Chiranjeevi Koratala Siva controversy: తెలుగు సినిమా ఇండస్ట్రీకి గత 50 సంవత్సరాల నుంచి ఎనలేని సేవలను అందిస్తున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. వైవిద్య భరితమైన సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను రాబట్టిన నటుడు కూడా తనే కావడం విశేషం…ఇతర ఇండస్ట్రీల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని తెలుగు ఇండస్ట్రీ ని టాప్ పొజిషన్ లోకి తీసుకెళ్లిన నటుడు కూడా చిరంజీవి కావడం విశేషం…మాస్ కమర్షియల్ సినిమాలను చేయడంలో ఆయన్ని మించిన వారు మరెవరు లేరనెంతల గుర్తింపుని తెచ్చుకున్నాడు. అయితే చిరంజీవి తను చేసే సినిమాల్లో తన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగానే ఉంటుందని చాలా మంది చెబుతుంటారు. దానివల్ల సినిమాకు హెల్ప్ అయితే పర్లేదు. కానీ ఒకవేళ చెడు జరిగితే మాత్రం చిరంజీవి చేయడం వల్లే సినిమాలు ప్లాప్ అయ్యాయని కొంతమంది చెప్తుంటే చిరంజీవి చెప్పిన మాటలు దర్శకులు వినకపోవడం వల్లే ఇలా జరుగుతున్నాయని మరికొంతమంది చెబుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా మెగాస్టార్ చిరంజీవి లాంటి నటుడు ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో ఆచితూచి మరి ముందుకు అడుగులు వేస్తున్నాడు. ఇప్పటివరకు చిరంజీవి చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి.
70 సంవత్సరాలు పైబడిన వయసులో కూడా ఆయన సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను రాబట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటికి ఆయన కమర్షియల్ సినిమాలను చేస్తున్నాడని కొంతమంది అంటుంటే మరి కొంతమంది మాత్రం ఆయన చేసే సినిమాల్ని తనని చేయనివ్వండి. డిఫరెంట్ సినిమాలను ఆయన ఎప్పుడైతే చేయాలనుకుంటాడో అప్పుడు మాత్రమే చేస్తాడు.
ఒకవేళ అతడి నుంచి అలాంటి సినిమాలు వచ్చినప్పుడు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించడం లేదు కాబట్టి చిరంజీవి అలాంటి సినిమా చేయడం లేదని చెప్పేవారు కూడా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి చేసిన ఆచార్య సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో కొరటాల శివ చిరంజీవి ఇచ్చిన ఇన్పుట్స్ తీసుకోలేదని అందువల్లే సినిమా ప్లాప్ అయిందని చాలా మంది చెబుతున్నారు.
ఒకరకంగా కొరటాల శివ మాత్రం చిరంజీవి చెప్పిన చేంజెస్ వల్లే సినిమా ప్లాప్ అయిందని తన సన్నిహిత వర్గాల దగ్గర చెబుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక చిరంజీవి మీద కోపం తో ఆయనకి ఆల్టర్నేట్ అయిన బాలయ్య ను టాప్ లోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతోనే కొరటాల శివ భారీ బడ్జెట్ తో పవర్ ఫుల్ సబ్జెక్టుని రెడీ చేసి మరి సినిమాని చేస్తున్నట్టుగా తెలుస్తుంది…
















శోభిత కి సమంత కీలక సూచనలు.. సంచలనం రేపుతున్న లేటెస్ట్ కామెంట్స్..
Samantha: నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత సమంత పలు సందర్భాల్లో, పలు ఇంటర్వ్యూస్ లో ఈ విషయం పై రియాక్ట్ అయ్యింది. కొన్ని ఇంటర్వ్యూస్ లో నాగ చైతన్య పై కోపాన్ని స్పష్టంగా తెలియజేస్తే , మరికొన్ని ఇంటర్వ్యూస్ లో ఆ ఫేస్ లో తాను ఎదురుకున్న బాధని , విడాకులు తీసుకున్న కొత్తల్లో పడిన మానసిక వేదనని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు ఆమె రాజ్ నిడిమోరు ని రెండవ పెళ్లి చేసుకుంది , గర్భం కూడా దాల్చేసింది. మరోపక్క నాగ చైతన్య కూడా ప్రముఖ యంగ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల ని పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు తమ వ్యక్తిగత జీవితాన్ని ఇప్పుడు సంతోషంగానే గడుపుతున్నారు. అయితే సమంత నిన్న ‘మా ఇంటి బంగారం’ సక్సెస్ మీట్ లో రిలేషన్ గురించి నేటి తరం స్త్రీలకూ మీ నుండి ఎలాంటి సలహాలు ఇస్తారు అన్న ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఆమె మాట్లాడిన ఈ మాటలు కేవలం నేటి తరం స్త్రీలకు మాత్రమే కాదు, శోభిత ధూళిపాళ్ల కు కూడా సూచనలు ఇస్తున్నట్టుగా అనిపించింది. జీవితం లో మన మీద మనకు ఆత్మా విశ్వాసం ఉండాలని , కానీ మన మీద ఆత్మవిశ్వాసం లేకుండా, ఎదుటి వ్యక్తి నీ జీవిత భాగస్వామి అయ్యినప్పుడు మాత్రమే నీ జీవితం సంపూర్ణం అవుతుందని అనుకుంటే పప్పులో కాలేసినట్టే , అలాంటి పనులు చేయకండి అంటూ రిలేషన్ షిప్ లోకి అడుగుపెట్టిన వాళ్లకు చెప్పుకొచ్చారు సమంత. ఇది ఒక రకంగా తన అనుభవాలను దృష్టిలో పెట్టుకొనే ఆమె ఈ కామెంట్స్ చేసినట్టుగా అనిపించింది. అంటే నాగ చైతన్య మీద పూర్తిగా ఆధారపడకు , అలా చేస్తే అతని మీద నీకు అంచనాలు పెరిగిపోతాయి , వాటి వల్ల గొడవలు ఏర్పడుతాయి అని పరోక్షంగా చెప్పకనే చెప్పినట్టు తెలుస్తోంది.
ఇదంతా పక్కన పెడితే అప్పట్లో సమంత ని నాగ చైతన్య పిల్లలు కావాలని కోరినట్టు , అందుకు సమంత నాకు ఇంకా చాలా పెద్ద కెరీర్ ఉంది , అప్పుడే పిల్లలు ఇష్టం లేదు అని చెప్పినట్టు , ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు ఏర్పడడం వల్లే విడాకులు తీసుకున్నట్టు , ఇలా ఎన్నో రకాల ప్రచారాలు జరిగాయి. కానీ సమంత తో రాజ్ ని పెళ్ళాడి ఏడాది కూడా పూర్తి అవ్వలేదు , అప్పుడే ఒక బిడ్డకు జన్మని ఇవ్వబోతుంది. దీనిని బట్టీ తప్పు ఎటు వైపు ఉందో మీరే ఆలోచించండి అంటూ సమంత ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నాగ చైతన్య , శోభిత లకు పెళ్లి జరిగి ఏడాది దాటింది , కానీ ఇప్పటి వరకు శోభిత గర్భం దాల్చకపోవడం గమనార్హం.