదట. ఇది ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో టీడీపీ కనుమరుగు అవడం ఖాయమనే ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఇకనైనా పాతచింతకాయ పచ్చడిలాంటి రాజకీయాలు మాని ప్రజా సమస్యలపై పోరాడాలని పలువురు సూచిస్తున్నారు.

ఐపీఎల్-2020పై నీలినీడలు.. క్రికెటర్లలో భయాందోళన


ఐపీఎల్-2020 నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. తాజాగా ఐపీఎల్ కు చెందిన చెన్నై జట్టులోని 13మంది కరోనా వైరస్ బారినపడ్డారు. దీంతో ఐపీఎల్ లో ఆడేందుకు ఆస్ట్రేలియా క్రికెటర్లు కంగారు పడుతున్నారు. అయితే బీసీసీఐ క్రికెటర్ల భద్రతా కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా పలువురు కరోనా బారిన పడటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

చెన్నై జట్టు సభ్యులు క్రికెటర్లు కరోనా బారినపడటానికి బుబుల్స్ కారణమని ప్రచారం జరుగుతోంది. క్రికెటర్లంతా ఆటకు ముందుగా బయో సెక్యూర్ లో కొంతకాలం ఉండాల్సి ఉంటుంది. ఇటీవల విజెన్డ్ టెస్టు కోసం కూడా ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు టెస్టు సీరిస్ కోసం సుమారు 70రోజులు బయో సెక్యూర్ బబుల్ లో ఉన్నాయి. వీరితోపాటు మాంచెస్టర్, సౌతాంప్టన్ ల్లోనూ క్రికెటర్లు బయో బబుల్ ఉన్నారు. అప్పుడు ఎలాంటి కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

అయితే తాజాగా ఐపీఎల్ బయో బబుల్ ఉన్న చెన్నై క్రికెటర్లకు కరోనా సోకడంతో ఆందోళన రేకెత్తిస్తోంది. 13మంది కరోనా బారిన పడటంతో ఐపీఎల్లో ఆడేందుకు ఆస్ట్రేలియా క్రికెటర్లు కంగారు పడుతున్నారు. ఇప్పటికే ఐపీఎల్ నుంచి రైనా, మలింగలు అవుట్ అయ్యారు. వీరిద్దరు కూడా ఐపీఎల్ లో స్టార్ ప్లేయర్ గా రాణించారు. ప్రస్తుతం వీరిద్దరు ఐపీఎల్ కు దూరం కావడంతో ఐపీఎల్ కళతప్పే అవకాశం కన్పిస్తోంది. అంతేకాకుండా పలువురు ఐపీఎల్ నిర్వహణపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఐపీఎల్-2020ను బీసీసీఐ ఎలా నిర్వహిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

కాళేశ్వరం నీళ్లు ఏడ పాయె..!


తెలంగాణ రాష్ట్ర సీఎం కలల ప్రాజెక్టు కాళేశ్వరం. 1.14 లక్షల కోట్ల ఖర్చు.. అంత ఖర్చు పెట్టి నిర్మించిన ఈ ప్రాజెక్టు రైతాంగాన్ని ఏమైనా ఆసరా అయిందా అంటే ఒక్క టీఎంసీని వాడుకోలేని పరిస్థితి. ఎందుకంటే మునుపెన్నడూ లేని విధంగా ఈసారి భారీ వర్షాలు పడ్డాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ప్రాజెక్టులు నిండుకుండలా కనిపిస్తున్నాయి. గేట్లు సైతం తెరుచుకున్నాయి. ఇంకేముంది.. ఈ సారి కాళేశ్వరం నీళ్లు అవసరం లేకుండా రాష్ట్రంలో 85 లక్షల ఎకరాల సాగు వానల కిందనే సాగులోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా కోటి 26 లక్షల ఎకరాల్లో పంటలు సాగైతే.. మేజర్‌‌ పార్ట్‌ అంతా కూడా వానల మీద ఆధారపడే రైతులు పంటలు వేశారు.

ఈ ఏడాది కూడా ఎప్పటిలాగే రాష్ట్రంలోని పంటలకు పాత ప్రాజెక్టులే ప్రాణాధారం అయ్యాయి. భారీగా కురిసిన వానలు, బావులు, బోర్లు పంపు సెట్లు నిండి రైతాంగాన్ని ఆదుకున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈ సారి 1.26 కోట్ల ఎకరాల్లో పంటలు సాగైతే.. ఇందులో ఇరిగేషన్‌ ప్రాజెక్టుల ద్వారా సాగులోకి వచ్చిన ఆయకట్టు కేవలం 41 లక్షల ఎకరాలు. అంటే మూడో వంతులోపే అన్నట్లు. ప్రాజెక్టుల రీ డిజైన్‌తో కోటి ఎకరాల మాగాణికి సాగునీరందిస్తామని సీఎం కేసీఆర్‌‌ మైక్‌ పట్టుకున్నప్పుడల్లా చెబుతుంటారు. కానీ.. ఈ సారి కేవలం 41 లక్షల ఎకరాలకే ప్రాజెక్టుల ద్వారా నీళ్లిచ్చేందుకు ప్రిపేర్‌‌ అయినట్లు ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ చెబుతోంది. అంటే గడిచిన ఆరేళ్లలో ఇలాంటి పరిస్థితి ఇదే ఫస్ట్‌ టైం అని చెప్పొచ్చు.

ఈ ఏడాది రాష్ట్రంలో 46 శాతం అదనంగా వానలు పడ్డాయి. దానికి అనుగుణంగా పంటల విస్తీర్ణం కూడా గణనీయంగా పెరిగింది. ఈ సీజన్‌లో 560.4 మిల్లీమీటర్ల వర్షపాతం అంచనా వేయగా.. వారం రోజుల క్రితం వరకే 819 మి.మీ. వర్షపాతం నమోదైంది. 14 జిల్లాల్లో భారీ వర్షాలు పడగా.. 11 జిల్లాల్లో అధికంగా.. 8 జిల్లాల్లో సాధారణ రెయిన్‌ ఫాల్‌ రికార్డయింది. ఈ సీజన్‌కు 1.25 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేయగా.. ఇప్పటికే 1.26 కోట్ల ఎకరాల్లో పంటలు సాగైనట్లు ప్రభుత్వం లెక్కలేసింది.

ప్రాజెక్టుల కింద సాగులోకి వచ్చిన భూముల్లో ఎక్కువగా శ్రీరాంసాగర్‌‌ ప్రాజెక్ట్‌ కిందనే ఉన్నాయి. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన ఈ ప్రాజెక్టు కింద 16.21 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఎస్సారెస్పీ స్టేజీ 1,2 సదర్మాట్‌, చౌట్పల్లి హన్మంతరెడ్డి, అలీసాగర్‌‌, గుత్ప లిఫ్ట్‌ స్కీంలు, ఐడీసీ స్కీములతో ఈ నీరు ఇవ్వనున్నారు. నాగార్జునసాగర్‌‌ ఎడమ కాలువ, ఏఎమ్మార్‌‌ ఎస్‌ఎల్బీసీ కింద మరో 8.50 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుండగా.. జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌ సాగర్‌‌, కల్వకుర్తి లిఫ్ట్‌ స్కీంలు, ఆర్డీఎస్‌ కింద మ్మడి మహబూబ్‌నగర్‌‌ జిల్లాలో 8 లక్షల ఎకరాలకు నీరందించాలని ప్రతిపాదించారు. ఇవన్నీ కూడా ఉమ్మడి ఏపీలో నిర్మించిన ప్రాజెక్టులే.

కేసీఆర్‌‌ సర్కార్‌‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూ.1.14 లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నీటితోనే రాష్ట్రంలో కోటి ఎకరాల సాగు విస్తీర్ణం అవుతున్నట్లు మరో వైపు ప్రభుత్వం షో చేసుకుంటోంది. కానీ.. వాస్తవ పరిస్థితులు చూస్తే ఈ ఏడాది కాళేశ్వరంతో ప్రభుత్వం ఒక్క ఎకరం ఆయకట్టును కూడా ప్రతిపాదించలేదు. ఎగువన కురిసిన వర్షాలతో ఎస్సారెస్పీ జలకళను సంతరించుకోగా.. ఎల్లంపల్లి దిగువన గోదావరి ఉరకలేస్తోంది. ఎప్పుడూ కాళేశ్వరం మీదనే దృష్టి పెట్టిన కేసీఆర్‌‌ ఎల్లంపల్లి నీటిని వినియోగంలోకి తీసుకురావడంలో ఫెయిల్‌ అయినట్లు ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. గోదావరితో నిండిపోయిన ఎల్లంపల్లి నుంచి మళ్లీ 16 టీఎంసీల నీటిని గోదాట్లోకే వదిలేశారు. అటు కాళేశ్వరమూ.. ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఈ సీజన్‌కు నిరుపయోగంగానే మారాయి.

-శ్రీని

భారత్ సత్తా.. పాక్‌కు మరోసారి ఎదురుదెబ్బ


అవకాశం దొరికినప్పుడల్లా ఏదో ఒక ప్రేరేపిత చర్యలకు పాల్పడుతూనే ఉంటుంది ఇండియా మీద పాకిస్థాన్‌. కశ్మీర్‌‌ను కైవసం చేసుకోవడానికి ఉగ్ర చర్యలకూ వెనకాడదు. మన భారత సైన్యం ఎన్ని సార్లు తిప్పికొట్టినా.. కేంద్రం ఎన్నిసార్లు దీటుగా సమాధానం ఇచ్చినా పాక్‌ తన బుద్ధి మాత్రం మార్చుకోవడం లేదు. దెబ్బ మీద దెబ్బ పడుతున్నా తన కుట్రలను వీడడం లేదు. ఐక్యరాజ్యసమితిలోనూ దేశాలన్నీ పాక్‌తో విబేదించినా కుఠిల రాజకీయాలు చేస్తూనే ఉంది.

తాజాగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో (యూఎన్‌ఎస్‌సీ)లో మరోసారి పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ తాకింది. భద్రతా మండలిలో ఇద్దరు భారతీయులను ఉగ్రవాదులుగా ప్రకటిస్తూ పాకిస్థాన్‌ చేసిన తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి తిరస్కరించింది. అసలు ఉగ్రవాదులను తన దేశంలోనే పెట్టుకొని భారతీయులను ఉగ్రవాదులుగా చేర్చడంపై భారత్‌ ఫైర్‌‌ అయింది.

ఉగ్రవాదంపై మతపరమైన రంగును పులమడం ద్వారా 1267 ప్రత్యేక విధానాన్ని రాజకీయం చేసే ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు ఐక్యరాజ్యసమితికి భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి బుధవారం తెలిపారు. యూఎన్‌ఎస్‌సీ యొక్క 1267 ఉగ్రవాద నిరోధక ఆంక్షల కమిటీ కింద అంగార అప్పాజీ, గోవింద పట్నాయక్ అనే ఇద్దరు భారతీయులను ఉగ్రవాద కార్యకర్తలుగా గుర్తించే చర్యను పాకిస్తాన్ ప్రారంభించింది. అందుకే ఈ చర్యను తిప్పికొట్టినట్లు వెల్లడించారు.

అయితే ఈ ఆరోపణలకు మద్దతు ఇవ్వడానికి ఆధారాలు సమర్పించడంలో పాకిస్థాన్ విఫలమైంది. ఏ ఆరోపణ చేసినా పాక్‌ వాటిని నిరూపించడంలో విఫలం అవుతూనే ఉంటుంది. కానీ.. బుద్ధిమాంద్యంతో ఎప్పటికప్పుడు భారత్‌పై ఆరోపణలు చేస్తూనే ఉంటుంది. తాజాగా చేసిన ఆరోపణల నేపథ్యంలో అమెరికా, యుకె, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం నేతృత్వంలోని యూఎన్‌ఎస్‌సీ పాకిస్థాన్ చర్యను అడ్డుకోవాలని నిర్ణయించింది. ఉగ్రవాదంపై మతపరమైన రంగును పులమడం ద్వారా 1267 ప్రత్యేక విధానాన్ని రాజకీయం చేయటానికి పాకిస్థాన్ చేసిన విఫల ప్రయత్నాన్ని యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అడ్డుకుందని.. ఈ పాకిస్తాన్ చర్యను అడ్డుకున్న కౌన్సిల్ సభ్యులందరికీ కృతజ్ఞతలు అని టీఎస్ తిరుమూర్తి ట్వీట్ చేశారు.

సుశాంత్ కేసు: రంగంలోకి ఎన్.సీ.బీ.. రియా చుట్టూ ఉచ్చు?


ఎంఎస్ ధోని సినిమాతో ఫేమస్‌ అయిన సుశాంత్ సింగ్.. 2008లో స్టార్ ప్లస్ లోని ఓ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయం అయ్యారు.  ఆ సీరియల్ మంచి విజయం సాధించడంతో సుశాంత్ సింగ్ పేరు మారుమోగింది. ఆ తరువాత కై పో చెయ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.  ఈ సినిమా తరువాత శుద్ధ్ దేశీ రొమాన్స్, ఎంఎస్ ధోని, కేదారనాథ్, చిచ్చోరె సినిమాల్లో నటించి మెప్పించారు.  సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ మేనేజర్ దిశా సలిన్ ఆత్మహత్య చేసుకున్న కొన్ని రోజులకే సుశాంత్ కూడా ఆత్మహత్య చేసుకోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ షాక్ తింది. అయితే ఆయన కేసులో అతని ప్రియురాలైన రియా చక్రవర్తి చుట్టూ ఉచ్చుబిగుస్తున్నట్లు తెలుస్తోంది.

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యకు సంబంధించిన కేసులో తాజాగా నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (NCB)అబ్దుల్‌ బాసిత్‌ అనే వ్యక్తిని అరెస్ట్‌ చేసింది. ఇతని అరెస్టుతో సుశాంత్‌ గర్ల్‌ఫ్రెండ్‌ రియా ఇరకాటంలో పడినట్లైంది. అబ్దుల్‌ బాసిత్‌తో రియా సోదరుడికి సంబంధాలు ఉన్నట్లు వార్తలు రావడంతో.. NCB అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. బాంద్రాలో ఇతడిని అదుపులోకి తీసుకోగా.. అతనికి సుశాంత్‌ మేనేజర్‌‌ శామ్యూల్‌ మిరండాతోనూ సంబంధాలు ఉన్నాయని తెలిపింది. అంతేకాకుండా రియా సోదరుడు షోవిక్‌ సూచనల మేరకు బాసిత్‌ నుంచి మిరండా డ్రగ్స్‌ తీసుకునే వాడని బ్యూరో తెలిపింది.

మిరండా గతంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఇంట్లో హౌస్ కీపింగ్ మేనేజర్‌‌గా గతేడాది మే నెలలో రియానే నియమించింది. ఇంటికి సంబంధించిన ఖర్చుల వ్యవహారాలన్నీ మిరండానే చూసుకునే వాడు. మిరండా పైన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఫ్యామిలీ కూడా ఆరోపణలు చేసింది. అతను డబ్బులు కొల్లగొట్టేవాడని, డ్రగ్స్ సరఫరా చేసేవాడని విమర్శలు గుప్పించింది.

ఈ కేసుకు సంబంధించి అబ్దుల్ బాసిత్‌తోపాటు జైద్ విలాత్రాను కూడా NCB అరెస్టు చేసింది. కాగా సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో ఎన్నో ఆశ్చర్యకర వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. సుశాంత్ కేసుతో సంబంధం ఉన్న యాభై మందికి పైగా విచారించారు ముంబై పోలీసులు. రియా చక్రవర్తి కీలకంగా ఈ కేసులో డ్రగ్స్ వ్యవహారం బయటపడింది. దీంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది. రోజుకో మలుపులు తిరుగుతున్న ఈ కేసులో ఇప్పటికే రియా తనకేం సంబంధం లేదన్నట్లుగా వాదిస్తోంది. బలమైన ఆధారాలు మాత్రం ఆమెకు వ్యతిరేకంగా దొరుకుతున్నాయి. మరి ఈ కేసు చివరికి ఎటు మలుపుతుందో చూడాలి.

ఓటీటీ విడుదల పరంపరలో ‘నాంది’ !


హిట్ లేకపోతే ఒకప్పుడు వరుస హిట్స్ ఉన్న హీరో కూడా మార్కెట్ లేక ఖాళీగా కూర్చోవాల్సి వస్తోంది. ప్రస్తుతం అల్లరి నరేష్ పరిస్థితి అదే. చాలా కాలం నుంచి హిట్ కోసం ఫైట్ చేస్తూ, హిట్ కొట్టలేక బాక్సాఫీస్ వద్ద పూర్తిగా తెలిపోతూ గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో సతమతవుతున్నాడు అల్లరి నరేష్. ఎట్టకేలకు అతి కష్టంమీద నరేష్ చేస్తోన్న ప్రయోగాత్మక చిత్రం ‘నాంది’. కాగా తాజాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమాని జీ5 ఓటీటీ సంస్థ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఎంతకు కొనింది అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. మరో పది రోజులు షూటింగ్ డేస్ బ్యాలెన్స్ ఉన్నాయట.

Also Read: ప్లాప్ డైరెక్టర్ మీద 500 కోట్లు పెట్టడమేమిటి ?

కాగా ఆ పది రోజుల షూటింగ్ ను కూడా ఫినిష్ చేసి.. ఆ తరువాత ఈ సినిమాని జీ5లో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాది శాడ్ ఎండింగ్ అని.. బాగా ఎమోషనల్ గా సాగే క్లైమాక్స్ చివర్లో అల్లరి నరేష్ పాత్ర చనిపోతుందని.. సెంటిమెంట్ పీపుల్స్ కి ఈ సినిమా ప్రత్యేకంగా కనెక్ట్ అవుతుందని తెలుస్తోంది. ఇక అల్లరి నరేష్ కూడా ఈ సినిమా పై బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. అందుకే పోలీస్ స్టేషన్ సన్నివేశాల్లో పూర్తిగా నగ్నంగా కనిపించడానికి కూడా అంగీకరించాడు. అల్లరి నరేష్ లాంటి హీరోకి ఇలాంటి పాత్ర చేయాల్సిన అవసరం లేదు, కానీ కేవలం కథ బాగా నచ్చి నరేష్ రెమ్యునరేషన్ ను కూడా తగ్గించుకుని ఈ సినిమాని చేశాడు. అందుకే విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పై మొదటి నుండి మంచి అంచనాలు ఉన్నాయి.

Also Read: వయసు ముదిరినా తరగని అందం..

దానికి తగ్గట్టుగానే ఈ సినిమా టీజర్ కి కూడా విపరీతమైన స్పందన వచ్చింది. టీజర్ వల్లే.. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన ఆసక్తి నెలకొంది. కెరీర్ లో ఎక్కువగా కామెడీ జానర్లో సినిమాలు చేసి తనకంటూ ఓ మిడియమ్ రేంజ్ మార్కెట్ సృష్టించుకున్న అల్లరి నరేష్.. కెరీర్ మొదట్లోనే నేను, ప్రాణం సినిమా లాంటి ఇంటెన్స్ చిత్రాలను కూడా చేశాడు. కానీ, ఆ సినిమాలేవి నరేష్ కి సక్సెస్ ను తెచ్చి పెట్టలేదు. అయితే గతంలో కూడా గమ్యం, శంభో శివ శంభో’ లాంటి చిత్రాలు నరేష్ కి మంచి పేరు తెచ్చి పెట్టాయి. కానీ ఈ సినిమాల్లో హీరో నరేష్ కాదు, కేవలం నరేష్ హీరోగా వచ్చిన ఇలాంటి చిత్రాలన్నీ ప్లాప్ అయ్యాయి. మరి ఇప్పుడు ఇలాంటి సినిమాతో నరేష్ ఎలా హిట్ కొట్టగలడో చూడాలి.

ఏపీ కేబినెట్: వరాలు కురిపించిన జగన్

ఏపీ కేబినెట్ ప్రజలపై వరాల జల్లు కురిపించింది.. ముఖ్యంగా ఏపీలో ఉచిత విద్యుత్ ఎత్తివేసి మీటర్లు బిగిస్తారనే ప్రచారం జరుగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ కేబినెట్ భేటిలో ఉచిత విద్యుత్ పథకం-నగదు బదిలీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. రైతుకు విద్యుత్ ఎప్పటికీ ఉచితమేనని.. ఒక్క కనెక్షన్ కూడా తొలగించబోమని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో రైతుపై ఒక్కపైసా భారం కూడా పడదని హామీ ఇచ్చారు.

వ్యవసాయ కనెక్షన్లను రెగ్యులరైజ్ చేస్తున్నట్టు సీఎం జగన్ తెలిపారు.30-35 ఏళ్లపాటు ఉచిత విద్యుత్ పథకానికి ఢోకా లేదని జగన్ అన్నారు. రైతు ఖాతాల్లో విద్యుత్ బిల్లు డబ్బులు వేస్తామని.. అదే డిస్కంలకు రైతులు కట్టాలని సీఎం జగన్ సూచించారు.

శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఉచిత విద్యుత్ పథకం అమలు కానున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిపారు. కేంద్రం సంస్కరణల వల్ల ఇలా నగదు బదిలీ తెస్తున్నామని వివరించారు.

కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవడమేనని చంద్రబాబు అన్నారని.. కానీ బాబు మిగిల్చిన రూ.8వేల కోట్ల బకాయిలను తమ ప్రభుత్వం తీర్చిందన్నారు. రైతులకు ఎప్పటికీ అన్యాయం జరగనీయబోమని.. రైతులకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని జగన్ తెలిపారు.

*ఏపీ కేబినెట్ తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు
*పంచాయితీరాజ్ శాఖలో డివిజనల్ డెవలప్ మెంట్ పోస్టులకు ఆమోదం
*గుంటూరు, ప్రకాశం జిల్లాలో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు స్థలాల కేటాయింపు
*విజయనగరం జిల్లాలో సుజల స్రవంతి పథకానికి ఆమోదం
*ఆన్ లైన్ జూదం, పేకాటలను నిషేధిస్తూ గేమింగ్ చట్టంలో సవరణలు
*పేకాట ఆడుతూ దొరికితే కఠిన శిక్షలు

ఆ యంగ్ హీరో టైమింగ్ కి మహేష్ ఫిదా !


సూపర్ స్టార్ మహేష్ బాబుకు సినిమా నిర్మాణం పై కూడా బాగా ఆసక్తి ఎక్కువ. అందుకే ఎంబీ ప్రొడక్షన్స్ అనే తన ఓన్ ప్రొడక్షన్ కంపెనీ పెట్టుకున్నాడు. తన ప్రతి సినిమాని ఈ కంపెనీలో ఇన్ వాల్వ్ చేయడం మహేష్ ఈ మధ్య బాగా అలవాటు చేసుకున్నాడు. ఆవతల ఎంత బడా ప్రొడ్యూసర్ ఉన్నా.. ప్రొడక్షన్ విషయంలో తన కంపెనీ నుండి కూడా పక్కా లెక్కల వ్యవహారాలు ఉండాలనేది మహేష్ కండీషన్. ఏమైనా మహేష్ పర్ఫెక్ట్ యాక్టర్ తో పాటు పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ గా కూడా బాగా రాణిస్తున్నాడు. ఇప్పటికే ఏ హీరో చేయలేని, ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ తో థియేటర్స్ బిజినెస్ ను కూడా సమర్ధవంతంగా హ్యాండిల్ చేస్తున్నాడు.

Also Read: ప్లాప్ డైరెక్టర్ మీద 500 కోట్లు పెట్టడమేమిటి ?

పైగా తన ప్రొడక్షన్ కంపెనీలో తన సినిమాలనే కాకుండా బయట హీరోలతో కూడా సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ.. తన ప్రొడక్షన్ కంపెనీని ఇంకా విస్తృత పరుస్తున్నాడు మహేష్. ఇప్పటికే మల్టీ టాలెంటెడ్ హీరో అడవి శేష్ హీరోగా వస్తోన్న ‘మేజర్’ సినిమాని నిర్మిస్తూనే మరో యంగ్ హీరోతో కూడా ఓ కామెడీ ఎంటర్ టైనర్ ను ప్లాన్ చేస్తున్నాడు. యంగ్ హీరో న‌వీన్ పోలిశెట్టి ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో వెండితెర పై హీరోగా ఎంట్రీ ఇచ్చి.. తనకంటూ ఓ ప్రత్యేకమైన కామెడీ టైమింగ్ ఉందని నిరూపించుకున్నాడు. మొదటి సినిమాతోనే మంచి హిట్ ను సొంతం చేసుకున్నాడు నవీన్. అయితే రీసెంట్ గా ఈ సినిమాని మహేష్ చూశాడట. సినిమాలో నవీన్ కామెడీ టైమింగ్‌ మహేష్ కి బాగా నచ్చిందని.. అందుకే తన ప్రొడక్షన్ లో నవీన్ తో ఓ సినిమా చేయాలని.. ఇప్పటికే నవీన్ తో కూడా మంచి కథ ఉంటే తీసుకురా.. మన ప్రొడక్షన్ లో సినిమా చేద్దాం అని మహేష్ చెప్పినట్లు తెలుస్తోంది.

Also Read: వయసు ముదిరినా తరగని అందం..

కాగా అనిల్ రావిపూడి దగ్గర అసిస్టెంట్ గా చేసిన వీర శేఖర్ అనే కొత్త డైరెక్టర్ చెప్పిన కథ నవీన్ కి బాగా నచ్చడంతో.. ఈ కథనే మహేష్ దగ్గరకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాడట. మహేష్ కి కథ నచ్చితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడం ఖాయం. నవీన్ పొలిశెట్టి నటనకు చాలామంది ఫిదా అయిపోయారు. ముఖ్యంగా యూత్‌లో న‌వీన్ కి మంచి క్రేజ్ ఉంది. అదే క్రేజ్ తో అతను లేటెస్ట్‌గా జాతిరత్నాలు అనే కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ సినిమా కూడా చేస్తున్నాడు. ఇప్పుడు మహేష్ బ్యానర్ లో మరో సినిమాని పట్టేశాడు. ఈ రెండు సినిమాలు హిట్ అయితే నవీన్ పొలిశెట్టి రేంజ్ అమాంతం పెరగడం గ్యారంటీ అనుకుంటున్నారు సినీ జనాలు.