Home Blog Page 71

చిరంజీవి మీద కోపం తోనే కొరటాల శివ పవర్ ఫుల్ కథను రెడీ చేశాడా..?బాలయ్య ప్రభంజనం స్టార్ట్ అవ్వబోతుందా..?

Chiranjeevi Koratala Siva controversy
Chiranjeevi Koratala Siva controversy

Chiranjeevi Koratala Siva controversy: తెలుగు సినిమా ఇండస్ట్రీకి గత 50 సంవత్సరాల నుంచి ఎనలేని సేవలను అందిస్తున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. వైవిద్య భరితమైన సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను రాబట్టిన నటుడు కూడా తనే కావడం విశేషం…ఇతర ఇండస్ట్రీల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని తెలుగు ఇండస్ట్రీ ని టాప్ పొజిషన్ లోకి తీసుకెళ్లిన నటుడు కూడా చిరంజీవి కావడం విశేషం…మాస్ కమర్షియల్ సినిమాలను చేయడంలో ఆయన్ని మించిన వారు మరెవరు లేరనెంతల గుర్తింపుని తెచ్చుకున్నాడు. అయితే చిరంజీవి తను చేసే సినిమాల్లో తన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగానే ఉంటుందని చాలా మంది చెబుతుంటారు. దానివల్ల సినిమాకు హెల్ప్ అయితే పర్లేదు. కానీ ఒకవేళ చెడు జరిగితే మాత్రం చిరంజీవి చేయడం వల్లే సినిమాలు ప్లాప్ అయ్యాయని కొంతమంది చెప్తుంటే చిరంజీవి చెప్పిన మాటలు దర్శకులు వినకపోవడం వల్లే ఇలా జరుగుతున్నాయని మరికొంతమంది చెబుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా మెగాస్టార్ చిరంజీవి లాంటి నటుడు ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో ఆచితూచి మరి ముందుకు అడుగులు వేస్తున్నాడు. ఇప్పటివరకు చిరంజీవి చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి.

70 సంవత్సరాలు పైబడిన వయసులో కూడా ఆయన సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను రాబట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటికి ఆయన కమర్షియల్ సినిమాలను చేస్తున్నాడని కొంతమంది అంటుంటే మరి కొంతమంది మాత్రం ఆయన చేసే సినిమాల్ని తనని చేయనివ్వండి. డిఫరెంట్ సినిమాలను ఆయన ఎప్పుడైతే చేయాలనుకుంటాడో అప్పుడు మాత్రమే చేస్తాడు.

ఒకవేళ అతడి నుంచి అలాంటి సినిమాలు వచ్చినప్పుడు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించడం లేదు కాబట్టి చిరంజీవి అలాంటి సినిమా చేయడం లేదని చెప్పేవారు కూడా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి చేసిన ఆచార్య సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో కొరటాల శివ చిరంజీవి ఇచ్చిన ఇన్పుట్స్ తీసుకోలేదని అందువల్లే సినిమా ప్లాప్ అయిందని చాలా మంది చెబుతున్నారు.

ఒకరకంగా కొరటాల శివ మాత్రం చిరంజీవి చెప్పిన చేంజెస్ వల్లే సినిమా ప్లాప్ అయిందని తన సన్నిహిత వర్గాల దగ్గర చెబుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక చిరంజీవి మీద కోపం తో ఆయనకి ఆల్టర్నేట్ అయిన బాలయ్య ను టాప్ లోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతోనే కొరటాల శివ భారీ బడ్జెట్ తో పవర్ ఫుల్ సబ్జెక్టుని రెడీ చేసి మరి సినిమాని చేస్తున్నట్టుగా తెలుస్తుంది…

మహేష్ బాబుకి ఆ స్టార్ హీరో క్లోజ్ ఫ్రెండ్.. ఆయన్ని సంవత్సరానికి రెండు సార్లే కలుస్తాడు..

Mahesh Babu NTR friendship
Mahesh Babu NTR friendship

Mahesh Babu NTR friendship: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వైవిధయల్భరితమైన సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఇప్పటివరకు తెలుగులో వరుస సినిమాలను చేస్తూ ప్రేక్షకులందరిని మెప్పించాడు. కానీ ఇప్పుడు మొదటిసారి రాజమౌళి డైరెక్షన్లో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. వారణాసి సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే మహేష్ బాబుకు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు…

తనకి ఉన్న ఫ్రెండ్స్ అందరిలో ఒక హీరోని మాత్రం మహేష్ బాబు ఎప్పుడు తన క్లోజ్ ఫ్రెండ్ గా భావిస్తుంటాడట. నిజానికి ఫ్రెండ్ గా కంటే కూడా సొంత తమ్ముడిలా ట్రీట్ చేస్తూ ఉంటాడని గతంలో పలు సందర్భాల్లో ఆయన చెప్పాడు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు అంటే ఎన్టీఆర్ కావడం విశేషం… ఎన్టీఆర్ సైతం మహేష్ బాబుని అన్నా అని పిలుస్తూ ఉంటాడు…

వాళ్ళిద్దరూ సొంత అన్నదమ్ముల కలిసిమెలిసి ఉంటారని వీళ్ళ సన్నిహితులు సైతం చెబుతుంటారు. అయితే మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ ని సంవత్సరంలో రెండుసార్లు మాత్రమే కలుస్తారట. ఒకటి ఎన్టీఆర్ బర్త్ డే రోజు, రెండు మహేష్ బాబు పుట్టినరోజు నాడు ఈ రెండు రోజులు మాత్రమే ఎన్టీఆర్ ని తప్పకుండా కలుస్తారట. ఇక మిగతా సందర్భాల్లో ఏదైనా ఈవెంట్స్ లో గాని పక్కపక్కన షూటింగ్స్ జరుగుతుంటే సెట్స్ లో కలుస్తుంటారట.

కాకపోతే అఫీషియల్ గా మాత్రం రెండు రోజుల్లో పక్కగా కలుస్తూ ఉంటారని అయినప్పటికి జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో తనకు ఉన్న స్నేహితుల్లో క్లోజ్ ఫ్రెండ్ అని మహేష్ బాబు చెబుతూ ఉంటాడు. ఎన్నిసార్లు కలిసాము అనేదానికంటే కూడా వాళ్ళతో మనకు ఎంత మంచి బాండింగ్ ఉందనే దానికి మహేష్ బాబు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాడు… ఇక ప్రస్తుతం మహేష్ బాబు వారణాసి సినిమా చేస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం డ్రాగన్ సినిమాలో బిజీగా ఉన్నాడు…

దేశంలో 500 కంపెనీలు.. 89 లక్షల మందికి ఉపాధి.. తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఇదే!

India top 500 companies
India top 500 companies

India top 500 companies: దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల్లో లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఉద్యోగ ఉపాధి సేవా రంగాల్లో వివిధ స్థాయిల్లో ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రైవేటు రంగ సంస్థలు కూడా లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఇందులో ఫార్మా, గ్రీన్ ఎనర్జీ రంగాలు ముందంజలో ఉన్నాయి. బర్గుండీ ప్రైవేట్ హురున్ ఇండియా సంస్థ దేశంలోని ప్రముఖ ప్రైవేటు సంస్థలు వాటిలో ఉపాధి పొందుతున్న ఉద్యోగుల వివరాలతో నివేదిక రూపొందించింది. దేశంలో కనీసం రూ.10,000 కోట్ల విలువ ఉన్న 500 కంపెనీల మొత్తం విలువ రూ.323 లక్షల కోట్లు. ఈ కంపెనీలు సుమారు 89 లక్షల మందికి నేరుగా ఉపాధి కల్పిస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో ఉండగా, హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ, టీసీఎస్ వంటి సంస్థలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ లెక్కలు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఉందో చూపిస్తున్నాయి.

ఏపీ-టీజీలో 39 కంపెనీలు..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి 39 కంపెనీలు మాత్రమే ఈ జాబితాలో చోటు సంపాదించాయి. వీటి మొత్తం విలువ రూ.12 లక్షల కోట్లు. ఇవి రెండు రాష్ట్రాలకు సుమారు 3.40 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 500 కంపెనీల్లో ఈ 39 సంస్థల విలువ కేవలం 3.7 శాతం.

టాప్ 5 కంపెనీలు ఇవీ..
బర్గుండీ ప్రైవేట్ హురున్ ఇండియా ప్రకారం..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి 39 కంపెనీలలో దివీస్ లాబొరేటరీస్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, మేఘా ఇంజనీరింగ్, అరబిందో ఫార్మా, గ్రీన్కో వరుసగా టాప్ 5 స్థానాల్లో ఉన్నాయి. ఇందులో మొదటి నాలుగు ఫార్మాస్యూటికల్ రంగానికి చెందినవి. గ్రీన్కో మాత్రం పునరుత్పాదక ఇంధన (రెన్యూవబుల్ ఎనర్జీ) రంగంలో ముందుంది. ఇది రెండు రాష్ట్రాల్లో ఫార్మా రంగం ఎంత బలంగా ఉందో తెలియజేస్తోంది.

ఉపాధి, ఆర్థిక వృద్ధికి సహకారం..
ఈ కంపెనీలు కేవలం విలువలోనే కాదు, నాణ్యమైన ఉద్యోగాల్లోనూ ముందుంటున్నాయి. ఫార్మా కంపెనీలు అధిక విలువ గల ఉత్పత్తులు ఎగుమతి చేస్తాయి. ఇది రాష్ట్రాల విదేశీ మారక ద్రవ్యాన్ని పెంచుతుంది. గ్రీన్కో వంటి సంస్థలు సౌర, గాలి శక్తి ప్రాజెక్టుల ద్వారా సుస్థిర అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. మేఘా ఇంజనీరింగ్ వంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు రోడ్లు, నీటిపారుదల, పారిశ్రామిక ప్రాజెక్టుల్లో పెద్ద పాత్ర పోషిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాలకు ఆర్థిక శక్తి ల..
ఆంధ్రప్రదేశ్తె, లంగాణలోని ఈ 39 కంపెనీలు దేశంలోని మొత్తం 500 కంపెనీల్లో చిన్న శాతం మాత్రమే అయినా, వాటి విలువ, ఉపాధి సంఖ్య గణనీయంగా ఉంది. ఇది రెండు రాష్ట్రాల్లో ఫార్మా, గ్రీన్ ఎనర్జీ రంగాలు ఎంతగా అభివృద్ధి చెందాయో చెబుతోంది. ఈ కంపెనీలు యువతకు నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు ఇస్తున్నాయి. ఇవి రాష్ట్రాల జీడీపీకి నేరుగా సహకరిస్తాయి. అలాగే, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణ భారతదేశం, ముఖ్యంగా ఏపీ-టీజీలో పారిశ్రామిక వృద్ధి వేగంగా జరుగుతోందని ఈ నివేదిక సూచిస్తోంది.

బర్గుండీ ప్రైవేట్ హురున్ ఇండియా నివేదిక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ను భారతదేశ ఆర్థిక వృద్ధిలో ముఖ్యమైన భాగంగా నిలబెడుతోంది. ఫార్మా ఎగుమతులు, పునరుత్పాదక ఇంధనం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి వంటి రంగాల్లో రెండు రాష్ట్రాలు ఇంకా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి.

తెలంగాణ వర్సెస్‌ ఆంధ్రప్రదేశ్‌.. విభజన తర్వాత అభివృద్ధిలో వ్యత్యాసం!

Telangana vs Andhra Pradesh
Telangana vs Andhra Pradesh

Telangana vs Andhra Pradesh: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగి 12 ఏళ్లు గడిచింది. ఒకే రాష్ట్ర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా విడిపోయాయి. విభజన తర్వాత తెలంగాణలో కరెంటు ఉండదని, నక్సలిజం పెరుగుతుందని అప్పట్లో కొందరు నేతలు వ్యాఖ్యానించారు. మరో బిహార్‌ అవుతుందని హెచ్చరించారు. అయితే ఇందుకు విరుద్ధంగా రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి వేగం పుంజుకుంది. వేర్వేరు ప్రాధాన్యతలతో అభివృద్ధి పనులు చేపట్టాయి. ఒక్కొక్క రాష్ట్రం తన ప్రధాన సమస్యలను దృష్టిలో పెట్టుకుని మౌలిక సదుపాయాలను నిర్మించుకుంది. ఇది రెండు రాష్ట్రాల మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని సృష్టించింది.

హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్లు…
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినత ర్వాత అధికారం చేపట్టిన కేసీఆర్‌ హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించడంపై ఎక్కువ దృష్టి పెట్టారు. రాష్ట్ర విభజన తర్వాత దాదాపు ఒక దశాబ్దంలో హైదరాబాద్‌లోనే 35కిపైగా ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, సబ్‌వేలు నిర్మించడం ద్వారా ట్రాఫిక్‌ ప్రవాహాన్ని మెరుగుపరచింది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం, రోడ్ల విస్తరణ, చెరువుల సుందరీకరణ వంటి పనులు కూడా చేపట్టింది. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ క్రమాన్ని కొనసాగిస్తూ మరిన్ని ఫ్లై ఓవర్లను ప్రారంభించింది.

ఆంధ్రప్రదేశ్‌లో విమానాశ్రయాలు..
ఇక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్ర విభజన తర్వాత విమానాశ్రయాల అభివృద్ధిపై ఎక్కువ దృష్టి సారించింది. కర్నూల్, కడప, భోగాపురం వద్ద కొత్త అంతర్జాతీయ విమానాశ్రయాలు ఏర్పాటు చేయడం, అమరావతిలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం, గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయాలకు సన్నాహాలు చేయడం ద్వారా రాష్ట్రంలో ఎయిర్‌ కనెక్టివిటీని మెరుగుపరచాలని ప్రయత్నిస్తోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు త్వరలో అందుబాటులోకి రానుంది.

ఏపీలో నగరాభివృద్ధి లోపం..
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో ఫ్లై ఓవర్ల నిర్మాణం చాలా తక్కువగా ఉంది. మెట్రో ప్రాజెక్టులతో ఫ్లై ఓవర్లను ముడిపెట్టే ప్రతిపాదనలు కేంద్రం నుంచి ఆమోదం పొందలేకపోవడం ఒక కారణం. రాజధాని అమరావతి నిర్మాణంపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల మిగిలిన జిల్లాలు, నగరాల్లో ఫ్లై ఓవర్లు, రోడ్ల విస్తరణ పనులు వెనకబడ్డాయి. అలాగే నగరాల్లో పచ్చదనం పెంచడంలో కూడా తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడి ఉంది.

రెండు రాష్ట్రాల ప్రాధాన్యతలు…
తెలంగాణ ప్రభుత్వం పట్టణీకరణ వల్ల ఏర్పడిన ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించడానికి ఫ్లై ఓవర్లు, రోడ్ల అభివృద్ధిని ప్రాధాన్యతగా తీసుకుంది. అయితే కొత్త విమానాశ్రయాల ఏర్పాటులో వెనుకబడింది. వరంగల్, ఆదిలాబాద్‌ విమానాశ్రయాలకు ఆమోదం వచ్చినా నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు. ఆంధ్రప్రదేశ్‌ మాత్రం రాష్ట్ర విభజన తర్వాత కనెక్టివిటీ, ఆర్థిక వృద్ధిని దృష్టిలో పెట్టుకుని విమానాశ్రయాలు, హైవేల నిర్మాణంపై ఎక్కువ దృష్టి పెట్టింది. కానీ నగరాల్లో ట్రాఫిక్‌ సౌకర్యాలు, ఫ్లై ఓవర్ల నిర్మాణంలో ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది.

ప్రస్తుతం తెలంగాణకు కొత్త విమానాశ్రయాలు అవసరం ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు నగరాల్లో ఫ్లై ఓవర్లు, రోడ్ల విస్తరణ, పచ్చదనం పెంచడం అత్యవసరం. రెండు రాష్ట్రాలు తమ బలహీనతలను గుర్తించి, ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటూ సమతుల్య అభివృద్ధిని సాధించాల్సిన అవసరం ఉంది.

మీ పిల్లలు నెంబర్ వన్‌గా స్థానంలో ఉండాలా.. చిన్నప్పటి నుంచే ఈ 5 అలవాట్లు నేర్పించండి!

Child Success Habits
Child Success Habits

Child Success Habits: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు చదువులోనే కాదు, జీవితంలోని ప్రతి రంగంలో ముందుండాలని కోరుకుంటున్నారు. అయితే కేవలం మార్కులు ఎక్కువ రావడం లేదా పరీక్షల్లో టాప్ చేయడం మాత్రమే విజయానికి కొలమానం కాదు. చిన్న వయసు నుంచే కొన్ని మంచి అలవాట్లు, ఆలోచనా విధానాలు పిల్లల్లో పెంపొందిస్తే వారు భవిష్యత్తులో ఆత్మవిశ్వాసంతో, నాయకత్వ లక్షణాలతో, సమాజంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించే వ్యక్తులుగా ఎదుగుతారు. కొంత మంది మానసిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ ఐదు ముఖ్యమైన అలవాట్లు పిల్లల జీవితాన్నిపూర్తి మార్చేస్తాయి..

స్పష్టమైన లక్ష్యం:
పిల్లలకు చిన్న వయసు నుంచే లక్ష్యాల గురించి అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నారు? ఏ విషయంలో ఆసక్తి ఉంది? వంటి విషయాలపై వారితో మాట్లాడాలి. లక్ష్యం ఉన్న పిల్లలు తమ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. చదువు, ఆటలు, ఇతర కార్యకలాపాల్లో కూడా క్రమశిక్షణతో వ్యవహరిస్తారు. లక్ష్యం వారిలో దిశను, పట్టుదలను పెంచుతుంది.

ఆరోగ్యకరమైన ఆహారం:
పిల్లల శారీరక, మానసిక అభివృద్ధిలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. జంక్ ఫుడ్, అధిక చక్కెర ఉన్న పదార్థాల కంటే పండ్లు, కూరగాయలు, పాలు, గింజలు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని అందించాలి. మంచి ఆహారం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. ఆరోగ్యంగా ఉన్న పిల్లలు చదువులోనే కాకుండా ఇతర రంగాల్లో కూడా మెరుగైన ప్రతిభ కనబరుస్తారు.

మంచి స్నేహితులు:
పిల్లల వ్యక్తిత్వంపై స్నేహితుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మంచి అలవాట్లు ఉన్న పిల్లలతో స్నేహం చేస్తే వారిలో కూడా క్రమశిక్షణ, బాధ్యత, సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. అందుకే పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు? ఎలాంటి వాతావరణంలో ఉంటున్నారు? అనే విషయాలను తల్లిదండ్రులు గమనించాలి. మంచి స్నేహితులు జీవితంలో సరైన దిశలో నడిపించే మార్గదర్శకులుగా మారుతారు.

ఎక్కువ ప్రశ్నలు :
చాలా మంది పిల్లలు ఎందుకు? ఎలా? అనే ప్రశ్నలు అడుగుతుంటారు. కొందరు పెద్దలు దీనిని విసుగుగా భావించినా, వాస్తవానికి ఇదే వారి నేర్చుకునే ప్రక్రియలో కీలక భాగం. పిల్లలు ప్రశ్నలు అడిగినప్పుడు వారిని నిరుత్సాహపరచకుండా సమాధానాలు చెప్పాలి. ప్రశ్నించే అలవాటు వల్ల ఆలోచనా శక్తి పెరుగుతుంది. కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి పెంపొందుతుంది. భవిష్యత్తులో సమస్యలను విశ్లేషించి పరిష్కరించే సామర్థ్యం కూడా అభివృద్ధి చెందుతుంది.

మాట్లాడే నైపుణ్యం:
జీవితంలో విజయం సాధించడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం. ఎంత ప్రతిభ ఉన్నా దాన్ని సరైన రీతిలో వ్యక్తపరచలేకపోతే అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. చిన్నప్పటి నుంచే పిల్లలను కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, ఉపాధ్యాయులతో ధైర్యంగా మాట్లాడేలా ప్రోత్సహించాలి. కథలు చెప్పడం, వేదికలపై మాట్లాడించడం, చర్చల్లో పాల్గొనించడం వంటి కార్యకలాపాలు వారి కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుస్తాయి.

పూణే వ్యాపారి కేసు: పకడ్బందీగా ప్రణాళిక.. కానీ అక్కడే నిందితులు దొరికిపోయారు..

Pune businessman Ketan Agarwal case
Pune businessman Ketan Agarwal case

Pune businessman Ketan Agarwal case: పూణే వ్యాపారి కేతన్ అగర్వాల్ కేసులో నిందితులు సియా, చేతన్ అత్యంత పకడ్బందీగా ప్రణాళిక రూపొందించారు. అతడిని అంతం చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. మే 31న ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం.. లోహ్ గడ్ కోటకు తీసుకువెళ్లాలనుకున్నారు. ఆరోజు కేతన్ వెళ్లలేదు.. మళ్లీ జూన్ 14న ప్రణాళిక రూపొందించారు. ఈసారి కేతన్ వెళ్లక తప్పలేదు.. కేతన్ ను అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ఎత్తయిన ప్రదేశం నుంచి అతడిని నెట్టివేసింది సియా. అయితే అతడు లోయలో పడి.. ఒక చిన్నపాటి పొదను పట్టుకున్నాడు.. ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత సియా అక్కడ పాము కనిపించిందని.. అందువల్లే లోయలోకి నెట్టి వేసినట్టు చెప్పింది. ఆమె మాటలను నిజమని కేతన్ నమ్మాడు.

జూన్ 18న తన పుట్టినరోజు కావడంతో సియా అతడిని అక్కడికి తీసుకెళ్ళింది. వారిద్దరిని సియా ప్రేమికుడు చేతన్ అనుసరించాడు. కేతన్ ను సియా ఎత్తయిన ప్రాంతం వద్దకు తీసుకెళ్లిన తర్వాత.. అతడిని నెట్టివేశారు. లోయలో పడిన అతడు చనిపోయాడు. అతడు చనిపోయిన తర్వాత సియా గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టింది. భద్రతా సిబ్బంది వచ్చారు. సహాయక చర్యలు మొదలుపెట్టారు. కానీ అప్పటికే అతడు చనిపోయాడు. దీనిని మొదట్లో ప్రమాదం అని అనుకున్నారు. కానీ వెనుక ఉన్న అసలు వాస్తవం వేరే ఉందని ఆ తర్వాత తెలిసింది.

కేతన్ చనిపోయిన తర్వాత.. నాలుగు రోజు అతడి సోదరి ఫోన్ చేస్తే సియా వచ్చింది. వారిద్దరు కేతన్ గురించి మాట్లాడుకున్నారు. అయితే కేతన్ చనిపోయిన రోజు చెప్పిన మాటలకు.. ఆరోజు మాటలకు తేడా ఉండడంతో సియా మీద కేతన్ సోదరికి అనుమానం వచ్చింది. వారు పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో పోలీసు రంగంలోకి దిగి విచారణ మొదలుపెట్టారు. వాస్తవానికి మొదట్లో ఈ కేసులో సియా మీద కేతన్ కుటుంబ సభ్యులకు ఎటువంటి అనుమానాలు లేవు. ఎప్పుడైతే ఆమె మాట తడబడిందో.. వివరాలు చెప్పడంలో ఆమె తత్తర పాటును ప్రదర్శించిందో.. అప్పుడే వారికి అనుమానాలు మొదలయ్యాయి. ఆ తర్వాత పోలీసులకు కంప్లీట్ చేస్తే.. వారి విచారణలో అసలు విషయాలు బయటపడ్డాయి.

కేతన్ ను తోసి వేసింది తాను కాదని చేతను చెబుతున్నాడు. పోలీసులు ఎన్ని రకాలుగా విచారణ సాగించినప్పటికీ అతడు అదే చెబుతున్నాడు. మరోవైపు సియా నెట్టి వేయలేదని అంటున్నది. అలాంటప్పుడు అతడిని నెట్టివేసింది ఎవరు.. వీరిద్దరు కాకుండా మూడో వ్యక్తి ఎవరైనా వచ్చారా.. ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం లభించాల్సి ఉంది.

వెనిజులా భూకంపం.. ఏమిటీ సిస్మిక్ డబ్లెట్..

Venezuela Earthquake
Venezuela Earthquake

Venezuela Earthquake: దక్షిణ అమెరికా ప్రాంతంలో అత్యంత కీలకమైన వెనిజులా దేశంలో భూకంపం చోటుచేసుకుంది. ఈ ఘటన తీవ్రమైన విధ్వంసం కారణమైంది. రాజధాని కారాకస్ ప్రాంతంలో అతిపెద్ద భవనాలు నేలకూలిపోయాయి. ప్రజలు భయభ్రాంతులకు గురై వీధుల్లోకి వచ్చారు. సునామి తరహాలో హెచ్చరికలు కూడా అక్కడ వినిపించాయి. ఈ ఘటన జరిగిన తర్వాత శిథిలాలను తొలగించే ప్రక్రియ జరుగుతుంది. చనిపోయిన వారు.. గాయపడిన వారు భారీగా ఉంటారని తెలుస్తోంది..

భూకంపం తీవ్రంగా చోటు చేసుకున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ఓ అంచనా ప్రకారం దాదాపు లక్ష మంది చనిపోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది.. బుధవారం సాయంత్రం వెనిజులా దేశంలో ఉన్న పశ్చిమ ప్రాంతంలో ముందుగా 7.2 తీవ్రతతో భూకంపం చోటుచేసుకుంది. ఆ తర్వాత సాన్ పేలిపే వద్ద భూకంప కేంద్రం ఏర్పడింది.. ఆ తర్వాత కేవలం 39 సెకండ్ల వ్యవధిలోనే యు మారే ప్రాంతం వద్ద 7.5 తీవ్రతతో మరోసారి భూకంపం చోటుచేసుకుంది. ఆ తర్వాత భూమి ఏకంగా 20 సార్లు స్వల్పంగా కనిపించడం విశేషం. క్షణంలోనే పెద్ద పెద్ద భవనాలు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి.. రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి.

ఇలా ఒకేసారి రెండు పర్యాయాలు తీవ్రస్థాయిలో భూకంపాలు రావడానికి సిస్మిక్ డబ్లెట్ అని పిలుస్తుంటారు దీనివల్ల ఆస్తితో పాటు ప్రాణం నష్టం ఎక్కువగా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇటువంటి భూకంపాలు ఏర్పడినప్పుడు సహజంగా 10,000 మంది చనిపోతారని.. వెనిజులా ప్రాంతంలో చోటుచేసుకున్న భూకంపం వల్ల మృతుల సంఖ్య లక్ష వరకు చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు వెనిజులా అధికారికంగా మృతుల సంఖ్యను బయట పెట్టలేదు.

వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సి రోడ్రీగేజ్ జరిగిన ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సహాయక చర్యలు వేగవంతంగా చేపడుతున్నట్టు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఆమె సానుభూతి తెలిపారు. అంతేకాదు భూకంపం వల్ల కారా కాస్ విమానాశ్రయంలో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. జూన్ 24న సెలవు దినం కావడంతో చాలామంది ఇంటికి మాత్రమే పరిమితమయ్యారు. అందువల్లే మృతుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.

మీ జీవితంలో ఈ నలుగురు ఉంటే.. ఎప్పటికీ బాగుపడరు..!

Life Lessons
Life Lessons

Life Lessons: ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలని, ఆర్థికంగా ఎదగాలని, సమాజంలో మంచి గుర్తింపు సంపాదించాలని కోరుకుంటారు. కానీ విజయానికి అడ్డుగా నిలిచేది ఎప్పుడూ బయటి పరిస్థితులు మాత్రమే కావు. చాలా సందర్భాల్లో మనలోనే దాగి ఉన్న కొన్ని చెడు అలవాట్లు, ఆలోచనా విధానాలే మన పురోగతిని అడ్డుకుంటాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. చాలా మంది తమ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు కారణం ఈ అంతర్గత శత్రువులేనని గుర్తించలేరు. మానసిక నిపుణుల ప్రకారం.. ప్రతీ వ్యక్తిలో ఉండే ఈ నాలుగు రకాల శత్రువులకు అవకాశం ఇవ్వడం వల్ల తన జీవితాన్ని తానే నాశనం చేసుకున్నవారవుతారు. మరి ఆ శత్రువులు ఎవరు? వారి నుంచి తప్పించుకోవడం ఎలా?

1. బద్ధకం.. కలలను దూరం చేసే నిశ్శబ్ద శత్రువు
బద్ధకం అనేది కేవలం పనిని వాయిదా వేయడం మాత్రమే కాదు. ఇది అవకాశాలను కోల్పోయేలా చేసే ప్రమాదకరమైన అలవాటు. ‘రేపు చేద్దాం’, ‘కొంచెం తర్వాత చూస్తాం’ అనే ఆలోచనలతో చాలా మంది ముఖ్యమైన పనులను వాయిదా వేస్తుంటారు. కానీ విజయం సాధించిన వ్యక్తుల జీవితాలను పరిశీలిస్తే వారు పనిని వెంటనే ప్రారంభించే అలవాటును పెంచుకున్నట్లు తెలుస్తుంది. బద్ధకం వల్ల సమయం వృథా అవుతుంది. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది, చివరకు లక్ష్యాలు కూడా దూరమవుతాయి.

2. తొందరపాటు.. మంచి అవకాశాలను కూడా నాశనం చేస్తుంది
కొన్ని సందర్భాల్లో త్వరగా నిర్ణయాలు తీసుకోవడం మంచిదే అయినా.. ఆలోచించకుండా తొందరపడి తీసుకున్న నిర్ణయాలు పెద్ద నష్టాలకు దారి తీస్తాయి. ఉద్యోగం, వ్యాపారం, పెట్టుబడులు లేదా వ్యక్తిగత సంబంధాలు ఏవైనా సరే, ఓర్పు లేకుండా వ్యవహరించడం సమస్యలను సృష్టిస్తుంది. తొందరపాటు వల్ల పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకునే అవకాశం కోల్పోతాం. అందుకే మానసిక నిపుణులు ముఖ్యమైన నిర్ణయాల ముందు కాసేపు ఆలోచించి, లాభనష్టాలను అంచనా వేసి ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు.

3. నిందించడం.. బాధ్యత నుంచి పారిపోయే అలవాటు
విజయం సాధించలేకపోయినప్పుడు చాలా మంది తమ తప్పులను అంగీకరించకుండా పరిస్థితులను, అదృష్టాన్ని లేదా ఇతర వ్యక్తులను నిందిస్తుంటారు. ఇలా చేయడం వల్ల సమస్యకు అసలు కారణం ఏమిటో తెలుసుకునే అవకాశం ఉండదు. జీవితంలో ఎదగాలంటే ముందుగా మన నిర్ణయాలకు మనమే బాధ్యత వహించడం నేర్చుకోవాలి. ప్రతి వైఫల్యంలో ఒక పాఠం దాగి ఉంటుంది. ఆ పాఠాన్ని గుర్తించకుండా ఇతరులను నిందించడం వల్ల అభివృద్ధి ఆగిపోతుంది.

4. ఈగో.. ఎదుగుదలను అడ్డుకునే కనిపించని గోడ
ఈగో అనేది వ్యక్తిని ఇతరుల నుంచి దూరం చేస్తుంది. ‘నాకే అన్నీ తెలుసు’, ‘నేను తప్పు చేయను’ అనే భావన మనిషిని కొత్త విషయాలు నేర్చుకోకుండా అడ్డుకుంటుంది. విజయవంతమైన వ్యక్తుల్లో కనిపించే ముఖ్యమైన లక్షణం వినయం. వారు తమ తప్పులను అంగీకరిస్తారు. ఇతరుల సలహాలను స్వీకరిస్తారు.నిరంతరం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఈగో ఎక్కువైతే సంబంధాలు దెబ్బతింటాయి. అవకాశాలు తగ్గిపోతాయి. వ్యక్తిగత అభివృద్ధి కూడా నిలిచిపోతుంది.

ఈ నాలుగు శత్రువులను ఎలా జయించాలి?
ఈ నాలుగు లక్షణాలను పూర్తిగా తొలగించడం ఒక్కరోజులో సాధ్యం కాదు. కానీ చిన్నచిన్న మార్పులతో వాటిని నియంత్రించవచ్చు. పనులను వాయిదా వేయకుండా వెంటనే ప్రారంభించడం, నిర్ణయాల ముందు ప్రశాంతంగా ఆలోచించడం. తప్పులను అంగీకరించడం. ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం వంటి అలవాట్లు పెంచుకుంటే జీవితంలో గణనీయమైన మార్పు కనిపిస్తుంది. ప్రతి రోజు మన ప్రవర్తనను మనమే పరిశీలించుకోవడం కూడా ఎంతో ఉపయోగపడుతుంది.

విదేశీ నిధులతో మతమార్పిడి.. స్వచ్ఛంద సంస్థల తోక కత్తిరించిన మోదీ!

New FCRA Rules
New FCRA Rules

New FCRA Rules: దేశంలో కొన్ని స్వచ్ఛంద సంస్థల ముసుగులో, సేవా కార్యక్రమాల మాటున చేస్తున్న కార్యక్రమాలు దేశ భద్రతకు ముప్పుగా మారుతున్నాయి. స్థానిక సంస్కృతిని దెబ్బతీస్తుంది. విదేశాల నుంచి విచ్చల విడిగా నిధులు సేకరిస్తూ.. హిందువలను మతం మారేలా కొన్ని సంస్థలు మచ్చిక చేసుకుంటున్నాయి. డబ్బు, సహాయం మాటున అరాచకాలు చేస్తున్నాయి. దీంతో ఇలాంటి సంస్థల తోక కత్తిరించాలని మోదీ సర్కార్‌ నిర్ణయించింది. విదేశాల నుంచి వచ్చే నిధుల విషయంలో ఎలాంటి ఒత్తిడికీ తలొగ్గకుండా కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. నిదుల వినియోగంలో పారదర్శకత పెంపుతోపాటు దుర్వినియోగానికి చెక్‌ పెట్టింది.

విదేశీ నిధులపై కఠిన నిబంధనలు..
ప్రభుత్వం విదేశాల నుంచి వచ్చే నిధులను అక్రమంగా ఉపయోగించినట్లయితే జరిమానాలు విధించే వ్యవస్థను బలోపేతం చేసింది. ఏదైనా సంస్థ విదేశీ నిధులను తప్పుడు మార్గంలో ఖర్చు చేస్తే ఆ నిధులు జప్తు చేయడం, జరిమానాలు విధించడం వంటి చర్యలు తీసుకుంటోంది. ఈ నిర్ణయాలు ఎన్జీవోలు, స్వచ్ఛంద సంస్థలు తమ కార్యకలాపాల్లో పారదర్శకంగా వ్యవహరించాలని బలవంతం చేస్తున్నాయి.

మత మార్పిడులకు అడ్డుకట్ట…
వైద్యం, విద్య, అన్నదానం వంటి సేవా కార్యక్రమాల పేరుతో మత మార్పిడులు జరిగే అవకాశాలను ప్రభుత్వం గుర్తించి, దానికి అడ్డుకట్ట వేసేందుకు సిద్ధంగా ఉంది. విదేశీ నిధులు మతపరమైన మార్పిడులకు ఉపయోగపడకుండా నిరోధించడం ఈ నిబంధనల ముఖ్య ఉద్దేశం. ఇది దేశంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు తీసుకున్న ముఖ్యమైన చర్యగా చూస్తున్నారు.

లెక్కలు, ఆడిటింగ్‌ తప్పనిసరి…
వచ్చిన నిధులను ఎలా ఖర్చు చేశారో పూర్తి వివరాలు సమర్పించాలని, తప్పనిసరిగా ఆడిటింగ్‌ చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. కేంద్ర బృందాలు వివిధ సంస్థలను తనిఖీ చేసే అధికారం కలిగి ఉంటాయి. ఈ వ్యవస్థ వల్ల నిధులు సరైన మార్గంలోనే ఉపయోగపడుతున్నాయని నిర్ధారించడం సాధ్యమవుతుంది. ఇది గతంలో జరిగిన అనేక అక్రమాలను నివారించేందుకు సహాయపడుతుందని నిపుణుల అభిప్రాయం.

జేడీ వాన్స్‌నే లెక్క చేయలేదు..
అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ జేడీ వాన్స్‌ కోల్‌కత్తాలోని మదర్‌ థెరీసా సేవా కేంద్రాన్ని సందర్శించినప్పటికీ, ఆ సంస్థకు ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వకపోవడం ప్రభుత్వం అనుసరిస్తున్న నిష్పాక్షిక వైఖరిని స్పష్టం చేస్తోంది. ఏ సంస్థ అయినా నిబంధనలను పాటించాల్సిందేనని, ఎవరికీ మినహాయింపు ఉండదని ఈ సంఘటన ద్వారా సంకేతం ఇచ్చింది.

దేశంలో విదేశీ నిధుల ప్రవాహాన్ని నియంత్రించడంతో పాటు, స్వచ్ఛంద సంస్థలు మరింత జవాబుదారీగా వ్యవహరించేలా చేస్తున్నాయి. అయితే కొంతమంది ఇది చట్టబద్ధంగా పని చేస్తున్న ఎన్జీవోలపై ఒత్తిడి పెంచుతుందని వాదిస్తున్నారు. మొత్తం మీద మోదీ సర్కార్‌ తీసుకున్న ఈ నిర్ణయాలు దేశ భద్రత, మత సామరస్యం, పారదర్శకత అనే మూడు అంశాల విషయంలో కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోంది.

కేంద్రం పర్యాటక భారీ ప్రణాళిక.. ఏపీ నుంచి ఆ రెండు నగరాలు!

AP Tourism Development
AP Tourism Development

AP Tourism Development: పర్యాటకంగానూ ఏపీకి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది కేంద్రం. ఇప్పటికే విభజన హామీల్లో భాగంగా ఏపీ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. రాష్ట్రానికి ప్రధాన ప్రాజెక్టులను కేటాయిస్తోంది. పెద్ద ఎత్తున నిధులను కూడా కేటాయిస్తోంది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పర్యాటక రంగ అభివృద్ధికి నడుం బిగించింది. ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా చాలా నగరాలను ఎంపిక చేసింది. అందులో తిరుపతి, విశాఖ నగరాలు ఉండడం విశేషం. సమగ్ర పర్యాటక గమ్యస్థానాలుగా ఈ రెండు నగరాలను అభివృద్ధి చేసే విషయాన్ని పరిశీలిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఒక్కో నగరంలో 50 నుంచి 100 ఎకరాల విస్తీర్ణంలో పర్యాటక అభివృద్ధికి.. కేంద్ర ప్రభుత్వం రూ.500 కోట్ల చొప్పున అందించనున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధికి ఒక గేమ్ చేంజర్ గా నిలుస్తుంది.

ఆదాయం తో పాటు ఉద్యోగ అవకాశాలు..
దేశవ్యాప్తంగా పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా ఆదాయంతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచవచ్చన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. మొత్తం పర్యాటక రంగాన్ని మిషన్ మోడ్ లో అభివృద్ధి చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ ప్రణాళికగా తెలుస్తోంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా 50 పర్యాటక గమ్యస్థానాలను ఎంపిక చేసి అభివృద్ధి చేయనుంది. కేవలం మన దేశ పర్యటకులకు ఆకట్టుకోవడమే కాదు విదేశీ పర్యాటకులను రప్పించేందుకు వీలుగా.. సరికొత్త నిర్మాణాలు జరపాలన్నది ఆలోచన. అందులో భాగంగా తిరుపతి తో పాటు విశాఖ నగరంలో పర్యాటక సమగ్ర అభివృద్ధికి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి వెళ్లాయి. తిరుపతిలో ఓ 60 ఎకరాల వరకు.. విశాఖలో ఓ 50 ఎకరాల వరకు ఖాళీ భూమిని అధికారులు గుర్తించే పనిలో ఉన్నారు.

గోవా ఫార్ములాతో..
దేశంలో ఇప్పుడు గోవా అనేది పర్యాటక ప్రాంతం. అక్కడి పర్యాటక రోడ్డు మ్యాప్ లో పేర్కొన్న ఐదు కీలక అంశాలైన గ్రీన్ టూరిజం, డిజిటలైజేషన్, నైపుణ్యాభివృద్ధి, పర్యాతక ఎం ఎస్ ఎం ఈ లు, డెస్టినేషన్ మేనేజ్మెంట్లకు కేంద్రం నిధులు ఇవ్వనుంది. ఇప్పటికే దీనిపై కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే ఆ జాబితాలో విశాఖ తో పాటు తిరుపతి నగరాలు ఉండడం విశేషం. పర్యాటక అభివృద్ధిలో స్థానికులను సైతం ఈ ప్రాజెక్టులో భాగంగా భాగస్వామ్యం చేస్తారు, స్థానిక అవసరాలు, ఆశయాలు, సాంస్కృతిక విలువలు దృష్టిలో పెట్టుకొని ఈ పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఒక ప్రణాళిక, వ్యూహంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోంది. అదే జరిగితే పర్యాటక రంగంలో దేశంలో ఏపీ కూడా ఒక ప్రత్యేక స్థానం సంపాదించే అవకాశం ఉంది.

శోభిత కి సమంత కీలక సూచనలు.. సంచలనం రేపుతున్న లేటెస్ట్ కామెంట్స్..

Samantha
Samantha

Samantha: నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత సమంత పలు సందర్భాల్లో, పలు ఇంటర్వ్యూస్ లో ఈ విషయం పై రియాక్ట్ అయ్యింది. కొన్ని ఇంటర్వ్యూస్ లో నాగ చైతన్య పై కోపాన్ని స్పష్టంగా తెలియజేస్తే , మరికొన్ని ఇంటర్వ్యూస్ లో ఆ ఫేస్ లో తాను ఎదురుకున్న బాధని , విడాకులు తీసుకున్న కొత్తల్లో పడిన మానసిక వేదనని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు ఆమె రాజ్ నిడిమోరు ని రెండవ పెళ్లి చేసుకుంది , గర్భం కూడా దాల్చేసింది. మరోపక్క నాగ చైతన్య కూడా ప్రముఖ యంగ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల ని పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు తమ వ్యక్తిగత జీవితాన్ని ఇప్పుడు సంతోషంగానే గడుపుతున్నారు. అయితే సమంత నిన్న ‘మా ఇంటి బంగారం’ సక్సెస్ మీట్ లో రిలేషన్ గురించి నేటి తరం స్త్రీలకూ మీ నుండి ఎలాంటి సలహాలు ఇస్తారు అన్న ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

ఆమె మాట్లాడిన ఈ మాటలు కేవలం నేటి తరం స్త్రీలకు మాత్రమే కాదు, శోభిత ధూళిపాళ్ల కు కూడా సూచనలు ఇస్తున్నట్టుగా అనిపించింది. జీవితం లో మన మీద మనకు ఆత్మా విశ్వాసం ఉండాలని , కానీ మన మీద ఆత్మవిశ్వాసం లేకుండా, ఎదుటి వ్యక్తి నీ జీవిత భాగస్వామి అయ్యినప్పుడు మాత్రమే నీ జీవితం సంపూర్ణం అవుతుందని అనుకుంటే పప్పులో కాలేసినట్టే , అలాంటి పనులు చేయకండి అంటూ రిలేషన్ షిప్ లోకి అడుగుపెట్టిన వాళ్లకు చెప్పుకొచ్చారు సమంత. ఇది ఒక రకంగా తన అనుభవాలను దృష్టిలో పెట్టుకొనే ఆమె ఈ కామెంట్స్ చేసినట్టుగా అనిపించింది. అంటే నాగ చైతన్య మీద పూర్తిగా ఆధారపడకు , అలా చేస్తే అతని మీద నీకు అంచనాలు పెరిగిపోతాయి , వాటి వల్ల గొడవలు ఏర్పడుతాయి అని పరోక్షంగా చెప్పకనే చెప్పినట్టు తెలుస్తోంది.

ఇదంతా పక్కన పెడితే అప్పట్లో సమంత ని నాగ చైతన్య పిల్లలు కావాలని కోరినట్టు , అందుకు సమంత నాకు ఇంకా చాలా పెద్ద కెరీర్ ఉంది , అప్పుడే పిల్లలు ఇష్టం లేదు అని చెప్పినట్టు , ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు ఏర్పడడం వల్లే విడాకులు తీసుకున్నట్టు , ఇలా ఎన్నో రకాల ప్రచారాలు జరిగాయి. కానీ సమంత తో రాజ్ ని పెళ్ళాడి ఏడాది కూడా పూర్తి అవ్వలేదు , అప్పుడే ఒక బిడ్డకు జన్మని ఇవ్వబోతుంది. దీనిని బట్టీ తప్పు ఎటు వైపు ఉందో మీరే ఆలోచించండి అంటూ సమంత ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నాగ చైతన్య , శోభిత లకు పెళ్లి జరిగి ఏడాది దాటింది , కానీ ఇప్పటి వరకు శోభిత గర్భం దాల్చకపోవడం గమనార్హం.

సాయికృష్ణది లాకప్ డె*త్.. సీఐ నాగరాజు శవాన్ని మాయం చేశాడు.. సంచలన నిజాలు*

Sai Krishna Lockup Death
Sai Krishna Lockup Death

Sai Krishna Lockup Death: ఏపీలో సంచలనంగా మారుతోంది సాయి కృష్ణ లాకప్ డె*త్ మిస్టరీ. ఇప్పటికే వైసీపీ నేతలు కుల రాజకీయం మొదలుపెట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగతంగా, రాజకీయంగా, కుల పరంగా టార్గెట్ చేశారు. అదృశ్యం తరహాలో కేసు విచారణ మొదలుపెట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఇందుకు ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సిఐ నాగరాజును అదుపులోకి తీసుకుంది. అయితే సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీ కాస్త లాకప్ డె*త్ గా బయటపడింది. సీఐ రిమాండ్ రిపోర్టులో అత్యా అని తేల్చేసింది సిట్. పోలీస్ కస్టడీలో తగిలిన గాయాల వల్లే సాయి కృష్ణ మరణం సంభవించిందని నిర్ధారించింది. దీంతో కుటుంబ సభ్యుల అనుమానాలు నిజమయ్యాయి. అయితే సాయి కృష్ణ మృతదేహాన్ని ఖననం చేశారా? లేకుంటే ఎక్కడైనా విడిచి పెట్టారా? అన్నది తెలియాల్సి ఉంది.

* తల్లి అనుమానం అదే..
అయితే సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి తన కుమారుడిని చంపేశారు అంటూ ఆది నుంచి ఆరోపిస్తున్నారు. కచ్చితంగా ఆనవాళ్లు, అనుమానాలు ఉండడంతో పాటు సంకేతాలు రావడంతోనే ఆమె ఆ తరహా ఆరోపణలు చేశారని ఇప్పుడు అర్థం అవుతోంది. సాయి కృష్ణ మే 6న మార్కాపురంలో టాస్క్ ఫోర్స్ సిబ్బందికి పట్టుబడ్డారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక్కడే నిందితుడిగా భావిస్తున్న సిఐ నాగరాజు వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్లు అర్థం అవుతుంది. మే 1 నుంచి జూన్ 1 వరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ పూర్తిగా మాయమైంది. అయితే ఇప్పటివరకు అదృశ్యం కేసు గానే ఉండేది. ఇప్పుడు లాకప్ డె*త్ అని తెలియడంతో దాని వెనుక జరిగిన పరిణామాలపై అసలు సిసలైన విచారణ మొదలుకానుంది.

* రెండో చార్జ్ షీట్ లో
అసలు సాయి కృష్ణ పై మోపిన అభియోగాలు ఏంటి? ఏ కేసులో టాస్క్ ఫోర్స్ పోలీసులు సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నారు? సీఐ నాగరాజుకు సరెండర్ చేసిన తర్వాత ఏం జరిగింది? అసలు లాకప్ డె*త్ చేయాల్సిన అవసరం సిఐ నాగరాజుకు ఎందుకు వచ్చింది? దీని వెనుక పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నాయా? లేకుంటే పెద్దల పాత్ర వుందా? ఒక నిందితుడిని అదుపులోకి తీసుకొని కోర్టుకు హాజరు పరచకుండా ఎందుకలా చేశారు? అన్నింటికీ మించి సాయి కృష్ణ మృతదేహం ఇప్పుడు ఎక్కడ ఉంది? ఖననం చేశారా? దహనం చేశారా? లేకుంటే ఎక్కడైనా పారవేశారా? అనేది ఇప్పుడు రెండో చార్ట్ షీట్లో తప్పకుండా వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే ఈ కేసు వెనుక ఏం జరిగిందనే దానిపై పోలీసు వర్గాలకు ఇప్పటికే ఒక స్పష్టత ఉంది. ఎందుకంటే మృతుడు సాయి కృష్ణకు నేరచరిత ఉంది. అయితే నేరస్తులంతా లాకప్ డె*త్ చేస్తామంటే కుదరదు. అయితే ఈ స్థాయికి పరిస్థితి వచ్చింది అంటే తెర వెనుక ఏం జరిగింది అనేది ఇప్పుడు కచ్చితంగా బయటపడుతుంది. అంతవరకు వేచి చూడాల్సిందే.

వైసీపీకి షాక్ ఇచ్చేలా కూటమి 'కాపు' సభ!

Kapu Meeting
Kapu Meeting

Kapu Meeting: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరికొత్త కుల రాజకీయం మొదలుపెట్టింది. ముఖ్యంగా కాపులపై దృష్టి పెట్టింది. కాపుల్లో చీలిక వస్తే కానీ వచ్చే ఎన్నికల్లో కష్టమన్న నిర్ణయానికి వచ్చిన ఆ పార్టీ.. ఒక డేంజర్ గేమ్ మొదలుపెట్టింది. కాపు ఆత్మీయ సమావేశాల పేరుతో ఇప్పటికే వైసీపీ కాపు నేతలు రంగంలోకి దిగారు. త్వరలో ఉభయగోదావరి తో పాటు విశాఖ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. అయితే వైసిపి కాపు నేతలతో పోల్చుకుంటే కూటమి కాపు నేతలు అంత దూకుడు ప్రదర్శించడం లేదు. అదే విషయాన్ని సీఎం చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో సైతం ప్రస్తావించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తుంటే మిగతా మంత్రులు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. తప్పకుండా కౌంటర్ ఇవ్వాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. కానీ నేతల్లో చలనం లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

* వారంతా దూకుడు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కాపు నేతలుగా ఉన్నారు అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, బొత్స సత్యనారాయణ, ఆళ్ల నాని వంటి వారు. అయితే వారు దూకుడుగా ముందుకు వెళుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన టాస్క్ ను అదే స్థాయిలో పూర్తి చేస్తున్నారు. ఎందుకంటే వారికి ఆప్షన్ లేదు. రాజకీయంగా ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. వైసీపీని గెలిపిస్తేనే తమకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని వారు బలంగా భావిస్తున్నారు. అందుకే బలమైన ప్రయత్నం చేస్తున్నారు. కానీ కూటమి నుంచి ఆ స్థాయిలో కౌంటర్ లేకుండా పోతోంది.

* టిడిపి కూటమి నేతలు ఉన్నా..
టిడిపి కూటమికి సంబంధించి ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడితే.. కిమిడి కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, జ్యోతుల నెహ్రూ, మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు, జనసేన నుంచి ప్రముఖ నేతలు ఉన్నారు. దాదాపు ఓ 40 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కానీ ఏ ఒక్కరూ కౌంటర్ ఇచ్చిన దాఖలాలు లేవు. అనవసరంగా కుల ప్రస్తావనలు ఎందుకులే అన్నట్టు వారి వ్యవహార శైలి ఉంది. అయితే మొన్ననే పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీ శ్రేణులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి నేతలకు ఎందుకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు సైతం మంత్రివర్గ సమావేశంలో సహచరులకు దీనిపైనే నిలదీశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని బలంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

* పవన్ చంద్రబాబు అలెర్ట్
కాపుల విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డేంజర్ గేమ్ ఆడుతోంది. దీనిని గట్టిగా తిప్పి కొట్టకపోతే టిడిపి కూటమికి నష్టం. ఇప్పుడు సాయి కృష్ణ ఉదంతంతో మరింత రెచ్చిపోతోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి సాయి కృష్ణ కు నేరచరిత ఉంది. ఆయనను వెనుకేసుకొస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎండ కట్టాల్సిన అవసరం ఉంది. చట్టానికి విరుద్ధంగా ఒక నేరస్తుడ్ని లాకప్ డెత్ చేయడం అనేది నేరం. దానిపైనే ఇప్పుడు వైసీపీ దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. త్వరలో ఉభయగోదావరి తో పాటు విశాఖలో భారీ బహిరంగ సభ పెట్టాలని చూస్తోంది. ఇప్పుడు పవన్ తో పాటు చంద్రబాబు అప్రమత్తం కావడంతో కూటమి కాపు నేతలు సైతం రంగంలోకి దిగుతున్నారు. గతంలో వైసిపి హయాంలో కాపులకు ఏ విధంగా అన్యాయం జరిగింది.. కూటమి వచ్చాక దక్కుతున్న గౌరవం పై కాపు సమాజానికి వివరించే ప్రయత్నం చేయనున్నారు. త్వరలో కూటమి కాపు నేతల సభ భారీగా ఉండబోతుందన్న టాక్ ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

బాలయ్య - కొరటాల శివ కాంబోలో వస్తున్న మూవీకి కెజిఎఫ్ సినిమాకి మధ్య సంబంధం ఏంటి..? కథ ఇదే...

Balayya Koratala Shiva Film
Balayya Koratala Shiva Film

Balayya Koratala Shiva Film: మాస్ కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరుగా మారిన దర్శకుడు కొరటాల శివ… ఆయన సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఏదో ఒక మెసేజ్ అయితే ఉంటుంది. గత రెండు సినిమాల నుంచి ఆయన కొంతవరకు నిరాశపరిచినప్పటికి అంతకుముందు మాత్రం స్టార్ హీరోలందరితో వరుస సక్సెస్ లను సాధించిన దర్శకుడిగా గొప్ప పేరు ప్రఖ్యాతాలను సంపాదించుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు బాలయ్య బాబుతో చేస్తున్న సినిమా విషయంలో కూడా చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ఈరోజు పూజా కార్యక్రమాలను జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన కథేంటి అనే దానిమీదనే విపరీతమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ సినిమా కథ కె.జి.ఎఫ్ ను మించి ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. కేజిఎఫ్ లో ఎలాగైతే మదర్ సెంటిమెంట్ ని బేస్ చేసుకుని సినిమా మొత్తాన్ని ముందుకు తీసుకెళ్లారో ఈ సినిమాలో కూడా మదర్ సెంటిమెంట్ ని ఆసరాగా చేసుకొని సినిమాని ముందుకు తీసుకెళ్తున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా కనక భారీ విజయాన్ని సాధిస్తే మాత్రం బాలయ్య బాబు క్రేజ్ అమాంతం తరా స్థాయికి వెళ్ళిపోతుంది. ఇక కొరటాల శివ సైతం టాప్ డైరెక్టర్ గా మారిపోతాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ మూవీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మొదటి సినిమా కావడం వల్ల ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలైతే నెలకొన్నాయి.

ఇక ఏది ఏమైనా కూడా కొరటాల శివ బాలయ్య బాబుని ఒక సింహంలా చూపించబోతున్నాడు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. కేజీఎఫ్ తరహాలోనే ఈ సినిమాలో కూడా భారీ ఎలివేషన్స్ ఉంటాయట. మదర్ సెంటిమెంట్ ని బేస్ చేసుకుని బాలయ్య బాబు వచ్చిన ప్రతిసారి సక్సెస్ ని సాధించాడు అంటూ తన అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు మదర్, సిస్టర్ సెంటిమెంట్స్ తో వచ్చిన ప్రతిసారి మంచి విజయాన్ని సాధిస్తున్నాడు. అలాగే బాలయ్య బాబు అలాంటి ఎమోషన్స్ అన్నింటిలో కూడా బాగా నటిస్తాడు అనే ఒక పేరు అయితే ఉంది. కాబట్టి ఈ సినిమాలో మరోసారి అదే రిపీట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది…

నాగ చైతన్య తో రిలేషన్ పై సమంత ఎమోషనల్ కామెంట్స్..ఇంత బాధని ఎలా దాచుకుందో..

Samantha Emotional Comments
Samantha Emotional Comments

Samantha Emotional Comments: కొంత గ్యాప్ తర్వాత సమంత ప్రధాన పాత్ర పోషించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం భారీ అంచనాల నడుమ రీసెంట్ గానే విడుదలై సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. సంక్రాంతి సీజన్ లో వచ్చిన సినిమాల తర్వాత , ఈ చిత్రమే కమర్షియల్ గా భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. బయ్యర్స్ కి మూడింతల లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సందర్భంగా సమంత తన మూవీ టీం తో కలిసి నిన్న ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఈ చిత్రం గురించి , అదే విధంగా తన మొదటి వైవాహిక జీవితం లోని అనుభవాలను నేటి తరం స్త్రీలకు చెప్తూ ఆమె మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

ఒక రిపోర్టర్ సమంత ని ప్రశ్న అడుగుతూ ‘ప్రతీ మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని అంటుంటారు, కానీ మీ జీవితం లోకి ఆయన వచ్చిన తర్వాత మొదటి సక్సెస్ ని ఎదురుకున్నారు. ఒక అబ్బాయిని ఎంచుకునే అమ్మాయిలు ఈమధ్య చాలా తడబడుతున్నారు, అలాంటి వారికి మోటివేషన్ గా మీరేమి చెప్తారు’ అని అడుగుతారు. అందుకు సమంత సమాధానం చెప్తూ ‘కెరీర్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కానీ రిలేషన్ షిప్స్ మాత్రం మన చేతుల్లో ఉండదు. నేను నా అనుభవాలతో అర్థం చేసుకున్నది ఏమిటంటే మన మీద మనకు పూర్తిగా ఆత్మవిశ్వాసం ఉండాలి. అప్పుడే మనం సరైన వాళ్ళని మన జీవిత భాగస్వాములు గా ఎంచుకోగలం. కానీ ఎప్పుడైతే మన మీద మనకు నమ్మకం లేకుండా, అసంపూర్ణ భావం తో ఉంటూ , అతను నీ జీవితం లోకి వస్తేనే సంపూర్ణం అవుతుందని అనుకున్నప్పుడే తప్పులు జరుగుతాయి. ఎందుకంటే మనకు జీవిత భాగస్వామి పై అంచనాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. అది కరెక్ట్ కాదు, నేను మహిళలకు ఇచ్చే అతి ముఖ్యమైన సూచన ఏమిటంటే, ఎదుటి వ్యక్తి మీద ఆధారపడాలి అనుకోకండి, మిమ్మల్ని మీరు బలంగా నమ్మండి’ అంటూ చెప్పుకొచ్చింది సమంత.

ఇదంతా ఆమె నాగ చైతన్య తో వైవాహిక జీవిత అనుభవాలను ఆధారంగా తీసుకొనే చెప్పిందని స్పష్టంగా తెలుస్తోంది. ఇకపోతే గత కొంతకాలం నుండి సమంత గర్భం దాల్చింది అనే ప్రచారం సోషల్ మీడియా బాగా ప్రచారం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. చాలా కాల గ్యాప్ తర్వాత వచ్చారు , ఇకపై గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చేస్తారా అని రిపోర్టర్ అడిగిన ప్రశ్న కి , సమంత సమాధానం చెప్తూ ‘దయచేసి క్షమించండి , ఇప్పుడు గర్భం తో ఉన్నాను , మెటర్నిటీ లీవ్ తీసుకోవాల్సి ఉంటుంది’ అని చెప్పేసింది. స్వయంగా ఆమెనే ఈ విషయాన్ని చెప్పడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

సొంత దేశంలోని కశ్మీరీలకు పాక్ రక్షణ మంత్రి వార్నింగ్.. వీడికి పిచ్చి ముదురుతోంది!

Pakistan Defence Minister
Pakistan Defence Minister

Pakistan Defence Minister: పాకిస్తాన్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌కు కొన్ని రోజులుగా నోరు లేస్తోంది. భారత్, కశ్మీర్‌ విషయంలో అనవసంగా ధూషణలు చేస్తున్నాడు. కవ్వింపు చర్యలకు దిగుతున్నాడు. ఇటీవలే సిందూ జలాల విషయంలో యుద్ధానికైనా సిద్ధమని ప్రకటించాడు. తాజాగా కశ్మీర్‌ ప్రజలకు వార్నింగ్‌ ఇచ్చాడు. ఆయన వ్యాఖ్యలు పాకిస్తాన్‌లో అస్థిరత, ద్వంద్వ విధానాలను సూచిస్తున్నాయి. కశ్మీర్‌ ప్రజలను హెచ్చరిస్తూ, మిర్‌పూర్, రావల్‌కోట్‌ వంటి ప్రాంతాల ప్రజలను ఎవరినీ నమ్మవద్దని, వారిని తాము మనుషులుగా కూడా చూడడం లేదని పేర్కొన్నాడు.

పీవోకే ఆక్రమణ అంగీకారం..
ఖవాజా ఆసిఫ్‌ మాటలను గమనిస్తే పీవోకే(పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌)ను తాము అక్రమంగా నియంత్రణలోకి తీసుకున్నట్లు పరోక్షంగా అంగీకరించాడు. సాధారణంగా పాకిస్తాన్‌ పీవోకేను స్వతంత్ర దేశంగా చిత్రీకరిస్తూ, దానికి ప్రత్యేక హోదా ఉందని చెబుతూ వస్తుంది. కానీ ఆయన వ్యాఖ్యలు ఆ ప్రాంతంపై పాకిస్తాన్‌ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోందని, దానిని తన నియంత్రణలో ఉంచుకున్నట్లు సూచిస్తున్నాయి. ఇది దశాబ్దాలుగా పాకిస్తాన్‌ అనుసరిస్తున్న అధికారిక వైఖరికి విరుద్ధంగా ఉంది.

సైనిక త్యాగాలు, ఆర్థిక సహాయం అంటూ..
ఖవాజా ఆసిఫ్‌ పీవోకే ప్రజల కోసం పాకిస్తాన్‌ ఎంతో చేసిందని, తమ సైన్యం ప్రాణాలు కోల్పోయిందని పేర్కొన్నారు. ఈ వాదన ఆ ప్రాంత ప్రజల్లో భావోద్వేగాన్ని రేకెత్తించడానికి ఉద్దేశించినట్లు కనిపిస్తోంది. అయితే పీవోకేలోని ప్రజల జీవన పరిస్థితులు, అభివృద్ధి, స్వేచ్ఛ వంటి అంశాలపై ఇప్పటికీ ప్రశ్నలు ఉన్నాయి. సైనిక త్యాగాలను ముందుకు తెచ్చి భావోద్వేగాన్ని రేకెత్తించడం రాజకీయంగా సాధారణ వ్యూహం అయినప్పటికీ, ఆ ప్రాంతంలోని వాస్తవ పరిస్థితులతో పోల్చినప్పుడు అది సరిపోదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ద్వంద్వ వైఖరి..
ఒకవైపు పీవోకేను స్వతంత్రంగా చిత్రీకరించి, మరోవైపు దానిపై పూర్తి నియంత్రణ చెలాయించడం పాకిస్తాన్‌ వైఖరిలోని ద్వంద్వత్వాన్ని స్పష్టం చేస్తోంది. ఇప్పుడు ఖవాజా ఆసిఫ్‌ వాళ్లను మనుషులుగా చూడకండి అని చేస్తున్న పిలుపు రక్షణను బలహీనం చేస్తున్నాయి.

ఖవాజా వ్యాఖ్యలు భారత్‌–పాకిస్తాన్‌ సంబంధాలు, కశ్మీర్‌ సమస్యపై అంతర్జాతీయ చర్చల్లో కొత్త కోణాన్ని తెస్తున్నాయి. పాకిస్తాన్‌ ఎప్పుడూ కశ్మీర్‌ ప్రజల హక్కుల కోసం మాట్లాడుతూ వచ్చినా, పీవోకేలోని ప్రజల పరిస్థితి గురించి అదే స్థాయిలో చర్చించడం లేదనే వాదనలు బలపడుతున్నాయి.